
బడుల్లో నీటికీ కటకటే
పల్నాడు
సోమవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2025
ఘనంగా తిరునాళ్ల మహోత్సవం
నగరం: మండలంలోని ఈదుపల్లి గ్రామదేవత ఈదులమ్మ వారి తిరునాళ్ల మహోత్సవం ఆదివారం నిర్వహించారు. గ్రామోత్సవం అనంతరం అమ్మ వారిని ఆలయంలో పునఃప్రవేశపెట్టారు.
బగళాముఖికి విశేష పూజలు
చందోలు(కర్లపాలెం): చందోలులోని
బగళాముఖి అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణ చేసి పసుపు, కుంకుమలు సమర్పించారు.
ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన
నాదెండ్ల: గణపవరం కోదండ రామాలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాత్రి జరిగిన కోలాటం ఆకట్టు కుంది. మాస్టర్ వెంకటరెడ్డిని సత్కరించారు.
రాజుపాలెం: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్కార్ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. విద్యార్థులకు కావల్సిన మౌలిక వసతులను కల్పించారు. రంగురంగులతో కూడిన ఇనుప బెంచీలను ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను బడికి పంపాలంటే జంకుతుంటారు. సరైన మరుగుదొడ్లు లేవని, ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుందని తల్లిదండ్రులు అంటుంటారు. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ గత ప్రభుత్వం హయాంలో మరుగుదొడ్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. వెస్ట్రన్ టాయిలెట్స్, వాష్ బేషన్లు, అదేవిధంగా ట్యాప్లు విద్యార్థులకు అనుకూలంగా ఉండేందుకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దీంతో పాఠశాలల్లో ఆడపిల్లల సంఖ్య భారీగా పెరిగింది. మౌలిక సదుపాయాలతోపాటు మినరల్ వాటర్ అందించేందుకు ప్రతి పాఠశాలలో ఆర్వో ప్లాంట్ (వాటర్)ను ఏర్పాటు చేశారు. గత ఏడాది నుంచి ఈ ప్లాంట్లు పనిచేయడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక తాగు నీటి కోసం విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఇంటి వద్ద నుంచి బాటిల్స్తో నీళ్లు తీసుకెళ్లే దుస్థితి ఏర్పడింది.
పట్టించుకునే దిక్కే లేదు..
గత ప్రభుత్వంలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో రూ.కోట్లు ఖర్చు చేసి ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అవి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పుడు మూలనపడ్డాయి. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మండలంలో 46 మండల పరిషత్ ప్రాథమిక , రెండు యూపీ , ఆరు జిల్లా పరిషత్ , ఒక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు ఉన్నాయి. మండల పరిషత్, యూపీ పాఠశాలలు కలుపుకొని మొత్తం 2,677 మంది విద్యార్థులు, జిల్లా పరిషత్, కేజీబీవీలలో కలిపి 1,776 మంది చదువుతున్నారు. తొలి దశలో నాడు–నేడు కింద 40 పాఠశాలలను ఎంపిక చేసి విద్యార్థుల సంఖ్యను బట్టి ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేశారు. మండల పరిషత్ పాఠశాలల్లో రూ.70 వేల నుంచి రూ. 2 లక్షల వరకు, హైస్కూల్లలో సుమారు రూ.5 లక్షలతో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. కూటమి సర్కారు వచ్చాక నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఏ ఒక్క బడిలోనూ ప్లాంట్లు పనిచేయడం లేదు. ప్రధానోపాధ్యాయులు బాగు చేయిద్దామంటే ఎంత ఖర్చు అవుతుందోనని చేతులెత్తేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆర్వో ప్లాంట్ల్లకు మరమ్మతులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
రాజుపాలెం పులిచింతల నిర్వాసిత కేంద్రంలోని బడిలో ఆర్వో ప్లాంట్కు తాళం వేసిన దృశ్యం
7
న్యూస్రీల్
అనుమతి వచ్చాక మరమ్మతులు
కొన్ని పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదని మా దృష్టికి వచ్చింది. వాటికి మరమ్మతులు చేపట్టాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి రావాలి. ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసిన కంపెనీ ప్రతినిధుల దృష్టికి మరమ్మతుల విషయం తీసుకెళ్లినా స్పందన రాలేదు. విద్యాశాఖలోని ఉన్నతాధికారులకు విషయం చెబుతాం. అవసరమైన మరమ్మతులు చేపడతాం. విద్యార్థులకు మంచినీరు అందేలా చర్యలు తీసుకుంటాం. అప్పటివరకు సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు పాటిస్తాం.
– కె.నరసింహారావు,
ఎంఈవో–2 , రాజుపాలెం
తాగునీటి కోసం అల్లాడుతున్న
విద్యార్థులు
ఏడాదిగా పనిచేయని ప్లాంట్లు
పాలకుల తీరుపై తీవ్ర ఆగ్రహం
వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
కనీసం పట్టించుకోని ప్రజాప్రతినిధులు,
అధికారులు

బడుల్లో నీటికీ కటకటే

బడుల్లో నీటికీ కటకటే

బడుల్లో నీటికీ కటకటే

బడుల్లో నీటికీ కటకటే

బడుల్లో నీటికీ కటకటే

బడుల్లో నీటికీ కటకటే

బడుల్లో నీటికీ కటకటే