
ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో భాగంగా ఇవాల్టి నుంచి (జూన్ 20) లీడ్స్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది.

డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో (2025-27) భారత్, ఇంగ్లండ్కు ఇదే తొలి మ్యాచ్

స్టార్ త్రయం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత శుభ్మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా సరికొత్త శకంలోకి అడుగుపెట్టబోతుంది

మరోవైపు ఇంగ్లండ్ బెన్ స్టోక్స్ సారథ్యంలో యువకులు, అనుభవజ్ఞులతో ఉరకలేస్తుంది

ఇంగ్లీష్ జట్టు తమ బజ్బాల్ అటాకింగ్ గేమ్ను టీమిండియాపై ప్రయోగించాలని ఆరాట పడుతుంది










