
వెంకట జయవర్ధన్ రెడ్డి అకాలమృతి బాధాకరం
● వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి ● అశ్రునయనాలతో అంతిమయాత్ర
సత్తెనపల్లి: యువకుడు పాపసాని వెంకట జయవర్ధన్ రెడ్డి అకాల మరణం బాధాకరమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి 16వ వార్డు వడ్డవల్లి ఏరియాకు చెందిన పాపసాని వెంకట జయవర్ధన్ రెడ్డి బుధవారం సొమ్మసిల్లి పడిపోయి గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం నిర్వహించిన అంతిమ యాత్రలో గజ్జల సుధీర్ భార్గవర్రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు, తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన కుమారుడు అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. వెంకట జయ వర్ధన్రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుధవారం వెంకటజయవర్ధన్ రెడ్డి మృతి వార్త తెలియడంతో డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డితో పాటు మాజీమంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్రెడ్డి, యర్రం వెంకటేశ్వరరెడ్డి, నాయకులు చిట్టా విజయభాస్కర్రెడ్డి, డాక్టర్ గజ్జల నాగభూషణ్రెడ్డి, రోళ్ల మాధవిలు పార్ధివదేహన్ని సందర్శించి నివాళులర్పించారు. అశ్రునయనాల నడుమ అంతిమ యాత్ర జరిగింది. ప్రత్యేక వాహనంపై వెంకట జయవర్ధన్రెడ్డి పార్ధీవ దేహాన్ని ఏర్పాటు చేసి పట్టణంలో ప్రదర్శన చేశారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్య కర్తలు, మృతుడి మిత్ర బృందం, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
జయవర్ధన్రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం
సత్తెనపల్లి: పట్టణంలోని 16వ వార్డు వడవల్లి ఏరియాకు చెందిన యువకుడు పాపసాని వెంకట జయవర్ధన్రెడ్డి (32) బుధవారం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో సొమ్మ సిల్లి పడిపోగా వైద్యశాలకు తరలించగా గుండెపోటుతో మృతి చెందిన విషయం పాఠకులకు విధితమే. పాపసాని వెంకటజయవర్ధన్రెడ్డి మృతదేహానికి రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో గురువారం ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానస్పద మృతిగా పట్టణ ఎస్ఐ ఎం.పవన్ కుమార్ కేసు నమోదు చేశారు.