కాకినాడ టౌన్‌–చర్లపల్లి, లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు | - | Sakshi
Sakshi News home page

కాకినాడ టౌన్‌–చర్లపల్లి, లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

Jun 20 2025 5:53 AM | Updated on Jun 20 2025 5:53 AM

కాకినాడ టౌన్‌–చర్లపల్లి, లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్ల

కాకినాడ టౌన్‌–చర్లపల్లి, లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్ల

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ టౌన్‌–చర్లపల్లి, కాకినాడ టౌన్‌–లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

కాకినాట టౌన్‌–చర్లపల్లి (07447) ప్రత్యేక రైలు జూలై 5 నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకు ప్రతి శనివారం రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07448) జూలై 6 నుంచి వచ్చే ఏడాది మార్చి 29 వరకు ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్‌లలో ఆగుతుంది.

● కాకినాడ టౌన్‌–లింగంపల్లి (07445) ప్రత్యక రైలు జూలై 2 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07446) జూలై 3 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో సాయంత్రం 6.30 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్‌లలో ఆగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement