
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్( Abhishek Bachchan) నటించిన కొత్త సినిమా హౌస్ఫుల్ 5 కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. ఆయన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను పొందుతోంది. ఇంతలో, ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను పంచుకున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ప్రియమైన వారికోసం అన్నీ ఇచ్చేశానంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో కుటుంబ సమస్యల వల్ల ఆయన ఇలాంటి పోస్ట్ చేశారా అంటూ నెటిజన్లు సందేహిస్తున్నారు. కొంతకాలంగా నటి ఐశ్వర్యరాయ్( Aishwarya Rai)- అభిషేక్ బచ్చన్ల విడాకుల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆయన చేసిన పోస్ట్ మరింత బలాన్ని ఇచ్చేలా ఉంది.
అభిషేక్ బచ్చన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రోజువారీ జీవితంలో ఎదురయ్యే బాధ్యతల మీద మాత్రమే దృష్టి పెట్టడం కంటే, అంతర్గత ఆనందం గురించి ఆలోచించడం ఎంత కీలకమో ఆయన నొక్కి చెప్పారు. ' నేను మరోసారి ఒంటిరిగా ఉండాలని ఉంది. నా కోసం నేను కొంత సమయం కేటాయించుకోవాలనిపిస్తుంది. ఈ జనసమూహం నుంచి దూరంగా ఉంటూ నన్ను నేను వెతుక్కోవాలనుకుంటున్నాను. నా ప్రియమైన వారికోసం అన్నీ ఇచ్చేశాను. ఇప్పుడు నాకూ కొంత సమయం కావాలి. నా గురించి నేను తెలుసుకునేందుకు ఒంటరిగా ఉండాలని ఉంది.' అంటూ హిందీలో రాసుకొచ్చారు.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలు ఉన్నాయి: పురందేశ్వరి)
నెటిజన్లు అభిషేక్ బచ్చన్ పోస్ట్పై ఇలా కామెంట్లు చేస్తున్నారు. మిస్ ఇండియాను వివాహం చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి సంతోషంగా లేడు అంటే ఏమిటి..? సంతోషానికి కొలమానం ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరొక వ్యక్తి సలహా ఇచ్చాడు- 'సార్, మీ భార్య, పిల్లలతో కొంత సమయం గడపండి, మీరు మంచిగా రీసెట్ అవుతారు.' అంటూ పేర్కొన్నాడు.
సుమారు 17 ఏళ్ల క్రితం అభిషేక్ - ఐశ్వర్యలకు వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరికి ఆరాధ్య(15) అనే కుమార్తె ఉంది. ఈ జంట విడాకులు తీసుకోనున్నారంటూ గత కొంతకాలంగా పలు కథనాలు వైరల్ అయ్యాయి. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని వీరిద్దరూ ఇప్పటికే పరోక్షంగా స్పందించారు. అయినప్పటికీ ఆ వార్తల ప్రచారం ఆగలేదు. ఇప్పుడు అభిషేక్ షేర్ చేసిన పోస్ట్తో మరోసారి విడాకుల అంశం తెరపైకి వచ్చింది.