
సోమాజీగూడాలోని ది పార్క్ హోటల్లో ప్రైడ్ ఇండియా అవార్డ్స్ ఆధ్వర్యంలో ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ 2025 ను ఘనంగా నిర్వహించారు.

భారత సమాజంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులు, సంస్థలను ఈ వేడుకలో అవార్డులతో గౌరవించింది. విద్య, ఆరోగ్య, వ్యాపార, వినూత్నత, సంస్కృతి వంటి విభాగాల్లో ఉత్తమతను ప్రదర్శించినవారిని గుర్తించి అవార్డులు ప్రదానం చేశారు.

ఈ ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ ప్రధానోత్సవానికి దక్షిణాది నటి కావ్యా థాపర్ ముఖ్య అతిథిగా హాజరై అవార్డులను అందజేసి విజేతలను అభినందించారు.















