ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలి | - | Sakshi
Sakshi News home page

ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలి

Jun 20 2025 5:53 AM | Updated on Jun 20 2025 5:53 AM

ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలి

ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలి

సత్తెనపల్లి: రాజీపడదగిన కేసుల్లో లోక్‌ అదాలత్‌ ద్వారా ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యే విధంగా న్యాయవాదుల సహకారం కూడ అవసరమని సత్తెనపల్లి మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్‌, సత్తెనపల్లి సీనియర్‌ సివిల్‌ జడ్జి వి.విజయ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. పట్టణంలోని బార్‌ అసోసియేషన్‌ హాల్లో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గంగూరి అజయ్‌ కుమార్‌ అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వచ్చే నెల 5వ తేదీన జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌లో సత్తెనపల్లి న్యాయస్థాన పరిధిలో ఉన్న రాజీ పడదగిన కేసుల్లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యే విధంగా న్యాయవాదులు చూడాలన్నారు. లోక్‌ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారంలో న్యాయవాదుల పాత్ర కీలకమన్నారు. సమావేశంలో ప్రధాన సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) తౌషిద్‌ హుస్సేన్‌, మొదటి అదనపు సివిల్‌జడ్జి (జూనియర్‌ డివిజన్‌) పి. ప్రియదర్శిని, రెండవ అదనపు సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) జె.సుజన్‌కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చిన్నం మణిబాబు, పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఉన్నారు.

సీనియర్‌ సివిల్‌ జడ్జి

వి.విజయ్‌ కుమార్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement