వైఎస్‌ జగన్‌ పర్యటన విజయవంతం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ పర్యటన విజయవంతం చేద్దాం

Jun 18 2025 3:19 AM | Updated on Jun 18 2025 3:19 AM

వైఎస్‌ జగన్‌ పర్యటన విజయవంతం చేద్దాం

వైఎస్‌ జగన్‌ పర్యటన విజయవంతం చేద్దాం

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి

నరసరావుపేట: సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ళ గ్రామంలో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు నియోజవర్గం నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలి రావాలని మాజీ శాసనసభ్యుడు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత కూటమి ప్రభుత్వ ఏడాది పాలన కాలంలోని వైఫల్యాలపై పార్టీ ముద్రించిన ‘జగనన్న అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం’ పుస్తకం ఆవిష్కరించారు. ఈసందర్భంగా డాక్టర్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంలో జరిగిన ప్రభుత్వ వైఫల్యాలను, చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. జెడ్పీటీసీ సభ్యుడు పదముత్తం చిట్టిబాబు, నరసరావుపేట, రొంపిచర్ల మండల కన్వీనర్లు తన్నీరు శ్రీనివాసరావు, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌ సీపీ ఇంటలెక్చ్యువల్‌ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఈయం స్వామి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నెంపున్నారెడ్డి, సామాజిక విశ్లేషకులు ఈదర గోపీచంద్‌, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.సుజాతాపాల్‌, నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు బొబ్బిలి శ్రీలక్ష్మి, నాయకులు షేక్‌ ఖాజావలి మాష్టారు, జి.అచ్యుతరావు, షేక్‌ కరిముల్లా, మాగులూరి రమణారెడ్డి, అచ్చి శివకోటి, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement