
రేపు జాతీయ బీసీ సంక్షేమ సంఘ సమీక్షా సమావేశం
గురజాల: ఈ నెల 15వ తేదీన జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు అఖిల భారత యాదవ మహాసభ పల్నాడు జిల్లా అధ్యక్షుడు సిద్దాడపు గాంధీ యాదవ్ శుక్రవారం ఓ పత్రికా ప్రకటలో తెలిపారు. సమావేశం బస్టాండ్ ఎదురు గల పల్నాడు కన్వెన్షన్ హాల్లో 15న ఉదయం 11 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ హాజరవుతారని తెలిపారు. మాచర్ల, గురజాల నియోజకవర్గ పరిధిలోని బీసీ, మైనార్టీ నాయకులు పార్టీలకతీతంగా పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
బుద్ధవనం ప్రాంగణంలో 18న యోగాంధ్ర
అమరావతి: స్థానిక ధ్యానబుద్ధ విగ్రహం ఎదురుగా ఉన్న బుద్ధవనం ప్రాంగణంలో ఈ నెల 18వ తేదీన జిల్లా స్థాయిలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించటానికి ఏర్పాట్ల గురించి అధికారులతో సత్తెనపల్లి ఆర్డీవో రమణకాంతరెడ్డి సమావేశమయ్యారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు చేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పార్వతి, తహసీల్దార్ డానియల్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి అయ్యప్ప ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవాలు
పిడుగురాళ్ల: పట్టణ సమీపంలోని అయ్యప్ప నగర్ ఎదురుగా ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ప్రతిష్ట వార్షికోత్సవాలను శనివారం ప్రారంభించనున్నట్లు శుక్రవారం దేవస్థాన శాశ్వత ధర్మకర్త గుండా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై రెండు రోజులు జరిగే కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన కోరారు.
‘తల్లికి వందనం’ కోసం
ఎన్పీసీఐలో నమోదవ్వాలి
నరసరావుపేట: తల్లికి వందనం పథకంలో ఆర్థిక సాయం పొందేందుకు ఎస్సీలైన 9, 10, ఇంటర్మీడియెట్ విద్యార్థులు బ్యాంకు, పోస్టల్ ఖాతాలకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుసంధానం చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారిత అధికారి ఈ.ఈశ్వరమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దగ్గరలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్, ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి, బ్యాంకు, పోస్టాఫీసులను సంప్రదించి తమ వివరాలను ఎన్పీసీఐలో అనుసంధానం చేసుకోవాలన్నారు. దీనికోసం శనివారం పోస్టల్, గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
స్పేస్ క్లబ్ ఆఫ్ ఇండియా బ్రోచర్ ఆవిష్కరణ
గుంటూరు ఎడ్యుకేషన్: చిల్డ్రన్ స్పేస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతరిక్ష విజ్ఞానంపై నిర్వహిస్తున్న కార్యక్రమాల బ్రోచర్ను జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లోఆవిష్కరించారు. స్పేస్ క్లబ్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు జి.శాంతమూర్తి మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కలిగిస్తూ, ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
నిమ్మకాయల ధరలు
తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2200, గరిష్ట ధర రూ.3200, మోడల్ ధర రూ.2600 వరకు పలికింది

రేపు జాతీయ బీసీ సంక్షేమ సంఘ సమీక్షా సమావేశం

రేపు జాతీయ బీసీ సంక్షేమ సంఘ సమీక్షా సమావేశం