
వైద్య శాఖలో బదిలీలకు జూమ్ కౌన్సెలింగ్
గుంటూరు మెడికల్: హెల్త్ డిపార్ట్మెంట్కు చెందిన వైద్యులు, వైద్య సిబ్బందికి జూన్లో జరగబోయే సాధారణ బదిలీలలో పేపర్ కౌన్సెలింగ్కు బదులు జూమ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారని ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. తమ అభ్యర్థన మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ ఆదివారం రాష్ట్ర ,వైద్య ,ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబుతో చర్చలు జరిపారని చెప్పారు. పేపర్ కౌన్సెలింగ్కు బదులుగా జూమ్ కౌన్సెలింగ్ నిర్వహణకు ఆయన ఒప్పుకున్నట్లు తెలిపారు. ఇందులో స్టేషన్ సీనియారిటీ ప్రకారం అన్నీ ఖాళీలను ప్రకటించిన తరువాతే కౌన్సెలింగ్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. జనరల్ ట్రాన్స్ఫర్స్లో అభ్యర్థులు కోరుకున్న ఐదు ఖాళీలే కాకుండా ప్రదర్శించబడిన ఖాళీల్లో దేన్నైనా కోరుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర నాయకత్వానికి తమ సమస్యను వివరించి, పరిష్కరించిన జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావుకు జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు, ఏపీఎన్జీఓ జిల్లా నేతలు ధన్యవాదాలు తెలిపారు.