
కాకినాడ టౌన్–చర్లపల్లి, లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్ల
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ టౌన్–చర్లపల్లి, కాకినాడ టౌన్–లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
కాకినాట టౌన్–చర్లపల్లి (07447) ప్రత్యేక రైలు జూలై 5 నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకు ప్రతి శనివారం రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07448) జూలై 6 నుంచి వచ్చే ఏడాది మార్చి 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది.
● కాకినాడ టౌన్–లింగంపల్లి (07445) ప్రత్యక రైలు జూలై 2 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07446) జూలై 3 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో సాయంత్రం 6.30 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్లలో ఆగుతుంది.