నేటి నుంచి బర్లీ కొనుగోలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బర్లీ కొనుగోలు

Jun 20 2025 5:53 AM | Updated on Jun 20 2025 5:53 AM

నేటి నుంచి బర్లీ కొనుగోలు

నేటి నుంచి బర్లీ కొనుగోలు

నరసరావుపేట: జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి యడ్లపాడులోని స్టేట్‌ వేర్‌హౌస్‌ కార్పొరేషన్‌ గోడౌన్‌లో హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తామని ఏపీ మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ నరసింహారెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక మున్సిపల్‌ అతిథి గృహంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా హెచ్‌డీఎం టాప్‌ గ్రేడ్‌ టొబాకో కిలో రూ.120, హెచ్‌డీఎక్స్‌ గ్రేట్‌ టొబాకో కిలో రూ.60లకు కొనుగోలు చేస్తామన్నారు. రైతులు పొగాకును గ్రేడ్లుగా చేసుకొని బేళ్లుగా కట్టుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. బేళ్ల బరువు 25 కిలోల నుంచి 150 కిలోల లోపు మాత్రమే ఉండాలని, తేమశాతం 20 శాతంకు మించకూడదన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతులకు కొనుగోలు తేదీ, సమయం వారి మొబైల్‌ నెంబర్‌కి సమాచారం వస్తుందని, ఆరోజు మాత్రమే కొనుగోలు కేంద్రానికి వారి పొగాకు తీసుకొని రావాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి మాట్లాడుతూ జిల్లాలోని హెచ్‌డీ బర్లీ పొగాకు పంటసాగుచేసిన రైతులు సీఎం యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లయితే వారు పండించిన పొగాకును ఏపీ మార్కెఫెడ్‌ ద్వారా మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. జిల్లాలో 2522 మంది రైతులు ఏపీఏఎంఐఎస్‌ యాప్‌లో పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. ఆర్డీఓ కె.మధులత, ఎం.శివకుమారి, ఏడీఏ పి.మస్తానమ్మ, కొనుగోలు అధికారి మురళి, జీడీసీఎంఎస్‌ మేనేజర్‌ హరగోపాల్‌, సబ్‌ డివిజన్‌ తహసీల్దార్లు, ఐదు మండలాల వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులు హాజరయ్యారు.

యడ్లపాడు వేర్‌హౌసింగ్‌ గోడౌన్‌లో కొనుగోలు కేంద్రం సీఏం యాప్‌లో నమోదుచేసుకున్న రైతులకే... మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ నరసింహారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement