
క్రూరంగా హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలి
దాచేపల్లి: వైఎస్సార్ సీపీ నేత ఉప్పుతల యల్లయ్య కుమారుడు హరికృష్ణని తీవ్రంగా కొట్టి గాయపరచిన దాచేపల్లి సీఐ భాస్కర్, ఎస్ఐలు, కానిస్టేబుళ్లను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని హైకోర్టు న్యాయవాది, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల బేబిరాణి డిమాండ్ చేశారు. ఇటీవల హరికృష్ణపై పోలీసులు కేసు నమోదు చేసి అక్రమంగా నిర్భందించి చిత్రహింసలకు గురి చేసిన విషయం పాఠక విధితమే. తీవ్ర అనారోగ్యం బారిన పడి ఇటీవల కాలికి శస్త్ర చికిత్స జరిగిన హరికృష్ణను మండలంలోని తంగెడలో మంగళవారం వేముల బేబిరాణి పరామర్శించారు. పోలీసుల పెట్టిన చిత్రహింసల గురించి హరికృష్ణ ఆమెకు వివరించారు. పోలీసులపై న్యాయపోరాటం చేసి తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, వైఎస్సార్ సీపీ పూర్తి అండగా ఉంటుందని బేబిరాణి భరోసా ఇచ్చారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి తీవ్రంగా స్పందించి బాధితుడికి అండగా నిలిచారని, జాతీయ మానవ హక్కుల కమిషన్లో కూడా ఫిర్యాదు చేశారని ఆమె గుర్తు చేశారు. దాచేపల్లి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదస్పదంగా ఉందని, రెడ్బుక్ పాలన అమలు చేసేందుకే పోలీసులు ఇక్కడ పని చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఆమెవెంట పార్టీ దాచేపల్లి మండల, పట్టణ కన్వీనర్లు కోట కృష్ణ, షేక్ సుభాని, నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్రెడ్డి, మాజీ సర్పంచ్ మందపాటి రమేష్రెడ్డి, ఎంపీపీ కందుల జాను, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ జాకీర్హుస్సేన్, నాయకులు దేవళ్ల వీరాస్వామి, గొగిరెడ్డి వెంకటరెడ్డి, వట్టె రామచంద్రారెడ్డి, ఉప్పుతల యల్లయ్య, ఆరికట్ల మల్లారెడ్డి, కాసర్ల నరసింహారెడ్డి, దేవళ్ల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేబిరాణి తంగెడలో హరికృష్ణకు పరామర్శ