
ఆంక్షలు పెట్టినా.. తగ్గేదేలే!
వినుకొండ: పల్నాడు జిల్లా రెంటపాళ్ల గ్రామంలో బుధవారం జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. అయితే ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లా కార్యకర్తలతో కలసి కారులో వెళుతుండగా అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఓ సాధారణ కార్యకర్తలా ద్విచక్ర వాహనంపై వైఎస్ జగన్ కాన్వాయ్ వెంట రెంటపాళ్లకు చేరుకున్నారు. కొన్నిచోట్ల పోలీసులు విసిగించినా తనపై కేసులు నమోదు చేసుకోండి.. కానీ జగన్ పర్యటనకు మాత్రం హాజరై తీరుతానని తేల్చి చెప్పారు.