నాటుసారా తయారీదారులపై చర్యలు | - | Sakshi
Sakshi News home page

నాటుసారా తయారీదారులపై చర్యలు

Jun 14 2025 7:33 AM | Updated on Jun 14 2025 7:33 AM

నాటుసారా తయారీదారులపై చర్యలు

నాటుసారా తయారీదారులపై చర్యలు

మాచర్ల రూరల్‌: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా పోలీసు, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని హసనాబాద్‌ తండాలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా తండాలో ప్రతి ఇంటిని తనిఖీ చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 8 మందిని అనుమానిత వ్యక్తులుగా గుర్తించారు. నాటుసారా తయారు చేసినా, విక్రయించినా చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌లో రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ నసీబ్‌ బాషా, ఎకై ్సజ్‌ సీఐ ఎన్‌. వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం నిందితులను మెజిస్ట్రేట్‌, మండల తహసీల్దార్‌ బి. కిరణ్‌ కుమార్‌ సమక్షంలో హాజరుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement