టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ పూర్తి చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తికావడంతో ఈ రోజు (గురువారం)ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ ను డిశ్చార్జ్ చేసినట్లు సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు తెలిపారు.
కాగా.. జూలై 27న సాయంత్రం ఎన్టీఆర్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. డా. ఆర్ఏ పూర్ణచంద్ర తేజస్వి, డా. నితిన్ బెజ్జంకి, డా. మధుసూదన్రావు, డా. శ్రీనివాస్రావు సూరపనేని నేతృత్వంలో ఆర్థోపెడిక్ సర్జన్స్ బృందంతో సికింద్రాబాద్ కిమ్స్లో బుధవారం సర్జరీ నిర్వహించారు. దాదాపు 2 నుంచి 3 నెలల్లోపే సంపూర్ణంగా కోలుకుని, సాధారణ స్థితికి వస్తారని డాక్టర్లు తెలిపారు.


