తెనాలి కోర్టులో జిల్లా జడ్జి పరిశీలన | - | Sakshi
Sakshi News home page

తెనాలి కోర్టులో జిల్లా జడ్జి పరిశీలన

Jun 13 2025 5:23 AM | Updated on Jun 13 2025 5:23 AM

తెనాలి కోర్టులో జిల్లా జడ్జి పరిశీలన

తెనాలి కోర్టులో జిల్లా జడ్జి పరిశీలన

తెనాలిరూరల్‌: తెనాలి కొత్త్తపేటలోని కోర్టుల ప్రాంగణాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ్‌ చక్రవర్తి గురువారం పరిశీలించారు. దెబ్బతిన్న భవనాలకు మరమ్మతులకు అంచనాలు సిద్ధం చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. కక్షిదారులకు సౌకర్యాలపై ఆరా తీశారు. న్యాయవాదులకు భవనం లేదని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్‌ వినతిపత్రం అందజేశారు. అనంతరం జడ్జీల క్వార్టర్లను ప్రధాన న్యాయమూర్తి పరిశీలించారు. సౌకర్యాల కల్పనకు నివేదిక ఇవ్వాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. జిల్లా జడ్జి వెంట 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి.శ్రీనివాసులు, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.శ్రీధర్‌ ఒకటో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.వివేక్‌ వర్ధన్‌, రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.రాజశేఖర్‌, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి హరిదాసు గౌరీ శంకర్‌, జాయింట్‌ సెక్రటరీ అప్పల కిషోర్‌, సీనియర్‌ న్యాయవాదులు, గుమస్తాలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement