నీట్‌ ర్యాంకర్ల ‘ఎయిమ్స్‌’ | - | Sakshi
Sakshi News home page

నీట్‌ ర్యాంకర్ల ‘ఎయిమ్స్‌’

Jun 15 2025 8:11 AM | Updated on Jun 15 2025 8:11 AM

నీట్‌

నీట్‌ ర్యాంకర్ల ‘ఎయిమ్స్‌’

గుంటూరు ఎడ్యుకేషన్‌ : వైద్య విద్యా కోర్సుల జాతీయస్థాయి అర్హత పరీక్ష (నీట్‌–2025)లో గుంటూరుకు చెందిన పలువురు విద్యార్థుల వివిధ కేటగిరీల్లో అఖిల భారతస్థాయిలో ర్యాంకులు కై వసం చేసుకున్నారు.

నీట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు జాతీయస్థాయి వైద్య విద్యా సంస్థల్లో (ఎయిమ్స్‌)తో పాటు దేశంలోని ప్రముఖ వైద్య కళాశాలల్లో సీట్లు సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు.

ఎయిమ్స్‌లో చేరడమే లక్ష్యం

స్వస్థలం యర్రగొండపాలెం. నాన్న యేసానాయక్‌ జెడ్పీ హైస్కూల్‌ గణితశాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. టెన్త్‌ వరకూ నవోదయలో, ఇంటర్మీడియెట్‌ గుంటూరు వచ్చి చదివాను. సీనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో 981మార్కులు సాధించాను. తాజా ర్యాంకుతో ఎయిమ్స్‌లో చేరాలని భావిస్తున్నాను.

– రమావత్‌ తరుణ్‌ కుమార్‌ నాయక్‌,

51వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీ

తల్లిదండ్రులే స్ఫూర్తి

స్వస్థలం గుంటూరు. నాన్న భానుప్రకాష్‌ గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలలో జువాలజీ అధ్యాపకునిగా పని చేస్తున్నారు. అమ్మ విజయ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గణితశాస్త్ర అధ్యాపకురాలు. నీట్‌ ఓపెన్‌ కేటగిరీలో 262 ర్యాంకు వచ్చింది. తాజాగా ర్యాంకుతో ఎయిమ్స్‌లో సీటు సాధిస్తా.

– కారుమంచి విక్రాంత్‌,

6వ ర్యాంకు, ఎస్సీ కేటగిరీ

అమ్మానాన్నలు ప్రభుత్వ వైద్యులే

స్వస్థలం గుంటూరు. నాన్న డాక్టర్‌ గోవిందనాయక్‌, అమ్మ డాక్టర్‌ కరుణ జీజీహెచ్‌లో వైద్యులు. ఓపెన్‌ కేటగిరీలో 2,135వ ర్యాంకు సాధించా. కళాశాలలో అధ్యాపకులు అందించిన సహకారం, సందేహాల నివృత్తి, వీక్లీ టెస్టుల ద్వారా సబ్జెక్టు పరంగా పట్టు సాధించా. ఇది మెరుగైన ర్యాంకు సాధనకు దోహదపడింది. మంగళగిరి ఎయిమ్స్‌లో చేరతా.

– ఎం. అరవింద్‌, 13వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీ

వైద్యురాలిగా

రాణించాలనే లక్ష్యం

స్వస్థలం నరసరావుపేట. నాన్న షేక్‌ మహబూబ్‌ సుభానీ వార్డు సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఓపెన్‌ కేటగిరీలో 1,184వ ర్యాంకు సాధించా. ఎయిమ్స్‌లో చేరే లక్ష్యంతో ఉన్నాను.

– షేక్‌ వసీమా, 80వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్‌

అన్నయ్య స్ఫూర్తి

స్వస్థలం గుంటూరు. నాన్న రత్నాకర్‌ ఆర్కిటెక్చర్‌. అమ్మ రెబెకా విద్య సివిల్‌ ఇంజినీర్‌. గతేడాది నీట్‌లో క్వాలిఫై అయ్యి పుదుచ్చేరిలోని జిప్‌మర్‌లో సీటు సాధించిన అన్నయ్య ప్రణయ్‌ విక్టర్‌ బాటలో వైద్య విద్య అభ్యసించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన తరువాత కార్డియాలజిస్ట్‌గా ఎదిగి, సమాజానికి సేవ చేస్తా. – సోలే ప్రేమ్‌ జడ్సన్‌ ప్రసన్న,

108వ ర్యాంకు, ఎస్సీ కేటగిరీ

గైనకాలజిస్ట్‌గా సేవలు

స్వస్థలం నెల్లూరు. నాన్న కృష్ణారెడ్డి వ్యవసాయం చేస్తున్నారు. వైద్య విద్యపై మక్కువతో రోజుకు 15 గంటల పాటు చదివాను. ప్రణాళికాబద్ధమైన కృషితోనే ర్యాంకు సాధ్యమైంది. ఎయిమ్స్‌లో వైద్యవిద్య అభ్యశించిన తరువాత గైనకాలజిస్ట్‌గా రాణించాలనే లక్ష్యంతో ఉన్నా.

– నాగిరెడ్డి మనస్విని,

49వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్‌

జాతీయస్థాయి వైద్య విద్యాసంస్థల్లో సీటు సాధనే లక్ష్యం వివిధ కేటగిరీల్లో ప్రతిభ చాటిన విద్యార్థుల భావి ప్రణాళికలు

నీట్‌ ర్యాంకర్ల ‘ఎయిమ్స్‌’ 1
1/5

నీట్‌ ర్యాంకర్ల ‘ఎయిమ్స్‌’

నీట్‌ ర్యాంకర్ల ‘ఎయిమ్స్‌’ 2
2/5

నీట్‌ ర్యాంకర్ల ‘ఎయిమ్స్‌’

నీట్‌ ర్యాంకర్ల ‘ఎయిమ్స్‌’ 3
3/5

నీట్‌ ర్యాంకర్ల ‘ఎయిమ్స్‌’

నీట్‌ ర్యాంకర్ల ‘ఎయిమ్స్‌’ 4
4/5

నీట్‌ ర్యాంకర్ల ‘ఎయిమ్స్‌’

నీట్‌ ర్యాంకర్ల ‘ఎయిమ్స్‌’ 5
5/5

నీట్‌ ర్యాంకర్ల ‘ఎయిమ్స్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement