
సాక్షి, పల్నాడు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు పర్యటన వేళ పోలీసులు ఆంక్షలు విధించారు. రెంటపాళ్లలో పోలీసుల చెక్పోస్టులు, అడ్డకుంలపై వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావు తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఎవరనీ అడ్డుకోవద్దు. మీ కాళ్లు పట్టుకుంటా.. మా బంధువులనైనా అనుమతించండి అని అన్నారు.
వైఎస్సార్సీపీ నేత నాగమల్లేశ్వరరావు తండ్రి తాజాగా మాట్లాడుతూ..‘పల్నాడు పోలీసుల వైఖరి సరికాదు. మా బంధువులను కూడా అడ్డుకుంటున్నారు. దయచేసి ఎవరనీ అడ్డుకోవద్దు. పరామర్శకు అనుమతి తీసుకున్నారు. మీ కాళ్లు పట్టుకుంటా.. మా బంధువులనైనా అనుమతించండి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో సత్తెనపల్లి వైపు వాహనాలను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుంకులు సృష్టిస్తున్నారు. గ్రామస్థులను కూడా ఆధార్ కార్డు చూపాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వైఎస్సార్సీపీ నేతల వరకు నోటీసులు పంపించారు. బుధవారం ఉదయం నుంచే వాహనాలను వెళ్లకుండా అడ్డంకులు సృష్టంచారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వాహనాలను అడ్డుకుంటున్నారు. నరసరావుపేట, మాచర్ల, గుంటూరు వైపు నుండి సత్తెనపల్లి వైపు వాహనాలను వెళ్లనీయడం లేదు. రెంటపాళ్ల ఊరిలోకి ఇతరులను రానీయకుండా అడ్డుకుంటున్నారు.
