మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరికి గాయాలు

Jun 15 2025 8:11 AM | Updated on Jun 15 2025 8:11 AM

మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరికి గాయాలు

మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరికి గాయాలు

నాదెండ్ల: మద్యం తాగిన ఇరువురు యువకులు ఘర్షణకు దిగటంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గణపవరం గ్రామంలో నివాసం ఉండే ఇరువురు ఒడిశా యువకులు స్థానిక స్పిన్నింగ్‌ మిల్లులో రోజువారీ కూలీ పనులకు వెళ్తుంటారు. శనివారం ఉదయం వారు షాపులో మద్యం తాగారు. మాటామాటా పెరగటంతో ఘర్షణకు దిగారు. వారిలో ఒకరు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

ఉరి వేసుకుని మహిళ మృతి

వేటపాలెం: ఇంట్లో ఉరి వేసుకొని ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. రామన్నపేట పంచాయతీ బాపయ్యనగర్‌లో డొక్కా శ్రావణి (40) అనే మహిళ ఆరు నెలలుగా అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఓనర్‌ అద్దె అడగడానికి శనివారం వెళ్లి చూడగా.. ఉరి వేసుకొని కనిపించింది. పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ జనార్దన్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement