
లక్ష్మీనారాయణకు ఉత్తమ రైతు పురస్కారం
పర్చూరు(చినగంజాం): మండలంలోని తిమిర్తిపాడు గ్రామానికి చెందిన బోడావుల లక్ష్మీనారాయణ 2025 ఏడాదికి గాను డాక్టర్ ఎంవీ రెడ్డి ఉత్తమ రైతు పురస్కారం అవార్డు అందుకున్నారు. గురువారం ఆచార్య ఎన్జీ రంగా 62వ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా గుంటూరు లాంఫాంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెం నాయుడు అవార్డు అందజేశారు. స్పెషల్ సీఎస్ బి.రాజశేఖర్, కమిషనర్ ఢిల్లీరావు, వీసీ శారదా జయలక్ష్మి, డీఆర్ పీవీ సత్యనారాయణ, డీన్ ఆఫ్ అగ్రికల్చర్ అదృష్టం, ప్రసాద్, సైంటిస్టులు, రైతు సోదరులు పాల్గొన్నారు.