
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ విచారణకు రెండోసారి కేటీఆర్ హాజరయ్యారు. విచారణకు వెళ్లే ముందుకు తెలంగాణ భవన్కు వెళ్లిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అక్రమ కేసులని, వీటికి భయపడేది లేదని.. అవసరమైతే జైలుకు వెళ్లేందుకు సిద్ధమని కేటీఆర్ అన్నారు. లక్షలాది మంది కేసీఆర్ సైన్యాన్ని ఎవరూ టచ్ చేయలేరని ప్రకటించారాయన.








