‘ఫ్రైట్‌’ డిపో కార్యాలయం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘ఫ్రైట్‌’ డిపో కార్యాలయం ప్రారంభం

Jun 14 2025 7:33 AM | Updated on Jun 14 2025 7:33 AM

‘ఫ్రైట్‌’ డిపో కార్యాలయం ప్రారంభం

‘ఫ్రైట్‌’ డిపో కార్యాలయం ప్రారంభం

లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని నల్లపాడులో ఫ్రైట్‌ డిపో (వ్యాగన్‌లను మరమ్మతు చేసే కార్యాలయం)ను సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌, డివిజన్‌ డీఆర్‌ఎం సుధేష్ఠ సేన్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాగన్‌లను మరమ్మతులు చేసే సమయంలో సిబ్బందికి వెయిటింగ్‌ చేసేందుకు నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. అనంతరం ఫ్రైట్‌ డిపో కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అక్కడ నుంచి పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డీఆర్‌ఎం కార్యాలయంలో ప్రమాద ఘంటికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డివిజన్‌ అధికారులతో సమీక్షా సమావేశంలో రైల్వే జీఎం మాట్లాడుతూ ౖస్టేషన్‌లలో ప్రయాణికులకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు.

ఆర్‌ఓబీల నిర్మాణానికి రూ.572.47 కోట్లు

గుంటూరులోని శామలానగర్‌, సంజీవయ్యనగర్‌లలో ఆర్‌ఓబీలకుగాను రైల్వే శాఖ రూ.159.59 కోట్లు మంజూరు చేయడంపై రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, తూర్పు నియోజక వర్గ శాసన సభ్యులు నసీర్‌ అహ్మద్‌ కలిసి ధన్యవాదాలు తెలిపారు. శంకర్‌ విలాస్‌ ఆర్‌ఓబీతో పాటు గడ్డిపాడు, పెద పలకలూరు, నందివెలుగు, మంగళగిరిల్లో ఆర్‌ఓబీల నిర్మాణాలకు గానూ రూ 572.47 కోట్లను మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement