
యోగాతో ఆరోగ్యం, ఆనందం
పిట్టలవానిపాలెం(కర్లపాలెం): యోగాసనాల వల్ల మానసిక ప్రశాంత కలుగుతుందని, ఆరోగ్యంగా ఉండొచ్చని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలలో భాగంగా శనివారం పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన యోగాసనాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు చేశారు. కేర్ న్యాచురోపతి వైద్య కళాశాల విద్యార్థులు నిర్వహించిన యోగాసనాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం పిట్టలవానిపాలెంలో అవగాహన ర్యాలీ నిర్వహించి సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని చెప్పారు. వికసిత్ భారత్ దిశగా కేంద్రం, స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముదుకు వెళుతున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నదని వాటి ఫలాలను ప్రజలు అందుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన జీవితం యోగాతోనే సాధ్యమవుతుందని యోగాసనాల వలన కలిగే ప్రయోజనాలను ప్రజలు గుర్తించాలని కలెక్టర్ చెప్పారు.
సూర్యలంకలో 10వేల మందితో యోగాంధ్ర
ఈనెల 21న విశాఖపట్నంలో చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ స్ధాయిలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని ప్రధానమంత్రి హాజరవనున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయిలో సూర్యలంక తీరంలో 10వేల మందితో జరిగే యోగాలో ప్రజలంతా పాల్గొని యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, డ్వామా పీడీ జయలక్ష్మి, మాతా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, పశు సంవర్థ శాఖ అధికారి వేణుగోపాల్రావు, ఎకై ్సజ్శాఖ పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వవెంకటేశ్వరరావు, ఇన్చార్జ్ ఎంపీడీఓ ఎలీషాబాబు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.
వికసిత్ భారత్ లక్ష్యంతో స్వర్ణాంధ్ర సాధన బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి పిట్టలవానిపాలెంలో జిల్లా స్థాయి యోగాసనాల కార్యక్రమం

యోగాతో ఆరోగ్యం, ఆనందం