విద్యార్థులను అప్రెంటిస్‌షిప్‌ దిశగా ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను అప్రెంటిస్‌షిప్‌ దిశగా ప్రోత్సహించాలి

Jun 18 2025 3:19 AM | Updated on Jun 18 2025 3:19 AM

విద్యార్థులను అప్రెంటిస్‌షిప్‌ దిశగా ప్రోత్సహించాలి

విద్యార్థులను అప్రెంటిస్‌షిప్‌ దిశగా ప్రోత్సహించాలి

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియెట్‌ వృత్తి విద్యాకోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులను వివిధ పరిశ్రమలు, ఆస్పత్రుల్లో అప్రెంటిస్‌షిప్‌ చేసేలా ప్రోత్సహించాలని జిల్లా వృత్తి విద్యాధికారి జె.పద్మ పేర్కొన్నారు. ప్రవేశాల పెంపుపై ప్రభుత్వ, ప్రైవేటు వృత్తి విద్యా జూనియర్‌ కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్‌తో మంగళవారం సాంబశివపేటలోని ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్‌ కళాశాలలోసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ విద్యార్థులు అప్రెంటిస్‌ షిప్‌ చేసే సమయంలో నెలకు రూ.7,500 అందజేస్తారని తెలిపారు. జిల్లాలోని పరిశ్రమలు, ఆస్పత్రుల్లో సర్వే నిర్వహించి, అప్రెంటిస్‌ షిప్‌ మేళాకు సంబంధించిన వివరాలు అందజేయాలని కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్‌కు సూచించారు. వృత్తి విద్యాకోర్సులను మరింత నాణ్యమైన విధంగా తీర్చిదిద్ది, విద్యార్థులకు నైపుణ్యాలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. పారిశ్రామిక సర్వేను విజయవంతం చేయడంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల సమన్వయంతో జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లాస్థాయి కమిటీకి డీవీఈవో చైర్మన్‌గా, డాక్టర్‌ ఉదయ శంకర్‌ సలహాదారుగా వ్యవహరించనున్నారు. సమావేశంలో ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌. ఆనందబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement