
నేడు న్యాయవాదుల సమావేశం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదుల ముఖ్య సమావేశం జరగనుంది. నగరంలోని జేకేసీ కళాశాల రోడ్డులోని వికాస్ ఇన్ హోటల్లో న్యాయవాదుల సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని పార్టీ లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సి.డి.భగవాన్ తెలిపారు. పలు కీలక అంశాలపై చర్చించడంతోపాటు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికపై చర్చిస్తామన్నారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర రీజనల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, లీగల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్రెడ్డి, మాజీ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, పార్టీ పార్లమెంట్ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్, విజయవాడ పార్లమెంట్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డితోపాటు, ముఖ్య నేతలు, సమన్వయకర్తలు హాజరు కానున్నారు. పలు అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేయనున్నారు. కార్యక్రమానిక పెద్ద ఎత్తున న్యాయవాదులు హాజరు కావాలని సి.డి.భగవాన్ పిలుపునిచ్చారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి దుర్మరణం
తెనాలిరూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందారు. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కోపల్లెకె చెందిన కారుమంచి దేవదానం(70) గురువారం పట్టణంలో జరిగిన ఓ దుకాణ ప్రారంభోత్సవానికి తన మోపెడ్పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో సుల్తానాబాద్కు రాగా వెనుక నుంచి వచ్చిన సిమెంటు లోడు లారీ ఢీ కొట్టడంతో లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కోపల్లె వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ కారుమంచి కిషోర్బాబుకు దేవదానం స్వయానా సోదరుడు.
రూ.1.15 కోట్లు
నష్టపరిహారం అందజేత
చీరాల: వాడరేవు–పిడుగురాళ్ల నేషనల్ హైవే పనుల్లో భాగంగా ఈపూరుపాలెం స్ట్రయిట్కట్ వద్ద గృహాలు కోల్పోయిన 52 కుటుంబాలకు నష్టపరిహారాన్ని గురువారం ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తన క్యాంపు కార్యాలయంలో అందించారు. మొత్తం 52 కుటుంబాలకు రూ.1.15 కోట్లు పరిహారం అందజేశారు. ఆర్డీఓ టి.చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.