
చెరువులో పడిన కారు
మేదరమెట్ల: విజయవాడ నుంచి శింగరాయకొండకు వెళుతున్న కారు గురువారం ఉదయం కొరిశపాడు జాతీయ రహదారి రొయ్యల ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న రహదారి వద్దకు కారు రాగానే డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో అదుపు తప్పిన కారు డివైడర్ కోసం ఉంచిన సిమెంట్ దిమ్మెను ఢీ కొని పక్కనే ఉన్న చెరువులోకి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ప్రయాణికులు లేకపోడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి చెరువులో పడిన కారును బయటకు తీసే ప్రయత్నాలు చేపట్టారు.