పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Jun 15 2025 8:11 AM | Updated on Jun 15 2025 8:11 AM

పల్నా

పల్నాడు

ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2025

I

నేడు వేంకటేశ్వర స్వామి శాంతి కల్యాణం

దుగ్గిరాల: పసుపు యార్డు సమీపంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి శాంతి కళ్యాణ మహోత్సవం ఆదివారం నిర్వహిస్తున్నట్టు ఉత్సవ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది.

ముప్పాళ్ల: ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమైంది. ముందస్తు రుతుపవనాల రాకతో వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. రైతులు ముందస్తు సాగుకు సిద్ధమవుతున్నా పాలకులు నిర్లక్ష్యం వారికి శాపంగా మారింది. సీజన్‌ ప్రారంభానికి ముందే రైతుకు కష్టాలు మొదలయ్యాయి. భూసారం పెరగాలంటే పచ్చిరొట్ట పంటలు సాగు చేయాలంటూ పెద్దఎత్తున వ్యవసాయశాఖ అధికారులు ప్రచారం చేస్తుంటారు. అయితే ఆ దిశగా రైతుకు అవసరమైన పచ్చిరొట్ట ఎరువులు పంపిణీలో మాత్రం చిత్తశుద్ధి కనపడటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు సబ్సిడీపై అందించే ప్రోత్సాహకాలు ఒక్కొక్కటి కనుమరుగవుతూ వస్తున్నాయి. సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి. చివరకు వ్యవసాయ సీజన్‌కు ఆరంభంలో సాగు చేసే పచ్చిరొట్ట విత్తనాలు కూడా అందకుండా పోతున్నాయి.

గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే విత్తనాలు

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా సొంత గ్రామంలోనే అందించేవారు. సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలైన పిల్లి పెసర, మినుము, జీలుగ, జనుము గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయశాఖ సిబ్బంది ద్వారా నేరుగా రైతుకు అందేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక పచ్చి రొట్ట విత్తనాల ఊసే కరువైంది.

వరి, పత్తి, మిరప విత్తనాల జాడే లేదు. గత వైఎస్సార్‌ సీపీ హయాంలో మండలానికి సుమారు 400 క్వింటాళ్ల వరకు విత్తనాలు సరఫరా కావటంతో రైతుకు కావాల్సినంత, కావాల్సిన రకం సొంత గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలోనే తీసుకొని సాగు చేసుకునేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది 120 క్వింటాళ్లు మాత్రమే సరఫరా అయ్యాయి. ఎన్నికల సమయం కావటంతో రైతులు కూడా విత్తనాల పంపిణీపై ఆసక్తి కనపరచలేదు. ఇదే అదనుగా ఈ ఏడాది మరలా కోత విధిస్తూ 100 క్వింటాళ్లు మాత్రమే పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా అయినట్లు వ్యవసాయశాఖ సిబ్బంది చెబుతున్నారు. మండలానికి కేటాయించే సరఫరాలో కోత విధిస్తుండటంతో రైతులకు విత్తనాలు అందటం లేదు. అధికార పార్టీ సిఫార్సులు ఉన్న వారికే విత్తనాలు దక్కే దుస్థితికి చేరింది.

గప్‌ చుప్‌గా పంపిణీ

ప్రభుత్వం సరఫరా చేసే అరకొర కేటాయింపులతో వ్యవసాయశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. కేవలం కూటమి నాయకులు సిఫార్సు చేసిన వారికి మాత్రమే గప్‌చుప్‌గా వ్యవసాయ అధికారులు విత్తనాలు అందిస్తున్నారు. ఎవరైనా విత్తనాల కోసం వెళితే స్టాక్‌ లేదంటూ సమాధానం ఇచ్చి వెనక్కి పంపుతున్నారు. పచ్చిరొట్ట సాగు చేపట్టాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టే అధికారులు ఆ దిశగా విత్తనాలు సరఫరా చేయాలనే కనీసం పరిజ్ఞానం లేకపోవటం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

న్యూస్‌రీల్‌

ఆరంభమైన ఖరీఫ్‌ సీజన్‌ నేటికీ అందని పచ్చిరొట్ట ఎరువులు సరఫరాలోనూ కోత ఆందోళనలో అన్నదాతలు

మళ్లీ వస్తాయంటూ కుంటి సాకులు

విత్తనాలు అరకొరగా రావడంతో వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. అడిగిన వారికి సమాధానం చెప్పుకోలేక తికమకపడుతున్నారు. రైతులు అడిగే ప్రశ్నలకు నోరు మెదపలేకపోతున్నారు. కొందరు కూటమి నేతలు సైతం విత్తనాల కోసం సిబ్బందిని వేధిస్తున్నారు. ఫోన్‌ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఈ తరుణంలో వారి కోపం నుంచి తప్పించుకునేందుకు మాయమాటలు చెప్పి తప్పించుకోవాల్సిన దుస్థితి. ప్రభుత్వం కేటాయించిన వరకు రైతులకు అందిస్తామంటూ వ్యవసాయాధికారులు చేతులెత్తేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం రైతులకు అవసరమైన విత్తనాలు అందించాలి. లేకుంటే రైతులు విత్తనాల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పచ్చిరొట్ట సాగు పంటకు ఎంతో లాభదాయకం. రైతులు సబ్సిడీ ద్వారా అందించే విత్తనాలతోనే పచ్చిరొట్ట సాగు చేస్తుంటారు. విత్తనాలు అందివ్వకుంటే సాగు అదనపు భారమే అవుతుంది.

– గుంటుపల్లి బాలకృష్ణ,

రైతుసంఘం నాయకులు

పల్నాడు1
1/9

పల్నాడు

పల్నాడు2
2/9

పల్నాడు

పల్నాడు3
3/9

పల్నాడు

పల్నాడు4
4/9

పల్నాడు

పల్నాడు5
5/9

పల్నాడు

పల్నాడు6
6/9

పల్నాడు

పల్నాడు7
7/9

పల్నాడు

పల్నాడు8
8/9

పల్నాడు

పల్నాడు9
9/9

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement