NTR
-
కూటమి ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొందాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి/తిరువూరు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని.. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా కూటమి నేతలు బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొందామన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ను ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కలిశారు. చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకులు చేసిన దాడుల గురించి వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన తీరును వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అరాచకాలు, దాష్టీకాలను దీటుగా ఎదుర్కొందామని.. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనేక ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలబడ్డారంటూ కౌన్సిలర్లను అభినందించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, తిరువూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాసు, కౌన్సిలర్లు తంగిరాల వెంకటరెడ్డి, పరసా శ్రీనివాసరావు, మోదుగు ప్రసాద్, ఇనపనూరి చిన్నారి, పాలం రమాదేవి, గుమ్మా వెంకటేశ్వరి, పరసా సత్యనారాయణ, వెలుగోటి విజయలక్ష్మి, షేక్ నదియా, రామవరపు మంజుల, జెడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కలకొండ రవికుమార్, సీనియర్ నాయకులు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, నరెడ్ల వీరారెడ్డి, తిరువూరు మండలాధ్యక్షుడు తాళ్లూరి నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు -
ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం
● బీడీసీ గండ్ల వద్ద కాంక్రీట్ గోడ నిర్మాణ పనులకు వర్షాలతో ఆటంకం ● పనుల కోసం జరిగిన తవ్వకాలతో ప్రమాదకరంగా బీడీసీ ఎడమ కట్ట ● కొద్దిపాటి వర్షం పడినా వరదంతా విజయవాడ వైపు తరలే ప్రమాదం జి.కొండూరు: ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. గతేడాది ఎన్టీఆర్ జిల్లాలో జల ప్రళయానికి కారణమైన బుడమేరు డైవర్షన్ కెనాల్ గండ్ల వద్ద కాంక్రీట్ గోడ నిర్మాణ పనుల్లో ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. వేసవి చివరిలో గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అడుగడుగునా బ్రేక్లు పడి పనులు ముందుకు సాగడంలేదు. ఈ పనుల కోసం జరిగిన తవ్వకాలతో డైవర్షన్ కెనాల్ కట్ట ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. భారీ వర్షం పడితే మైలవరం నియోజకవర్గంలో కురిసిన ప్రతి వర్షపు బొట్టు విజయవాడ వైపు తరలిపోయి మరో జల ప్రళయం వచ్చే ప్రమాదం పొంచి ఉంది. వరద నివారణ చర్యల్లో ప్రభుత్వ పని తీరును చూసి ఇదేనా విజన్ బాబూ అంటూ స్థానికులు విస్తుపోతున్నారు. ఎనిమిది నెలలుగా కాలయాపన గతేడాది ఆగస్టు 30వ తేదీ రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు బుడమేరు వరద పోటెత్తి జల ప్రళయాన్ని సృష్టించిన సంగతి విదితమే. ఈ ప్రళయానికి కారణం కూడా ప్రభుత్వ నిరక్ష్యమే కారణమని అప్పట్లో విమర్శలు తలెత్తాయి. ఈ వరదలకు ప్రధాన కారణమైన బుడమేరు డైవర్షన్ కెనాల్ గండ్లను అప్పట్లో మిలటరీ సాయంతో ప్రభుత్వం తాత్కాలికంగా పూడ్చింది. అయితే ఈ గండ్ల వద్ద కాంక్రీటు వాల్ నిర్మించకపోతే మరో సారి గండ్లు పడే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ నిపుణులు తేల్చారు. అయినప్పటికీ కాంక్రీట్ గోడ నిర్మాణ పనుల కోసం నిధులను కేటాయించ డంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. గండ్లు పడిన ఆరు నెలల తర్వాత మార్చి 21న హెడ్ రెగ్యులేటర్ మరమ్మతులకు రూ.1.80 కోట్లు, డైవర్షన్ కెనాల్కు గండ్లు పడిన ప్రదేశంలో ఎడమ వైపు 500 మీటర్లు, కుడి వైపు 50 మీటర్ల కాంక్రీట్ గోడ నిర్మాణ పనుల కోసం రూ.37.97 కోట్ల కేటాయిస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ నిధుల్లో రూ.28 కోట్లతో గోడ నిర్మాణ పనుల కోసం 54 రోజుల తర్వాత మే 15వ తేదీన శంకుస్థాపన చేశారు. ఈ పనులు నిరంతరాయంగా కొనసాగితే మూడు నెలల్లో కాంక్రీట్ గోడ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే వర్షాలు పడుతున్న నేపథ్యంలో వచ్చేది కూడా వర్షా కాలం కావడంతో పనులు ముందుకు సాగే అవకాశం కనిపించడంలేదు. వర్షంతో పనులకు బ్రేక్ బుడమేరు డైవర్షన్ కెనాల్కు జి.కొండూరు మండల పరిధి కవులూరు, కొండపల్లి శాంతినగర్కు సమీపంలో కట్టకు ఎడమ వైపు మూడు గండ్లు పడిన ప్రదేశంలో కాంక్రీట్ గోడ నిర్మాణం కోసం కట్టను తవ్వి పనులు ప్రారంభించారు. ఎగువ నుంచి నీరు దిగు వకు రాకుండా ఈ ప్రదేశంలో కెనాల్కు అడ్డంగా ఆనకట్ట కట్టారు. అయితే రెండు రోజులుగా భారీగా వర్షం పడుతున్న నేపథ్యంలో ఈ కాంక్రీట్ గోడ నిర్మాణ పనులకు ప్రారంభంలోనే బ్రేక్ పడింది. కాలువ కట్ట బురదమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి పనులు ముందుకు సాగడంలేదు. కెనాల్ ఎగువున నిల్వ ఉన్న నీటి నుంచి ఊట వస్తుండటంతో ట్రాక్టరు ఇంజిన్లతో నీటిని తోడే ప్రక్రియను ప్రారంభించారు. మరో వైపు నైరుతి రుతుపవనాలు కూడా మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉండడంతో ఇప్పటికే కృష్ణాజిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టడం లేదా కట్టను తవ్విన ప్రదేశంలో గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. పొంచి ఉన్న ప్రమాదం గండ్లు పడిన తర్వాత ఎనిమిది నెలలుగా కాలయాపన చేసిన ప్రభుత్వం, వర్షాకాలం ఆరంభానికి ముందు పనులను ప్రారంభించింది. ప్రస్తుత అకాల వర్షాలతో పనులకు బ్రేక్ పడుతోంది. కాంక్రీట్ గోడ నిర్మాణ పనుల కోసం బుడమేరు డైవర్షన్ కెనాల్కు ఎడమ వైపు మూడు గండ్లు పడిన ప్రదేశంలో కట్టను తవ్వడంతో పాటు ఇక్కడ ఉన్న సైపన్ ఎత్తు పెంచేందుకు కట్టను కింద వరకు తవ్వారు. దీంతో ఈ ప్రాంతం ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. ఎగువ బుడమేరుకు పడిన గండ్లు, మైలవరం నియోజకవర్గంలో చెరువులకు పడిన గండ్లను కూడా ఇప్పటి వరకు పూడ్చకపోవడంతో ఒక వేళ రాత్రి సమయంలో భారీ వర్షం కురిస్తే వరదంతా నేరుగా విజయవాడ వైపు తరలిపోయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యే ప్రమాదం ఉంది. వర్షంతో పనులకు ఆటంకం బుడమేరు డైవర్షన్ కెనాల్కు గండ్లు పడిన ప్రదేశంలో కాంక్రీట్ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ పనులకు వర్షం అడ్డంకిగా మారింది. రోజూ వర్షం పడడం వల్ల పనులు ముందుకు సాగడంలేదు. ఏ మాత్రం అవకాశం ఉన్నా వెంటే పనులను ప్రారంభించి చకచకా చేయిస్తున్నాం. పనులు జరుగుతున్న ప్రాంతంలో కట్ట బలంగానే ఉంది. వరద ప్రవాహం వల్ల గండ్లు పడే అవకాశం ఉండదు. – పి.కౌశిక్, పోలవరం కాలువ ఏఈఈ, వెలగలేరు -
రైతులకు అకాల కష్టం
● పసుపు, మొక్కజొన్న రైతులకు కోలుకోలేని దెబ్బ ● ధర లేక ఇప్పటికీ కల్లాల్లోనే ఉన్న పంట దిగుబడులు ● ఆపై వెంటాడుతున్న అకాల వర్షాలు కంకిపాడు: అకాల వర్షం కృష్ణా జిల్లా రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చేతికొచ్చిన పంటను కాపాడుకోవటానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. పండిన పంట వర్షానికి దెబ్బతినకుండా సంరక్షించుకోవడానికి రైతులు నానా పాట్లు పడు తున్నారు. ధర లేక కల్లాలు, ఖాళీ స్థలాల్లోనే పంట ఉత్పత్తులు రాశులుగా పోసి ఉండటంతో రైతుల్లో ఆందోళన రెట్టింపవుతోంది. వర్షాల వల్ల మార్కెట్ ధరపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపు, మొక్కజొన్నకు తప్పని నష్టం ఈ సీజన్లో మొక్కజొన్న, పసుపు రైతులకు అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోని పలు గ్రామాలతో పాటుగా లంక ప్రాంతాల్లో సాగు చేసిన మొక్క జొన్న పంట ఇంకా కల్లాల్లో రాశులు, పంట చేను మీద ఉంది. గాలులు, భారీ వర్షానికి చాలా చోట్ల పంట నేలవాలిపోయింది. మొక్కజొన్న కండెలు వర్షానికి తడిచిపోవ టంతో నాణ్యత దెబ్బతింది. రాశులు మీద ఉన్న గింజలు వర్షానికి నాను తున్నాయి. జిల్లాలో 5,031 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. రైతులు కొమ్ములను ఉడకబెట్టి ఎండబెట్టారు. పూర్తి స్థాయిలో ఎండబెట్టి మార్కెట్కు తరలించే క్రమంలో విడవకుండా పడుతున్న వర్షాలకు పంట నాణ్యత దెబ్బతింటోంది. కొమ్ములు కటిక (నలుపు) వస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా అటు మొక్కజొన్న, ఇటు పసుపు కొమ్ములను సంరక్షించుకోవడానికి రైతులు నిత్యం కల్లాలు, ఖాళీ వెంచర్లలో పంట మధ్యే గడుపుతున్న దుస్థితి. చినుకు పడితే పరదాలు కప్పటం, తెరపివ్వగానే ఎండ పొడకు పంటను ఎండబెట్టే పనుల్లో నిమగ్నం కావాల్సిన పరిస్థితి. ధరపై దిగులు ఈ విపత్కర పరిస్థితుల్లో మార్కెట్ ధరపై రైతులు దిగులు చెందుతున్నారు. ప్రస్తుతం క్వింటా మొక్కజొన్న రూ.2 వేల నుంచి రూ.2100 వరకు కొనుగోళ్లు జరుగుతున్నాయి. వదలకుండా పడుతున్న వానలకు గింజ నాణ్యత దెబ్బతింటే ధర మార్కెట్లో పతనం అయ్యే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. మరో వైపు ఎకరాకు 25 క్వింటాళ్లు వరకూ ఎండు పసుపు కొమ్ముల దిగుబడి వస్తున్న విషయం తెలిసిందే. క్వింటా ధర రూ.11,500 వరకూ పలుకుతోంది. వానల వల్ల కొమ్ములు నలుపు వచ్చినా, నాణ్యత దెబ్బతిన్నా ధర తగ్గుతుందనే ఆందోళన రైతులను కలవరపెడుతోంది. అకాల వర్షాలకు తీవ్ర నష్టం 1.5 ఎకరాల్లో మొక్కజొన్న, 70 సెంట్లలో పసుపు సాగు చేశాను. మొక్కజొన్న పూర్తిగా పడిపోయింది. చేలోనే పంట ఉండిపోయింది. ఎంత వస్తుందో దిగుబడి, ఎంత ధర వస్తుందో కూడా తెలియదు. పసుపు పంట ఎండబెట్టి మార్కెట్కు పంపుదామని చూస్తూంటే రోజూ వర్షమే. తడవటం, ఆరబెట్టడం ఇదే పనిగా మారింది. ఈ ఖర్చులే ఇప్పటి వరకూ రూ.10 వేలు అయ్యాయి. ఈ సీజన్లో వానల వల్ల పడ్డ ఇబ్బంది అంతా ఇంతా కాదు. – చెన్ను బాబూజీ, కౌలురైతు, గొడవర్రు అధికారులకు పట్టడంలేదు ఎకరంన్నరలో మొక్కజొన్న, ఎకరంన్నరలో పసుపు సాగు చేశాను. మొక్కజొన్న చేను పడిపోయి నష్టం జరిగిందని అధికారుల వద్దకు వెళ్లాను. పంట తీసుకొచ్చి చూపండని చెప్పారే కానీ వారు వచ్చి చేను చూడటం, నమోదు చేయటం జరగలేదు. ఇంకా మా బాధలు ఏం చెప్పాలి? తరచూ కురుస్తున్న వానలకు పసుపు పంట తడుస్తోంది. కటిక వచ్చి నాణ్యత దెబ్బతింటే మార్కెట్లో ధర పడిపోయే ప్రమాదం ఉందని భయంగా ఉంది. – నూతక్కి ధనకోటేశ్వరరావు, కౌలురైతు, గొడవర్రు కన్నెత్తి చూడని అధికారులు అటు వ్యవసాయశాఖ, ఇటు ఉద్యాన శాఖ అధికారులు తమ గోడు పట్టించుకోవటం లేదని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న పొలంలోనే నేలవాలిన, పంటకు నష్టం జరిగినా కనీసం తమ పొలాలకు వచ్చి చూసి పంట నష్టం నమోదు చేసిన అధికారులు లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ఆదేశాలతో పంట నష్టం నమోదు ప్రాథమిక అంచనాల్లో సైతం ఒక ఎకరం విస్తీర్ణంలోనూ పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ చూపకపోవటం విడ్డూరం. పసుపు పంట చేతికొచ్చాక వర్షాలకు తడిచి దెబ్బతిందని, ఈ దశలోనూ నష్టం నమోదు చేస్తే తమకు ఊరటగా ఉంటుందని రైతులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులను అకాల వర్షాలు విడవటం లేదు. రబీ సీజన్లో వరి, పసుపు, మొక్కజొన్న, మినుము ఇతర పంటలు చేతికొచ్చింది మొదలు అడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఆ శాఖ అంచనా మేరకు కృష్ణా జిల్లాలో 54 హెక్టార్లలో పంట దెబ్బతింది. వీటిలో ప్రధానంగా అరటి, తమలపాకు, బొప్పాయి, కూరగాయల పంటలు ఉన్నాయి. తాజాగా ద్రోణి ప్రభావంతో వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అతి కష్టం మీద ధాన్యాన్ని ఆర్ఎస్కేలు, బయటి వ్యాపారుల ద్వారా మిల్లులకు తరలించి రైతులు సొమ్ము చేసుకోగలిగారు. -
వైద్య సేవల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ పటమట(విజయవాడతూర్పు): అనారోగ్యానికి గురై చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిలో నిరుపేదలు వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రులకు వస్తారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించడం దైవ సేవతో సమానమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించడంలో ప్రభుత్వాస్పత్రిని అగ్రస్థానంలో నిలపాలని, టీమ్ జీజీహెచ్ స్ఫూర్తితో పనిచేయా లని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్డీఎస్) సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వాస్పత్రిలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించి, పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు అందించాలన్న లక్ష్యాన్ని నెరవేర్చడంలో ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేయా లన్నారు. ఇటీవల ప్రభుత్వాస్పత్రుల పనితీరుపై ప్రభుత్వం సేకరించిన ప్రజాభిప్రాయ నివేదిక ప్రకారం విజయవాడ సర్వజనాస్పత్రికి ఇచ్చిన నివేదికలో వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యం, అవినీతి రహిత సేవలు ఆశించిన స్థాయిలో లేకపోవడం బాధాకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సేవల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఆదర్శవంతమైన ఆస్పత్రిగా జీజీహెచ్ను తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషిచేయా లని సూచించారు. ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ.. పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ డీఎంఈ డాక్టర్ వెంకటేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్కుమార్, ఆర్ఎంఓలు డాక్టర్ పద్మావతి, డాక్టర్ మంగాదేవి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నాగార్జున, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. ఆమోదం పొందిన అంశాలు ఇవీ.. పల్మనరీ మెడిసిన్ డిపార్టుమెంటుకు రూ.5.17 లక్షలు, గైనకాలజీ డిపార్టుమెంటుకు రూ.4.50 లక్షలు, మైక్రోబయాలజీ డిపార్టుమెంటుకు రూ.10.90 లక్షలు, ఈఎన్టీ డిపార్టుమెంటుకు రూ.3 లక్షలు, డీవీఎల్ డిపార్టుమెంటుకు రూ.2.82 లక్షలు, ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్టుమెంటుకు రూ.3.74 లక్షలతో వివిధ సౌకర్యాలు కల్పించేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. పాత, కొత్త జీజీహెచ్లతో పాటు పీఎంఎస్ఎస్వై బ్లాక్లో రూ.4.50 లక్షలతో పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ ఏర్పాటుకు కూడా కమిటీ ఆమోదం తెలిపింది. ఓపీ కౌంటర్ల క్యూబికల్స్ కోసం రూ.లక్షతో పనులు చేపట్టేందుకు, ఆర్థోపెడిక్ డిపార్టుమెంట్లో దాదాపు రూ.3 లక్షలతో అవసరమైన సౌకర్యాల కల్పనకు కూడా ఆమోదం తెలిపారు. -
ఏపీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు ప్రారంభం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ ఈఏపీసెట్ పరీక్షల్లో భాగంగా ఇంజినీరింగ్ స్ట్రీమింగ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నిర్వహించారు. బుధవారం నుంచి ఇంజినీరింగ్ విభాగం ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా పరీక్షలు జరిగాయి. జిల్లాలో 12 కేంద్రాల్లో 7,816 మంది విద్యార్థు లకు 7,328 మంది పరీక్షలు రాశారు. కృష్ణాజిల్లాకు మూడు కేంద్రాల్లో 1,009 మంది విద్యార్థులకు 973 మంది హాజరయ్యారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కోనేరుసెంటర్(మచిలీపట్నం): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాంజీ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో బుధవారం యోగా డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు అధ్యాపకులు, విద్యార్థులతో యోగా గురువులు ఆసనాలు వేయించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వీసీ రాంజీ మాట్లాడుతూ.. యోగాతో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేసి ఆరోగ్యవంతు లుగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్.ఉష, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ రెజ్లింగ్ పోటీలకు నిహారిక, కుమార్ విజయవాడస్పోర్ట్స్: అండర్ –17 జాతీయ రెజ్లింగ్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఆంధ్ర ప్రదేశ్ జట్టులో విజయవాడ క్రీడాకారులు బి. నిహారిక, బి.కుమార్ చోటు దక్కించుకున్నారని ఎన్టీఆర్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఇన్చార్జి కార్యదర్శి డి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఇటీవల చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఈ ఇద్దరు క్రీడాకారులు సత్తాచాటి పతకాలు సాధించారని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి 27 వరకు హరియాణా రాష్ట్రంలోని పల్వాల్లో జరిగే జాతీయ పోటీల్లో నిహారిక 36–40 కిలోల విభాగం, కుమార్ 41–45 కిలోల విభాగంలో ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ‘ఉపాధి’లో ఉచితంగా పండ్ల తోటల పెంపకం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతులు ఉచితంగా పండ్ల తోటల సాగు చేపట్టొచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించి, సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని ఆదేశిం చారు. కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటలు, పశుగ్రాసం పెంపకా నికి సంబంధించిన సమాచారంతో కూడిన కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఉద్యాన పంటల ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందన్నారు. ఉపాధి పథకం ద్వారా ఉచితంగా ఉద్యాన పంటల సాగు చేపట్టొచ్చని పేర్కొన్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోట, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, కొబ్బరి, ఆయిల్పామ్, ఆపిల్ బేర్, మునగ, మల్లి, గులాబీ వంటి తోటల పెంపకానికి ఐదెకరాల లోపు పొలం ఉన్న చిన్న, సన్నకారు రైతులు అర్హులని తెలిపారు. సొంత భూమి ఉండి పశుపోషణ చేస్తున్న రైతులు పశుగ్రాసం పెంపకం చేపట్టవచ్చన్నారు. ఆసక్తిగల రైతులు ఎంపీడీఓ లేదా ఉపాధి హామీ ఏపీఓ లేదా గ్రామ సచివా లయ ఉద్యాన అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఎ.రాము, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్, ఏడీఏ అనిత, డ్వామా జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ కె.ఉష తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాగురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 512.60 అడుగుల వద్ద ఉంది. ఇది 136.1274 టీఎంసీలకు సమానం. మున్సిపల్ కార్మికుల ఆందోళనవిజయవాడ ధర్నా చౌక్లో మున్సిపల్ కార్మి కులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని కార్మికులు తేల్చిచెప్పారు. నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం ఇంద్రకీలాద్రి: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్కు చెందిన ఎం.పద్మారావు కుటుంబం బుధవారం రూ.లక్ష విరాళం సమర్పించింది. – 8లో7 -
యోగాంధ్ర మాసోత్సవాలు ప్రారంభం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో యోగాను ఒక భాగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సూచించారు. భారతీయ వారసత్వ, ప్రాచీన సంపదను అందరికీ అందించాలన్నదే యోగాంధ్ర ఉద్దేశమని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యాన బుధవారం విజయవాడ భవానీపురంలోని పున్నమిఘాట్లో యోగాంధ్ర మాసోత్సవాల ప్రారంభ కార్యక్రమం జరిగింది. యోగా ట్రైనర్ రామాంజనేయులు యోగా ప్రయోజనాలతోపాటు పతంజలి యోగా సూత్రాలను వివరిస్తూ ఆసనాలు చేయించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ యోగా నిపుణులు రూపొందించిన 45 నిమిషాల కామన్ యోగా ప్రొటోకాల్ ఆధారంగా ఔత్సాహికులకు శిక్షణ ఇస్తా మని తెలిపారు. కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మాట్లా డుతూ.. నెల రోజుల యోగాంధ్రలో భాగంగా గ్రామ/వార్డ్ సచివాలయాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. బాపూ మ్యూజియం, కొండపల్లి ఖిల్లా, గాంధీ హిల్ వంటి చారిత్రాత్మక, పర్యాటక ప్రదేశాల్లోనూ యోగాంధ్ర కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. యోగా విశిష్టతపై రాష్ట్రం నలుమూలల యోగాంధ్ర ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, మునిసిపల్ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, జిల్లా ఆయుష్ శాఖ అధికారి డాక్టర్ రామత్లేహి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కును రక్షించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విశాఖ ఉక్కును కాపాడేందుకు కేంద్రంపై కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో విశాఖ ఉక్కు రక్షణకు కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సంఘీభావంగా వామపక్ష పార్టీలు బుధవారం ధర్నా చేశాయి. బీజేపీ డౌన్ డౌన్.. విశాఖ ఉక్కును కాపాడుకుందాం అంటూ ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ధర్నాలో సీపీఎం రాష్ట్ర దర్శివర్గ సభ్యుడు సీహెచ్.బాబూరావు, కార్యవర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ప్రసంగించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రయత్నాలను కొనసాగిస్తోందన్నారు. ఇందులో భాగంగానే దఫదఫాలుగా వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించిందన్నారు. పర్మనెంటు కార్మికులు 1400 మందిని తగ్గిస్తోందన్నారు. ఎనిమిది నెలల నుంచి కార్మికులకు సగం జీతాలే చెల్లిస్తోందని వివరించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించకుండా కేంద్రం మోసం చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్లే ప్రకటించి బ్యాంకుల బకాయిల రూపంలో తిరిగి జమ చేసుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు కార్మికులు, ప్రజలు పోరాడుతుంటే వారిని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అణిచివేస్తోందన్నారు. కార్మి కుల తొలగింపు చర్యలు మానుకోవాలన్నారు. సీఐటీయూ నాయకులు ఎ.వి.నాగేశ్వరరావు, కె.దుర్గారావు, ఎన్.సీహెచ్.శ్రీనివాసరావు, మూలి సాంబశివ రావు, డి.హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
● 10,381 మంది అభ్యర్థులు, 25 పరీక్ష కేంద్రాలు ● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఈనెల 25న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ లక్ష్మీశ యూపీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 25 కేంద్రాల్లో 10,381 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 25న ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్ష జరగనుందన్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి లోకల్ ఇన్స్పెక్టింగ్ కమ్ లైజన్ ఆఫీసర్, రూట్ అధికారులు, సూపర్ వైజర్లు, స్ట్రాంగ్ రూమ్ భద్రతా సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్యం, విద్యుత్, ఏపీఎస్ఆర్టీసీ, సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఆర్డీవోలు కావూరి చైతన్య, కె.బాలకృష్ణ, కె.మాధురి, కలెక్టరేట్ కోఆర్డినేషన్ విభాగం సూపరింటెండెంట్ సలీమ్, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, లైజనింగ్ అధికారులు, సహాయ లైజనింగ్ అధికారులు, వెన్యూ సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
కాలుష్యం కోరల్లో కృష్ణమ్మ
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంకృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రకృతి ప్రసాదించిన జీవనది కృష్ణమ్మకు కష్టాలు వచ్చి పడ్డాయి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో ఓ వైపు మురుగునీరు, పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో నదీ జలాలు కలుషితమవుతుంటే మరోవైపు భవన శిథిలాలు, మట్టితో కృష్ణానది పరివాహక ప్రాంతం పూడ్చివేతకు గురవుతోంది. రాణిగారితోట, 18వ డివిజన్లో వారధి వెంబడి ఉన్న ర్యాంప్ ద్వారా కొందరు ఇష్టారాజ్యంగా భవన నిర్మాణ వ్యర్థాలను ట్రాక్టర్లు, ఆటోల, ఇతర వాహనాల ద్వారా నదీగర్భంలోకి తరలించి డంప్ చేస్తుండగా సాక్షాత్తు ప్రభుత్వ అభివృద్ధి పనులు చేసే ఓ కాంట్రాక్టర్ కూడా టిప్పర్ల ద్వారా యథేచ్ఛగా మట్టిని నదిలోకి తొలి పూడ్చివేతకు పాల్పడుతున్నారు. కృష్ణానదిలో ఇసుక తిన్నెలతో పాటు నదీ పరివాహక ప్రాంతంలో ఎటువంటి ఆక్రమణ లు గానీ, వ్యర్థాలు గానీ లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ సంబంఽధిత అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తూ చోద్యం చూస్తుండడంపై పలు విమర్శలొస్తున్నాయి. కాలువలు, చెరువుల్లో పూడిక తీయాలని ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందిస్తుంటే ఇక్కడ అధికారులు మాత్రం కృష్ణానదిని వ్యర్థాలతో నింపి పూడ్చే దిశగా ప్రయత్నం చేస్తుండడం శోచనీయం. కృష్ణానదిపై పర్యవేక్షణ లోపించటం వలనే పూడ్చివేతకు గురవుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో, నదీగర్భంలో ఎలాంటి చెత్తాచెదారం, భవన శిథిలాలను వేయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు వాటిని అతిక్రమించి రేయింబగళ్లూ తేడా లేకుండా ట్రాక్టర్లు, ఆటోల ద్వారా నదిలో డంప్ చేస్తూ కృష్ణానదిని డంపింగ్ యార్డుగా మార్చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల రాణిగారితోట, 18వ డివిజన్, సిమెంట్ గోడౌన్స్లో ఓ కాంట్రాక్టర్ నూతనంగా వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. తానేం తక్కువ కాదన్నట్లు నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వగా వచ్చిన మట్టిని టిప్పర్ల ద్వారా నదీగర్భంలోకి తరలించి వారధి పక్కన, రిటైనింగ్ వాల్ వెంబడి డంప్ చేశారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారో అర్థం కాని పరిస్థితి. దాదాపు 50 టిప్పర్ల వరకు మట్టిని నదిలోకి తరలించారని, అందుకు అధికారుల సహకారం ఉన్నట్లు సమాచారం. కృష్ణానది పూడ్చి వేతకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం వలన నదిలో వ్యర్థాలు పేరుకుపోయి రాబోయే రోజుల్లో నదీజలాలు అడుగంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికై నా అధికారులు స్పందించి నదీ గర్భ పరిశుభ్రతకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి నదీగర్భంలో వ్యర్థాలు వేయరాదని నిబంధనలు ఉన్నా కాంట్రాక్టర్ ఎవరి అండ చూసుకుని టన్నుల కొద్దీ మట్టిని నదిలోకి తరలించాడో చెప్పాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్తోనే నదిలో నుంచి మట్టిని తొలగించేందుకు చర్యలు చేపట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలని, నదులను సంరక్షించే బాధ్యతను అధికారులు సక్రమంగా నిర్వర్తించాలని కోరుతున్నారు. రక్షణగా గేటు ఏర్పాటు చేస్తాం డంపింగ్ యార్డులా తయారైన కృష్ణానది వ్యర్థాలు, మట్టికుప్పలతో నింపేస్తున్న వైనం కాంట్రాక్టర్ బాధ్యతారాహిత్యం చోద్యం చూస్తున్న వీఎంసీ అధికారులు కృష్ణానదిలో వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకుంటాం. వాటర్ ట్యాంక్ నిర్మాణంలో భాగంగా వచ్చిన మట్టిని కాంట్రాక్టర్ కృష్ణానదిలో వేసినట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని పరిశీలించి నోటీసులిస్తాం. అక్కడ నుంచి మట్టి కుప్పలను కాంట్రాక్టర్ తోనే తొలగింపచేసేందుకు చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా నదిలోకి ఎవరూ వెళ్లకుండా పటిష్ట చర్యలు చేపడతాం. రెండు మూడు నెలల్లో రక్షణగా గేటును ఏర్పాటు చేస్తాం. –సామ్రాజ్యం, వీఎంసీ ఈఈ (సర్కిల్–3) -
సంక్షేమం గాలికి.. కక్ష సాధింపే లక్ష్యంగా...
కూటమి పాలనపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపాటు అవనిగడ్డ: సంక్షేమ పఽథకాలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా పాలన సాగిస్తోందని విజయవాడ సెంట్రల్ మాజీ శాసన సభ్యుడు మల్లాది విష్ణు విమర్శించారు. అవనిగడ్డ మాజీ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్బాబు స్వగృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కరెంట్ని రూ.2.40కి కొనుగోలు చేస్తూ విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పుడున్న కూటమి పార్టీలు నానా యాగీ చేశాయన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే కరెంట్ని రూ.4.60కు ఎలా కొనుగోలు చేస్తూ ఒప్పందం కుదుర్చుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కృష్ణాజిల్లాలో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసేవారు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో చాలా చోట్ల రైతులు కల్తీ విత్తనాలతో నష్టపోయినా, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మల్లాది విమర్శించారు. ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన టీడీపీ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని, అందుకు తిరువూరు ఘటనే నిదర్శన మన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులు ప్రభుత్వాన్ని, పోలీసులను హెచ్చరించినా బుద్ధి తెచ్చుకోవడం లేదన్నారు. అన్ని పన్నులు పెంచేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు, నిత్యావరసర వస్తువులు, నీటి పన్నులు, ఇలా అన్నీ పెంచేశారని, ఇప్పుడు తాజాగా ఆస్తి పన్ను పెంచేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. ప్రజాసమస్యలపై వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు, జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, వైఎస్సార్సీపీ నాయకులు రాజనాల మాణిక్యాలరావు, గరికపాటి కృష్ణారావు పాల్గొన్నారు. -
కృష్ణా నదిని డంపింగ్ యార్డులా చేస్తున్నారు
కొందరు వ్యక్తులు బిల్డింగ్ మెటీరియల్, ఇతర వ్యర్థాలను వాహనాల్లో తరలించి నదిలో కలుపుతున్నారు. వారధి వద్ద, రామలింగేశ్వరనగర్ ప్రాంతాల్లో విపరీతంగా వ్యర్థాలను నదిలో వదులుతున్నారు. కృష్ణానదిని డంపింగ్ యార్డుగా తయారుచేస్తున్నారు. పలుమార్లు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ వ్యక్తుల వాహనాలు నదిలోకి వెళ్లకుండా అబ్జర్వర్ను గానీ, గేటు గానీ ఏర్పాటు చేయాలి. నదులను కలుషితం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. –పుప్పాల కృష్ణ, సీపీఎం తూర్పు నగర కార్యదర్శి -
దుర్గమ్మ సేవలో మంత్రి అచ్చెన్నాయుడు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయ వాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. పెనమలూరు సర్పంచి 3 నెలలు సస్పెన్షన్ పెనమలూరు: పెనమలూరు సర్పంచి లింగాల భాస్కరరావును మూడు నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. పెనమలూరు గ్రామం పల్లిపేటలో నిబంధనలకు విరుద్ధంగా 15వ ఆర్థిక సంఘ నిధులు, రూ.55,25,112, గ్రామ పంచాయతీ సాధారణ నిధులతో పల్లిపేటలో సీసీ రోడ్డు వేశారని డీఎల్పీవో విచారణలో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ నిధులు రూ.63,42,912 సర్పంచి భాస్కరరావు, పూర్వ పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు అభ్యంతరకరంగా ఖర్చు చేశారని డీపీఓ నివేదిక ఇచ్చారు. దీంతో ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్పంచి భాస్కరరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఉపసర్పంచి శీలం సుమతికి సర్పంచి బాధ్యతలు అప్పగించారు. చెక్ పవర్ ఉప సర్పంచితో పాటు డెప్యూటీ మండల పరిషత్ అధికారికి కౌంటర్ సంతకం చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. -
ఎస్ఆర్ఆర్ కళాశాల స్థలాన్ని పరిరక్షించాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): నగరం నడిబొడ్డున గులాబీతోట బీఆర్టీఎస్రోడ్డు సమీపంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన రూ.300 కోట్లకు పైగా విలువచేసే 6.67 ఎకరాల స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కళాశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కోరుతున్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగి, ఎంతోమంది మేధావులను దేశానికి అందించిన ఈ కళాశాల స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కాసుల కోసం కక్కుర్తి పడి అధికారులు, అధికార పార్టీ నేతలు కళాశాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఈ స్థలాన్ని అధికార పార్టీ నేతల అండదండలతో కాజేసేందుకు యత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయమై ఇప్పటికే కళాశాల పూర్వ విద్యార్థులు జిల్లా కలెక్టర్, మంత్రి నారా లోకేష్ను కలిసి కళాశాల స్థలాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన నారా లోకేష్ కళాశాల స్థలాన్ని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్ కళాశాల స్థలాన్ని నిషేధిత జాబితాలో పెడతామంటూ హామీ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇంత వరకు ఈ స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చలేదని కళాశాల విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులు నోరు మెదపకపోవటం అనుమానాలకు తావిస్తుండగా మరోపక్క ఇటీవల ఇక్కడ స్థలాన్ని కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులు భవన నిర్మాణాల ప్లాన్ల కోసం అడ్డదారులలో ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.300 కోట్ల విలువైన స్థలంపై పెద్దల కన్ను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు అధికార పార్టీ నేతల యత్నం నిషేధిత జాబితాలో చేర్చాలని కోరుతున్న పూర్వ విద్యార్థులు 22(1)ఏ నిషేధిత జాబితాలో చేర్చాలి ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని ఎటువంటి లావాదేవీలు జరగకుండా 22(1)ఏ నిషేధిత జాబితాలో చేర్చాలని నగరవాసులు, కళాశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కోరుతున్నారు. కళాశాల స్థలాన్ని ఎట్టి పరిస్ధితులలోను అన్యాక్రాంతం కాకుండా చూస్తామని, ఇందుకు అవసరమైతే ఎంత దూరం వెళ్లటానికై నా తాము సిద్ధంగా ఉన్నామని పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు లంకా జానయ్య, కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెలగా జోషి అంటున్నారు. అసలు కోర్టులో ఉన్న కళాశాల స్థలాన్ని ఏ విధంగా క్రయ విక్రయాలు జరుపుతారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కళాశాల స్థలాన్ని 22(1)ఏ నిషేధిత జాబితాలో చేర్చటంతో పాటు ఇప్పటికే ఆక్రమించిన ఆక్రమణలను కూడా తొలగించి కళాశాల అభ్యున్నతికి సహకరించాలని కోరుతున్నారు. -
మసుల ఫెస్ట్ వేడుకలను విజయవంతం చేస్తాం
● రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు ● అధికారులతో కలిసి మసుల ఫెస్ట్ ఏర్పాట్ల పరిశీలన ● ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు, సలహాలు జారీకోనేరుసెంటర్: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో వచ్చే నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరగనున్న మసుల ఫెస్ట్ను విజయ వంతం చేసేందుకు అధికారులు సన్నద్ధం కావాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవి నాయుడు అన్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని నిర్వహించనున్న జల క్రీడలు, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీలను అందరి సమన్వయంతో సమర్థంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. బుధవారం ఆయన మంగినపూడి బీచ్ను సందర్శించి అక్కడి ఏర్పాట్లకు సంబం ధించి అధికారులతో చర్చించారు. అనంతరం జల క్రీడలు నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. క్రీడలను వేల సంఖ్యలో ప్రజలు వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలు, విద్యుత్ దీపాలు, సౌండ్ సిస్టం, ప్రమాదాలు జరగకుండా రక్షణ వలయాలు పకడ్బందీగా చేయాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా కెనోయింగ్, కయా కింగ్ వంటి జల క్రీడలు, బీచ్ కబడ్డీ, వాలీబాల్ వంటి పోటీలు నిర్వహించనున్నామని చెప్పారు. ఈ ఉత్సవాలకు మసుల ఫెస్ట్–25గా నామకరణం చేశామని, త్వరలో డాల్ఫిన్ లోగోను ఆవిష్కరిస్తామన్నారు. మత్స్యకారులకు గుర్తుగా ఈ చిహ్నాన్ని మలిచారన్నారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సాంస్కృతిక, పర్యాటక రంగాలలో ఉన్న ప్రముఖులను ఈ ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ సాయిబాబు, డీఎస్డీఓ ఝాన్సీలక్ష్మి, విజయవాడ క్రీడల అధికారి కోటేశ్వరరావు, తహసీల్దార్ హరినాథ్, జల క్రీడల జిల్లా అధ్యక్షుడు దావులూరి సురేంద్రబాబు, ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. -
యోగాపై అవగాహన పెంచాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. నెల రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కృషిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేసే యోగాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో యోగా సంబంధిత కార్యక్రమాలను నిర్వహించా లని, ఉద్యోగులు, సిబ్బంది యోగా సాధన చేయాలని, పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు. బాపూ మ్యూజియం, కొండపల్లి ఖిల్లా, గాంధీ హిల్ వంటి చారిత్రక, పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. టెలికాన్ఫరెన్స్లో విజయవాడ మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, ఆర్డీఓలు కె.చైతన్య, కె.బాలకృష్ణ, కె.మాధురి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్పొరేట్లకు సాగిల పడుతున్న పాలకులు కంకిపాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు సాగిల పడుతూ ఊడిగం చేస్తున్నా యని కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు విమర్శించారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కంకిపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని కోరారు. కార్మిక, కర్షక వర్గాలు ఐక్యమై హక్కులు, చట్టాలను సాధించుకునేందుకు ఉద్యమిస్తున్నాయన్నారు. విద్యారంగంలో సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఆందో ళనబాట పట్టాయని స్పష్టంచేశారు. కనీస వేతనం అమలుచేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. నిరసన అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ అధికారులకు అప్పగించారు. వివిధ ప్రజా సంఘాల మండల బాధ్యులు తాడంకి నరేష్, జి.కుమారి, వి.శివశంకర్, వి.జాన్మోజేస్, వి.మరియదాసు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
గుణదల(విజయవాడ తూర్పు): రాష్ట్రంలో కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి రాజ్యాధికారమే ధ్యేయంగా ఏకపక్ష ధోరణితో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. గుణదలలోని తన కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రజాసంక్షేమాన్ని కనుమరుగు చేసి ప్రజా స్వామ్యాన్ని హరించే దిశగా కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలకు తెగబడిందన్నారు. జిల్లాలోని తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం తప్పుదారి పట్టింస్తోందన్నారు. ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ కౌన్సిలర్లకు మద్దతు ప్రకటించేందుకు వైఎస్సార్ సీపీ నాయకులం వెళ్తుండగా వంద లాది మంది టీడీపీ గూండాలు అడ్డగించారని పేర్కొన్నారు. నడిరోడ్డుపై తమ వాహనాలను నిలిపి, తమను చుట్టుముట్టి బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమి రక్షణ కల్పిస్తుందని సూటిగా ప్రశ్నించారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను, ఉద్రిక్త పరిస్థితులను వేదికగా మార్చారని దుయ్యబట్టారు. ఎన్నికల అధికారులను మరోమారు కలసి తమ సమస్యను చెప్పు కొంటామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని దుర్మార్గం సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందామంటున్న కూటమి నేతలు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో దిగజారుడుతనంతో వ్యవహరించారని, ఇది దేశంలో ఎక్కడా లేని దుర్మార్గ మని ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ విమర్శించారు. మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం నడిరోడ్డుపై దాదాగిరీ ప్రదర్శించిన కూటమి నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ అభ్యర్థులకు మద్దతు ప్రకటించేందుకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులే టీడీపీ గూండాలకు మద్దతుగా నిలవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, న్యాయం కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. తిరువూరు చైర్పర్సన్ ఎన్నికపై నీచరాజకీయాలు దౌర్జన్యాలు, దాడులకుతెగబడిన టీడీపీ గూండాలు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
పెనమలూరు: మండలంలోని కానూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ కథనం మేరకు.. కానూరు కామయ్యతోపు ప్రాంతా నికి చెందిన చిలికోటి సరోజిని(65) మంగళవారం రాయల్ ఫర్నిచర్ షాపు వద్ద బందరు రోడ్డు దాటుతుండగా వేంగా వచ్చిన బైక్ ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సరోజిని అపస్మారకస్థితికి చేరుకుంది ఆమెను హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. -
ఐసెట్లో జిల్లా విద్యార్థికి మూడో ర్యాంక్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఐసెట్లో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ సాధించాడు. ఐసెట్ ఫలితాలను విశాఖపట్నంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసింది. ఈ ఏడాది ఐసెట్ను ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన సకల కృష్ణ సాయి మూడో ర్యాంక్ సాధించాడు. ఎన్టీఆర్ జిల్లా నుంచి 2,528 మంది విద్యార్థులు ఐసెట్కు దరఖాస్తు చేసుకున్నారు. 2,271 మంది పరీక్షకు హాజర య్యారు. వారిలో 1,012 మంది బాలురు, 1,259 మంది బాలికలు ఉన్నారు. వారిలో 2,191 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. కృష్ణాజిల్లా నుంచి 713 మంది విద్యార్థులు ఐసెట్కు దరఖాస్తు చేసుకోగా 668 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 311 మంది బాలురు, 357 మంది బాలికలు ఉన్నారు. 638 మంది విద్యార్థులు అర్హత సాధించి ర్యాంకులు పొందారు. వారిలో 299 మంది బాలురు, 339 మంది బాలికలు ఉన్నారు. -
కృష్ణా జిల్లాలో 44.3 మి.మీ. సగటు వర్షపాతం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో 44.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం మంగళవారం నమోదైంది. అత్యధికంగా పమిడి ముక్కల మండలంలో 87.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా గన్నవరం మండలంలో 10.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని మిగిలిన మండలాల్లోని నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. చల్లపల్లి మండలంలో 71.8 మిల్లీమీటర్లు, మోపిదేవి 70.2, ఘంటసాల 69.2, పామర్రు 60.6, అవనిగడ్డ 57.4, మచిలీపట్నం 54.2, గుడ్లవల్లేరు 52.6, మొవ్వ, నాగాయలంక 50.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గుడివాడ మండలంలో 49.4 మిల్లీమీటర్లు, ఉయ్యూరు 48.2, బంటుమిల్లి 46.2, కంకిపాడు 44.2, పెదపారుపూడి 43.2, గూడూరు 36.0, నందివాడ 32.4, కోడూరు 31.2, పెనమలూరు 29.4, పెడన 28.8, తోట్లవల్లూరు 26.6, ఉంగుటూరు 21.4, కృత్తివెన్ను 18.2, బాపులపాడు మండలంలో 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్భారీ వర్షాలతో ఎలాంటి ఇబ్బంది కలిగినా సమాచారం ఇవ్వండి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, మునిసిపల్, వ్యవసాయ తదితర శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లో ప్రత్యేకంగా 9154 970 454 నంబర్తో కమాండ్ కంట్రోల్ కేంద్రం (సీసీసీ) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భారీ వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఈ నంబర్లో సంప్రదించి, సమాచారమివ్వాలని కోరారు. తాగునీరు కలుషితం కాకుండా, సరఫరాలో ఆటంకం లేకుండా పంచాయతీరాజ్, మునిసిపల్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, నిరంతరం పరిస్థితిని సమీక్షించాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా.. రోడ్లపై నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపేందుకు అవసరమైన సిబ్బంది, ఇంజిన్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా చెట్లు కూలితే వెంటనే తొలగించేలా ఆదేశాలిచ్చామన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని.. చెట్ల కింద నిలబడవద్దని, వాహనాలను భద్రమైన ప్రదేశాల్లో పార్క్ చేసుకోవాలని సూచించారు. టంగుటూరి జీవితం స్ఫూర్తిదాయకం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నేటి తరం యువత ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మంగళవారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద లోబ్రిడ్జి సమీపంలోని ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద ఆయన 60వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆంధ్రకేసరి టంగుటూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత విశేషాలను వివరించారు. కార్పొరేటర్ శర్వాణి మూర్తి, చల్ల సుధాకర్, తోపుల వర లక్ష్మి, మాత మహేష్,మురళి కృష్ణంరాజు, గజ్జల కొండ వాసు పాల్గొన్నారు. ‘పది’ పరీక్షలు రెండో రోజూ ప్రశాంతం వన్టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రెండో రోజు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. మంగళవారం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష 30 కేంద్రాల్లో నిర్వహించారు. 495 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 260 మంది పరీక్ష రాశారు. 52.53 శాతం మాత్రమే హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. 235 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి మరో 29 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. జిల్లా విద్యాశాఖ నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్లు 28 పరీక్ష కేంద్రాలను పరిశీలించాయి. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు పాత బస్తీలోని సుందరమ్మ వీఎంసీ బాలికల ఉన్నత పాఠశాల, సెయింట్ ఆంథోని హైస్కూల్తో పాటుగా పలు కేంద్రాలను పరిశీలించారు. -
మనీ.. మోర్ మనీ!
క్రషర్లను మూసి వేయాలి ‘యోగాంధ్ర’కు పటిష్ట బందోబస్తు కంచికచర్ల: రాతి క్వారీలు, క్రషర్లు వెదజల్లే దుమ్ము ధూళి వల్ల రెండు పంటలు పండే పొలాలన్నీ బీడు భూములుగా మారుతున్నాయి. పంటలు సాగుచేసే సమయంలో సాగర్ కాలువను పూడ్చటంతో సాగునీరు సరఫరా కాక పంటలన్నీ ఎండిపోతున్నాయి. పొలాలను అమ్ముకుని ఇతర ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేద్దామనుకుంటే క్రషర్ యజమానులు భూములను అమ్ముకోవద్దని తమను బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండ సమీపంలో 801 సర్వే నంబర్లలో 74 రాతి క్వారీలు, 25 వరకు క్రషర్లు ఉన్నాయి. క్వారీలు, క్రషర్ల సమీపంలో 450 ఎకరాల పంట భూములున్నాయి. ఆ భూముల్లో రైతులు పంటలు సాగు చేద్దామన్నా కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. నిత్యం వందల సంఖ్యలో లారీలకు భారీగా లోడింగ్ చేసి కంకర, మట్టి తరలిస్తున్నారు. దీంతో కాలుష్యం నిరంతరం వెదజల్లుతోంది. సాగర్ జలాలు రాకుండా కాల్వ పూడ్చివేత.. పంట పొలాలకు నాగార్జున సాగర్ జలాలు వచ్చేవి. ఆ నీటితో మూడు దశాబ్దాల క్రితం వరకు ఆ భూముల్లో రైతులు రెండు పంటలు పండించేవారు. కానీ క్వారీ గుత్తేదారులు, క్రషర్ల యజమానులు వారి వ్యాపారం కోసం సాగర్ కాలువలను సైతం పూడ్చివేసి రోడ్లు వేసుకున్నారు. దీంతో పంటలు సాగుచేసేందుకు సాగునీరు రాకపోవటంతో రైతుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. క్రషర్ల యజమానుల బెదిరింపులు.. పంట పొలాలను తక్కువ ధరకు ఇవ్వాలని లేకపోతే ఇతరులకు ఎవరికి విక్రయించినా ఊరుకునేది లేదని క్వారీ గుత్తేదారులు బెదిరిస్తున్నారని రైతులు చెబుతున్నారు. రాజధానికి అతి సమీపంలో ఉన్న తమ పొలాలు బయట మార్కెట్లో ఎకరం భూమి రూ. కోటి 20 లక్షలు వరకు కొనుగోలు జరుగుతున్నాయని క్వారీ నిర్వాహకులు మాత్రం తమ భూములను కేవలం రూ.40 లక్షలకే ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు పచ్చని పొలాలకు కాల్వను పూడ్చివేశారు.. సాగర్ జలాలు మూలపాడు మేజర్ కెనాల్ ద్వారా వచ్చేవి. ఆ సాగు నీటితో రెండు పంటలు పండించే వాళ్లం. క్వారీ నిర్వాహకులు సాగర్ కాల్వలను పూడ్చివేసి ఆ మట్టిని కూడా క్వారీ యజమానులు విక్రయించారు. తమ భూములను ప్రభుత్వమే కాపాడాలి. – పురమా వెంకట శివప్రసాద్, రైతు, పరిటాల బ్లాస్టింగ్తో బండరాళ్లు వచ్చి పడుతున్నాయి.. రాతి క్వారీలో నాణ్యతలేని నాసిరకం పేలుళ్ల పదార్థాలను బ్లాస్టింగ్ సమయంలో ఉపయోగించటం ద్వారా అవి పెద్ద పెద్ద శబ్దంతో పేలుళ్లు వస్తున్నాయి. అనుభవం లేని కార్మికులచే నిబంధనలకు విరుద్ధంగా, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఆ బండరాళ్లన్నీ పొలాల్లోకి వచ్చి పడుతున్నాయి. అదే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలకు తీవ్రగాయాలైన సంఘటనలు ఉన్నాయి. నాణ్యత, మన్నిక లేని నాసిరకం పేలుళ్ల పదార్థాలు గాతాల్లో పెట్టి రాళ్లను పేల్చుతున్నారు. ఆ పేలుళ్లకు ఇంటి గోడలు పెచ్చులూడి పడుతున్నాయి. పేలుళ్ల సమయంలో రాళ్లు లేచి జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు సైతం తీవ్రగాయాలైన సంఘటనలు సాధారణమైంది. దుమ్ము ధూళితో బీడు భూములుగా మారుతున్న వైనం సాగర్ కాల్వను పూడ్చటంతో సరఫరా కాని సాగు జలాలు భూములను అమ్ముకుందామన్నా బెదిరిస్తున్న క్రషర్ల యజమానులు ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న రైతులు నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. కానీ ఆ పొలం సాగు చేద్దామంటే క్రషర్ల నుంచి దుమ్ము, ధూళి వెదజల్లుతోంది. దీంతో సాగుచేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి, క్రషర్లను మూసివేసి పంటలు సాగయ్యేలా చూడాలి. – బండ్ల నాగేశ్వరరావు, రైతు, పరిటాల -
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కార్మికులకు శాపంగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో నిరసన, ధర్నా జరిగింది. కార్మికులకు శాపంగా మారిన నాలుగు లేబర్కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలని, ఎనిమిది పని గంటలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దోపిడీనే లక్ష్యంగా.. ధర్నాలో పాల్గొన్న ఆయా కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన ఈ నాలుగు లేబర్ కోడ్లకు రూపకల్పన చేసి ప్రవేశపెట్టిందని విమర్శించారు. కార్పొరేట్లు యథేచ్ఛగా దోపీడీ కొనసాగించడమే కాకుండా కార్మికుల శ్రమను దోచుకునేందుకు కోడ్లు తెచ్చిందని మండిపడ్డారు. కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు, చట్టాలు కనుమరుగవుతున్నాయన్నారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతోందన్నారు. కార్మికుల జీతభత్యాలు సక్రమంగా అందవని, ఉద్యోగాలు తొలగింపు తీవ్రతరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించినా, సమ్మె చేసినా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి, తిరిగి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సంక్షోభంలో వ్యవసాయం.. నూతన మార్కెట్ విధానం వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుంటుందన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూలై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ధర్నాలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె. దుర్గారావు, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మూలీ సాంబశివరావు, సీఐటీయూ రాష్ట్ర నాయకులు వీఎల్ నరసింహులు, ఏ వెంకటేశ్వరరావు, ఏ కమల, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు వెంకటసుబ్బయ్య, కేఆర్ ఆంజనేయులు, ఏఐయూటీయూసీ రాష్ట్ర కార్యదర్శి సుధీర్, ఏఐసీసీటీయూ రాష్ట్ర నాయకులు ఉదయ్ కుమార్, ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ, శంకర్, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు మరీదు ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాల డిమాండ్ -
గ్రంథాలయాలు మనో వికాస కేంద్రాలు
విజయవాడకల్చరల్: గ్రంథాలయాలు మనోవికాస కేంద్రాలని ఏపీ గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర సంచాలకుడు కృష్ణమోహన్ అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, గ్రంథాలయ పునర్వికాస వేదిక, స్వేచ్ఛ ఆంధ్ర ఆధ్వర్యంలో 15 రోజులపాటు నిర్వహించే గ్రంథాలయ వర్క్షాప్ను గవర్నర్పేటలోని బుక్ఫెస్టివల్ సొసైటీ కార్యాలయంలో ఆయన మంగ ళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ.. బాలబాలికలకు నిత్య పఠనాన్ని అలవాటు చేయాలని సూచించారు. వేసవి సెలవుల్లో గ్రంథాలయాలను విద్యార్థులు సందర్శించాలన్నారు. గ్రంథాలయాల కోసం కొత్త వెబ్సైట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రంథాలయ ఉద్యమనేత గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రంథాలయ పునర్వికాసానికి గ్రంథా లయ పునర్వికాస వేదిక ద్వారా కృషి చేస్తున్నామని, ప్రజలు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు సహకరించాలని కోరారు. గ్రంథాలయ పునర్వికాస వేదిక రాష్ట్ర కన్వీనర్ వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ గ్రంథాలయాల పూర్వవైభవం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. పిల్లల ఠాగూర్ గ్రంథాన్ని కృష్ణమోన్ ఆవిష్కరించారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యవర్గసభ్యులు మనోహర్ నాయుడు, లక్ష్మయ్య, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, ఎమెస్కో లక్ష్మీ, పల్లవి వెంకటనారాయణ, అరణ్కుమార్, జేసీ ప్రసాద్, నవరత్న రవి, సుబ్బరామయ్య, శైలజామూర్తి, నాగిరెడ్డి పాల్గొన్నారు. -
ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచాలి
కృష్ణా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచేలా ప్రభుత్వ శాఖల్లో పనితీరు మెరుగుపరుచుకోవాలని కృష్ణా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ గవర్నెన్స్ అధికారి మంగళవారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ, పలువురు అధికారులు వీడియోకాన్ఫరెన్స్ హాలు నుంచి పాల్గొన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ అనంతరం గీతాంజలిశర్మ అధికారులతో మాట్లాడుతూ.. అర్జీదారులతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా కాల్సెంటర్ 1100 నంబరు నుంచి మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారని, దాని విశ్లేషణ ఆధారంగా ప్రభుత్వశాఖల అధికారులకు ర్యాంకింగ్ ఇస్తున్నా రని పేర్కొన్నారు. ఇకపై ప్రజాసమస్యలపై వెంటనే స్పందించి వారితో సానుకూలంగా మాట్లాడి అర్జీల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాల నలో ప్రజల సంతృప్తి స్థాయి చాలా కీలకమన్నారు. మండలాల్లో పరిపాలనా విధానం బాగాలేదని ప్రజలు చెబుతున్నట్లు నివేదికలు అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి జూన్ 12వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో ఏ మేరకు సేవలు అందుతున్నాయో అడిగి తెలుసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.రాణి, డీఎస్ఓ వి.పార్వతి, ఇన్చార్జ్ సీఈఓ ఆర్.సి.ఆనంద్కుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణరావు, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ భూమిపై విచారణలో జాప్యం
కంకిపాడు: అమ్మవారి భూమి అన్యాక్రాంతం వ్యవహారం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. భూ ఆక్రమణ వ్యవహారం వెలుగులోకి వచ్చి రోజులు గడిచిపోతున్నా విచారణ పేరుతో కాలయాపన జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేవదాయశాఖ అధికారులు ఇంకా విచారణ సాగిస్తున్నారు. రెవెన్యూ రికార్డులతో పాటుగా కన్యకా పరమేశ్వరి సత్రానికి చెందిన దస్తావేజులు, రికార్డులను సైతం పరిశీలన చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన భూమిని పరిరక్షించటంలో తాత్సారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంకిపాడు మండలం నెప్పల్లి గ్రామ పరిధిలో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సుమారు 20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వెంచరు వేస్తోంది. దీనికి సరైన రహదారి సదుపాయం లేకపోవటంతో సమీపంలోని మరో వెంచరు నిర్వాహకులతో మాట్లా డుకుని అందులో నుంచి తమ వెంచరులోకి దారి ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 20 సెంట్లకు పైగా భూమిలో రోడ్డు నిర్మించారు. ఈ దారి నిర్మాణమే వివాదాస్పదమైంది. దారి నిర్మించిన భూమి దేవదాయశాఖ పరిధిలోనిదని కొందరు, కన్యకాపరమేశ్వరి సత్రానికి చెందిన భూమని మరి కొందరు చెబుతున్నారు. ఫిర్యాదులతో వెలుగులోకి.. నెప్పల్లి గ్రామానికి చెందిన కొందరు ఈ భూమి అన్యాక్రాంతం అవుతోందంటూ కృష్ణా జిల్లా కలెక్టరు సహా దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో భూమి అన్యాక్రాంతం వ్యవహారం వెలుగుచూసింది. దీనిపై ఈనెల 7న ‘అమ్మవారి భూమి అన్యాక్రాంతం’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో దేవదాయశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయి పరిశీలనలో గ్రామంలోని సర్వే నంబరు 101లో ఉన్న 4.41 ఎకరాల భూమి ఉందని తేలింది. ఈ భూమి ఆర్ఎస్ఆర్లో విజయవాడ కనకదుర్గ దేవస్థానానికి చెందినదిగా ఉంది. అడంగల్లో మాత్రం కన్యకాపరమేశ్వరి సత్రం భూమిగా నమోదైంది. రెండు రికార్డుల్లో రెండు విధాలుగా ఎందుకు నమోదై ఉంద న్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. భూ వివాదం వెలుగులోకి వచ్చాక, ఎకరాకు రూ.200 చొప్పున సత్రం కన్యకాపరమేశ్వరి సత్రం నిర్వాహకులు తహసీలు చెల్లించారు. వివాదం తేలే వరకూ ఉండకుండా సత్రం నిర్వాహకులు నుంచి రెవెన్యూ అధికారులు తహసీలు వసూలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెప్పల్లి భూ వివాదానికి తెరపడేదెప్పుడో? నేటికీ కొనసాగుతున్న వెంచరు పనులు రికార్డుల పరిశీలనలో దేవదాయ శాఖ ఉత్సవాల నిర్వహణకు భూమి అప్పగించారంటున్న సత్రం నిర్వాహకులు భూమిని పరిరక్షిస్తాం వివాదాస్పద భూమిని కచ్చితంగా పరిరక్షిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన చర్యలను అడ్డుకుంటాం. రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నాం. సమస్య జిల్లా కలెక్టరు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంది. సత్రం నిర్వాహకులు కూడా కొన్ని వివరాలను అధికారులకు అందించారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది. భూమిని అన్యాక్రాంతం కానివ్వబోం. – నూతక్కి వెంకట సాంబశివరావు, ఏసీ, దేవదాయశాఖ, కృష్ణాజిల్లా రూ.కోట్ల విలువైన భూమికి రక్షణ లభించేనా? కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమికి రక్షణ లభించేనా అన్న అనుమానాలు నెప్పల్లి గ్రామస్తులు వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం నెప్పల్లి పరిసరాల్లో ఎకరం భూమి విలువ రూ.5 కోట్ల వరకూ పలుకుతోంది. ఈ లెక్కన 4.41 ఎకరాల విలువ రూ.20 కోట్లు పైగా పలుకుతుంది. కోటి రూపాయల విలువైన దేవదాయ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా వెంచరు నిర్వాహకులు రోడ్డు నిర్మించి యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గం గుండానే వెంచ రులోకి అవసరమైన నిర్మాణ సామాగ్రిని తర లిస్తూ దర్పం ప్రదర్శిస్తున్నారు. భూమి వ్యవహారం తేలే వరకూ రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్వాహకులను కట్టడి చేయటం, భూమిని స్వా ధీనం చేసుకునే ప్రక్రియలో అధికారులు మెతకవైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భూమి లీజు కేటాయింపులు అదే గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి ఎలా దక్కాయన్నది కూడా ప్రశ్నగానే మిగిలింది. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన దేవదాయ శాఖ అధికారులు మాత్రం రోడ్డు నిర్మాణం అక్రమమేనని, పరిరక్షిస్తామని చెబుతున్నారు. సత్రం నిర్వాహకులు మాత్రం తమకు ఈ భూమిని ఉత్సవాల నిర్వహణకు ఏళ్లనాడు అప్పగించారంటూ కలెక్టరుకు సమర్పించిన నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025u8లో రైల్వేస్టేషన్లో పోలీసుల తనిఖీలు వన్టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్లో జీఆర్పీ పోలీసులు మంగళవారం జాగిలాల సాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. టీడీపీ దౌర్జన్యం తిరువూరు మునిసిపల్ చైర్మన్ ఎన్నికను ఎలాగైనా అడ్డుకోవాలని కూటమి నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులను దారి కాచి అడ్డగించారు. భారీ వర్షం అవనిగడ్డ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారు జామున కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. 7 -
చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
స్కానింగ్ సెంటర్లకు కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరిక గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (పీసీ–పీఎన్డీటీ) చట్టాన్ని ఉల్లంఘిస్తే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ హెచ్చరించారు. సమన్వయ శాఖల అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లను ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం, ఏఆర్టీ–సరోగసీ చట్టాల అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు, సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కమ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ ఎ.సత్యానంద్ హాజరయ్యారు. ప్రజల్లో అవగాహన కల్పించాలి.. సమావేశంలో కమిటీ చైర్మన్, కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఫిర్యాదులు వస్తే వాటిని త్వరితగతిన విచారించి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చట్టంలోని నిబంధనలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే ఉన్న స్కానింగ్ కేంద్రాలకు అదనంగా కొత్త రిజిస్ట్రేషన్లకు సంబంధించిన తొమ్మిది దరఖాస్తులను, మూడు రెన్యువల్ దరఖాస్తులను, నాలుగు క్యాన్సిలేషన్ దరఖాస్తులను కమిటీ పరిశీలించి, చర్చించి, ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఏఆర్టీ లెవెల్–1 కేటగిరీకి సంబంధించిన రెండు దరఖా స్తులు, ఏఆర్టీ లెవెల్–2 కేటగిరీకి సంబంధించిన రెండు దరఖాస్తులతో పాటు సరోగసీ క్లినిక్కు సంబంధించి ఒక దరఖాస్తుకు కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, వాసవ్య స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జి.రేష్మీ, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ, ఎన్హెచ్ఎం డీపీఎంవో డాక్టర్ నవీన్ పాల్గొన్నారు. -
ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఆస్తి పన్ను మదింపు
పెడన: పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను అసెస్ మెంట్లు పెరుగుతున్నా ఆదాయం పెరగకపోవడంపై పురపాలక శాఖ పరిపాలన విభాగం(డీఎంఏ) సీరి యస్ అయ్యింది. ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులు, టెలికాన్ఫరెన్సుల్లో ఇదే విషయాన్ని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లోని అధికారులకు స్పష్టం చేసింది. పన్నులు వసూళ్లు చేయడంలోనే కాకుండా ఇంకా పాత రేట్లను కొనసాగిస్తున్నారంటూ మండిపడింది. ఆయా కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో అసెస్మెంట్లు పెరుగుతున్న స్థాయిలో ఆస్తి పన్నులు కూడా పెరగాల్సి ఉండగా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉందని.. తక్షణం వార్డు సచివాలయాల్లో ని అడ్మిన్లు, ఇంజినీరింగ్, ప్లానింగ్ కార్యదర్శులతో పునఃపరిశీలన చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సస్పెండ్ అవుతారు జాగ్రత్త.. ఆస్తి పన్నుల రూపంలో ఆదాయం వచ్చే విషయంలో మీనమేషాలు లెక్కిస్తే మాత్రం శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డీఎంఏ స్పష్టం చేసింది. డీఎంఏ కార్యాలయం నుంచి ప్రత్యేక బృందాలు ఆస్తి పన్నులపై క్రాస్ చెక్ చేస్తాయని, ఆ సమయంలో ఏమైనా పన్నులు సక్రమంగా వేయలేదని గుర్తిస్తే మాత్రం సస్పెన్షన్కు గురికావాల్సి ఉంటుందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో వార్డు సచివాలయాలకు చెందిన అడ్మిన్లు ఆస్తిపన్నులపై దృష్టి సారించారు. చాలా చోట్ల సిఫార్సులతోను, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో కొన్ని ఇళ్లకు సక్రమంగా పన్నులు విధించడం లేదని విషయాలపై కూడా ఫిర్యాదులు డీఎంఏ కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం. ఆదేశాలు నిజమే.. అసెస్మెంట్లు పెరుగుతున్నా.. ఆదాయం పెరగడం లేదని, ఆస్తి పన్నులు పునఃపరిశీలన చేయాలని డీఎంఏ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన వీసీల్లోను, టీసీల్లో ఇదే విషయమై చర్చ కూడా జరిగింది. అడ్మిన్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఆస్తిపన్నులు పెంపుదలలో బాగా వెనుకబడ్డారని తెలిపింది. గతంలో బిల్ కలెక్టర్లు ఉన్న సమయంలో పనులు సక్రమంగా జరిగేవని, ఇప్పుడు ఎందుకు ఆస్తి పన్నులు పెంచలేదని ఉన్నతాధికారులు అడిగారు. అనుమానం ఉన్న ఇంటిని కాదు, ప్రతి ఇంటినీ క్రాస్ చెక్ చేయాలని ఆదేశించారు. ఆ దిశగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. – పి.వెంకటేశ్వరరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్,పురపాలక సంఘం, పెడన అధునాతన భవనాలు కట్టినా పాత ఇంటి బిల్లులు ఇంకా జనరేట్ అవుతున్నట్లు డీఏంఏ కార్యాలయానికి ఫిర్యాదులు చేరినట్లుగా తెలిసింది. కొత్తగా భవనాలు నిర్మించినా, మొదటి అంతస్తు వరకు పన్ను వేసి రెండు, మూడు అంతస్తులకు పన్నులు వేయకపోవడం, కాలనీలకు పన్నులు వేయకపోవడం, డాక్యూమెంట్లు సరిగ్గా లేవని పన్నులు వేయకుండా ఉండటం వంటి విషయంలో డీఎంఏ కార్యాలయం చాలా సీరియస్గా స్పందించినట్లు అధికారులు చెబుతున్నారు. తక్షణం ఇటువంటి వాటిని గుర్తించి 20 శాతం పన్ను వేయాల్సిందేనని స్పష్టం చేసినట్లు వివరిస్తున్నారు. కొలతలు ప్రకారం పన్ను ఉందా లేక తగ్గిందా చూడాలని, ఏమాత్రం తగ్గినట్లు అనుమానం ఉన్నా తక్షణం వాటికి పన్నులు వేయాలని పేర్కొందని చెబుతున్నారు. డీఎంఏ కార్యాలయం నుంచి వెళ్లిన బృందాలకు పలు మునిసిపాలిటీల్లో, కార్పొరేషన్లలో ఈ దుస్థితి ఎదురైందని, పలువురు అడ్మిన్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొంటూ హెచ్చరికలు జారీ చేసిందని వివరిస్తున్నారు. కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పునఃపరిశీలన చేయాలని ఆదేశాలు అసెస్మెంట్లు పెరుగుతున్నా ఆస్తి పన్ను పెరగకపోవడంపై డీఎంఏ సీరియస్ వార్డు సచివాలయాల అడ్మిన్లు పట్టించుకోలేదని ఆగ్రహం ప్రత్యేక బృందాలు గుర్తిస్తే సస్పెండ్ చేస్తామంటూ హెచ్చరిక పరుగులు పెడుతున్న సచివాలయ ఉద్యోగులు భవనాలు కట్టినా.. -
కొత్త సాంప్రదాయం.. టీడీపీ కార్యకర్తకు ఉద్యోగం
విజయవాడ: రాష్ట్రంలో సంక్షేమ పథకాలను తమ పార్టీకి చెందిన వారికే వర్తింపు చేయాలని, ఇది ఏ స్థాయి అధికారి అయినా గుర్తుపెట్టుకుని వ్యవహరించాలని గతంలో బహిరంగంగా ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఉద్యోగాలు కూడా టీడీపీ కార్యకర్తలకే ఇస్తామనే విషయాన్ని తాజాగా బహిర్గతం చేశారు. ఓ టీడీపీ కార్యకర్తకు ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కేబినెట్ సాక్షిగా నిలవడం గమనార్హం. ఈరోజు(మంగళవారం) సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.అయితే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ తరహా నిర్ణయం తీసుకోవడం చెడు సాంప్రదాయానికే తెరలేపినట్లే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత కక్షలతో చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్త హత్యగావించబడితే, ఆయన కుమారుడికి ఇప్పుడు శాశ్వత ఉద్యోగం కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు పలువురు విశ్లేషకులు.2022లో వెల్దుర్ది మండలం గుండ్లపాడుకు చెందిన చంద్రయ్య హత్యగావించబడ్డాడు. అయితే రెండు కుటుంబాల నడుమ చోటు చేసుకున్న విభేదాల కారణంగా చంద్రయ్యను హత్య చేసింది మరో కుటుంబం. ఈ హత్యకు రెండు కుటుంబాల మధ్య కక్ష అని అప్పట్లోనే పోలీసులు సైతం ప్రకటించారు. ఇక్కడ చంద్రయ్య కుటుంబం కూడా ఒక కుటుంబంపైనే ఫిర్యాదు చేసింది కూడా. అంటే ఇదంతా వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందనే విషయం స్పష్టంగా తెలుస్తుంటే, మరి చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఇచ్చారనేది చర్చనీయాంశంగా మారింది. ఇదీ చదవండి: AP: మళ్లీ ప్రజలకు రేషన్ కష్టాలే.. డోర్ డెలివరీకి మంగళం -
AP: మళ్లీ ప్రజలకు రేషన్ కష్టాలే.. డోర్ డెలివరీకి మంగళం
విజయవాడ: చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీకి మంగళం పాడింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రేషన్ను డోర్ డెలివరీని నిలిపివేస్తూ చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈరోజు(మంగళవారం) సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకోగా, అందులో రేషన్ డోర్ డెలివరీని నిలిపివేయడం ఒకటి. ఫలితంగా ఎండీయూ ఆనరేటర్లను రోడ్డున పడేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దాంతో 9260 రేషన్ డెలివరీ వాహనాలు నిలిచిపోనున్నాయి. మళ్లీ పాత పద్ధతిలోనే రేషన్ షాపుల నుండి సరఫరా చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. మళ్లీ ప్రజలకు రేషన్ కష్టాలే..రేషన్ డోర్ డెలివరీని నిలిపివేసే అంశాన్ని ఎండీయూ ఆపరేటర్లు గతంలో వ్యతిరేకించినా దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ఎండీయూ ఆపరేటర్లపై జాలి లేకుండా వ్యవహరించడమే కాకుండా మళ్లీ ప్రజలు పాత పద్ధతిలో షాపుల వద్ద క్యూ లో ఉండి తీసుకునే విధానానికే ప్రభుత్వం మళ్లీ మొగ్గుచూపింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయంతో రేషన్ను ఇప్పటివరకూ డోర్ డెలివరీ ద్వారా ప్రజలు ఇంటి వద్దనే పొందుతుండగా మళ్లీ వెనకటి రోజుల గుర్తు చేయడానికి సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. దాంతో ప్రజలకు మళ్లీ రేషన్ కష్టాలు తప్పదనే సంకేతాన్ని, సందేశాన్ని కేబినెట్ సాక్షిగా ఇచ్చేశారు చంద్రబాబు. ఇప్పటికే 2.50 లక్షల వాలంటీర్లను తీసేసిన ప్రభుత్వం.. తాజాగా ఎండీయూ ఆపరేటర్లు, రేషన్ వాహనాలు అవసరం లేదనే నిర్ణయానికి వచ్చేసింది. -
‘కేశినేని చిన్నియే టీడీపీ గూండాలను మాపైకి పంపారు’
ఎన్టీఆర్ జిల్లా: ప్రశాంతమైన తిరువూరులో టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. ‘టీడీపీ గూండాలు మాపై దాడి చేశారు కేశినేని చిన్నియే టీడీపీ గూండాలను మాపైకి పంపారు. మా కారును ధ్వంసం చేశారు.. మమ్మల్ని హతమార్చాలని చూశారు, టీడీపీ గూండాల దాడికి పోలీసులు సహకరించారు. మాపై దాడి చేసిన వారిని ఎవరినీ వదిలి పెట్టం. పోలీసులే రాజకీయం చేస్తున్నారు.కౌన్సిలర్లకు వారి ఇంటి నుంచి భద్రత ఇస్తామని వితండవాదం చేశారు. మా కౌన్సిలర్లకు మేమే రక్షణగా నిలిచాం. టిడిపి ఎంపీ కేశినేని చిన్ని మందు పోయించి టిడిపి గూండాలను మా పైకి రెచ్చగొట్టారు. మా కారును పైకి లేపి పల్టీలు కొట్టించి...ధ్వంసం చేయాలని చూశారు. మా కారు ధ్వంసం చేసే వరకూ పోలీసులు చూస్తూ ఊరుకున్నారు’ అని ధ్వజమెత్తారు.కోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదునేను 35 ఏళ్లుగా తిరువూరు రాజకీయాలు చూస్తున్నా. తిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఒక గూండా మాదిరి వ్యవహరించారు. ఇలాంటి ఎమ్మెల్యేని తిరువూరు ప్రజలు ఎన్నడూ చూడలేదు. కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. టిడిపి నేతలను చట్టపరంగా శిక్షిస్తాం. మాకు రక్షణ కల్పించమని కోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ మహిళా కౌన్సిలర్లను బలవంతంగా లాక్కెళ్లిపోయారు. అసలు ఈ రాష్ట్రం ఎటుపోతుంది. రాజ్యాంగబద్ధంగా కూటమి ప్రభుత్వం నడుచుకోవడం లేదు. రాబోయేది జగన్ మోహన్ రెడ్డి 2.0 పాలనే. తప్పుచేసిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటాం. మాపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వారి పై కేసు పెట్టి చట్టం ముందు నిలబెడతాం’ అని తిరువూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి,నల్లగట్ల స్వామిదాస్ హెచ్చరించారు.టీడీపీ గూండాలు భయోత్పాతం స్పష్టించారురెండు గంటల పాటు టిడిపి గూండాలు భయోత్పాతం సృష్టించారు. తిరువూరు వెళ్లడానికి మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. పోలీసులే దగ్గరుండి టిడిపి గూండాలతో మాపై దాడి చేయించారు, మేం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాం. నా కారును ధ్వంసం చేస్తున్నా.. పోలీసులు చోద్యం చూశారు. కౌన్సిలర్లకు భద్రత కల్పించమని ఎన్నికల కమిషనర్ , హైకోర్టు ఆదేశాలున్నా పోలీసులు పెడచెవిన పెట్టారు. ఒక్కో కౌన్సిలర్ కు ఒక్కొక్క గన్ మెన్ ఇవ్వాలని ఆదేశాలున్నాయ్. పోలీసులు రక్షణ ఇవ్వకపోతే మేమే రక్షణ కవచంలా నిలిచాం. మా కారును ధ్వంసం చేసి మా పై హత్యాయత్నం చేశారుతిరువూరు టిడిపి ఎమ్మెల్యే వీధి రౌడీలా ప్రవర్తించాడు. మా కారును అడ్డగించి మా పై దాడి చేసారు. నన్ను , స్వామిదాస్ ను కులం పేరుతో దూషించి చంపేస్తామని బెదిరించారు’ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. -
తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా
సాక్షి, విజయవాడ: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిరవధిక వాయిదా పడింది. కోరం లేక ముగించిసనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. నిన్న, ఈ రోజు టీడీపీ అరాచకం వల్ల ఎన్నిక జరగలేదు. ఎన్నికలు జరగకుండా టీడీపీ గూండాలు అల్లర్లు సృష్టించారు. టీడీపీ గూండాల బీభత్సంతో రెండు రోజులు ఎన్నిక జరగలేదు. వైసీపీ కౌన్సిలర్లు తిరువురు వెళ్లకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు.హైకోర్టు చెప్పినా కానీ పోలీసులు భద్రత కల్పించలేదు. టీడీపీ నేతల దాడితో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఎన్నికకు హాజురుకాలేకపోయారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కౌన్సిల్ సభ్యులు రాకపోవడంతో ఆర్డీవో కే.మాధురి ముగించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం తదుపరి కార్యచరణ ఉంటుందని ఆర్డీవో ప్రకటించారు.దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలను పోలీసు వాహనం ఎక్కనివ్వకుండా టీడీపీ టీడీపీ నేత రమేష్ రెడ్డి, టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. పోలీసు వాహనంపై కూడా టీడీపీ గూండాల దాడి చేశారు. దేవినేని అవినాష్ , మొండితోక అరుణ్ కుమార్లను రెడ్డిగూడెం స్టేషన్కు పోలీసులు తరలిస్తున్నారు. -
టీడీపీ గూండాల దౌర్జన్యం.. ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
విజయవాడ: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు హాజరయ్యేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పించడంలో పోలీసులు మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆ పార్టీ ప్రతినిధి బృందం మండిపడింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, పండుల రవీంద్రబాబు, వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర ముఖ్య నాయకులు విజయవాడలో మరోసారి ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీని కలిసి జరిగిన దౌర్జన్యానికి సంబంధించి ఫిర్యాదు చేశారు.కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా పోలీసులు బేఖాతరు చేయని వైనంపై ఆధారాలతో సహా కమిషనర్కు వివరించారు. కౌన్సిలర్లకు భద్రత కల్పించకపోగా, దాడికి పాల్పడిన కూటమి నేతలకు అండగా నిలుస్తూ, వైఎస్సార్సీపీ నేతలనే పోలీసులు అరెస్ట్ చేసిన వైనాన్ని కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళారు. అనంతరం విజయవాడలో మీడియాతో పార్టీ నేతలు మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారంటే..పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చినా అవి క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. పోలీసులే ఎస్ఈసీ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీకి పూర్తి బలం ఉన్నా, అధికార బలంతో అడ్డదారిలో నెగ్గాలని చూస్తున్నారు. తిరువూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక విషయంలో టీడీపీ అనుసరిస్తున్న విధానాలు, పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించడంపై ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసి వైఎస్సార్సీపీ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది. చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హెచ్చరించారు. రాష్ట్రాన్ని బీహార్లా మార్చేశారు: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తలంపుతో ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి అధికార టీడీపీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారు. పోలీసులు కూడా రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ నాయకులకు వంత పాడుతున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్లకు స్వేచ్ఛగా ఓటేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రౌడీ మూకల్ని వెంటేసుకొచ్చి 144 సెక్షన్ ను ఉల్లంఘించి హంగామా చేస్తుంటే అడ్డుకోవాల్సిన పోలీసులే వారికి సహకరించారు.ఎన్నిక సక్రమంగా జరిగేలా చూసుకోవాల్సిన పోలీసులే మా కౌన్సిలర్ల మెడలో ఉన్న వైయస్సార్సీపీ కండువాలను లాగి పడేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం చూసి ప్రజలంతా చీదరించుకుంటున్నారు. తిరువూరులో పోలీసులే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కూటమి పాలనలో ఆంధ్ర రాష్ట్రం బీహార్ కన్నా దారుణంగా తయారవుతోంది. ఇలాంటి సంస్కృతి భావితరాలకు మంచిది కాదని గుర్తుంచుకోవాలి. అధికార పార్టీ అరాచకాలను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలి.కోర్టులు, ఎన్నికల కమిషన్ ఆదేశాలను పట్టించుకోరా?: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుచట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే పచ్చ చొక్కాలు తొడుక్కున్న టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ఓటేసేందుకు వెడుతున్న కౌన్సిలర్లకు భద్రత కల్పించాల్సిన పోలీసులు, తిరువూరు వస్తేనే భద్రత కల్పిస్తామని మాటమార్చారు. చట్టపరంగా నడుచుకోవాల్సిందిపోయి అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి, పోలీసులకు ఎన్నికల కమిషన్ ఆదేశాలన్నా, కోర్టులన్నా గౌరవం కానీ భయం కానీ కనిపించడం లేదు. నిన్న ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆర్డర్ను పోలీసులు పాటించడం లేదని ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు, కలెక్టర్తో మాట్లాడతానని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని హామీ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు తిరువూరులో ఎన్నికకు హాజరుకావాల్సి ఉంటే, విజయవాడ నుంచి వస్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మార్గమధ్యలో ఎందుకు ఆపేయాల్సి వచ్చిందో పోలీసులే సమాధానం చెప్పాలి. మున్సిపాలిటీలో కేవలం ముగ్గురు సభ్యుల బలం మాత్రమే ఉన్న టీడీపీ, చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కింది. పోలీసుల అండతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గూండాలతో వచ్చి మా కౌన్సిలర్లపై దాడికి పాల్పడ్డాడు. పోలీసులే బలవంతంగా నలుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి తీసుళ్లి తెలుగుదేశం పార్టీలో చేర్పించారు.ఈరోజు కూడా అదే విధంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఎన్నికల కమిషన్ ఆదేశాలను సైతం ఉల్లంఘిస్తున్నారు. పోలీసుల వ్యవహారశైలిపై ఈ రోజు ఉదయం వైయస్సార్సీపీ కోర్టును ఆశ్రయించింది. కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినా పోలీసులు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారని సాక్షాత్తు కోర్టు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ 30 నిమిషాల్లో పూర్తి వివరాలతో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. అధికారం చేతుల్లో ఉంది కదా అని దౌర్జన్యం చేసి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. వీరి ఆటలు ఎంతోకాలం సాగవు. తిరువూరు మున్సిపాలిటీ హాల్ వరకు కౌన్సిలర్లకు భద్రత కల్పించి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. -
వైఎస్సార్సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడి
రెండు గంటల పాటు టిడిపి గూండాలు భయోత్పాతం సృష్టించారుఎమ్మెల్సీ ,మొండితోక అరుణ్ కుమార్తిరువూరు వెళ్లడానికి మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదుపోలీసులే దగ్గరుండి టిడిపి గూండాలతో మాపై దాడి చేయించారుమేం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాంనా కారును ధ్వంసం చేస్తున్నా.. పోలీసులు చోద్యం చూశారుకౌన్సిలర్లకు భద్రత కల్పించమని ఎన్నికల కమిషనర్ , హైకోర్టు ఆదేశాలున్నా పోలీసులు పెడచెవిన పెట్టారుఒక్కో కౌన్సిలర్ కు ఒక్కొక్క గన్ మెన్ ఇవ్వాలని ఆదేశాలున్నాయ్పోలీసులు రక్షణ ఇవ్వకపోతే మేమే రక్షణ కవచంలా నిలిచాంమా కారును ధ్వంసం చేసి మా పై హత్యాయత్నం చేశారుతిరువూరు టిడిపి ఎమ్మెల్యే వీధి రౌడీలా ప్రవర్తించాడుమా కారును అడ్డగించి మా పై దాడి చేసారునన్ను , స్వామిదాస్ ను కులం పేరుతో దూషించి చంపేస్తామని బెదిరించారు కులం పేరుతో దూషించి బెదిరించిన వారి పై నేను , స్వామిదాస్ కేసు పెట్టి... హై కోర్టుకు ఈడుస్తాంకోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు: తిరువూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి,నల్లగట్ల స్వామిదాస్నేను 35 ఏళ్లుగా తిరువూరు రాజకీయాలు చూస్తున్నాతిరువూరు టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఒక గూండా మాదిరి వ్యవహరించారుఇలాంటి ఎమ్మెల్యేని తిరువూరు ప్రజలు ఎన్నడూ చూడలేదుకూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారుటిడిపి నేతలను చట్టపరంగా శిక్షిస్తాంమాకు రక్షణ కల్పించమని కోర్టు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదువైఎస్సార్సీపీ మహిళా కౌన్సిలర్లను బలవంతంగా లాక్కెళ్లిపోయారుఅసలు ఈ రాష్ట్రం ఎటుపోతుందిరాజ్యాంగబద్ధంగా కూటమి ప్రభుత్వం నడుచుకోవడం లేదురాబోయేది జగన్ మోహన్ రెడ్డి 2.0 పాలనేతప్పుచేసిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటాంమాపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వారి పై కేసు పెట్టి చట్టం ముందు నిలబెడతాంప్రశాంతమైన తిరువూరులో టీడీపీ గూండాలు విధ్వంసం స్పష్టించారు: దేవినేని అవినాష్టీడీపీ గూండాలు మాపై దాడి చేశారుకేశినేని చిన్నియే టీడీపీ గూండాలను మాపైకి పంపారుమా కారును ధ్వంసం చేశారు.. మమ్మల్ని హతమార్చాలని చూశారుటీడీపీ గూండాల దాడికి పోలీసులు సహకరించారుమాపై దాడి చేసిన వారిని ఎవరినీ వదిలి పెట్టంపోలీసులే రాజకీయం చేస్తున్నారుకౌన్సిలర్లకు వారి ఇంటి నుంచి భద్రత ఇస్తామని వితండవాదం చేశారుమా కౌన్సిలర్లకు మేమే రక్షణగా నిలిచాంటిడిపి ఎంపీ కేశినేని చిన్ని మందు పోయించి టిడిపి గూండాలను మా పైకి రెచ్చగొట్టారు మా కారును పైకి లేపి పల్టీలు కొట్టించి...ధ్వంసం చేయాలని చూశారుమా కారు ధ్వంసం చేసే వరకూ పోలీసులు చూస్తూ ఊరురున్నారు 👉వైఎస్సార్సీపీ నేతలు అరెస్ట్దేవినేని అవినాష్, అరుణ్కుమార్లు అరెస్ట్తిరువూరు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులురెడ్డిగూడెం స్టేషన్కు తరలిస్తున్న పోలీసులు👉తిరువూరులో టీడీపీ గూండాల అరాచకంవైఎస్సార్సీపీ నేతల వాహనాలపై టీడీపీ గూండాల దాడిదేవినేని అవినాష్, అరుణ్కుమార్ వాహనాలపై దాడివైఎస్సార్సీపీ నేతల కారు అద్దాలు పగలగొట్టిన టీడీపీ గూండాలుదారికాసి వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ గూండాలుఎ.కొండూరు మండలం రేపూడి క్రాస్ వద్ద టీడీపీ గూండాల విధ్వంసంసాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు బరి తెగించేశారు.. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ నేతలను తిరువూరు వెళ్లకుండా చేసేందుకు కుట్రలకు తెరతీశారు. తిరువూరు వెళ్లే మార్గంలో రామచంద్రాపురం, చీమల పాడు వద్ద టీడీపీ.. భారీగా కార్యకర్తలను మోహరింపచేసింది. వైఎస్సార్సీపీ నేత స్వామిదాస్ ఇంటిని టీడీపీ గూండాలు ముట్టడించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల కుటుంబసభ్యులపై టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగారు.వైఎస్సార్సీపీ నేతల్ని దారికాసి టీడీపీ గూండాలు అడ్డగించారు. అవినాష్, స్వామిదాస్ అరుణ్ వాహనాలను అడ్డగించారు. వాహనాలు కదలకుండా టీడీపీ గూండాలు చుట్టుముట్టారు. అవినాష్, స్వామిదాస్పై టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేసింది. 13వ వార్డు కౌన్సిలర్ తండ్రితో టీడీపీ ఫిర్యాదు చేయించింది. ఓటమి భయంతో టీడీపీ గూండాలు దౌర్జన్యాలు చేస్తున్నారు. కాగా.. భద్రత కల్పించడంలో ఎన్నికల కమిషనర్ ఆదేశాలను కూడా పోలీసులు లెక్కచేయడం లేదు. తిరువూరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల రక్షణ విషయంలో వితండవాదం చేస్తున్నారు.తిరువూరు వస్తేనే భద్రత కల్పిస్తామని పోలీసులు అంటున్నారు. నిన్న టీడీపీ గూండాల దాడితో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ నుంచి ఎన్నిక జరిగే వరుకు కౌన్సిల్ హాలు వరకు రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కోరుతున్నారు. టీడీపీ గూండాల దాడులపై ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవిని సంఖ్యాబలం లేకపోయినా తన ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి నేటికి (మంగళవారం) వాయిదా వేశారు. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత కావాలి
కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ కృష్ణలంక(విజయవాడతూర్పు): భారత రాజ్యాంగ పరిరక్షణ వర్తమానంలో అందరి బాధ్యత కావాలని సీనియర్ పాత్రికేయుడు, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. పాలనకు పక్షవాతం సోకిందని, ఫెడరలిజానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా భారతదేశ ఫెడరల్ వ్యవస్థ–ఎదురవుతున్న సవాళ్లు అనే అంశంపై ఎం.బి.విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ పి.మధు అధ్యక్షతన సోమవారం స్మారకోపన్యాసం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీధర్ సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఫోర్త్ ఎస్టేట్లో ప్రశ్నించే ధోరణి లేదు.. అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కల్పించినా వాటికి భంగం కలిగించే ప్రయత్నాలు ముమ్మరం కావడం ప్రమాదకరమన్నారు. ఎంతో ముందు చూపుతో అత్యున్నత రాజ్యాంగం అందుబాటులోకి తెచ్చుకున్నామని చెప్పారు. ఆర్టికల్ 200, 201 ప్రకారం బిల్లుల ఆమోదానికి పరిధి ఉన్నప్పటికీ రాష్ట్రపతి ప్రశ్నలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఫైనాన్స్ ఫెడరలిజం అనేది ప్రశ్నార్ధకం అయ్యిందన్నారు. ఆర్టీఐ చట్టం కింద సమాచారం ఇవ్వాల్సి ఉండగా డేటా చట్టం పేరుతో సమాచారం లేకుండా చేస్తున్నారని, ఫోర్త్ ఎస్టేట్లో ప్రశ్నించే ధోరణి మాయమవుతుందని చెప్పారు. రాజ్యాంగం విలువలకు తిలోదకాలు ఇచ్చారని మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వ బిల్లులను గవర్నర్ అడ్డుకుంటే ఇక ఫెడరలిజం ఎక్కడుందని ప్రశ్నించారు. విచక్షణ లేని వారంతా గవర్నర్ స్థానంలో ఉండడం వలన పాలన కూడా పక్షవాతం బారిన పడుతోందన్నారు. రాష్ట్రాల సమాఖ్యగా ఉన్న దేశంలో ఇలాంటివి శ్రేయస్కరం కాదని, ప్రజలే భారత రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, పి.రామరాజు, టి.క్రాంతి, వై.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
హోంగార్డు కుటుంబానికి ఆర్థిక చేయూత
విజయవాడస్పోర్ట్స్: జిల్లా పోలీస్ కమిషనరేట్ హోంగార్డ్స్ యూనిట్లో హోంగార్డ్గా విధులు నిర్వర్తిస్తూ బ్రెయిన్ స్ట్రోక్తో మృతిచెందిన పి.శ్రీమన్నారాయణ కుటుంబానికి జిల్లాలోని హోంగార్డులు ఆర్థిక చేయూతనందించారు. శ్రీమన్నారాయణ కుటుంబ సభ్యులకు ఆర్థిక ఆసరా కల్పించేందుకు జిల్లాలో పని చేస్తున్న హోంగార్డులందరూ వారి ఒక్క రోజు వేతనాన్ని సమకూర్చారు. రూ.5 లక్షల నగదు చెక్కును పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు చేతుల మీదుగా శ్రీమన్నారాయణ భార్య పి.నరసమ్మకు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం అందజేశారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కేజీవీ సరిత, హోంగార్డ్స్ ఆర్ఐ కె.సుధాకరరెడ్డి పాల్గొన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా గట్టుభీమవరం(వత్సవాయి): హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడిన సంఘటన జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న క్రమంలో బస్సు జాతీయ రహదారిపై కొంగరమల్లయ్య గట్టు దాటాక సాయిబాబా గుడి సమీపంలో లారీని తప్పించబోయి అదుపు తప్పి పక్కకు ఒరిగింది. దీంతో బస్సులోని ప్రయాణికులు వెంటనే దిగిపోయారు. తరువాత చిన్నగా బస్సు బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు తెలిపారు. -
తెలంగాణ మద్యం స్వాధీనం
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో సోమవారం ఎకై ్సజ్ అధికారులు తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. గంపలగూడెం మండలం ఊటుకూరు నుంచి 78 మద్యం సీసాలతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గుండ్ల శేషగిరిరావు, ఎల్లమ్మలను అదుపులోకి తీసుకున్నట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. నిందితులను తిరువూరు కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్కు ఆదేశించారని తెలిపారు. బైపాస్ రోడ్డులో గుర్తు తెలియని యువకుడి మృతి చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): పాముల కాల్వ సమీపంలోని బైపాస్ రోడ్డులో గుర్తు తెలియని యువకుడు మృతదేహా న్ని సోమవారం గుర్తించారు. సుమారు 35 సంవత్సరాల కలిగిన వ్యక్తి రోడ్డు పక్కగా పడి ఉండటాన్ని గమనించిన వాహన చోదకులు కొత్తపేట పోలీసులకు సమాచారం అందించారు. జక్కంపూడి వైఎస్సార్ కాలనీ వీఆర్వో మర్రెపూడి శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గంజాయి కేసులో పాత నేరస్తుడి అరెస్ట్ గుడివాడరూరల్: గంజాయి కేసులో ఉన్న పాత నేరస్తుడిని అరెస్ట్ చేసినట్లు గుడివాడ తాలూకా ఎస్ఐ ఎన్.చంటిబాబు సోమవారం తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 20న నమోదు చేసిన గంజాయి కేసులో ఇప్పటికే నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామన్నారు. కోదాడకు చెందిన షేక్ పాషా(25) వారికి గంజాయిని సరఫరా చేసేవాడని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాషాను ఆదివారం సాయంత్రం మండలంలోని లింగవరం గ్రామంలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సీఐ ఎస్ఎల్ఆర్ సోమేశ్వరరావు నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు. తమ్ముడిపై పారతో దాడి కోనేరుసెంటర్: వేరే మహిళను ఇంట్లోకి తీసుకురావడాన్ని వ్యతిరేకించిన తమ్ముడిపై అన్న పారతో దాడి చేశాడు. ఈ సంఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. మచిలీపట్నం చిలకలపూడికి చెందిన వెంకటేష్, రాఘవలు అన్నదమ్ములు, వెంకటేష్కు వివాహం కాగా భార్యను వదిలేశాడు. తమ్ముడు రాఘవ తాపీ పనులు చేస్తుంటాడు. వెంకటేష్ ఇటీవల వేరే మహిళను ఇంటికి తీసుకువచ్చి పెట్టాడు. దీంతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. వెంకటేష్ ప్రవర్తనను రాఘవ వ్యతిరేకించటంతో ఆగ్రహంతో ఊగిపోయిన వెంకటేష్ తమ్ముడి తలపై పారతో బలంగా కొట్టాడు. దీంతో రాఘవ తలకు బలమైన గాయమైంది. చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు రాఘవను మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. రాఘవకు 60 కుట్లు పడ్డాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. -
పోలీస్ ప్రజావాణిలో 89 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 89 మంది ఫిర్యాదులు అందజేశారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీలు ఏ.బి.టి.ఎస్.ఉదయరాణి, కృష్ణమూర్తినాయుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదులను స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్య అడిగి తెలుసుకున్నారు. ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 42, కుటుంబ కలహాలపై తొమ్మిది, కొట్లాటకు సంబంధించి ఏడు, మహిళా సంబంధిత నేరాలపై ఏడు, సైబర్ నేరాలపై మూడు, దొంగతనాలపై రెండు, ఇతర చిన్న చిన్న వివాదాలు, సంఘటనలపై 19 మంది ఫిర్యాదులు అందజేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు డీసీపీలు ఆదేశాలిచ్చారు. 925 వెండి నాగపడగలు సమర్పించిన అజ్ఞాత భక్తులు ఘంటసాల: స్థానిక నాగేంద్ర స్వామి పుట్ట వద్ద అజ్ఞాత భక్తులు వెండి నాగ పడగలు వేసి వెళ్లినట్లు శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు గొర్రెపాటి వెంకట రామకృష్ణ(ట్రస్టీ), గొర్రెపాటి జగన్మోహనరావు, గొర్రెపాటి సురేంద్ర సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘంటసాల గ్రామంలో ప్రసిద్ధి గాంచిన సంతాన సాఫల్య స్వామిగా పేరుగాంచిన శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయ(షష్టి గుడి) ప్రాంగణంలోని నాగేంద్ర స్వామి పుట్ట వద్ద మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని అజ్ఞాత భక్తులు వెండితో చేసిన నాగ పడగలు పుట్టపై వేసి వెళ్లిపోయారన్నారు. వీటిని ఆలయ సిబ్బంది గుర్తించి తమకు అందజేశారని చెప్పారు. వాటిని లెక్కించగా 925 నాగ వెండి పడగలు ఉన్నాయన్నారు. భక్తులు తమ కోర్కెలు తీరినందు వల్లే ఇలా మొక్కబడి తీర్చుకుని ఉంటారని ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఆలయ చరిత్రలో తొలిసారిగా పుట్టపై భక్తులు వెండి నాగ పడగలు వేశారని, ఆ భక్తులకు స్వామి వార్ల ఆశీస్సులు అందించాలని కోరారు. వీటి విలువ రూ.లక్ష వరకు ఉంటుందని ఆలయ ధర్మకర్తలు అంచనా వేశారు. -
అన్నమయ్య పదశోభకు పట్టంకట్టిన సంకీర్తనలు
విజయవాడకల్చరల్: శ్రీ వెంకటేశ్వర సంకీర్తనా అకాడమీ(శ్వాస), కంచికామకోటిపీఠస్థ శారదా చంద్రమౌళీశ్వర, వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య జయంతి సందర్భంగా లబ్బీపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న పదయజ్ఞం కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు కార్యక్రమంలో ముడుంబై లక్ష్మి, రుగ్వేదం సోదరీమణులు, వడ్డాది కామేశ్వరి, వీరుభొట్ల సీతారమణి, తిరుపతికి చెందిన చిన్నమదేవి, ఎన్సీ శ్రీదేవిలు సంగీత యజ్ఞంలో పాల్గొన్నారు. అన్నమయ్య సంకీర్తనలకు విశేష ప్రాధాన్యం కలిగించిన గరిమెళ్ల బాల కృష్ణప్రసాద్ స్మృత్యర్ధం ఆయన ఆలపించిన కీర్తనల వీడియోలను, అందుకున్న పురస్కారాలను ప్రదర్శించారు. అలరించిన సప్తగిరుల సంకీర్తనం.. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామివారిని చేరుకోవాలంటే ఏడుకొండలను దాటి రావాలి ఒక్కో పర్వతానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వాటిని ప్రాధాన్యతను వివరిస్తూ అన్నమయ్య రచించిన కీర్తనలకు సప్తగిరులని పేరు అవి భావములోన, బ్రహ్మకడిగిన పాదము, యెంతమాత్రమున, పొడగంటిమయ్యా, కొండలలోనెలకొన్న, నారాయణతే నమోనమో, ముద్గుగారే యశోద కీర్తనలను నగరానికి చెందిన పలువురు విద్వాంసులు మధురంగా ఆలపించారు. నిర్వాహకులు స్వామి వారికి ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. లబ్బీపేట శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మాగంటి వేణుగోపాల్, కార్యనిర్వాహకుడు డాక్టర్ సి.రామ్మోహనరావు, మేనేజర్ శర్మ పాల్గొన్నారు. దుర్గమ్మ సేవలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సినీనటుడు బెల్లంకొండ శ్రీనివాస్ సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన శ్రీనివాస్ను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. కారు ఢీకొని ఆటోడ్రైవర్ మృతి కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కారు ఆటోను ఢీ కొట్టిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృత్యువాత పడ్డాడు. కొండపల్లి శాంతినగర్ సమీపంలో 30వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొండపల్లి గ్రామానికి చెందిన కంపా సాంబయ్య(59) ఆటోడ్రైవర్గా పని చేస్తాడు. ఇబ్రహీంపట్నం నుంచి జి.కొండూరు వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో కంపా సాంబయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికుల సమాచారం మేరకు 108 వాహన సిబ్బంది చేరుకుని వైద్యపరీక్షలు జరిపి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉండగా, ఇద్దరికి వివాహాలయ్యాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎంఈఎఫ్ కృష్ణా జిల్లా కమిటీ ఏర్పాటు మచిలీపట్నంటౌన్: ఎమ్మార్పీ ఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాలతో మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కృష్ణాజిల్లా నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎన్నికల్లో ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి బిక్షాలు మాదిగ తెలిపారు. ఎంఈఎఫ్ కృష్ణా జిల్లా నూతన కమిటీ అధ్యక్షుడిగా దేవరపల్లి విక్టర్ బాబు, ఉపాధ్యక్షుడిగా జే అనిల్కుమార్, ప్రధాన కార్యదర్శిగా బీడెల్లి మరియ కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శిగా బొకినాల కృష్ణ, కోశాధికారిగా రాచపూడి బాలస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉడుముల దుర్గారావు, గౌరవ అధ్యక్షుడిగా మేదర రమేష్, గౌరవ ముఖ్య సలహాదారుగా రావెల వరుణ్ కుమార్, లీగల్ అడ్వైజర్గా అద్దేపల్లి నిరంజన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
అభయాంజనేయునికి విశేష పూజలు
హనుమాన్జంక్షన్రూరల్: హనుమాన్జంక్షన్లోని ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు మూడో రోజైన సోమవారం ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని దేవస్థానాన్ని, స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు. ప్రధాన అర్చకులు మారేపల్లి సీతారామానుజాచార్యులు, అర్చకులు గొట్టిపాళ్ల శ్రీనివాసాచార్యులు, శృంగారం వెంకట శేషారామాచార్యులు అంజనీపుత్రునికి ప్రభాత సేవ, 1,008 చామంతి పూలతో ప్రత్యేక పూజలు చేశారు. అధ్యాత్మిక వేదికపై కోదండ రామాంజనేయ భజన మండలి (బిళ్లనపల్లి) భక్త బృందం సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. సాయంత్రం హనుమంతునికి బంగారు, వెండి పుష్పాలతో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయం ఎదుట సాయికృష్ణ భజన మండలి మహిళలు నిర్వహించిన కోలాటం ఆద్యంతం ఆకట్టుకుంది. కొరియోగ్రాఫర్ అనిల్కుమార్ ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన ‘డ్యాన్స్ బేబి డ్యాన్స్’ నృత్య ప్రదర్శన, నవీన ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ మ్యూజికల్ నైట్ అలరించింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి పితాని తారకేశ్వరరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
క్రీడల్లో ఏపీని అగ్రగామిగా నిలబెట్టాలి
విజయవాడస్పోర్ట్స్: జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని, క్రీడల్లో ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు క్రీడాకారులు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా కలిదిండిలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సిలంబం(కర్రసాము) పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు విజయవాడలోని శాప్ కార్యాలయంలో చైర్మన్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ.. ఎస్వీఆర్కే ఇండియన్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 73 గోల్డ్ మెడల్స్, 16 సిల్వర్ మెడల్స్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రపంచ క్రీడా వేదికపై అత్యధిక పతకాలు సాధించి రాష్ట్ర, దేశ గౌరవాన్ని పెంచాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో సిలంబం కోచ్లు శ్రీకాంత్, వర్మ తదితరులు పాల్గొన్నారు. -
పని చేయకపోతే సస్పెండ్ చేస్తా
జగ్గయ్యపేట: ‘ప్రజలు సమస్యలతో వచ్చినప్పుడు ఓపికగా వినాలి.. మీరేమైనా బ్రిటీష్ రాజ్యంలో ఉన్నారా? సమస్యలపై స్పందన లేకుంటే ఎలా?’ అని కలెక్టర్ జి.లక్ష్మీశ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని కోదాడ రోడ్డులో గల బీ– కన్వెన్షన్ హాల్లో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్లో అన్ని శాఖల నుంచి అత్యధికంగా ప్రజలు సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తున్నారన్నారు. రెవెన్యూ, మునిసిపల్, మహిళ శిశు సంక్షేమశాఖల నుంచే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. పద్దతి మార్చుకోకుంటే.. నందిగామ డివిజన్ పరిధిలోని సర్వేయర్లు, తహసీల్దార్ల పనితీరు సక్రమంగా లేదని పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే సస్పెండ్ చేస్తానని కలెక్టర్ హెచ్చరించారు. గత వారం తిరువూరులో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కూడా అధికారులను మందలించినా మార్పు రాలేదన్నారు. ప్రతి అర్జీదారుడు ఇచ్చే అర్జీని మండలంలోని అన్ని శాఖల ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయాలే తప్ప సమస్యపై నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. పీ4 సర్వే తీరుపై మండిపాటు.. జిల్లాలో అన్ని గ్రామాల్లో జరుగుతున్న పీ4 సర్వే కొన్ని గ్రామాల్లో సక్రమంగా జరగడంలేదని కలెక్టర్ అన్నారు. కొందరు ఎంపీడీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అటువంటి వారిని ఉపేక్షించేదిలేదన్నారు. ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు కూడా మీ పరిధిలో ఉన్న ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలను కూడా గుర్తించి పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చేలా చూడాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ, డీఆర్డీఏ పీడీ ఎన్.వి.నాంచరరావు, డీపీవో లావణ్య కుమారి, ఏసీపీలు తిలక్, వెంకటేశ్వరరావు, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శ్రీనివాసరావు, అని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 461 అర్జీలు స్వీకరణ.... జగ్గయ్యపేటలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సమస్యలపై 461 అర్జీలు వచ్చాయి. వీటిలో జగ్గయ్యపేట మండలం నుంచి 222, పెనుగంచిప్రోలు 56, వత్సవాయి 44, నందిగామ మండలం నుంచి 38, చందర్లపాడు 8, వీరులపాడు 4, కంచికచర్ల 8 చొప్పున అర్జీలు వచ్చాయి. అర్జీల పరిష్కారంపైప్రత్యేక దృష్టి పెట్టండి డీఆర్వో లక్ష్మీ నరసింహం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అర్జీదారుడు సంతృప్తి చెందేలా స్పష్టమైన సమాచారంతో అర్జీలను పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీ నరసింహం అన్నారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీ నరసింహం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా సమస్యలను పరిష్కరించి అర్జీదారులను సంతృప్తి పరచడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలన్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 63 అర్జీలు అందాయి. ● పెనుగంచిప్రోలులోని పాత సినిమాహల్ సెంటర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం (బురుజు సెంటర్) వరకు ఆర్అండ్బీ రోడ్డు విస్తరణకు సర్వే చేస్తున్నారని స్థానికులు వివరించారు. అయితే అధికారులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని.. రోడ్డు విస్తరణ చేస్తే తమ గృహాలు నేలమట్టం అవుతాయని న్యాయం చేయాలంటూ మహిళలు కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. ● పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా ఇటీవల కల్లు గీత కార్మికుని కోటాలో మద్యం దుకాణం మంజూరైందని, అయితే దుకాణాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు నడుపుతున్నారని ఆ ప్రాంతానికి చెందిన దినేష్, దొండ రాంబాబు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కాగా దుకాణం చుట్టూ గృహాలు ఉన్నాయని, అనధికారికంగా సిట్టింగ్ కూడా ఏర్పాటు చేయడంతో మహిళలు కూడా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చర్యలు తీసుకోవాలని అర్జీ అందజేశారు. ● షేర్మహ్మద్పేట అడ్డరోడ్డు సమీపంలోని ఆటోనగర్ వద్ద గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రూ.కోటి వ్యయంతో హైవే బస్స్టాండ్ నిర్మాణం జరిగిందని, అయితే 11 నెలలుగా బస్స్టాండ్ నిరుపయోగంగా ఉందని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని 5వ వార్డు కౌన్సిలర్ వట్టెం మనోహర్ అర్జీ అందించారు. నందిగామ రెవెన్యూ అధికారులపై కలెక్టర్ లక్ష్మీశ ఆగ్రహం పీజీఆర్ఎస్లో 461 అర్జీలు స్వీకరణవచ్చిన అర్జీల్లో కొన్ని.. -
కార్తికేయుని సేవలో ప్రముఖులు
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవిలో వేంచేసియున్న శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ బోర్డు డైరెక్టర్, తమిళనాడు రాష్ట్రం ఎయిర్ పోర్ట్ల అడ్వైజరీ కమిటీ సభ్యుడు గూడూరు రాధాకృష్ణ కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. అలాగే విశ్రాంత సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు. సత్యదేవుని ఆలయానికి రూ. లక్ష విరాళం గుడ్లవల్లేరు: స్థానిక శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి దేవాలయ గోపుర అభివృద్ధి పనులకు రూ.1,08,000ను సోమవారం దాతలు అందించారు. అట్లూరి సత్యనారాయణ, భాస్కరరావు, వీరమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు అట్లూరి వీరప్రభు చలపతి, రామకృష్ణ దుర్గా వరప్రసాద్, కుమార్తెలు కొండపల్లి వీర కుమారి, చాపరాల కస్తూరి చేతుల మీదుగా ఈ విరాళాన్ని గుడ్లవల్లేరు ఎస్ఈఆర్ఎం విద్యా సంస్థల చైర్మన్ వల్లభనేని వెంకట్రావుకు అందించారు. క్రికెట్ అండర్–15 జిల్లా బాలికల జట్టు ఎంపిక విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణాజిల్లా అండర్–15 బాలికల క్రికెట్ జట్టును కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి సోమవారం ప్రకటించారు. టి.సౌమ్య (కెప్టెన్), డి.షాలినీచౌదరి, పి.లక్ష్మీలోహిత, టి.కావ్య, కె.మేఘనసాయి, ఆర్.తేజశ్వని, పి.ఆనందదీప్తి, బి.కార్తీక, కె.రుత్వేకఆరాధ్య, కె.జస్వితసాయిరెడ్డి, బి.తమిళిక, కె.మేఘన, ఆర్.లక్ష్మీప్రసన్న, జి.హరణి, కె.అక్షయ, కె.స్పూర్తి, పి.హనీషా, కె.కుశిక జట్టులో చోటు దక్కించుకున్నారని పేర్కొన్నారు. 2025–26 సీజన్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ జట్టు ఉమ్మడి కృష్ణాజిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుందని వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం ఆటోనగర్(విజయవాడతూర్పు): ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా తొలి రోజు 23మంది సభ్యులు నామినేషన్ దాఖలు చేసినట్టు ఎన్నికల అధికారులు పంచకర్ల వెంకటరమణారావు, తాడేపల్లి శ్రీనివాస దివాకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రానికి నామినేషన్ల పర్వం ముగుస్తుందని చెప్పారు. మొత్తం 21 వార్డు మెంబర్లకుగానూ తొలి రోజే 23 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. గతంలో ఆటోమొబైల్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంధం వెంకటేశ్వరరావు నామినేషన్ వేశారు. ఈసారి అదనంగా ఇద్దరు వార్డు సభ్యు లు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ సారి అధ్యక్షుడికి మంచి పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తమ నాటికగా ‘చీకటి పువ్వు’ చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: చిలకలూరిపేటలో కళాకారుల ప్రతిభా వేదికగా నిలిచిన తొమ్మిదో ఆహ్వాన నాటికల పోటీలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. చిలకలూరిపేట కళా పరిషత్, సీఆర్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన ఈ మూడు రోజుల కళా ఉత్సవం 9 నాటికల ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించింది. బహుమతులు అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. చైతన్య కళాభారతి(కరీంనగర్) వారి ‘చీకటి పువ్వు’నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై బహుమతిని సొంతం చేసుకుంది. అమృత లహరి థియేటర్ ఆర్ట్స్(గుంటూరు) వారి ‘నాన్న నేను వచ్చేస్తా’ నాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా నిలవగా, అమరావతి ఆర్ట్స్’ (గుంటూరు) వారి ‘చిగురు మేఘం’ నాటిక తృతీయ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. -
తొలి రోజు పరీక్ష ప్రశాంతం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పరీక్షల సందర్భంగా ఆయా పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పాఠశాల విద్య, అధికారులతో పాటుగా రెవెన్యూ, పోలీసు, మెడికల్ తదితర శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు. 61.04 శాతం హాజరు.. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైన పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 61.04 శాతం విద్యార్థులు హాజరయ్యారు. తొలి రోజు 1,014 మంది విద్యార్థులకు 30 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. అందులో 614 మంది హాజరుకాగా 395 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు కేటాయించిన మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు 27 కేంద్రాలను పరిశీలించారు. విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకులు జోన్–2 (కాకినాడ) జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (కొండపల్లి)లోని పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే ఎస్పీఎన్ఆర్సీ ఉన్నత పాఠశాల (గొల్లపూడి) కేంద్రాన్ని పరిశీలించారు. డీఈవో యూవీ సుబ్బారావు విజయవాడలోని ఏపీఎస్ఆర్ మునిసిపల్ ఉన్నత పాఠశాల కృష్ణలంక వీఎంసీ ఉన్నత పాఠశాల, పటమట జీడీఈటీ ఉన్నత పాఠశాల, సీవీఆర్ ఎంసీ ఉన్నత పాఠశాల తదితర పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలో ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం -
బరితెగింపు
బలం లేకపోయినా సాక్షి ప్రతినిధి, విజయవాడ/తిరువూరు: తిరువూరు మునిసిపల్ చైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ దుశ్శాసన, దుర్వినీత పర్వానికి తెరతీసింది. సాక్షాత్తూ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, తన అనుచరులతో కలిసి మునిసిపల్ కార్యాలయం వద్ద వీధి రౌడీలా వ్యవహరించారు. తాయిలాలు ఎరవేసి వైఎస్సార్ సీపీ సభ్యులను తన వైపు తిప్పుకునేందుకు యత్నించారు. ఎన్నిక వాయిదా వేయించాలనే కుట్రతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను మునిసిపల్ కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. రెండు గంటలపాటు భీతావహ వాతావరణం సృష్టించారు. ఈ దౌర్జన్యకాండను అడ్డుకోవాల్సిన పోలీసులు అడుగడుగునా అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరించారు. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యకుడు దేవినేని అవినాష్, నియోజకవర్గపార్టీ ఇన్చార్జి స్వామిదాసు ఆధ్వర్యంలో పార్టీ నాయకులే కవచంలా ఏర్పడి రక్షించుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే మునిసిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, పార్టీ జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావుతో పాటు జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. భర్తతో ఒత్తిడి చేయించి.. ఒకటో వార్డు కౌన్సిలర్ కొలికపోగు నిర్మల భర్తను టీడీపీలో చేర్చుకున్న కూటమి నేతలు అతని చేత ఆమైపె ఒత్తిడి చేయించారు. అయినా ఆమె వైఎస్సార్ సీపీకే ఓటు వేస్తానంటూ తేల్చి చెప్పారు. పార్టీ కౌన్సిలర్లతోపాటు చైర్మన్ ఎన్నిక కోసం సోమవారం మునిసిపల్ కార్యాలయానికి వచ్చారు. అయితే నిర్మలను కిడ్నాప్ చేశారంటూ ఆమె భర్తతో పోలీసు కేసు పెట్టించిన ఎమ్మెల్యే కొలికపూడి మునిసిపల్ కార్యాలయం వద్ద గొడవకు దిగారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, నేతలను అడ్డుకున్నారు. మహిళా కౌన్సిలర్లపై చెప్పులు, వాటర్ బాటిళ్లు, రాళ్లతో చెలరేగిపోయారు. అయినా వైఎస్సార్ సీపీ నాయకులు సంయమనం పాటించారు. అండగా అవినాష్.. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పోలీసుల నిర్బంధాలను దాటుకుని మునిసిపల్ కార్యాలయానికి వచ్చి తమ కౌన్సిలర్లకు రక్షణగా నిలిచారు. ఈ దశలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దేవినేని అవినాష్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయినా వెనక్కి తగ్గని అవినాష్తోపాటు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామి దాస్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సుధారాణి, ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్, షేక్ ఆసిఫ్ కౌన్సిలర్లకు అండగా నిలిచారు. చివరకు పోలీసులే నిర్మలను బలవంతంగా తీసుకెళ్లి ఆమె భర్తకు అప్పగించారు. చివరకు కోరం సరిపోలేదంటూ ఎన్నికల అధికారి, ఆర్డీఓ మాధురి ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కమిషనర్కు ఫిర్యాదు.. టీడీపీ నాయకుల తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ కుమార్, పీఏసీ సభ్యుడు షేక్ ఆసిఫ్ వైఎస్సార్ సీపీ వార్డు సభ్యులతో కలిసి సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తిరువూరులో టీడీపీ అరాచక పర్వం గెలవలేమని తెలిసీ..ప్రజాస్వామ్యం ఖూనీ.. మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తిరువూరులో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. టీడీపీ బరిలో నిలిపిన చైర్మన్ అభ్యర్థి కూడా టీడీపీలో గెలిచిన వ్యక్తి కాదని, పోలీసులు ఖాకీ యూనిఫామ్ బదులు, పచ్చ దుస్తులు వేసుకున్నారన్నారు. తమ కౌన్సిలర్ను లాక్కెళ్లి ఆమె మెడలోని వైఎస్సార్ సీపీ కండువాను తీసి చెట్లలో పడేశారని, ఎన్టీఆర్ జిల్లాలో అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా అని పోలీస్ కమిషనర్ను ప్రశ్నించారు. కలెక్టర్ చర్యలు తీసుకోవాలి.. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారన్నారు. ఎన్నిక జరగకుండా ఉండేందుకు చెప్పులు.. వాటర్ బాటిల్స్ విసిరి రాద్ధాంతం చేశారన్నారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించలేని అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో రక్షణ కల్పించి.. నేటి ఎన్నికను ప్రశాంతంగా జరిపించాలని కోరుతున్నామన్నారు. తీవ్ర అభ్యంతరకరం.. ఎమ్మెల్సీ మొండితోక అరుణ కుమార్ మాట్లాడుతూ తిరువూరులో టీడీపీ నేతలు, పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. తమకు ఓటు వేసుకునే అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్కు వచ్చి ప్రజాప్రతినిధులు ఏనాడైనా కోరుకున్న సందర్భాలున్నాయా అని ప్రశ్నించారు. అలాంటి పరిస్థితులను ఈ కూటమి ప్రభుత్వం కల్పించిందన్నారు. తిరువూరులో పోలీసులు పసుపు చొక్కాలేసుకుని డ్యూటీలు చేశారని విమర్శించారు.. తిరువూరు నగర పంచాయతీ ఎన్నికల్లో ఇరవై వార్డులకు 17 వైఎస్సార్ సీపీ గెలుపొందింది. టీడీపీ మూడు వార్డులనే గెలుచుకోగలిగింది. అప్పట్లో చైర్మన్గా ఎన్నికై న గత్తం కస్తూరిబాయి ముందస్తు ఒప్పందంలో భాగంగా ఇటీవల రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ సోమవారం ఎన్నిక నిర్వహించాలని నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీనిని అదునుగా భావించిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చైర్మన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు కాకర్లమూడి సుందర్కుమార్, పసుపులేటి శేఖర్బాబు, దారా పద్మజను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలో చేర్చుకున్నారు. మరో ఇద్దరిని బలవంతంగా తమ వైపు తిప్పుకున్నారు. అయినా బలం చాలకపోవడంతో ఎన్నిక వాయిదా వేయించేందుకు దౌర్జన్యాలకు తెగబడ్డారు. -
ఏపీ ఈఏపీ సెట్ ప్రారంభం
తొలి రోజు ఎన్టీఆర్ జిల్లాలో 91.21, కృష్ణాలో 95.71 శాతం హాజరు వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇంజినీరింగ్, అగ్రికల్చల్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష(ఏపీ ఈఏపీ సెట్)– 2025 సోమవారం ప్రారంభమైంది. తొలి దశలో రెండు రోజుల పాటు అగ్రికల్చర్, ఫార్మసీ (బైపీసీ) విద్యార్థులకు నిర్వహించనున్నారు. మొదటి రోజు ఉమ్మడి జిల్లాలో మొత్తం 15 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, అలాగే మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పరీక్షలు కొనసాగాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఉదయం సెషన్కు 1,700 మందికి 1,555 మంది హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం సెషన్కు 1,700 మందికిగానూ 1,546 మంది పరీక్ష రాశారు. అదేవిధంగా కృష్ణాజిల్లాలో ఉదయం సెషన్కు 291 మందికి 282మంది, మధ్యాహ్నం సెషన్కు 292 మందికి 276 మంది హాజరయ్యారు. కృష్ణాలో 95.71, ఎన్టీఆర్లో 91.21శాతం హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 3,983 మందికి 3,659 మంది పరీక్ష రాశారు. -
ఇద్దరు రైల్వే ఉద్యోగులకు సేఫ్టీ అవార్డులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్ల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన విజయవాడ డివిజన్కు చెందిన ఇద్దరు ఉద్యోగులకు ‘జీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డు’ లభించింది. సోమ వారం జోనల్ హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్లోని రైల్ నిలయం నుంచి విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్తో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందే డ్ డివిజన్ల డీఆర్ఎంలతో వర్చువల్ పద్ధతిలో భద్రతపై జీఎం అరుణ్కుమార్ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. క్రమం తప్పకుండా అన్ని సెక్షన్లలో సేఫ్టీ డ్రైవ్లు నిర్వహిచాలని ఆదేశించారు. అనంతరం విజయవాడ డివిజన్లో విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన కాకినాడలోని మెకానికల్ విభాగానికి చెందిన టెక్నీషియన్ దార్ల బంగారి, గన్నవరంలోని ఆపరేటింగ్ విభాగానికి చెందిన స్టేషన్ మేనేజర్ జె.దుర్గాప్రసాద్లకు జీఎం అరుణ్కుమార్ జైన్ అవార్డులను అందజేశారు. అవార్డులు సాధించిన డివిజన్ సిబ్బందిని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. -
‘రేపటి ఎన్నికైనా సజావుగా జరపండి’
విజయవాడ: టీడీపీ నేతలు అరాచకం సృష్టించిన కారణంగానే తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా. పడిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. ఎన్నిక జరగకుండా ఉండటానికి టీడీపీ నేతలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదన్నారు. ‘ఎన్నిక జరగకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి హల్చల్ చేశారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరించారు. 20 మంది సభ్యులున్న కౌన్సిల్ లో వైఎస్సార్సీపీ 17, టీడీపీ 3 గెలిచింది. ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థినే గెలిపించాలనే వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు నిర్ణయించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ గూండాలు గుంపులుగా వచ్చారు. మా పై దాడిచేసేందుకు టిడిపి నేతలకు పోలీసులు మద్దతిచ్చారు. మా పార్టీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ నిర్మలను పోలీసులే కిడ్నాప్ చేశారు. ఇంతకంటే నీచంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ వ్యవహరించదు. స్వచ్ఛంధంగా వైఎస్సార్సీపీకే మద్దతిస్తున్నానని చెప్పినా నిర్మలను లాక్కెళ్లారుఛైర్మన్ పదవి కోసం చంద్రబాబు దగ్గర్నుంచి టిడిపి ఎమ్మెల్యే వరకూ అందరూ దిగజారిపోయారు. ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేశారు. రేపటి ఎన్నిక సజావుగా జరపాలని ఎన్నికల కమిషనర్ ను కోరాం. రేపు మా కౌన్సిలర్లకు భద్రత కల్పించమని కోరాం. రేపు తిరువూరులో రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందని ఆశిస్తున్నాం’ అని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. తిరువూరులో ప్రజాస్వామ్యం ఖూనీతిరువూరులో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. ‘టీడీపీ బరిలోని నిలిపిన చైర్మన్ అభ్యర్థి కూడా ఆ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. పోలీసులు ఖాకీ దుస్తుల బదులు .. పచ్చ దుస్తులు వేసుకున్నారు. మా కౌన్సిలర్ ను లాక్కెళ్లి...ఆమె మెడలోని వైఎస్సార్సీపీ కండువాను తీసి చెట్లలో పడేశారు. ఎన్టీఆర్ జిల్లాలో అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా అని పోలీస్ కమిషనర్ ను ప్రశ్నిస్తున్నాంతిరువూరులో జరిగిన విషయాలు తెలుసుకుని కమిషనర్ ఆశ్చర్యపోయారు. పోలీసులు టిడిపి తొత్తుల్లా పనిచేయడం బాధాకరం. రక్షణ కల్పించాల్సిన పోలీసులు...ఎంపీ ,ఎమ్మెల్యేకు అమ్ముడుపోయారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైఎస్సార్సీపీ అండగా నిలిచిన మా కౌన్సిలర్లను అభినందిస్తున్నాం. రేపు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి’ అని పేర్కొన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. -
తిరువూరులో ఉద్రిక్తత.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
తిరువూరులో ఎన్నిక అప్డేట్.. విజయవాడ:ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్👉తిరువూరు మున్సిపాల్టీ ఛైర్ పర్సన్ ఎన్నికల్లో పోలీసులు టిడిపి కార్యకర్తల్లా వ్యవహరించారు👉20 మంది సభ్యులున్న కౌన్సిల్ లో వైఎస్సార్సీపీ 17 , టిడిపి 3 గెలిచింది👉ఉపఎన్నిక నేపధ్యంలోవైఎస్సార్సీపీ అభ్యర్ధినే గెలిపించాలనివైఎస్సార్సీపీ కౌన్సిలర్లు నిర్ణయించుకున్నారు👉టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్,టిడిపి గూండాలు గుంపులుగా వచ్చారు👉మా పై దాడిచేసేందుకు టిడిపి నేతలకు పోలీసులు మద్దతిచ్చారు👉మా పార్టీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ నిర్మలను పోలీసులే కిడ్నాప్ చేశారు👉ఇంతకంటే నీచంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ వ్యవహరించదు👉స్వచ్ఛంధంగా వైఎస్సార్సీపీకి మద్దతిస్తున్నానని చెప్పినా నిర్మలను లాక్కెళ్లారు👉ఛైర్మన్ పదవి కోసం చంద్రబాబు దగ్గర్నుంచి టిడిపి ఎమ్మెల్యే వరకూ అందరూ దిగజారిపోయారు👉ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేశారు👉రేపటి ఎన్నిక సజావుగా జరపాలని ఎన్నికల కమిషనర్ ను కోరాం👉రేపు మా కౌన్సిలర్లకు భద్రత కల్పించమని కోరాం 👉కూటమి కుట్రలతో తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా. 👉వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిన కూటమి నేతలు. పోలీసులు సమక్షంలోనే వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ మూకల దాడులు. ఎన్నిక జరగకుండా కూటమి నేతల వ్యూహం. అల్లర్లు సృష్టించిన పచ్చ నేతలు👉తిరువూరులో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. ఎన్నిక జరగకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి హల్చల్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎన్నికలకు హాజరుకాకుండా దాడికి యత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై చెప్పులు విసిరి, బాటిళ్లు విసురుతూ టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. 👉తిరువూరులో పోలీసులు, టీడీపీ దౌర్జన్యానికి నిరసనగా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు రోడ్డుపై భైఠాయించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.👉టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాన్ని చోద్యం చూస్తూ పోలీసులు అక్కడే నిలబడ్డారు. ఎన్నికలు జరగకుండా టీడీపీ నేతల వ్యూహానికి పోలీసులు సహకరిస్తున్నారు. రౌడీయిజం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టలేదు. బలం లేకపోయినా రౌడీయిజంతో గెలవడానికి టీడీపీ అల్లర్లు. తిరువూరులో టీడీపీ ఉద్రిక్తత సృష్టిస్తోంది.👉తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఓవరాక్షన్కు దిగారు. ఎమ్మెల్యే, టీడీపీ శ్రేణులు బారికేడ్లు తోసుకుని, పోలీసులను నెట్టుకుంటూ మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, పార్టీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు.👉తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హల్చల్ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్సీపీ నేతలను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో బారికేడ్లు తోసుకుని, పోలీసులను నెట్టుకుంటూ కొలికపూడి, టీడీపీ నేతలు మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ వారినే బెదిరిస్తూ లోపలికి దూసుకెళ్లారు. దీంతో, వాగ్వాదం జరిగింది.👉మరోవైపు.. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు మద్దతుగా పార్టీ నేతలు దేవినేని అవినాష్, మొండితోక అరుణ్ కుమార్, నల్లగట్ల స్వామిదాస్, షేక్ ఆసిఫ్ తిరువూరు చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. నేడు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల కోసం బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తోంది. మరోవైపు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తిరువూరు వెళ్లొద్దంటూ వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
పెడన: మద్యానికి బానిసై రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెడన పట్టణంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. మచిలీపట్నం రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.... పట్టణంలోని రామలక్ష్మీ వీవర్స్ కాలనికి చెందిన సింహాద్రి రమేష్ (52) శనివారం వేకువ జామున గుడివాడ – మచిలీపట్నం ప్యాసింజరు రైలు కింద పెడన– వడ్లమన్నాడు రైలు మార్గంలోని పెడన శివారులో రైలుకు ఎదురువెళ్లాడు. రైలు ఢీ కొట్టడంతో పక్కకు పడి చనిపోయాడు. రైలు డ్రైవర్ ఈ విషయాన్ని రైల్వే పోలీసులకు తెలియజేయడంతో వారు పెడన వచ్చి మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మృతదేహం ఫొటోను వాట్సప్ గ్రూపుల్లో గుర్తించిన బంధువులు రైల్వే పోలీసులకు పూర్తి వివరాలను అందజేయడంతో వారు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. -
రేషన్ కోసం తప్పదు కుస్తీ!
ఇంటి వద్దనే రేషన్ ఇవ్వాలి ఎండీయూ వాహనం ద్వారా ఇప్పటి వరకు ప్రతినెలా ఇంటి వద్దనే రేషన్ బియ్యం తీసుకుంటున్నా. ఇక నుంచి ఇంటి వద్దకు వాహనం రాదనే ప్రచారం జరుగుతోంది. ఎండీయూ వాహనాలను రద్దు చేస్తే రేషన్ షాపు వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలి. ఇంటికి దూరంగా ఉన్న రేషన్ షాపునకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాలంటే ఇబ్బందులు తప్పవు. – సెశెట్టి ఈశ్వరి, కొండపల్లి, ఇబ్రహీంపట్నం మండలంసరుకుల కోసం పని మానుకోవాలి ఎండీయూ వాహనాలను తొలగించాలని ఆలోచన చేయడం బాధాకరం. ఇళ్లకు దూరంగా ఉన్న రేషన్ దుకాణాలకు దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు వెళ్లి రేషన్ తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడాల్సిందే. రేషన్ షాపుల వద్దకు వెళ్తే సరుకుల కోసం ఒక రోజు పని మానుకోవాల్సి వస్తుంది. ఇంటింటి రేషన్ పంపిణీపై ప్రభుత్వ పునరాలోచించాలి. – కంతేటి అగ్నేసమ్మ, కిలేశపురం, ఇబ్రహీంపట్నం మండలం ● ఎండీయూ వాహనాలకు ప్రభుత్వం మంగళం! ● డీలర్లతో రేషన్ సరుకుల పంపిణీకి కసరత్తు ● నిలిచిపోనున్న ఇంటింటికీ రేషన్ పంపిణీ ● ఆందోళనలో ఎండీయూ వాహనదారులు, కార్డుదారులు ఇబ్రహీంపట్నం: రేషన్ కార్డుదారుల ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులను చేరుస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వాహనాల సేవలకు ప్రభుత్వం త్వరలో మంగళం పాడనుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే జరిగితే బియ్యం కార్డుల లబ్ధిదారులు పనులు మానుకుని, తమ ఇళ్లకు దూరంగా ఉన్న రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎండీయూ వాహనదారులు, రేషన్ దుకాణదారులతో విజయవాడలో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరించారు. రేషన్ పంపిణీలో లోపాలు ఉన్నట్లు గుర్తించామని ప్రకటించారు. రేషన్ పంపిణీపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటా మన్నారు. ఈ పరిణామాలతో ఎండీయూ వాహనాలకు మంగళం పాడనున్నట్లు తేటతెల్లమవుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్కార్డుదారుల ఇంటి వద్దకే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఐదేళ్ల పాటు ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ సక్రమంగా సాగింది. ఇప్పుడు ఈ వ్యవస్థను నిలిపి వేసేందుకు కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. ఎండీయూ వాహనాలను నిలిపివేస్తే మైలవరం నియోజకవర్గంలో సుమారు 84,788 మంది రేషన్ కార్డుదారులు, 52 మంది ఎండీయూ వాహనదారులకు ఇబ్బందులు తప్పవు. 2027 జనవరి వరకు అగ్రిమెంట్ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రతి నెలా లబ్ధిదారుల ఇంటి వద్దనే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వాహనం ఏ వీధికి వస్తుందో ముందుగానే తెలియజేయడంతో లబ్ధిదారులు ఇంటి వద్ద ఉండి రేషన్ సరుకులు తీసుకునేవారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళలకు ఈ విధానం సౌకర్యవంతంగా ఉండేది. గత ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ మేరకు 2027 జనవరి వరకు ఎండీయూ వాహన వ్యవస్థ కొనసాగాల్సి ఉంది. వాహనాలకు బీమా ప్రీమియం చెల్లిస్తామని, అప్పటి వరకు కొనసాగించాలని వాహనదారులు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదని సమాచారం. ఎండీయూ వాహనాల తొలగింపునకు కసరత్తు! కూటమి ప్రభుత్వం తిరిగి రేషన్ డీలర్ల ద్వారా ప్రజలకు సరుకులు పంపిణీ చేసేందుకు సమాయత్తమవుతోందని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం త్వరలోనే నూతన విధానాన్ని అమలు చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో వాహనదారులు, డీలర్లతో సమావేశం నిర్వహించారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఎండీయూ వాహనాల రద్దు ప్రతిపాదన వస్తుందని తెలుస్తోంది. ఎండీయూ వాహనాల వ్యవస్థను రద్దు చేస్తే రేషన్ డీలర్ల వద్దకు వెళ్లి కార్డులు లైన్లో పెట్టి పడిగాపులు కాయాల్సి వస్తుందని వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
హోరాహోరీగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. సీనియర్స్ విభాగం పోటీలను శనివారం రాత్రి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ప్రారంభించారు. సీనియర్స్ విభాగంలో ఆరు జతలు పోటీలో పాల్గొన్నాయని పశు ప్రదర్శన కమిటీ సభ్యులు తెలిపారు. 25 నిమిషాల వ్యవధిలో 1.900 టన్నుల బరువును లాగినట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జత యజమానులకు అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ గరికపాటి భాస్కరం సోదరులు దుస్తులు, జ్ఞాపికలు అందజేశారు. నగదు బహుమతుల అందజేత శుక్రవారం రాత్రి జరిగిన జూనియర్ కేటగిరీ పోటీలలో విజేతలైన ఎడ్ల జత యజమానులకు కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం అతోటి శిరీష చౌదరి ఎడ్ల జత 20 నిమిషాల వ్యవధిలో 3,504.09 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు చెందిన రోహన్బాబు ఎడ్ల జత 3,451 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, బాపట్ల జిల్లా పర్చూరు మండలం చిన్న నందిపాడు గ్రామానికి చెందిన ఆలా మోహన్రావు, పల్నాడు జిల్లా అమరావతి మండలం జీడుగు గ్రామానికి చెందిన ఎడ్ల జత 2,770.10 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నాందేడ్లవారిపాలెం గ్రామానికి చెందిన కాకర్ల సురేష్బాబు ఎడ్ల జత 2,760.04 అడుగుల దూరం లాగి నాలుగవ స్థానం, కృష్ణాజిల్లా పెనమలూరు మండలం పెద్దపులిపాక గ్రామానికి చెందిన గరికపాటి శ్రీధర్ ఎడ్ల జత 2,250 అడుగుల దూరం లాగి ఐదో స్థానం, గుంటూరు జిల్లాకు చెందిన సోమిశెట్టి ఆంజనేయులు ఎడ్ల జత 2,000 అడుగుల దూరం లాగి ఆరో స్థానంలో నిలిచాయని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు వరుసగా రూ.70 వేలు, రూ.60 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.25 వేల చొప్పున నగదు బహుమతులు అందించినట్లు కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, రాంబాబు, విక్రమ్, రాంబాబు, వెంకట్రావ్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడ అలంకార్ సెంటర్లో శనివారం మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ నగరంలో వీధి దీపాలు సక్రమంగా వెలుగుతున్నాయని, నీటి సరఫరా జరుగుతుందంటే కారణం మున్సిపల్ కార్మికులేనన్నారు. అటువంటి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేయకపోవడం అన్యాయమన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల వేతనాలు పెంచారని చెప్పారు. ఆప్కాస్ ఏర్పాటు చేసి ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు అందించిందని గుర్తు చేశారు. మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాల పై బడిన కార్మికులను క్రమబద్దీకరించాలన్నారు. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరారు. హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఆదుకోవాలని విన్నవించారు. ఇతర న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు భవిష్యత్లో చేపట్టే ఆందోళనకు తమ పార్టీ పూర్తి మద్దతిస్తుందన్నారు. ధర్నాలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహేష్, పాల్గొన్నారు. సేంద్రియ ఎరువులపై అవగాహన కల్పించండి జికొండూరు: సేంద్రీయ ఎరువుల తయారీ గుంతలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సేంద్రీయ ఎరువుల గుంతలతో పారిశుద్ధ్యం సమస్యకు చెక్ పెట్టడంతో పాటు బహుళ ప్రయోజనాలు కలిగిన సేంద్రీయ ఎరువులు తయారు చేసుకోవచ్చని సూచించారు. జికొండూరులో సేంద్రీయ ఎరువుల (కంపోస్ట్ ఫిట్) తయారీ గుంతల తవ్వకం పనులను శనివారం ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ కంపోస్ట్ ఫిట్లకు ఎటువంటి ఖర్చులు లేకుండా ఉపాధిహామీ పథకంలో చేపట్టవచ్చన్నారు. ఈ ఏడాది జిల్లాలో 17వేల గుంతలు తీసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. పారిశుద్ధ్యం, పశు వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ రాము, డీఆర్డీఏ పీడీ నాంచారరావు, డీపీవో లావణ్యకుమారి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రారంభం
హనుమాన్జంక్షన్ రూరల్: స్థానిక అభయాంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని దేవస్థానాన్ని పూలతో విశేషంగా అలంకరించారు. స్వామివారి ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు. ప్రధాన అర్చకుడు మారేపల్లి సీతారామానుజాచార్యులు, అర్చకులు గొట్టిపాళ్ల శ్రీనివాసాచార్యులు, శృంగారం వెంకట శేషారామాచార్యులు అంజనీపుత్రునికి ప్రభాత సేవ, 1008 గులాబీ పూలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆధ్యాత్మిక వేదికపై దాసాంజనేయ భజన సమాజం భక్త బృందం 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసింది. సాయంత్రం హనుమంతునికి బంగారు, వెండి పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రధాన కూడలిలోని రామాలయం వద్ద భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. ఉత్సవాలు జరిగే ఆరు రోజులు నిత్యం భక్తులకు మజ్జిగ పంపిణీ చేస్తామని ఆర్యవైశ్య సంఘం నాయకుడు పైడి సుధాకర్ తెలిపారు. -
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల వినూత్న నిరసన
చిలకలపూడి(మచిలీపట్నం): సమస్యల పరిష్కారం కోసం ఆయుష్మాన్ భారత్ ద్వారా పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు శనివారం వినూత్న నిరసన తెలిపారు. ఉద్యమాన్ని ప్రారంభించి శనివారంతో 20 రోజులు పూర్తయిన నేపథ్యంలో వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా హృదయాకృతిలో ఏర్పడి నిరసన తెలిపారు. సంఘ ప్రతినిధి వి.నాగబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ నిరసన ప్రదర్శనలకు స్పందించి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రధానంగా ఆరు సంవత్సరాలు దాటిన వారిని క్రమబద్ధీకరించాలని కోరారు. రెగ్యులర్ ఇంక్రిమెంట్లతో పాటు పీఎఫ్ చెల్లింపులు చేపట్టాలన్నారు. ఇన్సెంటివ్లు చెల్లించాలని కోరారు. దీంతో పాటుగా తాము నిర్వహిస్తున్న కేంద్రాల కరెంటు బిల్లులు, అద్దె బకాయిలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలు మూలల నుంచి వచ్చిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
రైల్వే హాస్పిటల్లో నేరస్తుల సామాజిక సేవ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్లు, రైల్వే స్టేషన్ పరిసరాల్లో చిన్న, చిన్న నేరాలకు పాల్పడిన నేరస్తులకు రైల్వే కోర్టు న్యాయమూర్తి ఆర్.వి శర్మ భారత న్యాయ సురక్షా సంహిత్ను అనుసరించి 133 మంది నేరస్తులకు జరిమానాతో పాటు సమాజ సేవా చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఆర్పీఎఫ్ పోలీసులు పర్యవేక్షణలో 133 మంది నేరస్తులు విజయవాడ రైల్వే హాస్పటల్ ప్రాంగణంలో రోగులకు మజ్జిగ సరఫరా చేశారు. అనంతరం హాస్పటల్ పరిసరాలను శుభ్రపరిచారు. ఇటువంటి శిక్షలు విధించడంతో వారిలో పరివర్తన, సామాజిక బాధ్యత తెలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 22న జెడ్పీ సర్వసభ్య సమావేశం చిలకలపూడి(మచిలీపట్నం):ఈ నెల 22వ తేదీన జిల్లా పరిషత్ స్థాయీ సంఘాలు, సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జ్ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్ శనివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ఏడు స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం 11 గంటలకు జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో సర్వసభ్య సమావేశం నిర్వహణ ఉంటుందని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్రతో పాటు శాసనసభ్యులు, ఇతర ప్రత్యేక ఆహ్వానితులు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారులు హాజరవుతారని తెలిపారు. -
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంజినీరింగ్, అగ్రికల్చల్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ – పరీక్ష (ఏపీఈఏపీసెట్)– 2025 సోమవారం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. సంబంధిత పరీక్షలను కంప్యూటర్ ఆధారిత (ఆన్లైన్) విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా అగ్రికల్చర్, ఫార్మసీ (బైపీసీ) విద్యార్థులకు ఈ నెల 19, 20 తేదీలలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించనుండగా ఇంజినీరింగ్ స్టీమ్ (ఎంపీసీ) విద్యార్థులకు 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందులో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్లో పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో ఎన్టీఆర్ జిల్లాలో ఇంజినీరింగ్కు 37,666 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 6671 మంది, రెండు పరీక్షలకు హాజరువుతున్న వారు 86 మంది ఉండగా మొత్తం జిల్లాలో పరీక్షకు హజరయ్యేవారు 44,468 మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద అత్యధికంగా 38,269 మంది విద్యార్థులు ఒక్క విజయవాడలోనే పరీక్షలకు హాజరవ్వనున్నారు. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగానికి 5,050 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 1141, ఇంజినీరింగ్, ఫార్మసీ పరీక్షలకు హాజరవుతున్నవారు 18 మంది జిల్లా వ్యాప్తంగా హాజరయ్యే వారు 6209 మంది విద్యార్థులున్నారు. ఇందులో ఉదయం సెషన్ తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం సెషన్కు 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్లైన్లో పరీక్షను నిర్వహించనున్నారు. జిల్లాలో పరీక్ష కేంద్ర వివరాలు ఇలా... ఈఏపీసెట్ పరీక్ష కోసం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలను సిద్ధం చెశారు. ఎన్టీఆర్ జిల్లాలో పన్నెండు, కృష్ణా జిల్లాలో మూడు కేంద్రాలు ఉన్నాయి. అవి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ధనేకుల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఐకాన్ డిజిటల్ జోన్ కానూరు, ఎన్ఆర్ఐ గ్రూప్ ఆఫ్ కాలేజీస్, పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ప్రసాద్ వీ పొట్లూరి సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్కే ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సాయిలక్ష్మీ కంప్యూటర్స్, గొల్లపూడి, శ్రీ విజయదుర్గా ఐటీ ఇన్ఫో సొల్యూయేషన్స్, కానూరు (కానూరు ఎనికేపాడు డొంకరోడ్డు), ఎస్వీటీ ఇన్ఫోటెక్, గవర్నరుపేట విజయవాడ, వెలగపూడి రామకృష్ణ సిద్థార్థ ఇంజనీరింగ్ కళాశాలను ఎంపిక చేశారు. అదేవిధంగా తిరువూరులో శ్రీవాహిణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరువూరు, మైలవరంలో లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైలవరం తదితర కేంద్రాలను కేటాయించారు. అదేవిధంగా కృష్ణాజిల్లాలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గుడ్లవల్లేరు, దైతా మధుసూధన్ శాస్త్రి శ్రీ వెంకటేశ్వర హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మచిలీపట్నం, శ్రీ వాసవీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, నందమూరు మచిలీపట్నం కేంద్రాలు ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలు రెండు జిల్లాల్లో పరీక్షకు హాజరుకానున్న 50,677 మంది విద్యార్థులు రాష్ట్రంలో అత్యధికంగా విజయవాడలోనే పరీక్షకు హాజరు కానున్న విద్యార్థులు 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు 21 నుంచి 27 వరకూ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు -
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత జి.కొండూరు: పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించినప్పుడే ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడంతో పాటు భవిష్యత్తు తరాలకు భరోసా ఇవ్వగలమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. జి.కొండూరు మండలంలోని చెవుటూరు గ్రామంలో శని వారం నిర్వహించిన స్వచ్చాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెలా మూడో శనివారం ఒక ప్రత్యేక థీమ్లో స్వచ్చాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల బీట్ ది హీట్ను థీమ్గా కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఒక చెట్టును నరకడం తప్పనిసరైతే పది మొక్కలను నాటాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మొక్కలు పెంచడంతో పాటు ప్లాస్టిక్ వాడకాన్ని సైతం వదిలేయాలని సూచించారు. చలివేంద్రాల ఏర్పాటు, అన్ని కార్యాలయాల్లో మంచి నీటి సౌకర్యం, ఇంకుడు గుంతలు, నీటి రీచార్జ్ నిర్మాణాలు వంటి అంశాలపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. వడదెబ్బ నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెవుటూరు సర్పంచ్ పిన్నిబోయిన శ్రీదేవి, వైస్ ఎంపీపీ పుప్పాల సుబ్బారావు, డీపీఓ పి.లావణ్యకుమారి, డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్.వి.నాంచారరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, డ్వామా పీడీ ఎ.రాము, తహసీల్దార్ సీహెచ్. వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ బి.వి.రామకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులతో తొండాట
దివ్యాంగులతో కూటమి ప్రభుత్వం తొండాట ఆడుతోంది. పింఛన్ల సంఖ్యను కుదించేందుకు సదరం క్యాంపుల పేరిట వేధిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పింఛన్లు తీసుకుంటున్న పేద దివ్యాంగులను మళ్లీ సదరం క్యాంపులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. సదరం క్యాంపుల వద్ద కనీసం వీల్చైర్లు కూడా ఏర్పాటు చేయకుండా ఇబ్బందుల పాలుచేస్తోంది. చేసేదేమీ లేక దివ్యాంగులను వారి బంధువులు భుజాలు, వీపులపై మోస్తూ సదరం క్యాంపులకు తీసుకొస్తున్నారు. విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటుచేసిన సదరం క్యాంపు వద్ద దివ్యాంగుల దుస్థితిని ఈ ఫొటోల్లో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
కృష్ణా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ చిలకలపూడి(మచిలీపట్నం): స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని దీన్ని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ హెచ్చరించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం మధ్యాహ్నం ఆరవ అదనపు జిల్లా జడ్జి పి.పాండురంగారెడ్డితో కలిసి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉన్న జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల్లో పక్కా నిఘా ఉంచి తనిఖీలు చేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారిపై మాత్రమే కాకుండా అడిగిన వారు, ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవా లని అధికారులకు సూచించారు. న్యాయమూర్తి పాండురంగారెడ్డి మాట్లాడుతూ జిల్లా జనాభాలో సీ్త్ర, పురుష లింగ నిష్పత్తుల గణాంకాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నిష్పత్తుల్లో వ్యత్యాసం లేకుండా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కొత్తగా స్కానింగ్ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ కోసం ఐదు దరఖాస్తులు, రెన్యువల్ కోసం మూడు, క్యాన్సిలేషన్కు ఒక దరఖాస్తు వచ్చినట్లు డీఎంఅండ్హెచ్వో ఎస్ శర్మిష్ట వివరించారు. సమావేశంలో కమిటీ సభ్యులు ధర్మతేజ, పి. వెంకటేశ్వరరావు, విద్య మాస్ మీడియా అధికారి సీహెచ్ వాణిశ్రీ పాల్గొన్నారు. -
టెన్త్ సప్లిమెంటరీకి సన్నద్ధం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారికి నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఫలితాల వెల్లడి రోజునే షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో పదో తరగతి విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షను రాసినట్లయితే వారికి ఆ సర్టిఫికెట్పై సప్లిమెంటరీగా నమోదైది. కానీ గతంలో మాదిరిగా కాకుండా సప్లిమెంటరీ విద్యార్థులను కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణించనున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 59 పరీక్షా కేంద్రాలను అధికారులు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక తరగతులు.... గతేడాది మాదిరిగానే పదో తరగతి పరీక్షలు తప్పిన విద్యార్థులకు ఆయా పాఠశాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి వారు ఉత్తీర్ణులయ్యే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతున్నారు. ఈ మేరకు దాదాపుగా అన్ని పాఠశాల్లో తరగతులు కొనసాగుతున్నాయి. జిల్లాలోని ఆయా సబ్జెక్ట్లకు చెందిన ఉపాధ్యాయులు ప్రతి రోజూ ప్రత్యేక తరగతులను తీసుకొని తప్పిన విద్యార్థులను పరీక్షలకు సమాయత్తపరుస్తున్నారు. కొన్ని మెలకువలను నేర్పించి తీర్చిదిద్దుతున్నారు. హాల్ టికెట్లను పరీక్షల విభాగం ఆయా పాఠశాలలకు పంపించగా, ప్రధానోపాధ్యాయులు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించే పనిలో ఉన్నారు. 24 వరకూ ఓపెన్ స్కూల్ పరీక్షలు... ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్ స్కూల్ విద్యార్ధులకు సైతం ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకూ సప్లమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు పదో తరగతితో పాటుగా ఇంటర్మీడియట్ విద్యార్థులు హాజరవుతారు. వీరికి సంబంధించి 1677 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షలకు పదో తరగతికి 17, ఇంటర్మీడియెట్కు 12 చొప్పున పరీక్షా కేంద్రాలను అధికారులు కేటాయించారు. అధికారుల నియామకం జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 30 కేంద్రాలకు 30 మంది చీఫ్ సూపరింటెండెంట్లను జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు నియమించారు. వారితో పాటుగా మరో 30 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లును నియమించారు. ప్రశాపత్నాలు భద్రపరిచేందుకు, వాటిని పంపిణీ చేసేందుకు వివిధ పోలీసుస్టేషన్లను ఎంపిక చేశారు. అదేవిధంగా ఓపెన్ స్కూల్కు సంబంధించి సైతం మరో 29 మంది అధికారులను కేటాయించారు. వాటితో పాటుగా పరీక్షల నిర్వహణకు సుమారుగా 300 మంది ఇన్విజిలేటర్లను సైతం అధికారులు సిద్ధం చేశారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏడు బృందాలు పరీక్షలను పరిశీలించనున్నాయి. ప్రశ్నాపత్రాల పంపిణీని ఈ నెల 16వ తేదీన ప్రారంభించారు. 19 నుంచి 28వ తేదీ వరకూ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాలు పరీక్ష రాయనున్న 1677 మందిఓపెన్ స్కూల్ విద్యార్థులు ఓపెన్ స్కూల్ పరీక్షలకు మరో 29 కేంద్రాలు పరీక్షకు హాజరు కానున్న 6149 మంది విద్యార్థులు పరీక్షలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా సాధారణ ఎస్ఎస్సీ పరీక్షలకు 30 కేంద్రాలను, ఓపెన్ స్కూల్ పరీక్షలకు 29 కేంద్రాలను ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఆయా పాఠశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి సైతం దృష్టా సారించి వాటిని సిద్ధం చేస్తున్నాం. ఇతర విభాగాల సహకారంతో అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేస్తాం. – యువీ సుబ్బారావు, డీఈవో, ఎన్టీఆర్ మార్చి 19వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం పరీక్షలను నిర్వహించింది. అందులో ఎన్టీఆర్ జిల్లా నుంచి 27,467 మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు. వారిలో 23,534 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే వారిలో 3933 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్ట్ల్లో తప్పటంతో పదో తరగతి పరీక్షలు ఉత్తీర్ణులు కానట్లుగా ఫలితాలను ప్రకటించారు. వారితో పాటుగా గతంలో ఫెయిలైన విద్యార్థులతో కలిపి మొత్తం 6149 మంది విద్యార్థులు పరీక్షలకు హజరవుతున్నట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి పరీక్షకు హజరయ్యే విద్యార్థులు ఉండటంతో దాదాపుగా అన్ని మండలాల్లో పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 512.70 అడుగుల వద్ద ఉంది. ఇది 136.3003 టీఎంసీలకు సమానం. ‘ప్లాస్టిక్’ నుంచి విముక్తి మోపిదేవి: ప్లాస్టిక్ ముప్పు నుంచి సమాజానికి విముక్తి కలిగిద్దామని శనివారం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ఈఓ వరప్రసాదరావు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞలో పిలుపునిచ్చారు. రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో సోమవారం నుంచి ఏపీ ఈఏపీ సెట్ ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. –8లో7న్యూస్రీల్ -
పీహెచ్సీల్లో కాన్పులు పెరగాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలను పెంచాలని, రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులను మాత్రమే పెద్ద ఆస్పత్రులకు పంపాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని సూచించారు. జిల్లాలోని పీహెచ్సీ, యూపీహెచ్సీ వైద్యాధికారులతో ఆరోగ్య కార్యక్రమాల అమలుపై శనివారం విజయవా డలోని తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాచర్ల సుహాసిని మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల నమోదు, ఎన్సీడీ– సీడీ సర్వే, గర్భిణుల నమోదు వంటి కార్యక్రమాల లక్ష్యసాధనలో వెనుకబడి ఉన్న గ్రామీణ ప్రాంత వైద్యాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతి, ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ మాధవి, మాతృసంరక్షణ నోడల్ అధికారి డాక్టర్ పద్మావతి, డీపీహెచ్ఎన్ డీపీఎంఓ డాక్టర్ నవీన్, లిడియా ఇతర వైద్యాధికారులు, పలువురు పర్యవేక్షకులు పాల్గొన్నారు. కొండపల్లి బొమ్మల ఖ్యాతిని భావితరాలకు చాటాలి కొండపల్లి(ఇబ్రహీంపట్నం): దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని భావితరాలకు చాటి చెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లిలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించి పలు సూచనలు చేశారు. చారిత్రక, సాంస్కృతిక ఔన్నత్యమున్న జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. శతాబ్దాల నేపథ్యం కలిగిన కొండపల్లి బొమ్మ విశిష్టతను పర్యాటకులకు చాటిచెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ అభివృద్ధి చేస్తామన్నారు. అందమైన పెయింటింగ్స్తో ఈ సెంటర్ను అద్భుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. కొండపల్లి ఖిల్లా ట్రెక్కింగ్కు అనుకూలంగా మెట్లమార్గం అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీ టూరిజం అథారిటీ చీఫ్ మార్కెంటింగ్ ఆఫీసర్ ఎస్.పద్మారాణి, టూరిజం కన్సల్టెంట్ సాహితి, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, మునిసిపల్ కమిషనర్ రమ్యకీర్తన, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 21న జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి కూటమి విధానాలపై వైఎస్సార్ టీఎఫ్ తిరుగుబాటు మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయ బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ మే 21వ తేదీ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేస్తున్నట్లు ఆ సంఘ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధ్యక్షులు మల్లంపల్లి వెంకట మహంకాళిరావు, టి. జగదేశ్వర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలపై కూటమి ప్రభుత్వం తీసు కుంటున్న అస్పష్టమైన, అస్తవ్యస్త విధానాలపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉపాధ్యాయ సంఘాలు ఇటీవల విజయవాడలో జరిగిన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సమావేశాన్ని బహిష్కరించాయని తెలిపారు. గుర్తింపు పొందిన తొమ్మిది ఉపాధ్యాయ సంఘాలు సంయుక్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించాయని వివరించారు. దీనిలో భాగంగా ఈ నెల 21న మచిలీపట్నంలోని ఉమ్మడి జిల్లాల విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి నిర్ణయించామని తెలిపారు. 23న విజయవాడలో డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేస్తామని పేర్కొన్నారు. -
సాగు భూమి మొత్తాన్నీ తీసుకుంటారా?
ఇబ్రహీంపట్నం: ‘‘ఇదివరకు గ్రామంలో దాదాపు 1,200 ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. రియల్ ఎస్టేట్, కళాశాలలు, పరిశ్రమలకు 600 ఎకరాలు పోయింది. మిగిలిన 581 ఎకరాలను స్పోర్ట్స్ సిటీ పేరుతో ప్రభుత్వం తీసుకుంటే.. మా ఇళ్లు మాత్రమే మిగులుతాయి. ఇక వ్యవసాయం ఎక్కడ చేయాలి?’’ అంటూ టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పార్టీల నేతలు ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం వీరంతా నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సచివాలయ కార్యదర్శి ఎం.మౌనికకు వినతిపత్రం అందజేశారు.ఆందోళనలో టీడీపీ నాయకులు కేతనకొండ మాజీ సర్పంచి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పత్రి లేపాక్షిరావు, పత్రి చలపతి, కొమ్మూరి గోపీ, జనసేనకు చెందిన కొమ్మూరి వెంకటస్వామి, మొక్కపాటి చింతయ్య తదితరులు పాల్గొన్నారు. ఎకరం లోపు ఉన్న రైతులు సుమారు 90 శాతం మంది ఉన్నారని, ఏటా మూడు పంటలు పండే భూములను స్పోర్ట్స్ సిటీకి తీసుకుంటే ఎలాగని నిలదీశారు. సన్న, చిన్నకారు రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని, స్పోర్ట్స్ సిటీతో తమ పొట్టకొట్టొదని వేడుకున్నారు.కాగా, కేతనకొండ, పరిసర గ్రామాల్లో సుమారు 2,874 ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకుంటున్నట్లు రెవెన్యూ అధికారులు గ్రామ సభల్లో ప్రకటించారు. దీంతో తమ ప్రాంతంలో వ్యవసాయం కనుమరుగేనని.. జీవితాలు దుర్భరంగా మారతాయని రైతులు వాపోతున్నారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న రైతులకు ఇప్పటికీ ప్లాట్లు కేటాయించలేదని, ఇక తమకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పూలింగ్పై పునరాలోచన చేయాలని కోరారు. కాగా, జీవనాధారంగా ఉన్న వ్యవసాయ భూములను పూలింగ్కు ఇవ్వబోమని ఇప్పటివరకు రైతులు మాత్రమే అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా వారి బాటలోనే కూటమి నాయకులు ప్రతిఘటించడం గమనార్హం. కేతనకొండ గ్రామం 1930లో ఉబ్బడివాగు వాగు పక్కన ఏర్పడింది. ప్రస్తుత 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. రియల్ ఎస్టేట్కు 400 ఎకరాలు, పరిశ్రమలు, స్టోన్ క్రషర్లు, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల ఏర్పాటుకు 200 ఎకరాలు పోయింది. మిగతాది కూడా తీసుకుంటే వ్యవసాయానికి భూమి మిగలదని రైతులు, కూటమి నాయకులు ఆందోళన చెబుతున్నారు. ఉన్నదే 44 సెంట్లు.. అదీ తీసుకుంటారా? నాకు 44 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. మూడు పంటలు పండిస్తా. అదే కుటుంబానికి ఆసరా. దీనినీ తీసుకుంటారా? గ్రామంలో 90 శాతం మంది ఎకరం లోపు ఉన్న రైతులే. భూములు తీసుకుంటే వారంతా ఏమవాలి. ఎట్టి పరిస్థితిలో పూలింగ్లో భూములు ఇవ్వం. –పయ్యావుల రాము, ఇబ్రహీంపట్నం బీజేపీ ప్రధాన కార్యదర్శి, కేతనకొండవ్యవసాయం లేకుంటే నేనేం చేయాలి? వ్యవసాయం ఇతర పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. జీవనాధారంగా ఉన్న భూమిని ప్రభుత్వం తీసుకుంటే నేనేం చేయాలి. వ్యవసాయం అలవాటుగా మారింది. భూమి లేకపోతే పంటలు ఉండవు. పశువులకు మేత, రైతు కూలీలకు పని దొరకదు. –షేక్ ఉద్దండు, రైతు, మాజీ ఎంపీటీసీ, కేతనకొండ -
రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి అరెస్ట్
విజయవాడ: మద్యం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల విచారణ అనంతరం సిట్ అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులు కక్ష పూరితమని.. ఐఏఎస్లు, ఐపీఎస్లను అరెస్టు చేసే సంస్కృతి సరికాదని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి తరపు అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి అన్నారు. లిక్కర్ కేసులో రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఇవాళ రాత్రి 7.15కి అరెస్టు చేశారని.. రేపు(శనివారం) ఉదయం వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.కాగా, మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని సిట్ తీవ్ర వేధింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. నిన్న (గురువారం) 13 గంటలకుపైగా విచారణ పేరుతో ప్రహసనం సాగించడం సిట్ కుట్రలకు అద్దం పడుతోంది.సిట్ చీఫ్గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబు, ఇతర అధికారులు వారిని విడివిడిగా రోజంతా విచారించారు. మొదటి రోజు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడగడం గమనార్హం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. సీఎంవో కార్యదర్శి, ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ తేల్చి చెప్పారు.ఆ అంశం పూర్తిగా ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్కు సంబంధించినదని పేర్కొన్నారు. అయినా సరే సిట్ అధికారులు పదే పదే అవే ప్రశ్నలు వేస్తూ వారిని వేధించారు. ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ వారిపై మానసిక ఒత్తిడికి గురి చేసేందుకు యత్నించారు. ఇక మెయిల్ ఐడీలు, పాస్ వర్డ్ చెప్పమని సిట్ అధికారులు అడిగారు. అందుకు వారిద్దరూ సున్నితంగా తిరస్కరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. -
వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. టీడీపీ ఆఫీస్పై దాడి చేశారన్న ఆరోపణల కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్న వల్లభనేని వంశీ ఉన్నారు. రెండు రోజుల వ్యవధిలో రెండు కీలక కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరైంది. రెండు రోజుల క్రితం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరవ్వగా, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇవాళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వంశీపై ఇప్పటి వరకూ నమోదైన 6 కేసుల్లో బెయిల్ మంజూరైంది.90 రోజులుగా రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు. వరుసగా ఒక్కొక్క కేసులో బెయిల్ వస్తున్న తరుణంలో వంశీపై కక్ష పూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వంశీపై నిన్న నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు.. ఇవాళ నూజివీడు కోర్టులో వంశీని హాజరు పరిచారు.ఈ నెల 29 వరకూ నూజివీడు కోర్టు రిమాండ్ విధించగా.. ఇవాళ తాజాగా వల్లభనేని వంశీపై మరో కేసును గన్నవరం పోలీసులు నమోదు చేశారు. గన్నవరంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై 58 పేజీలతో పోలీసులకు గనుల శాఖ ఏడీ ఫిర్యాదు చేశారు. క్రైమ్ నెం.142/2025తో గన్నవరం పీఎస్లో కేసు నమోదైంది. కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేయాలని గన్నవరం పోలీసుల నిర్ణయించారు. వంశీపై కూటమి కక్షసాధింపు చర్యలపై ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ మండిపడుతోంది. జైల్లో వంశీ శ్వాసకోస సమస్య, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. వంశీ ఆరోగ్యంపై ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
విజయవాడలో బోర్డు తిప్పేసిన నాగరాజు కన్సల్టెన్సీ సంస్థ
సాక్షి, విజయవాడ: నగరంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షల రూపాయలను కేటుగాళ్లు దోచేశారు. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇపిస్తామంటూ నిరుద్యోగులను నిండా ముంచేశారు. మొగల్ రాజుపురంలోని నాగరాజు ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ.. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మోసానికి పాల్పడింది. ఒక్కొక్కరి వద్ద రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేసి సంస్థ నిర్వాహకులు బోర్డు తిప్పేశారు.మాచవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన కానీ న్యాయం జరగలేదంటూ విజయవాడ కమిషనర్ను కలిసేందుకు బాధితులు వచ్చారు. విజయవాడ కమిషనరేట్లో స్పందనలో కంప్లైంట్ ఇచ్చిన కానీ నేటికీ కూడా న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది బాధితులు ఉన్నారని బాధిత నిరుద్యోగులు అంటున్నారు. ఫిర్యాదు చేసి నెల రోజులు గడిచిన ఇప్పటి వరకు నిర్వాహకులను అరెస్టు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. సంస్థ ప్రతినిధులు నాగరాజు, హెచ్ఆర్ శిరీషలను అరెస్ట్ చేయకుండ మాచవరం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపించారు.మోసపోయిన వాళ్లందరూ ఒకేసారి వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. వారిపై చర్యలు తీసుకునే సరికి పది సంవత్సరాలైనా సమయం పట్టవచ్చంటూ హేళనగా సమాధానం చెబుతున్నారని బాధితులు అంటున్నారు. చేసేదిలేక విజయవాడ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చామని సీపీ రాజశేఖర్బాబు తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. -
హోరాహోరీగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో ఉన్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోటీలలో భాగంగా న్యూ కేటగిరీ విభాగంలో నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీలను గురువారం రాత్రి పశుప్రదర్శన కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యూ కేటగిరీ విభాగంలో ఎనిమిది జతలు పోటీలో పాల్గొన్నాయన్నారు. పోటీలను తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జత యజమానులకు అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ గరికపాటి భాస్కరం సోదరులు వస్త్రాలు, జ్ఞాపికలను అందజేశారు. నగదు బహుమతుల అందజేత గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన ఆరుపళ్ల విభాగం పోటీలలో విజేతలైన ఎడ్ల జత యజమానులకు కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన శ్రీకావ్య నంది బ్రీడింగ్ బుల్స్ నెల్లూరి రామకోటయ్య ఎడ్ల జత 15 నిమిషాల వ్యవధిలో 3911.08 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. కృష్ణాజిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన అనంతనేని కావ్యమధు ఎడ్ల జత 3583.2 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం పంగులూరు గ్రామానికి చెందిన చిలుకూరి నాగేశ్వరరావు ఎడ్ల జత 3,500 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచాయన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి గ్రామానికి చెందిన గాదే అశేర్ సుమన్వీరెడ్డి ఎడ్ల జత 3,481.8 అడుగుల దూరం లాగి నాలుగవ స్థానం, పల్నాడు జిల్లా నకిరేకల్ మండలం చల్లగుండ్ల గ్రామానికి చెందిన మేక అంజిరెడ్డి ఎడ్ల జత 3412.3 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు ఎడ్ల జత 3,313.3 అడుగుల దూరం లాగి ఆరవ స్థానంలో నిలిచాయని తెలిపారు. విజేతలకు వరుసగా రూ.40 వేలు, రూ.35 వేలు, రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేల చొప్పున నగదు బహుమతులు అందించినట్లు కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, రాంబాబు, విక్రమ్, రాంబాబు, వెంకట్రావ్, శివాజీ పాల్గొన్నారు. -
కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పర్యాటకులకు మధురానుభూతిని కల్పించేలా కొండపల్లి ఖిల్లా, కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రాలను అభివృద్ధి చేయడంతో పాటు ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కొండపల్లి బొమ్మల తయారీ కాలనీ వద్ద ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు, కొండపల్లి ఖిల్లా అభివృద్ధి పై గురువారం కలెక్టర్ లక్ష్మీశ పర్యాటక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండపల్లిలో సుమారు 400 ఏళ్లకు పైగా రాజస్థాన్కు చెందిన హస్త కళాకారులు అత్యంత కళానైపుణ్యంతో తయారు చేసిన బొమ్మలకు జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందన్నారు. కొండపల్లి పరిసర ప్రాంతాలలో లభ్యమయ్యే తెల్ల పొణికి చెక్కతో రూపొందించే కొండపల్లి బొమ్మలకు మరింత ప్రాచుర్యం కల్పించి కళాకారులను ప్రోత్సహించడం ద్వారా జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా శతాబ్దాల చారిత్రక వారసత్వానికి సజీవ సాక్ష్యంగా ఉన్న కొండపల్లి బొమ్మల విశిష్టతను పర్యాటకులకు చాటిచెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ను అభివృద్ధి చేస్తామన్నారు. భవనంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసి, సుందరీకరణ పనులు చేపట్టి ఆకర్షణీయంగా తీర్చిదిదేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొండపల్లి బొమ్మల కాలనీ నుంచి ఖిల్లా వరకు ఉన్న మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులకు అనువుగా తీర్చిదిద్దాలన్నారు. కొండపల్లి వద్ద పర్యాటకులు ట్రెక్కింగ్ నిర్వహించుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఎస్.పద్మారాణి, టూరిజం కన్సల్టెంట్ సాహితి, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డీఈ శ్రీనివాస యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ -
ఏపీఈసెట్లో జిల్లా విద్యార్థులకు ర్యాంకులు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీఈసెట్ ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. రెండు వేరువేరు విభాగాలలో జిల్లాకు చెందిన విద్యార్థులు పది లోపు ర్యాంకులు సాధించారు. జిల్లాలోని కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామానికి చెందిన జ్యోతుల ప్రసన్నలీల బీఎస్సీ మ్యాథ్స్ స్ట్రిమ్కు సంబంధించి రాష్ట్ర స్థాయిలో 88 మార్కులతో నాలుగో ర్యాంకును సాధించారు. విజయవాడ మల్లికార్జునపేటకు చెందిన గొడుగుల దినేష్కుమార్ సివిల్ విభాగంలో 119 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఐదో ర్యాంకును సాధించారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మంచి విద్యాసంస్థల్లో చేరనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కొలువులు పొందటం లక్ష్యంగా వివరించారు. మద్యం వ్యసనంతో వ్యక్తి ఆత్మహత్య పెనమలూరు: మద్యం వ్యసనం కారణంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తి గురువారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం తాడిగడప కార్మికనగర్కు చెందిన బావిశెట్టి సురేష్ (39)కు 15 ఏళ్ల క్రితం వివాహం అయింది. అతని చెడు అలవాట్ల కారణంగా భార్యతో విభేదాలతో కొద్ది సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. మద్యం విపరీతంగా తాగుతుండటంతో తండ్రి జయకృష్ణ, సోదరుడు నాగబాబు మందలించారు. దీంతో మద్యం తాగటం మానేస్తానని సురేష్ కొద్ది రోజుల క్రితం కొండాలమ్మ గుడి వద్దకు వెళ్లి కడియం వేసుకున్నాడు. అయితే కొద్ది రోజులకే కడియం తీసివేసి మరల మద్యం తాగటం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో గురువారం మద్యం తాగి సోదరుడు నాగబాబు ఉంటున్న లక్ష్మీపురం కాలనీ ఇంటికి వచ్చాడు. తండ్రి, సోదరుడు మందలించడంతో మనస్తాపానికి గురైన సురేష్ తాడిగడప కార్మికనగర్లో ఉన్న తన ఇంటికి వెళ్లి తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం కుటుంబ సభ్యులకు తెలియటంతో వారు ఘటనా స్థలం వద్దకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
దోమల నియంత్రణ ద్వారానే డెంగీ నివారణ సాధ్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దోమల నియంత్రణ ద్వారానే డెంగీ వ్యాధిని అరికట్టగలుగుతామని, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో దోమల నివారణ చర్యలు చేపట్టి ప్రాణాంతక డెంగీ వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఈనెల 16వ తేదీ జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా డెంగీ వ్యాధి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, నగర పాలక సంస్థ, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం అవగాహన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దోమల నియంత్రణ ద్వారానే డెంగీ వ్యాధిని అరికట్టగలుగుతామన్నారు. డెంగీ వ్యాధి లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా సంబంధిత అధికారులు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. అధిక జ్వరం, తలనొప్పి, కంటి వెనుక భాగంలో నొప్పి, కండరాల నొప్పి, చర్మంపై గుండ్రటి మచ్చలు వంటి లక్షణాలు ఉన్న వారికి వెంటనే డెంగీ పరీక్షలు నిర్వహించాలన్నారు. యాంటీ లార్వా ఆపరేషన్ ప్రక్రియను ప్రతి సచివాయాలనికి అనుసంధానించాలని అన్నారు. దోమల నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం అవసరమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వి.మోతీబాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాచర్ల సుహాసిని, వైద్య ఆరోగ్య శాఖ, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు
జగ్గయ్యపేట: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ద్వారా పార్ బాయిల్డ్ బియ్యం కొనుగోళ్లు నిలిచిపోవటంతో మిల్లు యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. గత 45 రోజులుగా ఎఫ్సీఐ కొనుగోళ్లు ఆపివేయటంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. అయినా పౌర సరఫరాల శాఖాధికారులు పట్టించుకోవటం లేదని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆయా మిల్లుల్లో 10 వేల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. జిల్లాలో నాలుగు మిల్లులు.. జిల్లాలో జగ్గయ్యపేటలో వెంకటేశ్వర పార్ బాయిల్డ్, అనుమంచిపల్లిలో శ్రీ పద్మావతి శ్రీనివాసా, విస్సన్నపేట మండలం పుట్రేలలోని వెంకటేశ్వర, ఎ.కొండూరులోని వెంకట శేషసాయి పార్ బాయిల్డ్ రైస్ మిల్లులున్నాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మిల్లుల వద్ద నుంచి పార్బాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తుంది. 45 రోజులుగా కొనుగోళ్లు నిలిపివేయటంతో మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. దీంతో మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రబీ సీజన్ ముగియటంతో ఆయా గ్రామాలలోని రైతు సేవా కేంద్రాల ద్వారా వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా, ఇప్పటికే మిల్లుల్లో ఽనిల్వ ఉన్న ధాన్యంతో రైతులు తీసుకువచ్చే ధాన్యానికి స్థలం లేక ధాన్యం తీసుకోమంటూ మిల్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇటీవల జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, నందిగామ ప్రాంతాల్లోని రైతులకు, యజమానులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మరొక పక్క యజమానులు మాత్రం ఎఫ్సీఐ అధికారులు ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తే మిల్లుల్లో ధాన్యం ఖాళీ అవుతుందని, అప్పుడు రబీ సీజన్కు ధాన్యం తీసుకునేందుకు మిల్లుల్లో అనువుగా ఉంటుందని, రైతులకు గోనె సంచుల కొరత ఉండదని చెబుతున్నారు. రంగు మారే అవకాశం.. ఎఫ్సీఐ బియ్యం కొనుగోలు చేయకపోవటంతో మిల్లుల్లో ఆరుబయట ఉన్న ధాన్యం బాయిల్డ్ సమయంలో రంగు మారే అవకాశం ఉందని అంతేకాకుండా వర్షాలు పడుతుండటంతో తడిసే అవకాశం ఉందని మిల్లర్లు చెబుతున్నారు. బ్యాంకు గ్యారంటీ గడువు కూడా ముగుస్తుందని, ఎఫ్సీఐ అధికారులు కనీస నిబంధనలు కూడా చెప్పటం లేదని వాపోతున్నారు. 45 రోజులుగా నిలిచిన ఎఫ్సీఐ బియ్యం కొనుగోళ్లు పట్టించుకోని అధికారులు రబీ ధాన్యం తీసుకునేందుకు స్థలం లేక మిల్లర్ల ఇబ్బందులు జిల్లాలోని మిల్లుల్లో 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు రెండు, మూడు రోజుల్లో కొనుగోళ్లకు అనుమతులు పార్ బాయిల్డ్ రైస్ మిల్లుల నుంచి ఎఫ్సీఐ గోడౌన్లకు బియ్యం కొనుగోళ్లకు రెండు, మూడు రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలోని మిల్లర్లతో మాట్లాడుతున్నాం. అనుమతులు రాగానే కొనుగోలు చేస్తాం. – సతీష్, పౌరసరఫరాల శాఖ డీఎం -
గురుకుల విద్యార్థుల ప్రతిభకు పట్టం
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, గురుకుల పాఠశాలల్లో చదువుతూ పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థులను సత్కరించారు. వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో ఎంజేపీ గురుకులాలు, బీసీ గృహాల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి, అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా 31 గురుకుల పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలను తీసుకొచ్చేందుకు కృషి చేసిన ప్రిన్సిపాళ్లను కూడా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 200 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, 22 మందికి రూ.20 వేలు, రూ.15, రూ.10 వేల చొప్పున నగదు పురస్కారాలను అందజేశామని తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా గురుకుల పాఠశాలల బీసీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించటం అభినందనీయమన్నారు. జూన్ 15వ తేదీన తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అన్ని హాస్టళ్లల్లో సన్న బియ్యంతో భోజనం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సంచాలకుడు డాక్టర్ ఎ.మల్లికార్జున్, అడిషనల్ డైరెక్టర్ డి.చంద్రశేఖర్రాజు, మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల సొసైటీ కార్యదర్శి పి.మాధవీలత, ఎ.కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు టీచర్ల మెడపై అడ్మిషన్ల కత్తి
పెనుగంచిప్రోలు: విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే అడ్మిషన్ల పేరిట తమ వద్ద పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులను ప్రైవేటు విద్యాసంస్థలు వేధిస్తున్నాయి. మండుటెండల్లో ఇంటింటి ప్రచారం చేసి విద్యార్థులను చేర్పించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయి. అడ్మిషన్లను తీసుకురాకుంటే జీతం ఇవ్వబోమని హెచ్చరిస్తున్నాయి. ప్రైవేటు విద్యాసంస్థల తీరుతో ప్రైవేటు టీచర్లు, అధ్యాప కులు మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేక పీజీ, డిగ్రీ, బీఈడీలు చేసిన ఎంతోమంది జీవనం సాగించటానికి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి రెండు నెలల ముందే విద్యార్థుల ప్రవేశాలకు టార్గెట్ విధిస్తూ సిబ్బందిని ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు వేధింపులకు గురిచేస్తున్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచి ప్రోలు, వత్సవాయి, జగ్గయ్యపేట మండలాల్లో సుమారుగా 50 వరకు ప్రైవేటు పాఠశాలలు, పది కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా పెనుగంచిప్రోలులో రెండు, జగ్గయ్యపేటలో మరో రెండు కార్పొరేట్ పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. ఈ సంస్థల్లో వెయ్యి మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలు గత నెల నుంచి ఆయా పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇంటింటికి పంపిస్తు న్నాయి. వారు ప్రతి ఇంటికీ వెళ్లి ‘మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారా, ఉంటే ఏం చదువుతున్నారు’ అన్న సమాచారం సేకరిస్తున్నారు. వారిని తమ పాఠశాల, కళాశాలలో చేర్పించండని తల్లిదండ్రులను బతిమలాడుతున్నారు. టార్గెట్ పూర్తయితేనే.. ఇచ్చిన అడ్మిషన్ల టార్గెట్లు పూర్తి చేస్తేనే సెలవుల్లో జీతాలు ఇస్తామని కొన్ని కార్పోరేట్ విద్యాసంస్థలు నిబంధనలు పెడుతున్నాయి. ఒకొక్కరు కనీసం పది నుంచి 15 మందిని చేర్పించాలన్నది లక్ష్యం. అలా చేర్పించిన తరువాత కూడా సెలవుల అనంతరం పాఠశాల తెరిచాక ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియదు. ఇచ్చే అరకొర జీతాలు నిలిపి వేస్తారనే భయంతో ఉపాధ్యాయులు, సిబ్బంది నానాతంటాలు పడుతుంటారు. భగభగ మండే ఎండల్లో ఇంటింటికీ తిరుగుతూ నానా కష్టాలుపడుతున్నారు. పిల్లలను చేర్పించటం ఒక పని అయితే స్థానికంగా పాఠశాలల నిర్వహణ చూసే బాస్లు సిబ్బందితో మాట్లాడే భాష, వారి ప్రవర్తన మరింత ఇబ్బంది పెట్టేలా ఉంటుందని పలువురు ప్రైవేటు ఉపాధ్యాయులు వాపోతున్నారు. అడ్మిషన్ల కోసం నోటికి ఏది వస్తే అది మాట్లాడి మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సతమతమవుతున్న సిబ్బంది ఒకవైపు బోధన, మరోవైపు అడ్మిషన్ల టార్గెట్ను పూర్తిచేసే పనిలో ప్రైవేటు, కార్పొరేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు తీవ్ర వత్తిడికిలోనై మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారని విద్యావేత్తలు చెబుతున్నారు. తమ వేదనను ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుమిలి పోతున్నారు. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్న సమయంలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోలేక, ఒత్తిడిని తట్టుకోలేక ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు యాజమాన్యాలు చాలీచాలని వేతనాలిస్తూ వారి జీవితాలతో చెలగాట మాడుతున్నాయి. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు బోధించే టీచర్లకు నెలకు రూ.4,500 నుంచి రూ.5 వేల జీతం మాత్రమే ఇవ్వడం గమనార్హం. పిల్లలను స్కూళ్లలో చేర్పించాలంటూ టార్గెట్లు ఎండల్లో ఇంటింటి ప్రచారం చేయాలని ఆదేశం అడ్మిషన్లను తీసుకురాకుంటే జీతం అందనట్టే మనోవేదనకు గురవుతున్న ప్రైవేటు టీచర్లుభారీగా ఫీజులు విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాల్సి ఉంది. అయితే ఈ నిబంధన జిల్లాలోని ఏ ప్రైవేట్ పాఠశాలలో అమలు కావటం లేదు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్థాయి నుంచే భారీగా ఫీజులు దండుకుంటున్నారు. టెక్నో, ఈ–టెక్నో, సీబీఎస్ఈ , ఐఐటీ కోచింగ్, అబాకస్, స్పోకెన్ ఇంగ్లిష్, కరాటే, డ్రాయింగ్ తదితరాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారాన్ని మోపుతున్నారు. దీనికి అద నంగా యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బూట్లు, సాక్సులు, టై వంటివి ఆయా పాఠశాలల్లోనే అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారు. -
చె
రువు మట్టి.. రబట్టి పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో జోరుగా మట్టి తవ్వకాలు సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లాలో కూటమి నేతలు సహజ వనరులను కొల్లగొట్టేస్తున్నారు. వారి ధన దాహానికి అడ్డూఅదుపు లేకుండా పోయింది. చెరువులను చెరబట్టి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మట్టిదందా సాగిస్తున్నారు. పామర్రు నియోజకవర్గంలో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా సాగిస్తున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే మట్టి దందా సాగుతోంది. ప్రైవేటు వెంచర్లకు మట్టిని విక్రయిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. మరో వైపు ఉచిత ఇసుకను కూడా బొక్కేస్తున్నారు. తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు గ్రామం మొదలుకొని పమిడిముక్కల మండలంలోని లంకపల్లి వరకు సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పేదల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత ఇసుక విధానానికి తూట్లు పొడుస్తున్నారు. రోజుకు 400 లారీల ఇసుకను అక్రమంగా తరలించి జేబులు నింపుకొంటున్నారు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో, లంకపల్లి చుట్టుపక్కల కార్మికులు తమ ఉపాధికి గండి కొడుతున్నారని రోడ్డెక్కిన ఘటనలు ఉన్నాయి. గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలంతో పాటు, బుడమేరులో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. పామర్రు నియోజకవర్గంలో.. పొలాల్లో పూడికతీత, గ్రామాల్లో ఇళ్ల స్థలాల మెరకల పేరుతో కూటమి నాయకులు గ్రామాల్లో చెరువులను, కుంటలను చెరబట్టారు. చెరువులు, కుంటల్లో అక్రమంగా మట్టిని తవ్వి ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలను ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు సైతం మామూళ్లు తీసుకుంటూ తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మట్టి తవ్వకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ అక్రమ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. రోజుకు వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా పామర్రు, ఉయ్యూరు ప్రాంతంలోని ప్రైవేటు వెంచర్లు, ఇళ్ల స్థలాల మెరకు మట్టి తరలిస్తున్నారు. కొన్ని చెరువుల్లో ఇప్పటికే మట్టి అక్రమ తవ్వకాల ద్వారా కోట్ల రూపాయల దోపిడీని పచ్చనేతలు చేశారు. ఒక్కో చెరువులో మట్టి తరలింపు ద్వారా కోటి రూపాయలకు పైగా దోచుకున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. గుడివాడ నియోజక వర్గంలో.. గుడివాడ నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజాప్రతినిఽధి కనుసన్నల్లో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు చేస్తూ, కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. బుడమేరులో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ఇక్కడి నుంచి తవ్విన మట్టిని ఓ ఇంటర్నేషనల్ స్కూల్కు తరలిస్తున్నారు. నందివాడ మండలంలో వెన్ననపూడి, ఇలపర్రు గ్రామ చెరువుల్లోనూ మట్టి అక్రమ తవ్వకాలు జోరుగాసాగుతున్నాయి. గుడివాడ మండలంలో లింగవరం, నాగవరప్పాడు, బిళ్లపాడు, సిరిసింతల, కలువపూడి అగ్రహారం, మోటూరు గ్రామ చెరు వుల్లో మట్టి దోపిడీ చేస్తున్నారు. గుడ్లవల్లేరు మండలంలో విన్నకోట గ్రామ చెరువులో యథేచ్ఛగా మట్టి దందా సాగిస్తున్నారు. ఈ మట్టిని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. అక్రమంగా చెరువుల్లో మట్టి తవ్విప్రైవేటు వెంచర్లకు తరలింపు పామర్రు నియోజకవర్గప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే తవ్వకాలు అధికారం అండతో రూ.కోట్లు దోచుకుంటున్న కూటమి నేతలు -
పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
వన్టౌన్(విజయవాడపశ్చిమ): పరిశ్రమలకు అవస రమైన కోర్సులను అందించే ఐటీఐ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. పదో తరగతి అనంతరం ఐటీఐ కోర్సులు చేసిన వెంటనే ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండటమే దీనికి కారణం. ఇటీవల పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి అనంతరం చేరాల్సిన కోర్సులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దృష్టి సారిస్తున్నారు. కొంత మంది విద్యార్థులు పాలిసెట్, రెసిడెన్షియల్ కళాశాలల ప్రవేశ పరీక్షలు రాశారు. అధిక శాతం మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ కోర్సుల్లో చేరనున్నారు. ఇంకా కొందరు విద్యార్థులు టెక్నికల్ కోర్సులు ఉన్న పాలిటెక్నిక్, ఐటీఐలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. పదో తరగతి పూర్తి చేయగానే త్వరితగతిన ఉపాధి పొందేందుకు ఐటీఐ కోర్సులు దోహదం చేస్తాయని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఐటీఐ కాలేజీలు ఇలా.. ఎన్టీఆర్ జిల్లాలో ఒక ప్రభుత్వ, పది ప్రైవేటు ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్లలో 680 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో సుమారుగా 944 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాల విజయవాడలో రమేష్బాబు హాస్పిటల్ రోడ్డులో ఉంది. ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఐటీఐ (గొల్లపూడి), సెయింట్ జోసఫ్ ఐటీఐ (గుణదల), జంపాల అన్నపూర్ణ ఐటీఐ (విజయవాడ), శ్రీ పద్మావతి ఐటీఐ (నందిగామ), వివేకానంద ఐటీఐ (విజయవాడ), సాయి కృష్ణ ఐటీఐ (తిరువూరు), శ్రీమతి ఈకే ఐటీఐ (జగ్గయ్యపేట), పీఎస్సీ బోస్ ఐటీఐ (నందిగామ), డోలూస్ ఐటీఐ (నందిగామ), నలంద ఐటీఐ (విజయవాడ) కళాశాలలు ఈ సంవత్సరం అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఎన్టీఆర్ జిల్లాలో ఒక ప్రభుత్వ, పది ప్రైవేట్ కాలేజీలు వివిధ ట్రేడుల్లో అందుబాటులో 1,624 సీట్లు అడ్మిషన్ల రిజిస్ట్రేషన్లకు ఈ నెల 24 వరకు గడువు -
ఐటీఐ అర్హతతో అద్భుత ఉపాధి అవకాశాలు
ఐటీఐ అర్హతతో అద్భుత ఉపాధి అవకాశాలు ఉన్నాయి. సాంకేతిక విద్యపై ఆసక్తి కలిగి, వివిధ కారణాలతో ఉన్నత చదువులకు వీలుకాని వారికి ఐటీఐ విద్యాకోర్సులు చక్కని ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. ఐటీఐలో చేరదలిచే విద్యార్థులు ఈ నెల 24వ తేదీ వరకు ఐటీఐ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కోర్సులు పూర్తి చేసిన తరువాత నైపుణ్యం కలిగిన విద్యార్థులకు జాబ్మేళాలు నిర్వహించి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తాం. – ఎం.కనకారావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ, విజయవాడ ● -
నిత్యాన్నదానానికి భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గురువారం పలువురు భక్తులు విరాళాలు అందచేశారు. హిందూ పూర్కు చెందిన బి.నవీన్ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ ఈఓ శీనానాయక్ను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందచేశారు. విజయవాడ భవానీపురానికి చెందిన శీలం సాయి ఫణీంద్ర కుటుంబం అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి రూ.1,01,116 విరాళం సమర్పించింది. దాతలకు ఈఓ శీనానాయక్, ఆలయ పర్యవేక్షకుడు నాథురామ్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. దుర్గమ్మకు వెండి పంచపాత్ర సమర్పణ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం దంపతులు గురువారం వెండి పంచపాత్రను సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్ష్మీకాంతం దంపతులు ఆలయానికి విచ్చేయగా, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం రూ.2 లక్షలు ఖర్చుచేసి 2.028 కిలోల వెండితో తయారు చేయించిన పంచపాత్రను ఆలయ అధికారులకు అందజేశారు. లక్ష్మీకాంతం దంపతులకు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. తిరుమలగిరి హుండీ ఆదాయం రూ. 26.41 లక్షలు తిరుమలగిరి(జగ్గయ్యపేట): స్థానిక వాల్మీకోద్భవ వెంకటేశ్వర స్వామికి హుండీ కానుకల ద్వారా రూ.26,41,390 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసాద్ తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో కానుకల లెక్కింపు నిర్వహించారు. గత నెలలో నిర్వహించిన స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. కానుకల లెక్కింపులో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ పవన్కల్యాణ్, పరిటాల సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అడ్డుకున్న గ్రామస్తులు హుండీ కానుకల లెక్కింపు సమాచారాన్ని ఆలయ పాలకవర్గానికి ఇవ్వలేదని కొద్దిసేపు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇటీవల జరిగిన కల్యాణ మహోత్సవాల్లో ఆలయ ఈఓ ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేశారని, ఆ వివరాలు కూడా చెప్పటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఆలయం వద్దకు చేరుకుని గ్రామస్తులకు సర్దిచెప్పారు. ఆ సమయంలో ఆలయ ఈఓ కార్యాలయంలో లేరు. తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నట్లు ఇద్దరు వ్యక్తులపై ఆలయ ఈఓ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కొండపల్లి మునిసిపల్ చైర్మన్ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇబ్రహీంపట్నం: మండలంలోని కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మునిసిపల్ కమిషనర్ రమ్యకీర్తనకు హైకోర్టు నుంచి సీల్డ్ కవర్ వచ్చింది. సీల్డ్ కవర్ను సబ్ ట్రెజరీలో భద్రపర్చాలని ఆదేశాలు ఉన్నాయి. దీంతో మైలవరం సబ్ ట్రెజరీ అధికారులకు దానిని గురువారం మునిసిపల్ కమిషనర్ అందజేశారు. విజయవాడ ఆర్డీఓ చైతన్య ఈ సీల్డ్ కవర్ను తెరిచి అందులో ఉన్న ఉత్తర్వుల మేరకు మునిసిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. 2021 నవంబర్లో 29 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వైఎస్సార్ సీపీ నుంచి 14 మంది, టీడీపీ నుంచి 14 మంది కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. ఒకరు ఇండిపెండెంట్గా గెలుపొందారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్ టీడీపీలో చేరడంతో వారి సంఖ్య 15కు చేరింది. అప్పటి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ ఎక్స్ అఫీషియో ఓటుతో వైఎస్సార్ సీపీ సంఖ్య కూడా 15 అయింది. అప్పటి టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్అఫీ షియో ఓటు కోసం కోర్టును ఆశ్రయించడంతో ఎన్నిక నిర్వహించి సీల్డ్కవర్ ద్వారా కోర్టుకు సమర్పించారు. ఇటీవల కాలంలో కేశినేని నాని కేసు ఉపసంహరించుకోవడంతో ప్రస్తుతం కోర్టు ఉత్తర్వులు సీల్డ్ కవర్లో వచ్చాయి. -
కొనసాగుతున్న కక్ష.. వల్లభనేని వంశీపై మరో పీటీ వారెంట్ దాఖలు
సాక్షి, విజయవాడ: వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగుతోంది. వల్లభనేని వంశీపై మరో పీటి వారెంట్ దాఖలైంది. నూజివీడు కోర్టులో పీటీ వారెంట్ను పోలీసులు దాఖలు చేశారు. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారంటూ పీటీ వారెంట్ దాఖలు చేశారు. వంశీతో పాటు మరో 10 మందిపై కేసు నమోదైందికాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేశారనే అభియోగంపై అరెస్టైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ బెయిల్ పిటీషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. బెయిల్ పిటీషన్పై కౌంటర్ దాఖలు చేసిన అనంతరం ప్రాసిక్యూషన్ తరపున జాయింట్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్యాణి వాదనలు వినిపించగా, వంశీ తరపున సత్య దేవిశ్రీ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం 12వ అదనపు జిల్లా న్యాయస్థానం జడ్జి తీర్పును శుక్రవారం వెల్లడించనున్నారు. ఈ కేసులో వల్లభనేని వంశీ మోహన్ ఎ71 నిందితునిగా ఉన్నారు. -
AP ECET 2025: ఏపీ ఈసెట్ ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల కోసం అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి.. sakshieducation.com ద్వారా ఫలితాలను పొందవచ్చు.ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా మరియు బీఎస్సీ (గణిత శాస్త్రం) విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరానికి BE / BTech / B.Pharmacy కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రెండవ సంవత్సరంలో ప్రవేశాలు లభిస్తాయి. ఈ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు, త్వరలో ప్రారంభమయ్యే AP ECET 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా తగిన సీట్లను పొందవచ్చు.మొత్తం 35,187 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 31,922 మంది పరీక్ష రాశారు. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాకు చెందిన రేవతి 169 మార్కులతో ప్రథమ ర్యాంక్ సాధించింది. రెండు, మూడు, నాలుగో స్థానాలను కూడా తెలంగాణ విద్యార్థులు దక్కించుకున్నారు.AP ECET Results Direct Linkక్లిక్👉 ఏపీ ఈసెట్ రిజల్ట్ -
ప్రతిభకు కార్పొరేట్ వల
కంకిపాడు: ‘‘ఇంటర్లో స్టేట్ 1, 2, 3 ర్యాంకులు మావే... నీట్, ఎంసెట్లోనూ మేమే టాప్..’’ అంటూ కార్పొరేట్ విద్యాసంస్థలు తమ స్థాయిని పదిలం చేసుకోవాలంటే ప్రతిభావంతులైన విద్యార్థులు ఉంటేనే సాధ్యం. అందుకు ప్రతిభావంతులైన విద్యార్థులు పక్క విద్యాసంస్థల్లో చేరకుండా తమ సంస్థల్లోనే అడ్మిషన్లు పొందేలా చేసుకోవాలి. దీంతో పలు విద్యాసంస్థలు అడ్మిషన్లలో తీవ్ర పోటీ పడుతున్నాయి. ప్రతిభావంతులను చేర్చుకునే పనిలో పడ్డాయి. సమయం లేదుగా... ఈ విద్యాసంవత్సరం ఇంటర్మీడియెట్ తరగతులు జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు తమకు అనువైన, అందుబాటులో ఉన్న కళాశాలల్లో కోర్సులను ఎంపిక చేసుకుని అడ్మిషన్లను పొందుతున్నారు. ఈ కొద్ది రోజుల సమయాన్ని వినియోగించుకుని అడ్మిషన్లను భారీగా నమోదు చేసుకునే పనిలో పేరొందిన కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన విద్యాసంస్థలు నేడు గ్రామీణ ప్రాంతాల్లోనూ బ్రాంచిలను అందుబాటులోకి తెచ్చి గ్రామీణ విద్యార్థులను చేర్పించుకుంటూ, అందుబాటులోనే తమ సంస్థ బ్రాంచిలు ఉన్నాయంటూ ప్రచారంలో ముందున్నాయి. ఆఫర్లే...ఆఫర్లు పది ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులపై టాప్–5లో ఉన్న కార్పొరేట్ సంస్థలు దృష్టి సారించాయి. వారు చదివిన పాఠశాలల నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించి వారిని నేరుగా కలుసుకుని అడ్మిషన్లను ఖాయం చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల విడుదలైన పది ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభను చూసి ఆఫర్లు ఇస్తున్నారు. 550 మార్కులు దాటితే ఫీజులో 50 శాతం రాయితీ, 575 మార్కులు దాటితే 75 శాతం రాయితీ, 590 పైన మార్కులు వస్తే 80–90 శాతం వరకూ ఫీజుల్లో రాయితీ, అవసరమైతే అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తామంటూ ఆఫర్లు మీద ఆఫర్లు అందిస్తున్నారు. ఇదే క్రమంలో గత విద్యాసంవత్సరంలో తమ సంస్థకు వచ్చిన ర్యాంకులు, నీట్, ఎంసెట్ ఫలితాల్లో టాప్గా నిలిచామంటూ ప్రకటనలను చూపించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆకర్షణ మంత్రం వాడుతున్నారు. ఎంసెట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ అన్నింటికి కోచింగ్ ఇదే ఫీజులో అందిస్తామంటూ ఆశ చూపుతున్నారు. ఇంటర్లో అడ్మిషన్ల కోసం క్యూలు కడుతున్న వైనం విద్యార్థుల ఇళ్ల చుట్టూ అధ్యాపకుల ప్రదక్షిణలు రకరకాల ఆఫర్ల పేరుతో ఆకర్షించే యత్నం అడ్మిషన్లు మిస్సయితే జీతాలు కట్ కొంతమంది విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభను తమ ఖాతాలో వేసుకుని కోట్లు దండుకుంటున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలు. టెన్త్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు వల వేసి, వారికి ఫీజుల్లో 50 నుంచి 90 శాతం వరకు కూడా రాయితీల ఆశ చూపించి తమ సంస్థల్లో చేర్చుకుంటాయి. ఇంటర్లో వారు సాధించిన ర్యాంకులను తమ గొప్పలుగా చెప్పుకొంటూ లక్షలాది అమాయక విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కోట్లాది రూపాయలు పోగేసుకుంటున్నాయి. మరో వైపు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మెడపై కార్పొరేట్ సంస్థలు కత్తి పెడుతున్నాయి. ఎంపిక చేసుకున్న విద్యార్థుల అడ్మిషన్ నూరు శాతం ఓకే అవ్వాలి. అడ్మిషన్ల సంఖ్య తగ్గినా, ముఖ్యమైన టార్గెట్ మిస్సయినా మే నెల జీతాలు ఉండబోవని ఆయా సంస్థలు తమ సిబ్బందికి టార్గెట్లు నిర్ణయిస్తున్నాయి. దీంతో సిబ్బంది చేసేది లేక విద్యార్థులు, వారి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఎలాగోలా అడ్మిషన్ ఓకే అయ్యేలా చేసేందుకు నానా తిప్పలు పడుతున్నారు. -
ఆకట్టుకున్న గోదా కల్యాణం నృత్య రూపకం
శ్రీకాకుళం(ఘంటసాల): శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషాభిమానాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించిన గోదా కల్యాణం కూచిపూడి నృత్య రూపకం ఆసాంతం ఆకట్టుకుంది. శ్రీకృష్ణదేవరాయల మహోత్సవం సందర్భంగా ఆముక్త మాల్యద కావ్యం నుంచి డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్, కేవీ సత్యనారాయణ రచించిన గోదా కల్యాణం కూచిపూడి నృత్య రూపకాన్ని బుధవారం రాత్రి ప్రదర్శించారు. శ్రీకృష్ణదేవరాయలుగా కేవీ సత్యనారాయణ అభినయించారు. తొలుత కేవీ సత్యనారాయణను జస్టిస్ యు.దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘనంగా సన్మానించారు. -
నిర్లక్ష్యాన్ని సహించను
ఉపాధి లక్ష్యాల సాధనలో గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా శ్రామికులకు 80 లక్షల పనిదినాలను కల్పించాలనే లక్ష్యాన్ని సాధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, లక్ష్య సాధనలో నిర్లక్ష్యాన్ని సహించనని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. పనుల నిర్వహణలో వెనుకబడితే చర్యలు తప్పవని, శ్రామికులకు రూ.307 కనీస వేతనం కల్పించి ఆర్థిక ఊతం ఇచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో చేపడుతున్న పనుల ప్రగతిపై బుధవారం నీటి యాజమాన్య సంస్థ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, మండలాభివృద్ధి అధికారులు, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అధికారులతో కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా శ్రామికులకు పని కల్పించి వారికి ఆర్థిక ఊతం ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఎటువంటి అలసత్వం వహించినా సహించేది లేదన్నారు. ఈ ఏడాది శ్రామికులకు 80 లక్షల పని దినాలను కల్పించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం 13.40 లక్షల పని దినాలను మాత్రమే కల్పించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో పనులను మరింత వేగవంతం చేసి లక్ష్య సాధన వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. జగ్గయ్య పేట, నందిగామ, చందర్లపాడు, రెడ్డిగూడెం విస్సన్నపేట, ఎ.కొండూరు మండలాలలో ఆశించిన స్థాయిలో లేదని, ఆయా మండలాల అధికారులు మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఉపాధి హామీ ద్వారా 3వేల పంట కుంటలను నిర్మించాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు 572 కుంటలు మాత్రమే పూర్తి చేశారన్నారు. ఉపాధి హామీ పనులలో ఉద్యాన పంటల పనులకు ఆర్థిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఉద్యాన పంటల సాగుకు ప్రతి గ్రామంలో కనీసం 20 ఎకరాలను గుర్తించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సరాసరి 294 రూపాయలు మాత్రమే శ్రామికులకు లభిస్తోందని చేపట్టనున్న పనుల ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన రూ.307 దినసరి కనీస వేతనం తప్పనిసరిగా లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జాతీయ ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.రాము, ఉద్యాన శాఖ సహాయ సంచాలకుడు పి. బాలాజీ కుమార్, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. శ్రామికులకు కనీస వేతనం రూ.307 కల్పించాలి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
ఖరీఫ్ సాగుపై నీలినీడలు
నిధులు మంజూరు చేయని ప్రభుత్వం గండ్లు పూడ్చకపోతే సాగు చేయలేం వెల్లటూరు పడమర చెరువు కింద నాకు 2 ఎకరాల పొలం ఉంది. పోయిన సంవత్సరం ఖరీఫ్లో వరి సాగు చేశాను. చెరువుకు ఐదు చోట్ల గండ్లు పడి పైరు పూర్తిగా కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయాను. ఇప్పటివరకు గండ్లు పూడ్చలేదు. గండ్లు పూడ్చకపోతే పంట సాగు చేయలేం. –మాదు నాగయ్య, రైతు, వెల్లటూరు పులివాగు గండ్లతో తీవ్రంగా నష్టపోయాం గత ఏడాది బుడమేరుకు వచ్చిన వరదలతో పులివాగు పొంగి గండ్లు పడ్డాయి. ఈ వరదల వలన నేను సాగు చేసిన నాలుగు ఎకరాల్లో వరిపైరు కుళ్లిపోయింది. తీవ్రంగా నష్టపోయాను. గండ్లు ఇప్పటివరకు పూడ్చలేదు. ఈ ఏడాది సాగు చేపట్టడం కూడా దండగ అనిపిస్తోంది. గండ్లు పూడ్చకపోతే సాగు చేపట్టలేం. –బెజవాడ వీరయ్య, రైతు, కవులూరు ఎనిమిది నెలలైనాగండ్లు పూడ్చలేదు గత ఏడాది వరదల వలన పులివాగుకు గండ్లు పడి నేను సాగు చేసిన పది ఎకరాల్లో వరిపైరు పాడైపోయింది. తీవ్రంగా నష్టపోయాను. గండ్లు పడి ఎనిమిది నెలలు దాటినా గండ్లు పూడ్చకపోవడం దారుణం. ప్రభుత్వం వెంటనే గండ్లను పూడ్చాలి. లేదంటే ఈ ఏడాది సాగు చేపట్టడం కష్టమే. –బొర్రా శ్రీనివాసరావు, రైతు, కవులూరు కూటమి ప్రభుత్వానికి అమరావతి జపం తప్ప రాష్ట్రంలో రైతులు ఏమై పోయినా పట్టదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా దళారీల దోపిడీకి దారులు తెరుస్తోంది. మిర్చికి గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నా పట్టించుకోదు. బుడమేరు వరదలకు గండ్లు పడి ఎనిమిది నెలలైనా వాటిని పూడ్చాలనే ధ్యాసే ఈ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది ఖరీఫ్లో 10 వేల హెక్టార్లలో సాగు ప్రశ్నార్థకం కానుంది. జి.కొండూరు: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. గత ఏడాది జల ప్రళయాన్ని సృష్టించిన బుడమేరు ప్రక్షాళన సంగతి దేవుడెరుగు కనీసం చెరువులకు, వాగులకు పడిన గండ్లను పూడ్చడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సాగు చేపట్టాలో లేదో తెలియక రైతులు అయోమయంలో ఉన్నారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎగువ బుడమేరు గండ్లతో పాటు పలు వాగులు, ఎన్ఎస్పీ కాల్వలకు పడిన గండ్లను అలానే వదిలేయడంతో మరో జల ప్రళయానికి ఆస్కారమిచ్చేలా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ... బుడమేరు డైవర్షన్ కెనాల్కు జి.కొండూరు మండల పరిధి కవులూరు శివారులో పడిన భారీ గండ్ల వద్ద జరుగుతున్న లైనింగ్ పనులను ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చెరువులు, వాగులు, ఎగువ బుడమేరు గండ్లు పూడ్చకపోతే తాము సాగు చేయలేమంటూ మొరపెట్టుకున్నారు. ఖరీఫ్ సాగు చేయమంటారా, వద్దంటారా అని మంత్రిని రైతులు పశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ దాటవేత ధోరణితో మాట్లాడారు. గండ్లు పూడ్చేందుకు ప్రతిపాదనలు ఆర్థికశాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయని, నిధులు విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. లైనింగ్ పనులకు విడుదలైన నిధులనే ఆర్థికశాఖ రిజెక్ట్ చేస్తే సమస్య తీవ్రతను వివరించి నిధులు తెచ్చామంటూ గొప్పలు చెప్పారు. మంత్రి మాటలను విని నవ్వాలో, ఏడవాలో తెలి యని పరిస్థితిలో రైతులు ఉన్నారు. గండ్లు పూడ్చకపోతే క్రాప్ హాలిడే ప్రకటించడమే మేలని భావిస్తున్నారు.ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోతే బుడమేరు వరద ముంపునకు గురైన పదివేల హెక్టార్లలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకం కానుంది. వర్షాకాలం ముంచుకొస్తున్నా... గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షానికి బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో మైలవరం నియోజకవర్గంలో 34 చెరువులకు గండ్లు పడ్డాయి. వీటితో పాటు పులివాగు, కోతులవాగు, ఎన్ఎస్పీ కాల్వలకు సైతం గండ్లు పడి వేలాది ఎకరాల్లో ఖరీఫ్ పంటను రైతులు నష్టపోయారు. ఈ వరదల వలన చెరువులకు పడిన గండ్లను తాత్కాలికంగా కొన్ని చోట్ల పూడ్చినప్పటికీ కొన్ని చెరువులు, వాగులు, ఎగువ బుడమేరు గండ్లకు తట్ట మట్టి కూడా వేయలేదు. వేసవి కాలం పూర్తయి వర్షాకాలం వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా చోద్యం చూస్తుండడంతో ఖరీఫ్ సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. బుడమేరు గండ్లు పూడ్చడంలో మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం వర్షాకాలం సమీపిస్తున్న వేళ రైతుల ఆందోళన గండ్లు పూడ్చకపోతే సాగు చేపట్టడం కూడా దండగేనంటున్న రైతులు గండ్లు పూడ్చాలంటూ ఇరిగేషన్ మంత్రికి మొరపెట్టుకున్న రైతులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిన మంత్రి 10వేల హెక్టార్లలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకమే క్రాప్ హాలిడే తప్పదాబుడమేరు వరదల వలన వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎగువ బుడమేరు అంటే బుడమేరు ప్రారంభం వరకు వాగుకు ఇరువైపులా కట్టలకు పడిన గండ్లను పూడ్చేందుకు అధికారులు 65 పనులుగా నిర్థారించారు. ఈ పనులకు రూ.29 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనాలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపి నెలలు గడుస్తున్నా నిధులు విడుదల చేయలేదు. దీంతో పాటు చెరువులు, పులివాగు, కోతులవాగు, ఎన్ఎస్పీ కాల్వలకు పడిన గండ్లను శాశ్వతంగా పూడ్చేందుకు రూ.35 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు పంపినా నిధులను విడుదల చేయలేదు. కేవలం బుడమేరు డైవర్షన్ కెనాల్కు కవులూరు గ్రామశివారులో పడిన భారీ గండ్ల వద్ద లైనింగ్ పనులు, హెడ్ రెగ్యులేటర్ మరమ్మతులకు మాత్రమే రూ.39.77 కోట్లు నిధుల విడుదల చేసి చేతులు దులుపుకొన్నారు. -
పెన్షన్ స్కీంలపై ముగిసిన అవగాహన సదస్సులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో విజయవాడ సంఘ్ కార్యాలయంలో మూడు రోజులపాటు యూపీఎస్ (యూనిఫైడ్ పెన్షన్ స్కీం), ఎన్పీఎస్ (న్యూ పెన్షన్ స్కీం), ఏపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీం) లపై నిర్వహించిన అవగాహన సదస్సులు బుధవారం ముగిశాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘ్ సెంట్రల్ కమిటీ సభ్యుడు అల్లం రమేష్ మాట్లాడుతూ.. పెన్షన్ స్కీం ఎంపికలో ఉద్యోగులు అలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎన్పీఎస్లో ఉద్యోగి ఫండ్ నుంచి నగదు విత్డ్రా చేసుకుంటే తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. సీనియర్ సెక్షన్ ఇంజినీర్లు రవికుమార్, నాగశయనలు మాట్లాడుతూ.. పాత పెన్షన్, నూతన పెన్షన్, యూనిఫైడ్ పెన్షన్ విధానాల్లోని తేడాలు, అందు లోని లాభనష్టాలపై కార్మికులకు అవగాహన కల్పించారు. యూపీఎస్లో రూ.10 వేల కనీస పింఛన్ ఉంటుందని, కార్మికుడు రాజీనామా చేసిన లేదా ఏదైనా ఇతర కారణాల చేత సర్వీసు నుంచి వైదొలిగినా ప్రయోజనం ఉండదని స్పష్టంచేశారు. పెన్షన్ ఎంపిక పూర్తిగా కార్మికుడి ఇష్టం పైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కార్మికులు ఆలోచించి తగిన స్కీంను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి కర్నూల్ సుకుమార్, ఇంజినీరింగ్ బ్రాంచ్ కార్యదర్శి ఎం.ఎస్.రావు, కార్యవర్గ సభ్యులు నవీన్, లాజరస్, మణికుమార్, బి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా.. 15 మందికి గాయాలు
గూడూరు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టిగూడూరు సమీపంలో ఆటో బోల్తా కొట్టిన ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మచిలీపట్నంలో జరిగే ఓ శుభకార్యానికి వెళ్లడానికి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లికి చెందిన 15 మంది ఆటోలో బయలుదేరారు. ఆ ఆటో తరకటూరుపాలెం దాటిన తర్వాత అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆటో డ్రైవర్ తాడిశెట్టి శివరామప్రసాద్, పునుగుపాటి కోటేశ్వరమ్మ, పునుగుపాటి వెంకటేశ్వరమ్మ, మోచర్ల బ్లెస్సీ, కామరవపు శ్రీరష్మ, మోచర్ల సుజాత, రామకోటి ధనుష్, మోచర్ల జాయి, మోచర్ల వెంకటేశ్వరరావు తదితరులు గాయపడ్డారు. గూడూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్ని రకాల పాఠశాలలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా?
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొమ్మిది రకాల పాఠశాలలను నెలకొల్పే ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ఎద్దేవా చేసింది. ఇన్ని రకాల పాఠశాలలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా అంటూ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో 117 జీఓకు పూర్వం ఉండే పాఠశాల వ్యవస్థ విధానాలు కావాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా జరిగింది. కూటమి ప్రభుత్వం విధానంతో ప్రభుత్వ పాఠశాలలు బలహీన పడతాయని ధ్వజమెత్తింది. ఈ ధర్నాను ప్రారంభించిన ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ.. విద్యారంగాన్ని గాడిలో పెడతామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ రంగాన్ని మరింత గందరగోళంలోకి నెడుతోందన్నారు. దీనిని ఏపీటీఎఫ్ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తోందని స్పష్టంచేశారు. గత ప్రభుత్వం కేవలం 3, 4, 5, తరగతులను మాత్రమే ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తే... ఈ ప్రభుత్వం ఒకటి, రెండు తరగతులను కూడా విలీనం చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. మోడల్ ప్రాథమిక పాఠశాలల పేరుతో, ఫౌండేషన్ పాఠశాలలను నెలకొల్పడం సరికాదన్నారు. మోడల్ ప్రాథమిక పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టు టీచర్లను నియమించడం అశాసీ్త్రయమని విమర్శించారు. ఈ ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భానుమూర్తి మాట్లాడుతూ ‘గత ప్రభుత్వ విద్యారంగ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. 12వ నేతన సవరణ కమిషన్ నియమించి 2023 జూలై నుంచి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు చేయాలని, ప్రభుత్వం ఉద్యోగులకు బాకీపడిన 34 డీఏలను తక్షణం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ప్రధాన సంపాదకుడు షేక్ జిలాని మాట్లాడుతూ.. విద్యారంగంలో విధ్వంస విధానాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాద్ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొమ్మిది రకాల పాఠశాలలను నెలకొల్పడం, పాఠశాలకు పాఠశాలకు మధ్య అనేక అంతరాలను సృష్టించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు ఎ.శ్యాంసుందరరెడ్డి, కె.అశోక్ కుమార్, టి.త్రినాథ, మర్రివాడ అనిత, పువ్వాడ వెంకటేశ్వర్లు, కార్యదర్శులు డి.సరస్వతి, బి.ఎ.సాల్మన్రాజు, సయ్యద్ చాంద్బాషా, ఎన్.రవికుమార్, కె.శ్రీనివాసు, ఎం.శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి ఏపీటీఎఫ్ సూటి ప్రశ్న -
ఆరోగ్య కార్యక్రమాల్లో లక్ష్యాలు సాధించాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల్లో లక్ష్యాలు సాధించాలని వైద్యాధికారులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని సూచించారు. విజయవాడలోని తన కార్యాలయంలో గ్రామీణ, పట్టణ ప్రాంత వైద్యాధికారులతో ఆమె బుధవారం సమీక్ష స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. అందులో భాగంగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల నమోదు, ఎన్సీడీ–సీడీ సర్వే, గర్భిణుల నమో దు వంటి కార్యక్రమాల్లో నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని డీఎంహెచ్ఓ సూచించారు. ఆయా కార్యక్రమాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో డీఎల్టీఓ డాక్టర్ ఉషారాణి, డీఐఓ డాక్టర్ శరత్బాబు, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతి, ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ మాధవీనాయుడు, డీఎంఓ డాక్టర్ మోతీబాబు, డీపీఎంఓ డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
రసవత్తరంగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీపేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఆరు పళ్ల విభాగం పోటీలను బుధవారం రాత్రి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త వెంకటలక్ష్మీ సాయిబాబు ప్రారంభించారు. ఈ విభాగంలో 17 జతలు పాల్గొన్నాయని, 10.20 క్వింటాళ్ల బరువును 15 నిమిషాల వ్యవధిలో లాగిన దూరాన్ని బట్టి విజేతలను నిర్ణయిస్తామని నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జత యజ మానులకు అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ గరికపాటి భాస్కరం సోదరులు వస్త్రాలు, జ్ఞాపికలను అందజేశారు. నగదు బహుమతుల అందజేత మంగళవారం రాత్రి జరిగిన నాలుగు పళ్ల ఎడ్ల ప్రదర్శన పోటీల్లో విజేతలుగా నిలిచిన ఎడ్ల జతల యజమానులకు కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామానికి చెందిన గుదిబండ మాధవరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎడ్ల జత 4,750 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలిచింది. బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన వజ్రాల తేజారెడ్డి, కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన అనంతనేని శ్రీకన్యశ్రీమధు ఎడ్ల జత 4,702 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, బాపట్ల జిల్లా యద్దన పూడికి చెందిన ఖాదర్ మస్తాన్, బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన ఏలూరి లిఖిత చౌదరి ఎడ్ల జత 3,750 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, మండల కేంద్రమైన చందర్లపాడు గ్రామానికి చెందిన గడుపూడి సాంబశివరావు ఎడ్ల జత 3,500 అడుగుల దూరం లాగి నాలుగో స్థానం, పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం ఇస్సప్పాలేనికి చెందిన మందలపు వాసవికారెడ్డి, జశ్వితరెడ్డి ఎడ్ల జత 3,250.11 అడుగుల దూరం లాగి ఐదో స్థానం, పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం రావిపాడుకు చెందిన యద్దనపల్లి పెద్దబ్బాయ్ బుజ్జి మెమోరియల్ మనోజ్ చౌదరి ఎడ్ల జత, పల్నాడు జిల్లా క్రోసూరు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన ప్రవీణ్కుమార్, ప్రేమ్కుమార్ ఎడ్ల జత 3,221 అడుగుల దూరం లాగి ఆరో స్థానంలో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.12 వేలు, రూ.10 వేల నగదు బహుమతులు అందించినట్లు కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, రాంబాబు, విక్రమ్, రాంబాబు, వెంకట్రావ్, శివాజీ తదితరులు తెలిపారు. -
వైభవంగా శ్రీకృష్ణదేవరాయల మహోత్సవం
ఘంటసాల: తెలుగు భాషలోని నీతులు, సామాజిక రీతులను చిన్నారులకు చెప్పకపోవడం వల్లే నేటి సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్నా యని హై కోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ప్రభుత్వ హైపవర్ కమిటీ చైర్మన్ జస్టిస్ యు.దుర్గాప్రసాద్ అన్నారు. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేంచేసియున్న శ్రీకాకుళేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కృష్ణదేవరాయలు మహోత్సవం బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి, డీసీ దాసరి శ్రీరామ వర ప్రసాదరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ఇలాంటి ఉత్సవాలు తెలుగు భాషాభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లా డుతూ.. యావత్ తెలుగు జాతికి స్ఫూర్తినిచ్చిన మహోన్నత వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు అని కొనియాడారు. తెలుగులో ఆముక్తమాల్యద గ్రంథాన్ని రచించారని పేర్కొన్నారు. తొలుత ఈ కార్యక్ర మానికి హాజరైన జస్టిస్ దుర్గాప్రసాద్కు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆముక్తమాల్యద మండపంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి జస్టిస్ దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి.వి.పూర్ణచందు, ఏఏంసీ చైర్మన్ తోట కనకదుర్గ, సర్పంచ్ ఎం.రవి ప్రసాద్, పీసీ చైర్మన్ డి.వెంకటేశ్వరరావు, ప్రత్యేకాధికారి సాయిబాబు, తహసీల్దార్ బి.విజయ ప్రసాద్, ఎంపీడీఓ డి.సుబ్బారావు పాల్గొన్నారు. -
స్విమ్మర్లకు అభినందన
పటమట(విజయవాడతూర్పు): ఖేలో ఇండియా–2025 యూత్ గేమ్స్ అండర్–18 కేట గిరీలో ఆలిండియా చాంపియన్షిప్లో 64 పాయింట్లతో ఏపీ తృతీయ స్థానంలో నిలిచింది. విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించిన అండర్–18 స్విమ్మర్లు తీర్థు సామదేవ్, దేవ గణేష్, యజ్ఞ సాయిలను వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో మంగళవారం కమిషనర్ ధ్యానచంద్ర అభినందించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రతిభ చూపిన స్విమ్మర్లకు వీఎంసీ తరఫున అన్ని విధాలా సహకరిస్తామని, భవిష్యత్తులో మరింత ప్రగతి సాధించాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ డాక్టర్ లత, ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ ఐ.రమేష్, కృష్ణా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ వి.వినోద్, సహాయక కోచ్ నితీష్, ఇతర కోచ్లు పాల్గొన్నారు.రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో బంగారు పతకంపెనమలూరు: రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన బాడీ బిల్డర్ సీహెచ్ దుర్గాప్రసాద్ 70 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించాడని జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.మనోహర్, అశోక్ తెలిపారు. మంగళవారం వివరాలు వెల్లడిస్తూ ఈ నెల 12న సత్యసాయి జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన కదిరిలో రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహించారన్నారు. దుర్గాప్రసాద్ 70 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించగా, 70 కేజీల పైవిభాగంలో రాహుల్కృష్ణ బెస్ట్ ఆఫ్ సిక్స్ సాధించాడన్నారు.ప్రశాంతంగా రెండో రోజు ఇంటర్ పరీక్షలువన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రెండో రోజు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. మొదటి ఏడాది పరీక్షకు 15,494 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 14,846 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 293 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 253 మంది రాశారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 346 మంది విద్యార్థులకు 276 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 54 మంది విద్యార్థులకు 42 మంది హాజరయ్యారు. -
త్వరగా పూర్తి చేయండి
అభివృద్ధి పనులు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఈవో శీనానాయక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలోని అభివృద్ధి పనులను ఈవో మంగళవారం పరిశీలించారు. ప్రాంగణంలో నిర్మిస్తున్న పూజా మండపాన్ని పరిశీలించారు. ప్లాన్ ప్రకారం ఇంకా జరగాల్సిన పనులు, రెండో అంతస్తును తనిఖీ చేశారు. దాతల సహకారంతో నిర్మించిన నూతన యాగశాల తుది పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయనే వివరాలను ఈఈ కోటేశ్వర రావును అడిగి తెలుసుకున్నారు. మల్లేశ్వరస్వామి ఆలయం చుట్టూ పచ్చదనం పెంపొందించాలని ఆదేశించారు. నూతన పూజా మండపాలు, యాగశాలను త్వరగా విని యోగంలోకి తీసుకురావాలని సూచించారు. అభివృద్ధి పనులు పూర్తయ్యేలా కాంట్రాక్టర్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని, రోజువారీ సమీక్షించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈవో వెంట ఈఈ కోటేశ్వరరావు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. కమిషనర్ సమీక్ష దుర్గగుడి ఈవో శీనానాయక్, ఇంజినీరింగ్ అధికారులు, ఇతర ఆలయ అధికారులు మంగళవారం కమిషనర్ రామచంద్రమోహన్తో సమావేశమయ్యారు. గొల్లపూడిలోని దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఆలయంలో జరుగుతున్న పనులతో పాటు భవిష్యత్తు ప్రణాళికలపై ఈవోతో చర్చించినట్లు సమాచారం. దుర్గగుడి ఈఓ శీనానాయక్ -
నిధులు ఈ వారంలో వచ్చేస్తాయి
జిల్లాలో గోకులం షెడ్ల నిర్మాణం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టారు. మెటీరియల్కు సంబంధించి నిధులు వచ్చి ఉన్నాయి. ఉపాధి కూలీల వేతనాలు రూ.6,19,71,224 రావాల్సి ఉంది. ఇవి కూడా వారం పది రోజుల్లో వస్తాయని సమాచారం ఇచ్చారు. పాడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆలస్యమైందంటే. 751 షెడ్లు పూర్తయ్యాయి. మిగిలిన వాటిని కూడా పూర్తి చేయాలని చెబుతున్నాం. –ఎన్వీ శివప్రసాద్, డ్వామా పీడీ, మచిలీపట్నం, కృష్ణాజిల్లా -
రూ. 83,500 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలను విజయవంతం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ. 83,500 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక (ఏసీపీ) లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు బ్యాంకులు కృషి చేయాలన్నారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో లీడ్ జిల్లా కార్యాలయం ఆధ్వర్యాన జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లాస్థాయి సమీక్ష కమిటీ (డీఎల్ఆర్సీ) సమావేశాలు జరిగాయి. సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి 2025–26 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఎల్డీఎం.. గత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో వివిధ బ్యాంకుల పాత్ర, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన కీలక సూచికల్లో ప్రగతి, ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంక్ లింకేజీ రుణాలు, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలు తదితరాలను పీపీటీ ద్వారా వివరించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి రూ. 13,500 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 17వేల కోట్లు రుణ లక్ష్యాలను ప్రతిపాదించినట్లు తెలిపారు. మొత్తం ప్రాధాన్యరంగానికి రూ. 33 వేల కోట్లు, ప్రాధాన్యేతర రంగానికి రూ. 50,500 కోట్ల మేర లక్ష్యాలను రుణ ప్రణాళికలో పొందుపరిచినట్లు వివరించారు. ఇతర ప్రాధాన్య రంగానికి రూ. 2,495 కోట్ల రుణాలను ప్రతిపాదించినట్లు తెలిపారు. బ్యాంకుల భాగస్వామ్యం ముఖ్యం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వికసిత్ భారత్ – 2047, స్వర్ణాంధ్ర : 2047 లక్ష్యాలు నెరవేరాలంటే బ్యాంకుల భాగస్వామ్యం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. సమావేశంలో డీసీసీ కన్వీనర్, యూబీఐ రీజనల్ హెడ్ ఎంవీ తిలక్, ఆర్బీఐ ఎల్డీవో సీహెచ్ నవీన్ కుమార్, నాబార్డు డీడీఎం మిలింద్ చౌసాల్కర్, ఎల్డీఎం కె.ప్రియాంక, ఆర్సేతి డైరెక్టర్ అమరేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. రుణ ప్రణాళిక ఆవిష్కరించిన జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ -
ఎన్టీటీపీఎస్లో మాక్డ్రిల్
ఇబ్రహీంపట్నం: యుద్ధ వాతావరణం, ఉగ్ర ముప్పు నుంచి ఉద్యోగులు ఎలా రక్షణ పొందాలనే అంశంపై ఎస్పీఎఫ్ సిబ్బంది ఎన్టీటీపీఎస్లో మంగళవారం మాక్డ్రిల్ నిర్వహించారు. ముఖ్యఅతిథి ఆర్డీఓ కావూరి చైతన్య మాట్లాడుతూ అనుకోని విపత్తలు ఎదురైనప్పుడు ఉద్యోగులు తమకు తాము రక్షించునే పద్ధతులు తెలియజేయడమే మాక్డ్రిల్ ఉద్దేశమన్నారు. అగ్నిప్రమాదం, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తీసుకోవల్సిన రక్షణ చర్యలు, ఎదుటివారు సమస్యల్లో చిక్కుకుంటే ఎలా స్పందించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ఉపద్రవాల సమయంలో స్పందించాల్సిన తీరుపై అగ్నిమాపక శాఖ, పోలీస్, మెడికల్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మాక్డ్రిల్ ద్వారా చూపించారు. ఏసీపీ ఎస్వీడీ ప్రసాద్, ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ రాజు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీఈ శివరామాంజనేయులు, పోలీస్, ఫైర్, మెడికల్, తదితర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సుమధురంగా అన్నమయ్య సంకీర్తనం
విజయవాడకల్చరల్: శ్రీ అన్నమయ్య సంకీర్తనా అకాడమీ( శ్వాస), కంచికామకోటి పీఠస్థ శారదా చంద్రమౌళీశ్వర, వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య జయంతి సందర్భంగా లబ్బీపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నమయ్య జయంతి జాతీయ స్థాయి సంగీత కార్యక్రమాలు మధురంగా సాగుతున్నాయి. మంగళవారం నాటి కార్యక్రమంలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు సంగీత విద్యాలయం విద్యార్థినులు, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల విద్యార్థినులు, బంకుమల్లి విద్యాసాగర్, ధూళిపాళ వాసవి అన్నమయ్య రచించిన చక్కని తల్లికి చాంగ్భళా, పలుకుతేనియ తల్లిని, అదివో అల్లదివో శ్రీహరి వాసము, తందనానా ఆహి తందనానాతో పాటు అనేక సంకీర్తనలను అత్యంత మధురంగా ఆలపించారు. చివరిగా మల్లాది సోదరులు అన్నమయ్య పదానికి పట్టం కడుతూ సంకీర్తనలను గానం చేశారు. శ్వాస నిర్వాహకులు సత్యబాబు, ప్రసాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కిడ్నీ రోగి మృతి తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని సుందరయ్య కాలనీకి చెందిన కిడ్నీరోగి మంగళగిరి దుర్గారావు (58) చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు. టైలరింగ్ వృత్తి చేసి జీవించే దుర్గారావు మధుమేహం బారిన పడడంతో రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. 2022 నవంబర్ నుంచి దుర్గారావు డయాలసిస్ చికిత్స చేయించుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించడంతో తిరువూరు డయాలసిస్ కేంద్రానికి చికిత్స నిమిత్తం వెళ్లగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి దుర్గారావు మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఒక కుమార్తెకు, కుమారుడికి వివాహం చేశారు. మరో కుమారుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సుందరయ్య కాలనీలో గతంలో అల్లూరి నాగమణి కూడా కిడ్నీ వ్యాధి బారిన పడి మృతిచెందారు. పలు కేసుల్లో నిందితునిపై పీడీ యాక్టు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గంజాయి విక్రయాలతో యువత ఆరోగ్యానికి భంగం కలిగించడంతో పాటు దొంగతనాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న అక్బర్ బాషాపై ప్రభుత్వం పీడీ యాక్ట్ ప్రయోగించింది. విద్యాధరపురానికి చెందిన అక్బర్ బాషాపై ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో 35 కేసులు ఉన్నాయి. వీటిలో 5 గంజాయి కేసులు, 30 దొంగతనం, దోపీడీ కేసులు నమోదయ్యాయి. భవానీపురం స్టేషన్లోనే 4 గంజాయి కేసులు, 5 దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో బెయిల్పై విడుదల అయి వచ్చి తిరిగి గంజాయి విక్రయాలు, దొంగతనాలు కొనసాగిస్తున్నాడు. అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుండడంతో ప్రభుత్వం అక్బర్బాషాపై పీడీ యాక్ట్ ప్రయోగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అక్బర్ బాషాను రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్కు తరలించినట్లు సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. -
ఆర్టీసీ డ్రైవర్పై దాడికి పాల్పడిన నిందితుల అరెస్ట్
కోనేరుసెంటర్/బంటుమిల్లి: బంటుమిల్లిలో ఆర్టీసీ డ్రైవర్పై దాడికి పాల్పడిన నిందితులను బంటుమిల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం బందరు డీఎస్పీ సీహెచ్ రాజ మచిలీపట్నంలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్న ఎం.నాగరాజు గత వారం విధి నిర్వహణలో భాగంగా గుడివాడ డిపో నుంచి బస్సు తీసుకుని సరిగ్గా బంటుమిల్లి సెంటర్కు రాగానే ఎదురుగా బైక్లు అడ్డు రావటంతో హారన్ కొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన సోమిశెట్టి వెంకటనారాయణ, రాఘవరపు సతీష్, దాసు శ్రీనివాసు మద్యం మత్తులో డ్రైవర్ నాగరాజుపై దాడికి పాల్పడ్డారు. వీరి దాడిని సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న మహిళా కండక్టర్పై కూడా దురుసుగా వ్యవహరించారు. బాధితుడు నాగ రాజు అదే రోజు బంటుమిల్లి పోలీస్స్టేషన్లో జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ముగ్గురిపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టుకు హాజరుపరచగా 15 రోజులు రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపారు. విధినిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడిన ముగ్గురిపై నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు. రూరల్ సీఐ, బంటుమిల్లి ఎస్ఐ పాల్గొన్నారు. -
ఉత్కంఠభరితంగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
రెండు పళ్ల విభాగం విజేతలకు బహుమతుల అందజేత నందిగామరూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో ఉన్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోటీలలో భాగంగా మంగళవారం రాత్రి నిర్వహించిన నాలుగు పళ్ల విభాగంలో ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీలను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల వెంకటలక్ష్మీ సాయిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పశు ప్రదర్శన కమిటీ సభ్యులు మాట్లాడుతూ నాలుగు పళ్ల విభాగంలో ఏడు జతలు పోటీ పడ్డాయని, 15 నిమిషాల వ్యవధిలో 8.50 క్వింటాళ్ల బండను లాగినట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జత యజమానులకు అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ గరికపాటి భాస్కరం సోదరులు వస్త్రాలు, జ్ఞాపికలను అందజేశారు. నగదు బహుమతుల అందజేత గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన రెండు పళ్ల ఎడ్ల ప్రదర్శన పోటీలలో విజేతలైన ఎడ్ల జత యజమానులకు కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం బయ్యారం గ్రామానికి చెందిన కేఎంకే బుల్స్ కడియం మణికంఠ ఎడ్ల జత మూడు వేల అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలవగా, సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామానికి చెందిన కేఆర్ఆర్ బుల్స్ కొప్పుల గోవర్దన్రెడ్డి ఎడ్ల జత 2,695.09 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడికి చెందిన జమ్మనబోయిన సుబ్రహ్మణ్యం ఎడ్ల జత 2,061 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచాయన్నారు. చందర్లపాడు మండలం బ్రహ్మబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన పాలెం వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రాగిపాడుకు చెందిన యద్దనపల్లి మనోజ్ చౌదరి ఎడ్ల జత 2,045 అడుగుల దూరం లాగి నాలుగవ స్థానం, బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం అడవిపాలెం గ్రామానికి చెందిన పోకల శ్రీనివాసరావు నాయుడు, పద్మావతి నాయుడు ఎడ్ల జత 1,750 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం, నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బట్ట కార్తికేయ యాదవ్ ఎడ్ల జత 1,554 అడుగుల దూరం లాగి ఆరవ స్థానంలో నిలిచాయని తెలిపారు. విజేతలకు వరుసగా రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.18 వేలు, రూ.15 వేలు, రూ.12 వేలు, రూ.10 వేలు నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, రాంబాబు, విక్రమ్, రాంబాబు, వెంకట్రావ్, శివాజీ పాల్గొన్నారు. -
సస్పెండైన ఏపీటీడీసీ ఉద్యోగిపై విచారణ షురూ!
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)లో సస్పెండైన ఉద్యోగికి సంబంధించి విచారణ ఎట్టకేలకు మొదలైంది. విజయవాడ డివిజనల్ ఆఫీస్లో చోటు చేసుకున్న ఉద్యోగి రాసలీలల ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పటికి పది రోజులు ముందుగానే ఘటనకు సంబంధించిన వీడియోలు ఏపీటీడీసీ ఉన్నతాధికారులకు చేరినట్లు ప్రచారం జరిగింది. దాంతో నాలుక్కరుచుకున్న ఉన్నతాధికారులు ఈ నెల 4న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం వాటర్ ఫ్లీట్ జీఎం, ఓ అండ్ ఎం జీఎంలను విచారణ అధికారులుగా నియమించారు. ఈ నెల 12న డివిజనల్ ఆఫీస్లో ఇద్దరు అధికారులు విచారణ ప్రారంభించారు. సీసీ ఫుటేజి వీడియోల్లో రాసలీలలకు పాల్పడిన వ్యక్తి స్పష్టంగా కనబడుతుంటే ఇంక విచారణ ఎందుకు అన్నది ప్రశ్నార్థకం. విచారణ పేరుతో అమాయకులను బలి చేయడానికి చూస్తున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది.ఫుటేజి దొంగిలించిన వ్యక్తి తొలగింపుసీసీ కెమెరాల ఫుటేజిని దొంగిలించిన వ్యక్తిని లెమన్ ట్రీ హోటల్ యాజమాన్యం తొలగించినట్లు విశ్వసనీయ సమాచారం. అతను లెమన్ ట్రీ హోటల్ కాంప్లెక్స్లోగల మెక్లైన్ కంపెనీ (హౌస్ కీపింగ్)లో ఎలక్ట్రీషియన్గా పని చేస్తూ మధ్యాహ్నం నుంచి భవానీ ఐలాండ్లో ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అతను దొంగిలించిన సీసీ ఫుటేజిని భవానీ ద్వీపంలో కీలక పదవిలో ఉన్న ఏపీటీడీసీ అధికారికి అందజేసినట్లు సమాచారం. మొత్తానికి ఈ కేసులో అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయా, ఉద్యోగి సస్పెన్షన్తో సరిపెడతారా అన్నది వేచి చూడాల్సిందే. -
ట్రాఫిక్తో టెన్షన్.. టెన్షన్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకవైపు మండే ఎండలు, మరోవైపు గజిబిజి ట్రాఫిక్తో రోడ్డుపై ప్రయాణించాలంటేనే జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొంతమంది యువకులు అడ్డదిడ్డంగా నడిపే వాహనాలతో ట్రాఫిక్లో పద్ధతిగా వెళ్లేవారికి వాహనాలు నడపాలంటేనే చిరాకు, టెన్షన్ వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో నిత్యం ట్రాఫిక్లో ప్రయాణించే వారు అనేక శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పిల్లల్ని పరీక్షలకు తీసుకెళ్లడం, ఉద్యోగ విధులకు వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ కావడంతో సమయానికి వెళ్లలేమని టెన్షన్ పడుతుంటారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలు... ● పెనమలూరుకు చెందిన రాజేష్ వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నారు. ఉదయం 9 గంటలకు డ్యూటీకి వెళ్లేటప్పుడు నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అసలే ఆఫీసులో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ అమలులో ఉంది. పది నిమిషాలు ఆలస్యమైతే, మూడు రోజులకు ఒక సీఎల్ కట్ చేస్తుండటంతో తీవ్రమైన టెన్షన్ నెలకొంటుంది. ట్రాఫిక్లో ప్రయాణిస్తూ తీవ్రమైన మానసిక వత్తిడికి గురవుతున్నారు. ● గాంధీనగర్కు చెందిన ఉద్యోగి గన్నవరంలో పనిచేస్తుంటారు. ప్రతిరోజూ తమ కుమార్తెను బెంజిసర్కిల్ వద్ద కళాశాలలో దించి కార్యాలయానికి వెళ్తుంటారు. ఇలా ప్రతిరోజూ కళాశాలకు, కార్యాలయానికి సమయానికి వెళ్లలేమనే టెన్షన్కు గురవుతూ, నలభై ఏళ్ల వయస్సులోనే హైపర్టెన్షన్ బారిన పడ్డారు. ఇలా వీరిద్దరే కాదు. నగరంలోని ట్రాఫిక్తో అనేకమంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఏమి చేయాలి... ● మనం వెళ్లే ప్రాంతం దగ్గరలో ఉన్న సమయానికి కంటే కొద్దిగా ముందుగా బయలు దేరాలి. అప్పుడు ట్రాఫిక్ ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ● వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించి, పబ్లిక్ వాహనాల్లో ప్రయాణిస్తే ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ● నిత్యం ప్రయాణించే వారు యోగా, మెడిటేషన్ చేయాలి. ● కాలుష్యం బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టాలి. వైద్యులు గుర్తించిన సమస్యలివే... ట్రాఫిక్లో ప్రయాణించే వారు యాంగ్జయిటీకి గురవుతున్నారు. యాంగ్జయిటీకి గురయ్యే వారు కార్యాలయానికి వెళ్లిన గంట వరకూ పనిపై దృష్టి పెట్టలేక పోతున్నారు. నిత్యం ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసే వారికి కాలుష్యం కారణంగా రక్తం చిక్కపడి గుండెపోటు, మెదడుపోటు వచ్చే అవకాశం ఉంది. నిత్యం ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసే వారు చిన్న వయస్సులోనే హైపర్టెన్షన్ బారిన పడే అవకాశం ఉంది. ట్రాఫిక్లో ప్రయాణంతో నిద్ర సమస్యలు తలెత్తుతున్నాయి. ఎక్కువ సేపు డ్రైవింగ్ చేసే వారిలో స్పైన్ సమస్యలు వస్తున్నాయి. ట్రాఫిక్ చిక్కులతో కోపం, ఆవేశం, చిరాకు పెరుగుతుంది. ట్రాఫిక్లో డ్రైవింగ్తో సమస్యలు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో ప్రయాణించడం వలన కాలుష్య ప్రభావానికి గురవుతుంటారు. ఫలితంగా రక్తం చిక్కపడి బ్రెయిన్స్ట్రోక్, గుండెపోటు వంటి వాటికి గురయ్యే ప్రమాదం ఉంది. అంతే కాకుండా చికాకు, పనిపై దృష్టిపెట్టలేక పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. బీపీ, వెన్నెముక సమస్యలకు సైతం దారితీయొచ్చు. –డాక్టర్ టీవీ మురళీకృష్ణ ,జనరల్ మెడిసిన్ స్పెషలిస్టు రద్దీ రోడ్లపై ప్రయాణంతో మానసిక, శారీరక సమస్యలు రక్తపోటు అధికం అవుతుందంటున్న వైద్యులు యాంగ్జయిటీ, నిద్ర సమస్యలు ఎక్కువే కాలుష్యంతో రక్తం చిక్కపడి స్ట్రోక్కు దారితీయొచ్చు విపరీతంగా పెరిగిపోయిన వ్యక్తిగత వాహనాలు యాంగ్జయిటీకి గురవుతారు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం ద్వారా కొందరు యాంగ్జయిటీకి గురవుతారు. దీనివలన చికాకుతో రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. హైపర్టెన్షన్ బారిన పడతారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టును వినియోగించడం మేలు. –డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్ట్ -
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి
–జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుహాసిని లబ్బీపేట(విజయవాడతూర్పు): రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రతరమై ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటిద్దాం, వడదెబ్బ వలన సంభవించే మరణాలను అరికడదామని ఆమె పిలుపునిచ్చారు. ఎండ తీవ్రత వలన శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగి (104.9 డి.ఎఫ్) మెదడు మీద ప్రభావం చూపుతుందని, దీని వలన మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం (హైపో థలామస్) దెబ్బతిని వడదెబ్బకు గురి అవుతారని చెప్పారు. దీనినే ‘హీట్ స్ట్రోక్‘లేదా ’సన్ స్ట్రోక్ ‘అంటారని, ఇది ప్రమాదకరం, ప్రాణాంతకమని హెచ్చరించారు. వాతావరణపు వేడిమికి శరీరం ఎక్కువసేపు గురికావడం వలన చెమట పట్టి శరీరంలోని లవణాలు (సోడియం క్లోరైడ్) తగ్గిపోవడం, శరీరంలో నీటి నిష్పత్తి తగ్గిపోవడం సంభవిస్తుందని, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలలో ఎక్కువ శ్రమతో కూడిన పని చేస్తున్నప్పుడు ప్రతి గంటకు మూడు లేక నాలుగు లీటర్ల నీటిని చెమట రూపంలో మన శరీరం కోల్పోయి వడదెబ్బకు ఎక్కువగా గురవుతారని డాక్టర్ సుహాసిని తెలిపారు. వయస్సు 65 ఏళ్లు దాటిన వారు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో భాదపడే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. -
దుర్గమ్మ సన్నిధిలో మొరాయిస్తున్న స్టేర్ లిఫ్ట్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సుమారు రూ.8 లక్షల వ్యయంతో ఏర్పాటు స్టేర్ లిఫ్ట్ తరచూ మొరాయిస్తుండడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో చిన్న గాలి గోపురం సమీపంలోని మెట్లపై గత ఏడాది దసరా ఉత్సవాల సమయంలో స్టేర్ లిఫ్ట్ను ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే వృద్ధులు, వికలాంగులు స్టేర్ లిఫ్ట్ను సద్వినియోగం చేసుకుని స్కానింగ్ పాయింట్ వరకు చేరుకుంటున్నారు. అయితే ఈ లిఫ్ట్ తరచుగా మొరాయిస్తోంది. ప్రారంభించిన 7 నెలల కాలంలో ఎక్కువ సార్లు మరమ్మతులకు గురికావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ స్టేర్లిఫ్ట్ పని చేయకపోవడంతో ఘాట్రోడ్డు మీదగా వచ్చే పెద్ద వారు, వృద్ధులు, వికలాంగుల ఇక్కట్లు వర్ణనాతీతం. ఘాట్రోడ్డు వైపు నుంచి వచ్చే వృద్ధులు, వికలాంగులు వీల్చైర్పై నేరుగా ఆలయ ప్రాంగణానికి చేరుకునే అవకాశం లేదు. గాలి గోపురం వద్దకు చేరుకున్న తర్వాత స్టేర్ లిఫ్ట్ ద్వారా కిందకు దిగి అక్కడి నుంచి ఆలయంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. స్టేర్ లిఫ్ట్ను ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే అంటే గత ఏడాది నవంబర్ 8వ తేదీన మొదటిసారిగా నిలిచిపోవడంతో టెక్నికల్ సిబ్బంది మరమ్మతులు చేశారు. అప్పటి నుంచి ప్రతి 15 రోజులకు ఓ సారి ఈ స్టేర్ లిఫ్ట్ పని చేయకపోవడం పరిపాటిగా మారింది. లక్షలాది రూపాయల దేవస్థానం సొమ్ము వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ స్టేర్ లిఫ్ట్ ఇలా తరచూ మరమ్మతులకు గురికావడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజులుగా స్టేర్ లిఫ్ట్ పని చేయకపోవడంతో ఆలయ ఇంజినీరింగ్ సిబ్బంది టెక్నీషియన్ను పిలిపించారు. ఆరు బయట వర్షం నీరు పడటంతో మోటరు పాడైపోయిందని చెప్పారు. అయితే స్టేర్ లిఫ్ట్కు ఏడాది పాటు వారంటీ ఉండటంతో కంపెనీనే పూర్తి బాధ్యత వహిస్తుందని చెబుతున్నా, ఆ తర్వాత పరిస్థితి ఏంటనేది భక్తుల ప్రశ్న. అయితే ఈ స్టేర్ లిఫ్ట్ ఏర్పాటు చేసే సమయంలోనే మెట్లపై వర్షం నీరు పడకుండా షెడ్డు ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇకనైనా స్టేర్ లిఫ్ట్ పూర్తి కాలం పని చేసేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు పేర్కొంటున్నారు. వృద్ధులు, వికలాంగులకు తప్పని ఇక్కట్లు -
మద్యం అమ్మకాల ఆదాయం భారీగా పెంచండి!
విజయవాడ: ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోవడంతో దాన్ని సరిచేసుకునే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు. దీనికి చంద్రబాబు దగ్గర ఉన్న ప్రధానం ఆయుధం మద్యం. ఇప్పుడు దానిపైనే మరోసారి పడ్డారు చంద్రబాబు. మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం భారీగా పెంచాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయం స్పష్టం చేశారు చంద్రబాబు.మద్యం ద్వారా అమ్మకాల ద్వారా రూ. 33, 882 కోట్లు ఆదాయం తేవాలని టార్గెట్ నిర్దేశించారు. అదే సమయంలో ఎర్రచందనం అమ్మకంతో కూడా ఆదాయం పెంచాలన్నారు సీఎం చంద్రబాబు. దీనిపై కూడా భారీగా ప్రభుత్వ ఆదాయం పెంచాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఎర్రచందనాన్ని అంతర్జాతీయంగా అమ్మాలని ఆదేశించారు. దీనికి సంబంధించి అధికారలతో కమిటీ వేయాలన్నారు.29 శాతం పెంచాలంటూ..!చంద్రబాబు పాలనలో భారీగా తగ్గిపోవడంతో కేంద్ర నుండి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం తగ్గినట్లు అధికారులు అంగీకరించారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుండి మే 11 వరకూ రూ. 5,500 కోట్ల మైనస్ ఆదాయం ఉందని అధికారులు తెలిపారు. దాంతో ఆదాయాన్ని 29 శాతం ఆదాయం పెంచాలంటూ అధికారులకు టార్గెట్ పెట్టారు చంద్రబాబు. అయితే 29 శాతం ఆదాయం ఎలా పెంచాలని అధికారులకు తలలు పట్టుకుంటున్నారు. -
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్
విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. సత్యవర్థన్ కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు. రెండేళ్ల క్రితం గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడు సత్యవర్థన్ను కిడ్నాప్, దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయనపై బీఎన్ఎస్ క్లాజ్ 140 (1), 308, 351 (3) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా గత ఫిబ్రవరిలో వంశీని అరెస్ట్ చేశారు. తాజాగా వంశీకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. రూ. 50 వేలతో పాటు రెండు షురీటిలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. వంశీతో పాటు మరో నలుగురకి బెయిల్ వచ్చింది. సత్యవర్డన్ కిడ్నాప్ కేసులో జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ.. ఈ రోజు(మంగళవారం) కోర్టుకు హాజరయ్యారు. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిసన్ పై విచారణ చేపట్టిన ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు.. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. -
బాబూ.. ఉచిత బస్సు ప్రయాణం ఇంకెప్పుడు?
బస్టాండ్ (విజయవాడ పశ్చిమ): మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయకపోవడం శోచనీయమని ఏపీ మహిళా సమాఖ్య సభ్యులు విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీలు గుప్పించి.. గెలిచాక విస్మరించారని మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ సోమవారం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లోని సిటీ బస్సుల ప్రాంగణం వద్ద నిరసన తెలిపారు. సిటీ బస్సు ఎక్కి నినాదాలు చేశారు.సమాఖ్య విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి పంచదారుల దుర్గమ్మ మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలపై టీడీపీ అధినేతగా చంద్రబాబు ప్రగల్భాలు పలికారని గుర్తుచేశారు. మహిళల ఓట్లతో అధికారం చేపట్టి.. ఏడాదైనా ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పటికే అమలు చేస్తున్నా, కూటమి ప్రభుత్వం మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. నిత్యావసర వస్తువులు, కరెంట్ చార్జీలు, గ్యాస్ ధరలు మండుతున్న నేపథ్యంలో ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు కాస్త ఊరటగా ఉంటుందన్నారు. హామీ అమలు చేయకుంటే పెద్దఎత్తున పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. -
కలెక్టరేట్లో ఇగ్నైట్ సెల్ ప్రారంభం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వర్ణాంధ్ర ః 2047 లక్ష్యాలను దశల వారీగా చేరుకునేందుకు జిల్లాస్థాయిలో ఇగ్నైట్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఇగ్నైట్ సెల్ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ ప్రత్యేక సెల్ ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవలపై అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త సాకారం దిశగా ఔత్సాహికులను సరికొత్త ఆలోచనలతో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ సెల్ అవసరమైన సహాయసహకారాలు అందిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి, వాటికోసం దరఖాస్తు చేసుకోవడంలోనూ తోడ్పడుతుందన్నారు. ఇందు కోసం ప్రత్యేక కౌన్సెలింగ్ సిబ్బంది ఉంటారన్నారు. రోజుకో డిపార్టుమెంట్ ఇగ్నైట్ స్టాల్ను ఏర్పాటుచేస్తుందని, ఆ శాఖ కార్యకలాపాలతో పాటు ఆ శాఖ పరిధిలోని పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తుందని వివరించారు. ప్రజల నుంచి వచ్చే కొత్త ఆలోచనలను సరైన విధంగా నమోదుచేసే డాక్యుమెంటేషన్ సెంటర్గా కూడా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. తొలిరోజు వ్యవసాయ శాఖ, ప్రకృతి వ్యవసాయం, రైతు సాధికార సంస్థ స్టాళ్లను ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, డీపీఓ పి.లావణ్య కుమారి, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
బైక్ దొంగల అరెస్ట్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని భవానీపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 20లక్షల నగదు, 11 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇటీవల భవానీపురం పోలీసు స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సంఘటనా స్థలంలోని ఆధారాలను సేకరించి దర్యాప్తు చేశారు. వెస్ట్ ఏసీపీ దుర్గారావు పర్యవేక్షణలో సీఐ ఉమామహేశ్వరరావు సిబ్బంది బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని అనుమానితులు, పాత నేరస్తులపై నిఘా ఉంచారు. హెచ్బీ కాలనీకి చెందిన గడ్డం శరణ్సాయి, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం డోలాస్ నగర్కు చెందిన బొక్కా కార్తీక్లను అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా గొల్లపూడిలోని అట్కిన్సన్ స్కూల్ సమీపంలో తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోంకు పంపారు. రూ. 20 లక్షల నగదు, 11 బైక్లు స్వాధీనం -
విధి నిర్వహణలో అలసత్వం వద్దు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తిరువూరు: విధినిర్వహణలో అధికారులు నిర్లక్ష్య ధోరణి అనుసరించవద్దని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. తిరువూరు ఆర్యవైశ్య కల్యాణ మండ పంలో జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరువూరు డివిజన్ నుంచే ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్లో అత్యధికసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని, ఆ అర్జీల పరిష్కారంలో సంతృప్తిస్థాయిని పెంచాల్సిన బాధ్యత అధికారులదేనని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. నాణ్యతతో సమస్య పరిష్కరించినపుడే కార్యక్రమానికి సార్థకత వస్తుందన్నారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం చూపే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్జీలు గడువులోపు పరిష్కరించడం ఎంతో ముఖ్య మన్నారు. బాధితులను అధికారులు తమ కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రపర్యటన చేయాలని సూచించారు. మండలస్థాయిలో తహసీల్దారు, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్హౌస్ ఆఫీసర్ తదితర అధికారులు అర్జీల పరిష్కారంలో ప్రత్యక్ష భాగస్వాములు కావాలన్నారు. కిందస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను మాత్రమే పైస్థాయికి పంపవచ్చన్నారు. 283 అర్జీల స్వీకరణ తిరువూరులో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 283 అర్జీలు వచ్చాయి. వీటిలో తిరువూరు మండలానికి చెందినవి అత్యధికంగా 146 అర్జీలు ఉన్నాయి. రెడ్డిగూడెం నుంచి ఏడు, ఎ.కొండూరు నుంచి 38, విస్సన్నపేట నుంచి 47, గంపలగూడెం నుంచి 45 అర్జీలు వచ్చినట్లు ఆర్డీఓ మాధురి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఆర్ డీఏ పీడీ ఎ.ఎన్.వి.నాంచారరావు, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేకాధికారి జ్యోతి, ఏసీపీ వెంకటేశ్వరరావు, తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కలెక్టరేట్లో 100 అర్జీల స్వీకరణ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి అందిన 100 అర్జీల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 37 అర్జీలు ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసు శాఖకు సంబంధించి 16, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఏడు, పురపాలక, సర్వే శాఖలకు సంబంధించి ఆరు చొప్పున అర్జీలు వచ్చాయని వివరించారు. మిగిలిన అర్జీలు గృహ నిర్మాణం, పౌర సరఫరాలు, ఫైబర్ నెట్, వైద్య ఆరోగ్యం, నైపుణ్యాభి వృద్ధి, మహిళా శిశు సంక్షేమం, వయోజన విద్య, విద్యుత్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, డీఆర్డీఏ, విద్య, ఉపాధి, ఎండోమెంట్స్, మత్స్య, ఇరిగేషన్, లీడ్ బ్యాంక్ మేనేజర్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, రహదారులు–భవనాలు, రిజిస్ట్రేషన్స్–స్టాంప్స్, గ్రామీణ నీటి సరఫరా, సైనిక సంక్షేమం విభాగాలకు సంబంధించిన అర్జీలని పేర్కొన్నారు. -
రైల్వేస్టేషన్లో ఆకస్మిక తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్లో అధిక ధరలు, అనధికారిక విక్రయాలపై కమర్షియల్ అధికారులు ఆదివారం అర్ధరాత్రి స్టేషన్లోని క్యాటరింగ్ స్టాల్స్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు పర్యవేక్షణలో కమర్షియల్ అధికారులు, సిబ్బందితో స్టేషన్లోని పది ప్లాట్ఫాంలలో క్యాటరింగ్ స్టాల్స్ అనుమతులు, విక్రయాలు సాగిస్తున్న వెండర్స్ ఐడీ కార్డులు, పర్మిట్లను తనిఖీల చేశారు. అధిక ధరలకు విక్రయాలు చేస్తున్న స్టాల్స్ నిర్వాహకులు, గుర్తింపు లేని, గడువు ముగిసిన ఐడీ కార్డులు, పర్మిట్ కార్డులు లేకుండా అనధికారిక విక్రయాలు సాగిస్తున్న 17 మందిని అదుపులోకి తీసుకుని రూ. 85 వేలు జరిమానా వసూలు చేశారు. ప్రయాణికుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం రైలు ప్రయాణికుల ఆరోగ్య భద్రతకు విజయవాడ డివిజన్ అధిక ప్రాధాన్యమిస్తోందని, వారికి పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం విక్రయించేలా స్టాల్స్, వెండర్స్పై ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు సీనియర్ డీసీఎం రాంబాబు పేర్కొన్నారు. స్టేషన్లో అనధికార హాకర్లు, విక్రేతలను నివారించడానికి క్రమంతప్పకుండా తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేయకూడదని, సరైన పర్మిట్లు ఉన్న వెండర్స్ మాత్రమే విక్రయించాలని, స్టాల్స్ నిర్వాహకులు వారికి కేటాయించిన ప్రదేశాల్లోనే విక్రయించుకోవాలని ఆయన సూచించారు. అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద రీతిలో ఇన్నర్ రింగ్ రోడ్డులోని పొలాల్లో శవమై కనిపించాడు. ఘటనపై మృతుని అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుణదలకు చెందిన వీరబత్తిన వెంకటరావు(45) వెల్డర్. అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంకటరావు సాయంత్రమైనా తిరిగి రాలేదు. సోమవారం ఉదయం వైవీరావు ఎస్టేట్ నుంచి పైపుల రోడ్డు మధ్య ఉన్న ఇన్నర్రింగ్ రోడ్డులోని ఖాళీ స్థలాల్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు వెంకటరావుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అక్క నక్షత్ర ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాక్టర్పై నుంచి జారిపడి డ్రైవర్ మృతి గూడూరు: మట్టి ట్రాక్టర్పై నుంచి జారిపడిన డ్రైవర్ మరణించిన ఘటన సోమవారం మండల పరిధిలోని మల్లవోలులో చోటు చేసుకుంది. మల్లవోలు శివారు ముదిరాజుపాలెం గరువుకు చెందిన పూల నరసింహ(25) ట్రాక్టర్ డ్రైవర్. వారం రోజులుగా రాయవరం పొలిమేర నుంచి చటారిపాలెంకు ట్రాక్టర్లతో మట్టి తోలకానికి వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం చటారిపాలెం మట్టి డంప్ చేసి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తూ ట్రాక్టర్పై నుంచి జారి పడిపోయాడు. అతని నడుంపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు. నరసింహను తొక్కుకుంటూ వెళ్లిన ట్రాక్టరు చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. వెనుక వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు నరసింహ అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూలీ పనులు చేసుకుని జీవించే పూల శ్రీనుకు ఇద్దరు కుమారులు వారిలో నరసింహ పెద్దవాడు. తన కుమారుడికి పెళ్లి కూడా కాలేదంటూ.. అతను దుర్మరణం చెందడంపై శ్రీను కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ‘క్యాటరింగ్ స్టాల్స్’ అనధికార విక్రేతలకు రూ. 85 వేలు జరిమానా -
దుర్గమ్మ ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వైశాఖ పౌర్ణమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున మూడు గంటలకు నిర్వహించిన సుప్రభాత సేవకు 15 మంది ఉభయదాతలు హాజరయ్యారు. అనంతరం అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చన 32 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవ మూర్తి వద్ద నిర్వహించిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చనలో ఉభయదాతలు విశేషంగా పాల్గొనగా, రికార్డు స్థాయిలో చండీహోమానికి 139కు టికెట్లను విక్రయించారు. రెండు 250 మందికి పైగా భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు, ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయప్రాంగణంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. మధ్యాహ్నం అమ్మవారికి మహానివేదన సమర్పించేందుకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. -
ఉపాధ్యాయుల నిరసన
సర్దుబాటు ప్రక్రియపైగాంధీనగర్(విజయవాడసెంట్రల్): పాఠశాల విద్యాశాఖ చేపడుతున్న పాఠశాల పునఃవ్యవస్థీకరణ ప్రక్రియతోపాటు స్పష్టమైన జీఓలు లేకుండా రోజుకో ఆలోచనతో జరుగుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటుపై యూటీఎఫ్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 117 జీఓను రద్దు చేసిన నూతన జీఓ జారీ చేసిన తర్వాత మాత్రమే పాఠశాలను పునఃవ్యవస్థీకరించాలని డిమాండ్ చేశారు. విజయవాడ అలంకార్ సెంటర్ లోని ధర్నా చౌక్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఆలవాల సుందరయ్య మాట్లాడుతూ.. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో 1ః20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలని, అన్ని మోడల్ ప్రైమరీ స్కూల్స్లో ఐదు తరగతులు బోధించడానికి ఐదుగురు టీచర్లను నియమించాలని, విద్యార్థుల సంఖ్య 76కు మించితే పీఎస్, హెచ్ఎం పోస్టులు అద నంగా కేటాయించాలని, 120 మించితే ఆరో ఎస్జీటీ, ఆ పైన ప్రతి 30 మందికి ఒక ఎస్జీటీ చొప్పున కేటాయించాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లోనే బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. నిరసన కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల కళ్లెదుటే కానరాని లోకాలకు..
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): తల్లిదండ్రుల కళ్లెదుట కుమార్తె కానరాని లోకాలకు వెళ్లిపోయింది. కొండపల్లి శ్రామికనగర్కు చెందిన తిరుమలకొండ వీరబాబు, సుచరిత దంపతుల కుమార్తె మహాలక్ష్మి(5) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తిరువూరు సమీపంలోని వల్లంపట్ల గ్రామంలో ఆదివారం రాత్రి శుభకార్యానికి కారులో వెళ్లారు. సోమవారం ఉదయం తిరుగు ప్రయాణంలో ఎ.కొండూరు వద్ద కారును ట్రక్ ఆటో ఢీకొట్టింది. కారులో కూర్చున్న మహాలక్ష్మి (5) మృత్యువాత పడింది. మిగిలిన వారికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని తిరువూరు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె కళ్లెదుటే మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కొండపల్లి తీసుకువచ్చిన బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ వైద్యశాలకు పోలీసులు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల బాలిక మృతి -
సమయస్ఫూర్తే ఆపద్బాంధవుడు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎలాంటి విపత్తు సంభవించినా భయాందోళనలకు గురికాకుండా.. సమయస్ఫూర్తితో వ్యవహరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. సరైన నిర్ణయాలు తీసుకొని తమను తాము రక్షించుకుంటూ ఇతరులకు ఆపన్నహస్తం అందించడం ముఖ్యమన్నారు. విపత్తు స్పందన, అగ్ని మాపక సేవల శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో మాక్డ్రిల్ నిర్వహించారు. దీనిలో భాగంగా కలెక్టర్ చాంబర్కు ఎదురుగా అగ్ని ప్రమాదం సంభవించింది. మొదట నిచ్చెన ఆసరాగా భవనంపైకి విపత్తు స్పందన సిబ్బంది చేరుకొని ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిందకు తీసుకొచ్చారు. తక్షణ వైద్య సహాయం అందించడానికి 108 వాహనాల ద్వారా ఆస్పత్రికి తరలించడం, అగ్నిమాపక వాహనం ద్వారా నీటితో మంటలను ఆపడం వరకు మాక్డ్రిల్ చేశారు. ప్రమాదాల నివారణపై డెమో ఇంట్లో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వస్తే ఎలా నియంత్రించాలనే అంశాన్ని డెమో ద్వారా ప్రదర్శించారు. తడి బట్ట, ప్లాస్టిక్ బకెట్, పిండి వంటివాటితో మంటలను ఆర్పే పద్ధతులను వివరించారు. రోడ్డు ప్రమాదాల సమయంలో రెండు వాహనాలు ఢీకొని వాటి మధ్య చిక్కుకున్న వారిని ప్రత్యేక పరికరాలు ఉపయోగించి బయటకు తీసే విధానాన్ని ప్రదర్శించారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సీపీఆర్, స్ట్రెచర్ వినియోగం, అత్యవసర వైద్యం అందించడంపై అవగాహన కల్పించారు. ప్రతి అధికారికీ అవగాహన ముఖ్యం విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖ అధికారులకు ఎలాగూ అవగాహన ఉంటుందని.. ఇదే విధంగా వ్యవసాయం, ఉద్యాన, పరిశ్రమలు వంటి శాఖల అధికారులు కూడా సరైన అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో మాక్డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, జిల్లా అగ్నిమాపక అధికారి (డీఎఫ్వో) ఏవీ శంకరరావు, సహాయ డీఎఫ్వో కె.వినయ్, ఎస్ఎఫ్వో కె.నరేష్, కలెక్టరేట్ ఏవో ఎస్.శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. కొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ లక్ష్మీశ విపత్తుల నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించేందుకే మాక్డ్రిల్ -
వైభవంగా ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివారు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ సోమవారం అంగరంగ వైభవంగా సాగింది. ఇంద్రకీలాద్రి ఘాట్రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద పూలతో అలంకరించిన వాహనాన్ని అధిష్టించిన ఉత్సవమూర్తులకు ఈవో శీనానాయక్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ప్రచార రథంతో పాటు ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనం ముందుకు సాగింది. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ, భక్తజనుల కోలాటనృత్యాలు, డప్పుకళాకారులు విన్యాసాల మధ్య ఊరేగింపు ముందుకు సాగింది. ఘాట్రోడ్డు నుంచి ప్రారంభమైన ప్రదక్షిణ కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రాహ్మణవీధి మీదగా అమ్మవారి ఆలయానికి చేరింది. ఆది దంపతులకు పసుపు, కుంకుమ, పూజా సామగ్రి సమర్పించి తమ కుటుంబాలు చల్లగా ఉండాలని వేడుకున్నారు. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు స్వర్ణకవచాన్ని అలంకరించారు. స్వర్ణకవచంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రతి నెలా పౌర్ణమి రోజున అమ్మవారికి స్వర్ణకవచం అలంకరిస్తారు. -
పోలీస్ ప్రజావాణిలో 77 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: నగరంలోని పోలీస్ కమిషనరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (ప్రజావాణి)లో ప్రజల నుంచి 77 ఫిర్యాదులను స్వీకరించినట్లు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఎ.బి.టి.ఎస్.ఉదయరాణి తెలిపారు. ఆస్తి, నగదు వివాదాలపై 40, కుటుంబ కలహాలపై ఆరు, మహిళా సంబంధిత నేరాలపై ఐదు, దొంగతనాలపై మూడు, కొట్లాటలపై తొమ్మిది, చిన్నచిన్న ఘటనలపై 14 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఆమె చెప్పారు. బాధితులు ధైర్యంగా అధికారులు ముందుకొచ్చి సమస్యలు చెప్పవచ్చన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరిస్తామన్నారు. బాధితులతో మర్యాదగా మసలుకోవాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడిన అనంతరం సదరు ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ అధికారులను ఆదేశించినట్లు డీసీపీ తెలిపారు. -
మంత్రిని కలవకుండా సీహెచ్ఓలను అడ్డుకున్న పోలీసులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): తమ సమస్యల పరిష్కారం కోసం మంత్రిని కలుద్దామని వస్తే అడ్డగిస్తారా అంటూ పోలీసులపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (సీహెచ్ఓ) ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజులుగా సమస్యల పరిష్కారం కోరుతూ సీహెచ్ఓలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వస్తున్నట్లు సీహెచ్ఓలు తెలుసుకున్నారు. తమ సమస్యలను మంత్రికి వివరిద్దామని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని కళాక్షేత్రం ఆవరణలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. శాంతియుతంగా మంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు వస్తే పోలీసులు అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య రంగానికి సంబంధించి ఎవరూ పట్టించుకోని సందర్భంలో చివరికి మంత్రిని కలుద్దామని వస్తే కలవనివ్వక పోవడం దుర్మార్గమని వాపోయారు. -
ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ కార్యకర్త వేధింపులు.. మహిళ బలి
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ కార్యకర్త వేధింపులకు ఓ మహిళ బలైన ఘటన చందర్లపాడు మండలం విభరింతలపాడు గ్రామంలో జరిగింది. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న అబ్బూరి మాధురిని టీడీపీ కార్యకర్త, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మైలా రవితేజ నోటికొచ్చినట్లు తీవ్ర దుర్భాషలాడారు. అందరి ముందూ దూషించడంతో పాటు దౌర్జన్యం చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైన మాధురి.. రవితేజ చేసిన అవమానాన్ని భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో విడుదల చేసింది.తనపై తీవ్ర దుర్భాషలాడుతూ.. దౌర్జన్యం చేస్తున్నా కానీ ఎవరూ అడ్డుకోలేదని మాధురి ఆవేదన వ్యక్తం చేసింది. తన చావుకు ఫీల్డ్ అసిస్టెంట్ రవితేజ కారణమంటూ మాధురి వీడియోలో పేర్కొంది. తనకు జరిగిన అన్యాయం మరొక మహిళకు జరగకూడదంటూ తన ఆవేదన వెల్లబుచ్చిన మాధురి.. తాను చచ్చిపోతున్నానని.. మరో మహిళకు ఇలాంటి అవమానం జరగకూడదంటూ పేర్కొంది. తనకు న్యాయం చేయాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలను సెల్ఫీ వీడియోలో మాధురి వేడుకుంది. -
ఎన్టీఆర్ జిల్లా: టీడీపీలో చిచ్చు రేపిన నామినేటెడ్ పోస్టుల భర్తీ
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జిల్లా టీడీపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చిచ్చు రాజేసింది. మాజీ మంత్రి , ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్కు అన్యాయంపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. ఆప్కాబ్ ఛైర్మన్ పదవిపై రఘురాం ఆశలు పెట్టుకోగా, ఆప్కాబ్ ఛైర్మన్ పదవి ఆయనకు ఇవ్వకపోవడంపై జగ్గయ్యపేట టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేటలోని ఓ ఫంక్షన్ హాలులో నెట్టెం రఘురాం అనుచరులు, టీడీపీ నేతలు సమావేశమయ్యారు.టీడీపీ ఆవిర్భావం నుంచి నెట్టెం రఘురాం పార్టీ కోసం పనిచేశారని.. కేడీసీసీ ఛైర్మన్ పదవి ఇచ్చి ఆయన స్థాయిని తగ్గించారని.. నేడు ఆప్కాబ్ ఛైర్మన్ పదవి ఇవ్వకుండా అవమానపరిచారంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. నలభై ఏళ్లుగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీని కాపాడుకుంటూ వచ్చారు. అలాంటి నెట్టెం రఘురాంకు పదవి ఇవ్వకుండా చేయడం బాధాకరమన్నారు.‘‘2024 ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో అన్ని స్థానాలు గెలవడం వెనుక నెట్టెం కృషి ఎంతో ఉంది. 1995లో టీడీపీ సంక్షోభ సమయంలో చంద్రబాబు వెంట నిలబడిన వ్యక్తి నెట్టెం రఘురాం. రెండు సార్లు పార్టీ గెలుపు కోసం తన సీటును త్యాగం చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి చంద్రబాబు ఇచ్చిన మాట మర్చిపోయారు. తక్షణమే రఘురాంకు ఆప్కాబ్ ఛైర్మన్ లేదా రాష్ట్రస్థాయి పదవి ఇవ్వాలి. పార్టీలో సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ మనుగడ కష్టం’’ అంటూ ఆ పార్టీ నేతలు తేల్చిచెప్పారు. -
మా బతుకులతో ‘ఆడుకోవద్దు’
భూమితో మాది విడదీయరాని అనుబంధం.. వ్యవసాయం తప్పితే మాకు వేరే వృత్తి తెలియదు.. తక్కువో ఎక్కువో ఉన్నదాంట్లోనే పంటలు పండించుకుంటున్నాం, గుట్టుగా బతుకుతున్నాం.. కన్నతల్లి లాంటి భూమిని మానుంచి లాక్కుని మా జీవితాలతో ఆటలాడొద్దు.. గతంలో భూ సమీకరణకు తీసుకున్న భూములకే ఇప్పటికీ దిక్కూమొక్కు లేదు.. ఇప్పుడు మా నుంచి తీసుకున్న భూమికి ఎప్పుడు న్యాయం చేస్తారు? కళ్లముందు ఉన్న భూమిని పోగొట్టుకుని.. ఎక్కడో ఇచ్చే భూమి మాకెందుకు? – స్పోర్ట్స్ సిటీ భూసమీకరణ గ్రామసభల్లో రైతులుసాక్షి ప్రతినిధి, విజయవాడ: రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా, మా భూములు ఎందుకివ్వాలని నిలదీస్తున్నా, తమ జీవితాలతో ఆడుకోవద్దని వేడుకుంటున్నా, స్పోర్ట్స్ సిటీ పేరుతో భూ సమీకరణ ద్వారా భారీఎత్తున భూములను తీసుకునేందుకే ప్రభుత్వం సిద్ధమవుతోంది. అన్నదాతలు ససేమిరా అంటున్నా.. మాయమాటలతో మభ్యపెట్టి ముందుకు అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగానే అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. వీటిలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా సరే సర్కారు తన ధోరణిని మార్చుకోవడం లేదు.ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు, త్రిలోచనాపురం, కాచవరం, కేతనకొండ, జమీమాచవరంలో స్పోర్ట్స్ సిటీకి అవసరమైన భూములను ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేశారు. వాస్తవానికి స్పోర్ట్స్ సిటీకి తొలుత కృష్ణా నది లంక గ్రామాలు, లంక భూములను ప్రభుత్వ పెద్దలు ఎంచుకున్నారు. నెల రోజుల క్రితం కృష్ణా పరీవాహక ప్రాంతమైన చినలంక, పెదలంక, ఇబ్రహీంపట్నం, జూపూడిలో లంక భూములను మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, పలువురు ఎమ్మెల్యేలు పరిశీలించారు. కానీ, ఈ భూములకు కృష్ణా వరద తాకిడి ఉంటుందనే కారణంతో తాజాగా మూలపాడు పరిధిలోని మెరక ప్రాంత భూములపై కన్నేశారు.అయితే, స్పోర్ట్స్ సిటీ, ఐకానిక్ బ్రిడ్జి పేరుతో విలువైన, జీవనాధారమైన భూములను తీసుకునేందుకు ప్రభుత్వం పన్నిన పన్నాగాన్ని రైతులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. స్పోర్ట్స్ సిటీ పేరుతో వ్యాపారం చేసేందుకే తమ భూములను తీసుకుంటున్నారనే అభిప్రాయం రైతుల్లో నెలకొంది. దీంతో పంట పొలాలను ఇవ్వబోమని విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య ఎదుట తెగేసి చెప్పారు. వారు ఒప్పుకోకున్నా ఏదోరకంగా భూములు స్వా«దీనం చేసుకునే ఎత్తుగడల్లో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఒప్పుకోకున్నా ఒప్పుకొన్నట్లు.. రైతుల అభిప్రాయ సేకరణకు రెవెన్యూ అధికారులు గురు, శుక్రవారాల్లో గ్రామ సభలు నిర్వహించారు. మూలపాడు సభలో కొందరు భూములు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు కూటమి నేతలు ప్రకటించారు. కానీ, వెంటనే 90 శాతం మంది రైతులు ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వబోమని తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు తెగేసి చెప్పారు. అమరావతి రాజధానినే ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదని ఇక తమ ప్రాంతాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తారని సూటిగా ప్రశి్నంచారు. వ్యవసాయమే జీవనాధారంగా బతికే తాము పొలాలను ఎలా ఇస్తామని నిలదీశారు. భూమి మా చేతిలో ఉంటేనే బంగారంజమీమాచవరంలో సభకు హాజరైన రైతులు అందరూ ల్యాండ్ పూలింగ్లో భూములిచ్చేది లేదని తేల్చి చెప్పారు. కాచవరం, కేతనకొండ గ్రామ సభల్లో ఆర్డీవో కావూరి చైతన్య పాల్గొన్నారు. కాచవరంలో ఒకరిద్దరు భూస్వాములు మినహా మిగిలిన రైతులు ప్రభుత్వానికి పొలాలు ఇవ్వబోమని ప్రకటించారు. కేతనకొండలో రైతులు నిరసనగా చప్పట్లు కొడుతూ మరీ పొలాలు ఇచ్చేది లేదని వెల్లడించారు. ‘భూమి మా ఆధీనంలో ఉంటే పిల్లల చదువులు, వివాహాలు, కుటుంబ అవసరాలకు వాడుకుంటాం. ప్లాటు ఇవ్వడానికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది. అప్పటివరకు మా అవసరాలు ఎలా తీరతాయి’ అంటూ ఆర్డీవో చైతన్యను రైతులు సూటిగా ప్రశి్నంచారు.2,874 ఎకరాల సేకరణకు ఎత్తుగడ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండలం ఐదు గ్రామాల పరిధిలోని భూములను ల్యాండ్ పూలింగ్లో సేకరించేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి గ్రామాల్లో ఉన్న భూముల వివరాలను వెల్లడించారు. మూలపాడులో 313 ఎకరాలు, కాచవరంలో 590 ఎకరాలు, త్రిలోచనాపురంలో 1,390 ఎకరాలు, జమీమాచవరంలో 301 ఎకరాలు, కేతనకొండలో 280 ఎకరాలు చొప్పున మొత్తం 2,874 ఎకరాలను ల్యాండ్ పూలింగ్లో తీసుకోనున్నారు. వీటిలో ఎక్కువగా పట్టా భూములు ఉండగా, ఎన్ఎస్పీ కాలువ, ప్రభుత్వ అసైన్మెంట్, లంక భూములు కొన్ని ఉన్నాయి. చిన్న, సన్నకారు రైతుల పొట్టకొడతారా? చిన్న, సన్నకారు రైతుల భూములను ల్యాండ్ పూలింగ్లో తీసుకోవడం దుర్మార్గమైన చర్య. వారి పొట్టకొడతారా? పూలింగ్పై ప్రతి గ్రామంలో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. రెవెన్యూ అధికారుల వద్ద వారి ఆవేదనను వెల్లడించారు. భూములే జీవనాధారం అని కూడా తేల్చిచెప్పారు. మెజార్టీ రైతుల అభిప్రాయం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. –గరికపాటి శ్రీదేవి, జెడ్పీ వైస్ చైర్మన్, మూలపాడు 3 పంటలు పండే భూములు.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఇబ్రహీంపట్నంలో ఎకరా రూ.కోటి నుంచి రూ.2 కోట్ల ధర పలుకుతోంది. మా భూముల్లో ఏడాదికి మూడు పంటలు పండుతాయి. వీటిని ప్రభుత్వానికి ఇచ్చేది లేదు. – ఎస్డీ జానీ, పీఏసీఎస్ మాజీ చైర్మన్, కేతనకొండ ఉన్నది 80 సెంట్లు.. అదీ తీసుకుంటారా? 80 సెంట్ల భూమిలో వ్యవసాయం చేస్తున్నా. కొంత భాగం పొలంలో గ్రాసం పెంచి పాడి పరిశ్రమను నిర్వహిస్తున్నా. కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాకు వ్యవసాయం తప్ప మరో పని తెలియదు. ఇప్పుడు ఉన్న పొలం తీసుకుని ప్లాటు ఇస్తామంటే ఎలా? – ఆళ్ల శ్రీనివాసరావు, రైతు, త్రిలోచనాపురం -
నూతన కార్యవర్గం ఎన్నిక
చిలకలపూడి(మచిలీపట్నం): నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. స్థానిక నాల్గో తరగతి ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా ఎస్ఎస్ఎన్ఎంవీఆర్వీ ప్రసాద్, సహాధ్యక్షుడిగా ఎం. ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా డి. కుమార్, ఎ. కోదండరామ్, కార్యదర్శిగా ఎస్. రాము, సంయుక్త కార్యదర్శులుగా నాగలక్ష్మి, గోపీకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్కే జాబార్, కోశాధికారిగా ఎం. నాగలక్ష్మీలను ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన ఆర్. శ్రీనివాస్, కె. కొండయ్య తెలిపారు. గుడివాడలో జాబ్మేళా చిలకలపూడి(మచిలీపట్నం)/గుడివాడ రూరల్: గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాలలో ఈ నెల 14వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ ఆదివారం తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనాశాఖ ఆధ్వ ర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ జాబ్మేళాను నిర్వహిస్తున్నామన్నారు. హెటీరో ల్యాబ్స్ లిమిటెడ్, ఎంఆర్ఎఫ్ లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ముత్తూట్ ఫైనాన్స్, పతంజలి ఫుడ్స్ తదితర కంపెనీల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ కంపెనీల్లో ఉద్యోగాలకు పదో తరగతి నుంచి పీజీ వరకు పూర్తి చేసి ఉన్న వారు పాల్గొనవచ్చని, వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలన్నారు. ఎంపికై న వారికి మంచి వేతనంతో పాటు సౌకర్యాలతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వివరాలకు 9848819682, 9666654641లలో సంప్రదించాలన్నారు. ద్వారకాతిరుమల వెంకన్నకు పట్టువస్త్రాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం తరఫున ఆలయ ఈవో వీకే శీనానాయక్ ఆదివారం పట్టువస్త్రాలను సమర్పించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల వెళ్లిన దుర్గగుడి ఈవో శీనానాయక్ దంపతులను ఆ దేవస్థాన ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈవో దంపతులు, దుర్గగుడి ప్రధాన అర్చకులు లింగంభోట్ల దుర్గాప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు శంకర శాండిల్య పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు ప్రసాదాలను అందించారు. నేడు కలెక్టరేట్లో మాక్డ్రిల్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అగ్ని మాపక శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల వరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అగ్ని కీలల్లో, ఉక్కిరిబిక్కిరి చేసే పొగల్లో ఎవరైనా చిక్కుకుంటే ఎలా కాపాడాలి? భూకంపాలు, ఎడతెరపి లేకుండా కురిసే భారీ వర్షాల సమయాల్లో భవనాలు కూలితే ఏమిచేయాలి? అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు దీనిని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, రవాణా తదితర శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొంటారని, నగర ప్రజలు కూడా కార్యక్రమాన్ని తిలకించి అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ కోరారు. పవర్ లిఫ్టింగ్లో షబీనాకు 4 స్వర్ణాలు మంగళగిరి: ఉత్తరాఖండ్లోని డెహ్రడూన్లో జరుగుతున్న ఏషియన్ జూనియర్ ఎక్యూప్డ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన షేక్ షబీనా 84 కేజీల విభాగంలో 4 బంగారు పతకాలు సాధించారు. ఆదివారం గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మాకుల విజయభాస్కరరావు, షేక్ సంధాని వివరాలు చెబుతూ.. ఈ నెల 10వ తేదీన జరిగిన స్క్వాట్ 190 కేజీలు, బెంచ్ ప్రెస్ 85 కేజీలు, డెడ్ లిఫ్ట్ 180 కేజీలు, ఓవరాల్ 455 కేజీల విభాగాలలో పతకాలు కై వసం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా తెనాలికి చెందిన షబీనా మంగళగిరిలోని పవర్ లిఫ్టింగ్ కోచ్ షేక్ సంధాని వద్ద శిక్షణ పొందుతున్నారు. -
పాపం.. పసుపు రైతు!
కంకిపాడు: బహిరంగ మార్కెట్లో జరుగుతున్న మాయాజాలానికి పసుపు రైతులు నలిగిపోతున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి ధరను స్థిరంగా ఉంచుతున్నారు. సన్నకొమ్ములు, పుచ్చులు కనిపిస్తున్నాయంటూ ధరను తగ్గించి అన్నదాతలను లూటీ చేస్తున్నారు. గత రెండు సీజన్లలో ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది కూడా గరిష్ట ధర దక్కుతుందనే ఆశలో అన్నదాతలు ఉన్నారు. దీనికి తోడు పంటను నిల్వ చేసుకునే సన్నాహాల్లో ఉన్నారు. కష్ట, నష్టాలకోర్చి సాగు.. ప్రధాన వాణిజ్య పంటల్లో పసుపు ఒకటి. దీన్ని ఈ ప్రాంత రైతాంగం పచ్చబంగారంగా పిలుస్తారు. ఈ సీజన్లో కృష్ణాజిల్లా వ్యాప్తంగా 5,031 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 707 ఎకరాల్లో పంటను సాగు చేశారు. ప్రధానంగా కడప మైదుకూరు, ప్రగతి, శీలం, ఇతర స్థానిక విత్తన రకాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నారు. ఎకరాకు రూ.1.70 లక్షలు వరకూ పెట్టుబడులు పెట్టారు. భారీ వర్షాలు, వరదలతో సాగు ఆరంభంలో పంటకు నష్టం జరిగింది. ఆటు పోట్లను అధిగమించి రైతులు పంటను సంరక్షించుకున్నారు. వర్షాల కారణంగా అక్కడక్కడా దుంప పుచ్చు ఆశించింది. పచ్చి పసుపు 60–70 పుట్టు (పుట్టు అంటే 225 కిలోలు) వరకూ దిగుబడి వచ్చింది. ఉడకబెట్టి, ఎండబెట్టిన పిదప 22 క్వింటాళ్ల నుంచి గరిష్టంగా 26 క్వింటాళ్ల వరకూ దిగుబడులు చేతికందాయి. సిండికేట్తో రైతులకు కష్టాలు.. ఈ ఏడాది పంట చేతికొచ్చిన మార్చి, ఏప్రిల్ నెలల్లో క్వింటా పసుపు కొమ్ములు రూ. 9,100 పలికింది. ఇంకా ధర పెరుగుతుందని అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. అదే విధంగా ధర క్రమంగా పెరుగుతూ వచ్చింది. రూ. 11,500 వరకూ చేరింది. అయితే గడిచిన 20 రోజులుగా క్వింటా పసుపు కొమ్ముల ధర రూ. 11వేల మీదే నిలిచిపోయింది. ధర పెరగకుండా వ్యాపారుల సిండికేట్ అడ్డు పడుతోందని రైతులు భావిస్తున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పంట నాణ్యత దెబ్బతినటం, ఊట సరిగా ఊరకపోవటంతో కొమ్ములు నాణ్యంగా ఉన్నప్పటికీ సైజు సన్నగా ఉండటాన్ని వ్యాపారులు సాకుగా మార్చుకున్నారు. అక్కడక్కడా పుచ్చు, కొమ్ములు సన్నంగా ఉన్నాయని ధరను తగ్గించేస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా మార్చుకుని ధర నిర్ణయం చేస్తూ అందినకాడికి దోచేస్తున్నారు. సన్నం, పుచ్చు నెపంతో క్వింటా రూ. 9వేల నుంచి రూ. 11వేల లోపు చెల్లిస్తూ అన్నదాతను నిట్టనిలుపునా ముంచేస్తూ వ్యాపారులు తమ జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలు బహిరంగ మార్కెట్లో వినిపిస్తున్నాయి. సిండికేట్ అయి కొను‘గోలుమాల్’ నాసిరకం పేరుతో ధర తగ్గింపు రూ. 9వేల నుంచి రూ. 11వేలు పలుకుతున్న ధర 20 రోజులుగా ధరను స్థిరంగా ఉంచుతున్న వైనం ధర పెరుగుతుందనే ఆశలో అన్నదాతలు పంటను నిల్వ చేసుకునేందుకు సన్నాహాలు ధర పెరగకుండా వ్యాపారుల మాయాజాలం -
ఘనంగా తిరునక్షత్ర మహోత్సవం
తాడేపల్లి రూరల్: ఎంటీఎంసీ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి తిరునక్షత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ పరమహంస పరివ్రాజకులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళాశాసనంలో ఉదయం 9 గంటలకు సర్వగ్రహ దోష నివారణ, దృష్టి దోష నివారణ కోసం లక్ష్మీ నారసింహస్వామి హోమం అంగరంగ వైభవంగా నిర్వహించామని, సాయంత్రం 6 గంటలకు పంచామృత అభిషేకం, స్వామి వారి కల్యాణం, మల్లె పుష్పార్చన ఉత్సవాలు నిర్వహించామని అనంతరం తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించామని తెలిపారు. -
పద కవితకు ఆద్యుడు అన్నమయ్య
విజయవాడ కల్చరల్: పద కవితకు ఆద్యుడు అన్నమయ్య అని లబ్బీపేట శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్వహణ బాధ్యుడు డాక్టర్ సీహెచ్ రామ్మోనరావు అన్నారు. శ్రీ వేంకటేశ్వర సంకీర్తనా అకాడమీ(శ్వాస) కంచి కామకోటిపీఠం శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో 8 రోజులపాటు నిర్వహించే జాతీయ అన్నమయ్య సంగీత మహోత్సవాలు లబ్బీపేటలోని శ్రవణ సదనంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. రామ్మోనరావు మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనలు తెలుగు భాషా వీచికలుగా అభివర్ణించారు. లలిత కళలతోనే మనో వికాసం కలుగుతుందన్నారు. తొలిరోజు నృసింహ జయంతి సందర్భంగా తరికొండ వెంగమాంబ జయంతిని నిర్వహించారు. వెంగమాంబ రచించిన సంకీర్తనలను సంగీత కళాశాల ప్రిన్సిపాల్ కె.లక్ష్మీనరసమ్మ, శ్రేష్ట మ్యూజిక్ అకాడమీ విద్యార్థినులు, మానస, లాస్యలు మధురంగా ఆలపించారు. కార్యక్రమాన్ని సంస్థ సభ్యులు సత్యబాలు, ప్రసాద్ నిర్వహించారు. నగరానికి చెందిన పలువురు సంగీత విద్వాంసులు పాల్గొన్నారు. -
‘ప్రొటోకాల్’కు టికెట్లు తప్పనిసరి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ‘ప్రొటోకాల్, అంతరాలయ దర్శనాలకు టికెట్లు తప్పని సరి చేయండి.. సిఫార్సులపై వచ్చే వారి ఆధార్ నంబర్లతో పాటు వారిని ఎవరు పంపారనే వివరాలు పుస్తకంలో నమోదు చేయండి.. గతంలో ఏం జరిగిందో నేను అడగను.. ఇకపై తప్పనిసరిగా ఇవి చేయండి’ అని దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్ ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం దుర్గగుడిపై భక్తుల రద్దీ అధికంగా ఉండటంలో కీలక ప్రదేశాల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలోని స్కానింగ్ పాయింట్ వద్ద పెద్ద ఎత్తున భక్తులు గుంపులు గుంపులుగా ఉండటాన్ని గమనించి పరిశీలించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, అధికారుల పేరిట వచ్చిన వారిగా గుర్తించి టికెట్లపై ఆరా తీశారు. ప్రొటోకాల్ ఉన్న వారికి ప్రస్తుతం జరుగుతున్న విధానాన్ని స్వస్తి పలికి, ఇకపై ప్రతి ఒక్కరికీ ఒక టికెటు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అవసరమయితేనే దేవస్థాన సిబ్బంది ప్రొటోకాల్ దర్శనాలకు రావాలని సూచించారు. అనంతరం టికెట్ చెకింగ్ పాయింట్ వద్ద అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లో వస్తున్న భక్తులతో మాట్లాడారు. సమాచార కేంద్రంలో విధుల్లో ఉన్న అధికారులతో మాట్లాడిన ఈవో సిఫార్సులపై దర్శనానికి విచ్చేసే ప్రతి ఒక్కరి ఆధార్ కార్డుతో పాటు సిఫార్సు చేసిన వారి వివరాలు నమోదు చేయాలని సూచించారు. మహా మండపంలో తనిఖీలు.. మహా మండపం 7వ అంతస్తులోని దేవస్థాన మైక్ ప్రచార కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎస్పీఎఫ్ సిబ్బంది చాంబర్లో తనిఖీలు నిర్వహించిన ఆయన డ్యూటీ చార్ట్ను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో ప్రాంగణంలో దేవస్థాన ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత మజ్జిగ పంపిణీని పరిశీలించి, భక్తులకు పంపిణీ చేశారు. -
అదును చూసి మట్టి అక్రమ తవ్వకాలు
సెలవు రోజులే లక్ష్యంగా తవ్వేస్తున్న మట్టి మాఫియా ఘంటసాల: మండలంలో మట్టి మాఫియా అదును చూసి అక్రమ తవ్వకాలు చేపడుతోంది. సెలవు రోజులే లక్ష్యంగా అర్ధరాత్రులు హడావుడిగా మట్టి తవ్వేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి ఘంటసాల మండలం తెలుగురావుపాలెం శివార్లలో రాత్రికి రాత్రే మట్టి తవ్వకాలు చేశారు. తెల్లవారి ఆదివారం మట్టి తవ్వకాలు చూసి గ్రామస్తులు నివ్వెరపోతున్న పరిస్థితి నెలకొంది. ఘంటసాల గ్రామంలోని మల్లంపల్లి రోడ్డులో శనివారం రాత్రి టిప్పర్లతో భారీగా మట్టిని తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘంటసాల మండలంలో సెలవు రోజే లక్ష్యంగా జరుగుతున్న మట్టి మాఫియా ఆగడాలను అధికారులు అరికట్టాలని, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
కవులు సమాజాన్నిఅధ్యయనం చేయాలి
విజయవాడ కల్చరల్: కవులు సమాజాన్ని అధ్యయనం చేయాలని కవి నగ్నముని అన్నారు. లలిత పబ్లికేషన్స్ ప్రచురించిన రాధాకృష్ణ కరి రచించిన లైఫ్ డ్రామా, అమూల్యాచందు రచించిన భూమినవ్వడం చూశాను కవితా సంపుటాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని బాలోత్సవ్ భవన్లో ఆదివారం నిర్వహించారు. నగ్నముని మాట్లాడుతూ యువ కవుల చేతులో కవిత్వం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. సమాజాన్ని చైతన్య పరిచే అంశాలు అందులో కనిపిస్తున్నట్లు తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ శాంతి శ్రీ అమూల్యాచందు రచించిన భూమి నవ్వడం చూశాను పుస్తకాన్ని సమీక్ష చేస్తూ అమూల్య కవిత్వంలో సమాజ ప్రేరేపిత అంశాలు కనిపిస్తాయన్నారు. కవిత్వంలో ఆమె వాడిన పదాల కూర్పు, పదబంధాలు ఆలోచింప చేస్తాయన్నారు. రాధాకృష్ణ కవిత్వాన్ని కవయిత్రి వాణిశ్రీ నైనాల సమీక్షించారు. సీనియర్ కవి వసీరా సుధామురళి ప్రసంగించారు. నగ్నముని కవితా సంపుటాలను ఆవిష్కరించారు. పదోన్నతులు కల్పించండి ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు వీకేఎన్ జయలక్ష్మి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో 28 ఏళ్లుగా ఉద్యోగోన్నతి లేకుండా చేస్తున్న సిబ్బందికి పదోన్నతులు కల్పించాలని ఏపీ ఉమెన్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు వీకేఎన్ జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ హాల్లో ఆదివారం సంఘ సమావేశం జరిగింది. ఆమె మాట్లాడుతూ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ నుంచి సూపర్వైజర్లుగా పదోన్నతి కల్పించాలన్నారు. 2211 హెడ్ కింద పని చేస్తున్న ఎంపీహెచ్ఏ(ఎఫ్)లకు ఐదేళ్లుగా రవాణా భత్యాలు లేవన్నారు. ప్రభుత్వం స్పందించి రవాణాభత్యం ఇప్పించాలని కోరారు. రెగ్యులర్ ఎంపీహెచ్ఏ(ఎఫ్) రీడిప్లాయ్మెంట్ రద్దు చేసి బదిలీలు చేయాలని కోరారు. ఫీల్డ్ స్టాఫ్కు ఎఫ్ఆర్ఏ రద్దు చేయాలని కోరారు. నర్సెస్ డే సందర్భంగా ఏఎన్ఎంలను ఘనంగా సత్కరించారు. సమావేశంలో ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రమీల, ఎస్వీ మహాలక్ష్మి, బి.విమల, కె.మురళీకృష్ణ, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
ప్రీ వెడ్డింగ్ షూట్కు వెళ్లి వస్తుండగా ప్రమాదం
పిడుగురాళ్ల: పట్టణ శివారు అయ్యప్పస్వామి దేవస్థానం వద్ద హైవే పక్కనున్న సేఫ్టీ రెయిలింగ్ను కారు ఢీకొట్టిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కొండాపూర్కు చెందిన బాణావత్ అరవింద్, సోనియాల వివాహం ఈ నెల 23న జరగనున్న నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ షూట్కు కోసం చీరాల సముద్ర తీరానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా పిడుగురాళ్ల సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి హైవే పక్కనున్న రెయిలింగ్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురి గాయాలయ్యాయి. ప్రాణ నష్టం జరగకపోయేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్థానికుల సమాచారంతో 108 వాహనం ద్వారా పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేశారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైకోర్టు మాజీ ఏజీపీ నాగభూషణం మృతి
జగ్గయ్యపేట అర్బన్: వైఎస్సార్ సీపీ నాయకుడు, సీనియర్ న్యాయవాది, హైకోర్టులో ఏజీపీగా సేవలందించిన అమృత నాగభూషణం(60) అనారోగ్యానికి గురై ఆదివారం ఉదయం జగ్గయ్యపేటలో మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగభూషణం మరణం వార్త తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ నాయకులు.. మృతుడు నాగభూషణం నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు వట్టెం మనోహర్, పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపాగ సుందరరావు, న్యాయవాది పసుపులేటి సత్యశ్రీనివాసరావు, పార్టీ పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి గొట్టిపాళ్ల సురేష్, ప్రచార విభాగం అధ్యక్షుడు గోగుల వెంకయ్య ఉన్నారు. న్యాయవాదుల నివాళులు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్, న్యాయవాది నాగభూషణం ఆకస్మిక మృతిపై బార్ కౌన్సిల్ తరఫున పలువురు న్యాయవాదులు నివాళులర్పించారు. సీనియర్ న్యాయవాది రాయపూడి శ్రీనివాసరావు, బార్ మాజీ అధ్యక్షుడు అన్నెపాగ కాంతారావు, న్యాయవాదులు గోనెల వెంకటేశ్వర్లు, దామాల సంతోష్, మన్నెపల్లి బసవరాజు, ఆరేపల్లి వెంకటేశ్వర్లు, ఆలేటి కిషోర్, అన్నెపాగ కిషోర్బాబు తదితరులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
మహిళలపై పోలీసుల తీరు అమానవీయం
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో మహిళలపై పోలీసులు అమానవీయంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. మాజీ మంత్రి అని కూడా చూడకుండా విడదల రజనిపై పోలీసులు ప్రదర్శించిన తీరే నిదర్శనమన్నారు. వారి వైఖరిని ఖండిస్తున్నామన్నారు. విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవైపు దేశంలో యుద్ధవాతావరణం నెలకొంటే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీలను ఏ రకంగా కట్టడి చేయాలి, ఎలా కక్ష తీర్చుకోవాలనే దానిపై దృష్టి పెట్టినట్లు ఆరోపించారు. మాజీ మంత్రి విడదల రజని విషయంలో పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే రౌడీల్లా వ్యవహరించడం చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో దిగజారిపోయాయో ఆ ఘటనే ఉదాహరణ అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్టంలో చేసిందేమీ లేదన్నారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన ఎటు పోతోందో అర్థం కావడం లేదని, బీసీ, దళిత మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు క్రూరంగా వ్యవహరించారన్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలని, తప్పనిసరిగా చట్టం ముందు నిలబడి మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
చర్మవ్యాధులు సోకకుండా జాగ్రత్తలు
● వేసవిలో శరీరానికి మాయిశ్చరైజర్స్, సన్స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. ● ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ కాకుండా గొడుగు, తలకు టోపీ ధరించాలి. ● ముఖ్యంగా లూజు దుస్తులు, కాటన్వి వేసుకోవాలి. ● రాత్రి వేళల్లో సైతం గాలిసోకే ప్రాంతంలో నిద్రించాలి. ● గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. అనంతరం శరీరాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. ● స్నానం అనంతరం చర్మానికి పౌడర్ రాసుకుంటే చెమట పొక్కులు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నివారించవచ్చు. ● ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోకిన వారు వాడే టవల్స్ మరొకరు వాడితే సోకే అవకాశం ఉంది. వాటిని వేడి నీటిలో నానబెట్టి వాష్ చేయాలి. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మైలవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి మైలవరం బైపాస్ రోడ్డులో జరిగింది. సేకరించిన వివరాలు ప్రకారం మైలవరం గ్రామానికి చెందిన పజ్జూరు శివనారాయణ(55) ద్విచక్ర వాహనంపై పశువుల మేతకు గడ్డి తీసుకువస్తున్నాడు. ఎ.కొండూరు మండలం చీమలపాడు నుంచి కూరగాయల లోడుతో విజయవాడ వెళుతున్న నాలుగు చక్రాల ఆటో వాహనానికి గేదె అడ్డు వచ్చింది. దీంతో గేదెను తప్పించబోయి ద్విచక్ర వాహనానికి ఆటో తగిలింది. ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివనారాయణ రోడ్డుపై పడిపోయాడు. అతని తలకు బలమైన దెబ్బ తగలడంతో ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. నాలుగు చక్రాల ఆటోను స్థానికులు అడ్డుకుని నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
చెరువులో దూకి వాచ్ మెకానిక్ ఆత్మహత్య
గన్నవరం: కోనాయి చెరువులో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఇస్లాంపేటకు చెందిన మొఘల్ అన్వర్(60) వాచ్ మెకానిక్.. రెండేళ్ల క్రితం అతని భార్య మృతి చెందగా, అప్పటి నుంచి మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి కోనాయి చెరువులోని పైలెట్ ప్రాజెక్ట్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువు గట్టుపై అతని సైకిల్, చెప్పులు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శ్రీధర్, సిబ్బంది అక్కడికి చేరుకుని మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమారై ఉన్నారు. బైక్ ఢీ.. వ్యక్తి మృతి మక్కపేట(వత్సవాయి): బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోళ్ల నాగేశ్వరరావు(45) పంచాయతీ కార్యాలయంలో కొంతకాలంగా స్వీపర్గా చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో అతన గోపినేనిపాలెం రహదారివైపు నడుచుకుని వెళ్తుండగా చిల్లకల్లు వైపు నుంచి వేగంగా వచ్చిన బైక్ అదుపుతప్పి నాగేశ్వరరావును ఢీకొట్టింది. ఘటనలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. ఘటనపై ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు. ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్ట్ 10 కేజీల గంజాయి స్వాధీనం మధురానగర్(విజయవాడసెంట్రల్): గంజాయి విక్రయించడానికి సిద్ధంగా ఉన్న ఐదుగురు యువకులను ఆదివారం గుణదల పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గుణదల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎం. ఏడుకొండల గుణశేఖర్, కె.సాయి నితిన్, కొత్తపల్లి వసంత కుమార్, వల్లపు మణికంఠ, కట్ట గోపి ఐదుగురు స్నేహితులు. వీరు మధురానగర్లో ఒక రూమ్లో ఉంటే వేర్వేరు పనులు చేస్తుంటారు. వీళ్లు జల్సాలు, మద్యం, గంజాయికి బానిసయ్యారు. వీరికి డబ్బులు సరిపోక గంజాయి కొని తీసుకొచ్చి ఇక్కడ అధిక లాభానికి అమ్ముదామని ఆలోచనతో ఐదుగురూ ఒడిశా వెళ్లి అక్కడ మారుమూల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొని తీసుకువచ్చారు. గుణదల రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయిని ఐదుగురు పంచుకొనడానికి రాగా ముందస్తు సమా చారం మేరకు గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీను, గుణదల సిబ్బంది ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వారి నుంచి 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. అనుమానాస్పద మృతిపై కేసు కంకిపాడు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై కంకిపాడు పోలీస్స్టేషన్లో ఆదివారం రాత్రి కేసు నమోదైంది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. కంకిపాడుకు చెందిన సాయిరాం వరప్రసాద్ సింగ్(62) బ్యాంక్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. అతనికి వివాహమైంది. కుమారై ఉన్నారు. అతని భార్య సుమారు ఐదేళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి ఒంటరిగా నివసిస్తున్నాడు. మద్యానికి బానిసైన సింగ్ అనారోగ్య కారణాలతో మనస్తాపానికి గురై అపార్ట్మెంట్ కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 10వ తేదీ జరిగిన ఘటనపై కుటుంబ సభ్యులు కంకిపాడు పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. -
ఇంద్రకీలాద్రిపై భక్తజన సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై భక్తజన సందడి నెలకొంది. దుర్గామల్లేశ్వరస్వామివార్లను ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకల నుంచి పెద్ద ఎత్తున యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఆదిదంపతులకు జరిగిన పలు ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీహోమం, లక్ష కుంకుమార్చన విశేషంగా జరిగాయి. లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్తులు సర్వ దర్శనంతో పాటు రూ. 100, రూ.300, రూ.500 టికెట్ల క్యూలైన్లలో అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు రద్దీ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు త్వరత్వరగా దర్శనం కలిగేలా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం మహా నివేదన నిమిత్తం అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో రద్దీ మరింత పెరిగింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. అమ్మవారి ఆలయంలో సూర్యోపాసన సేవ జరిగింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, అనంతరం పల్లకీ సేవలోనూ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మోపిదేవిలో..మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. తెల్లవారుజాము నుంచే తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. నాగపుట్ట, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డీసీ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
సిటిజెన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ ప్రారంభం
లబ్బీపేట(విజయవాడతూర్పు): క్యాన్సర్పై అవగాహన పెంచుకోవడం ద్వారా తొలిదశలో గుర్తించి, పూర్తిగా నయం చేసేందుకు అవకాశం ఉంటుందని టెలికం రంగ దిగ్గజం ఎన్కే గోయల్ సూచించారు. క్యాన్సర్పై అవగాహన పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. క్యాన్సర్పై అవగాహన పెంచడం, క్యాన్సర్ రోగులకు అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన సిటిజెన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ను ఆయన శనివారం ఆవిష్కరించారు. విజయవాడ మహాత్మాగాంధీరోడ్డులోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో గోయల్ మాట్లాడుతూ.. ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో స్వచ్ఛంద సంస్థల కృషి ఎంతో కీలకమన్నారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎన్.సుబ్బారావు మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధి బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందన్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడం ద్వారా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, నిర్ధారణ పరీక్షలు, అందుబాటులో ఉన్న చికిత్సలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వ్యాధిని జయించేందుకు అవసరమైన తోడ్పాటు అందించాలన్నారు. క్యాన్సర్ విముక్త భారత నిర్మాణానికి కృషి.. ఇండియన్ రేడియాలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్(ఐఆర్ఐఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వేమూరి వరప్రసాద్ మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స ప్రభావవంతంగా ఉంటుందన్నారు. అందుబాటులో ఉన్న అత్యాధునిక వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా క్యాన్సర్ విముక్త భారత నిర్మాణానికి సిటిజెన్ ఫోర్స్ కృషి చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సిటిజెన్ ఫోర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ పిన్నంశెట్టి రమేష్బాబు మాట్లాడుతూ.. క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణం కోసం సిటిజెన్ ఫోర్స్ క్యాన్సర్ క్లబ్ పని చేస్తుందన్నారు. ఇండియన్ రేడియోలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.వి.మోహన్ ప్రసాద్, సినీ నటి చంద్రానీదాస్ తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ టాపర్ల విమానయానం
విమానాశ్రయం(గన్నవరం): పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడానికి అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఉత్తమ మార్కులు సాధించిన తొమ్మిది మంది విద్యార్థులను ఎంపిక చేసిన ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చులతో వారిని కడప నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు విమానంలో తీసుకొచ్చారు. అనంతపురం జిల్లా కోనాపురం స్కూల్ హెచ్ఎం ఎస్.రమేష్బాబు, పెద్దవడుగూరు హైస్కూల్ ఉపాధ్యాయిని ఎన్.హేమలత పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన తొమ్మిది మంది విద్యార్థులకు విమాన ప్రయాణ అవకాశం కల్పించడానికి ముందుకొచ్చారు. పెదవడుగూరు మండలంలోని ఏడు హైస్కూల్స్లో అత్యధిక మార్కులు సాధించిన ఎనిమిది మందిని, వికలాంగుల్లో ఒకరిని ఎంపిక చేశారు. మొత్తం తొమ్మిది మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు రూ.50 వేలు వెచ్చించి శనివారం కడప ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరానికి ఇండిగో విమానంలో వెంట తీసుకువచ్చారు. మధ్యాహ్నం ఇక్కడికి చేరుకున్న విద్యార్థులు సంతోషంతో కేరింతలు కొట్టారు. పేద కుటుంబాలకు చెందిన తమను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చి విమాన ప్రయాణం చేయాలనే కలను నేరవేర్చిన హెచ్ఎం రమేష్బాబు, ఉపాధ్యాయిని హేమలతకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులను విజయవాడ సందర్శనార్థం ఉపాధ్యాయులు తీసుకెళ్లారు. -
బైక్ చోరీల ముఠా ఆటకట్టు
కంకిపాడు: కంకిపాడు పోలీసులు మోటారు బైక్ల చోరీ ముఠా ఆటకట్టించారు. ఈ కేసులో నలుగురి నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ మేరకు కంకిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్రావు శనివారం కేసు వివరాలను వెల్లడించారు. గత నెల 25న గంగూరు గ్రామానికి చెందిన మహమ్మద్ జివుల్ రెహమాన్ ఈడుపుగల్లులోని మసీదు వద్ద నమాజ్ చేసుకునేందుకు తన స్నేహితుడి మోటారు బైక్పై వచ్చాడు. నమాజ్ చేసుకుని బయటకు వచ్చి చూసే సరికి బైక్ కనిపించలేదు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం ఉదయం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ డి.సందీప్ కంకిపాడు పట్టణంలోని ఫ్లై ఓవర్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా యువకులు రెండు మోటారు బైక్లపై వెళ్తూ పట్టుబడ్డారు. వారి వాహనాలకు రికార్డులు లేకపోవటంతో గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ద్విచక్ర వాహనాలను చోరీ చేసే ముఠాగా గుర్తించారు. రూ.21.46 లక్షల విలువైన 50 బైక్ల రికవరీ కృష్ణాజిల్లాలోని కంకిపాడు, పెనమలూరు, పెడన, మచిలీపట్నం, గుడ్లవల్లేరు, ఎన్టీఆర్ జిల్లాలోని భవానీపురం, మాచవరం, విజయవాడ టూ టౌన్, గుంటూరు జిల్లా కొత్తపేట, మంగళగిరి టౌన్, ఏలూరు జిల్లాలోని ఏలూరు టూ టౌన్, బాపట్ల జిల్లాలోని రేపల్లె పోలీసుస్టేషన్లలో మొత్తం ఐదు జిల్లాల పరిధిలో 17 పోలీసుస్టేషన్లలో రూ.21.46 లక్షల విలువైన 50 ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు విచారణలో నేరం అంగీకరించారు. మచిలీపట్నం నిజాంపేటకు చెందిన మొహమ్మద్ రిజ్వాన్, కోడూరు మండలం గౌడపాలెంకు చెందిన కేశన సురేష్, ఉల్లిపాలెం గ్రామానికి చెందిన షేక్ ఇబ్రహీం, కోలా కృష్ణారావులను మోటారు బైక్ల చోరీ కేసులో నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. ముందుగానే చోరీ చేసేందుకు ఒక ప్రాంతాన్ని ఎంచుకుని సీసీ కెమెరాల్లో చిక్కకుండా ఉండేలా హెల్మెట్ ధరించి చోరీలకు పాల్పడటం ఈ ముఠా నైజమన్నారు. ఫంక్షన్ హాల్స్, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, హాస్పిటల్స్ వద్ద పార్కు చేసి ఉన్న వాహనాలే వీరి లక్ష్యంగా పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. కేసు విచారణలో ప్రత్యేక చర్యలు తీసుకున్న సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ డి.సందీప్, హెచ్సీ కె.చంద్రబాబు, పీసీలు పీఎస్ఎన్ మూర్తి, ఎస్డి బాబీబాబులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. -
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు ఏపీ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా జరిగింది. సమాన పనికి సమాన వేతనం, కార్మికులను పర్మినెంట్ చేయాలని నినాదాలు చేశారు. ధర్నాలో పాల్గొన్న యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.కోటేశ్వరరావు గౌడ్, గౌరవాధ్యక్షుడు గుంటుపల్లి శేషగిరిరావు మాట్లాడుతూ.. అత్యవసర విభాగాలైన నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రెయినేజీ, పార్క్లు, మెకానిక్లు, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అన్ని విభాగాల్లో పనిచేస్తున్న టెక్నికల్ సిబ్బందికి రూ.29,200లు, నాన్ టెక్నికల్ సిబ్బందికి రూ.24,500లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల సర్వీసు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి.. కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్ను రద్దు చేస్తే కార్మికులందరిని పర్మినెంట్ చేయాలన్నారు. కార్మికుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, ఇతర ఉద్యోగుల మాదిరిగా గ్రాట్యుటీ, కనీస పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలి, ఆదివారాలు, దేశ, జాతీయ పండుగలకు సెలవు దినాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో చనిపోయిన కార్మికులకు కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో యూనియన్ సమన్వయ కార్యదర్శి బత్తుల శివశంకర్, నగర అధ్యక్షుడు పిట్టా మహేష్, కార్యదర్శి ఎండీ గౌస్, ఉపాధ్యక్షులు బుచ్చిబాబు, వి.జైపాల్, బి.నాగరాజు, నాయకులు సాంబశివరావు, విష్ణుప్రసాద్, శివాజీ, బి.విజయ్, ఎన్.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్లో అనారోగ్యంతో వ్యక్తి మృతి రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్లో అనారోగ్యంతో వ్యక్తి మృతి చెందిన ఘటనపై ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్పీ) కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం ప్లాట్ఫాం నంబర్ 1లోని దక్షిణ ప్రవేశ ద్వారం, బుకింగ్ కార్యాలయం వద్ద గుర్తు తెలియని మగ వ్యక్తి చనిపోయి ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది జీఆర్పీ పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. దీంతో హెడ్కానిస్టేబుల్ పార్థసారథి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని, ఒంటిపై నలుపు రంగు ఫ్యాంటు, నలుపుపై తెలుపు గడుల చొక్కా ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ స్టేషన్ లేదా 88971 56153 ఫోన్ నంబర్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. -
గంజాయి విక్రేత మనోజ్పై పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అమలు
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): గంజాయి సరఫరా, పలు చోరీ కేసుల్లో నిందితుడైన నగరానికి చెందిన తుమ్మల మనోజ్పై నగర పోలీసులు పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అమలు చేశారు. విజయవాడ నగరంతో పాటు పలు జిల్లాల్లోని విద్యాసంస్థల వద్ద గంజాయి విక్రయిస్తూ యువతను మత్తుకు బానిసలు చేయడమే లక్ష్యంగా పనులు నిర్వహించడం ఇతని నైజం. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఆర్పీ రోడ్డులో నివాసముండే తుమ్మల మనోజ్పై 2011లో తొలిసారిగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసు నమోదైంది. ఆ తరువాత 2012లో మరో కేసు నమోదు కాగా అప్పటి నుంచి వరుసగా గంజాయి విక్రయిస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. సత్యనారాయణపురం, వన్టౌన్, కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట, భవానీపురం, కృష్ణలంక, విశాఖపట్నంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో 28 సార్లు గంజాయి అమ్ముతూ పట్టుబడి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాడు. బెయిల్పై బయటకు వచ్చిన తరువాత కూడా తన నేర ప్రవృత్తిని కొనసాగించేవాడు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగ జేస్తున్నందున అతనిపై పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్–1988 అమలు చేస్తూ పోలీసుశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగర ఇన్చార్జి పోలీసు కమిషనర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వుల మేరకు శనివారం పశ్చిమ ఏడీసీపీ జి.రామకృష్ణ పర్యవేక్షణలో నార్త్ ఏసీపీ స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం ఇన్స్పెక్టర్ లక్ష్మినారాయణ మనోజ్ను అదుపులోనికి తీసుకున్నారు. న్యాయస్థానంలో హాజరుపర్చిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. -
ఎన్టీటీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్లోని రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం ఒకటో యూనిట్ సాంకేతిక లోపంతో నిలిచింది. దీంతో 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఆ తర్వాత కొంతసేపటికి 8వ యూనిట్లోని బాయిలర్ ట్యూబ్ లీకవడంతో యూనిట్ను షట్డౌన్ చేయడానికి ఇంజినీర్లు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎర్త్ అయ్యి ఒక్కసారిగా ప్లాంటు మొత్తం నిలిచి పోయింది. ఈ పరిణామాలతో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పతి ఆగిపోయింది. రెండు యూనిట్లో మొత్తం 1,010 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఇంజినీరింగ్ అధికారులు అర్ధరాత్రి ఒంటిగంట వరకు మరమ్మతులు చేసినా రెండు ప్లాంట్లు వినియోగంలోకి రాలేదని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం విమానాశ్రయం(గన్నవరం): ఇండియా–పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల మేరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయం ప్రవేశం వద్ద వాహనాలను క్షుణంగా తనిఖీ చేసిన తర్వాతే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు. ప్రయాణికులను మాత్రమే ఎయిర్పోర్ట్లోకి పంపిస్తున్నారు. విమానాశ్రయ సందర్శనకు వచ్చే విజిటర్లను భద్రత కారణాల దృష్ట్యా లోపలికి అనుమతించడం లేదు. టెర్మినల్లో ప్రయాణికులు, వారి లగేజీని పూర్తిస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో పోలీస్ భద్రతను పెంచడంతో పాటు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. 13న ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణా జిల్లా అండర్–16 బాలుర క్రికెట్ జట్టును ఈ నెల 13వ తేదీ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఎంపిక చేస్తున్నట్లు కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2009 సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత జన్మించిన వారు పోటీలకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రం, వైట్ డ్రస్, స్పోర్ట్స్ షూస్, సొంత కిట్తో ఆ రోజు ఉదయం ఏడు గంటలకు ఎంపిక ప్రాంగణంలో సంప్రదించాలని సూచించారు. జట్టుకు ఎంపిౖకైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. డ్రెస్ కోడ్ పాటించరే..! పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట): పెనుగంచి ప్రోలులోని తిరుపతమ్మ ఆలయ ఈఓ బి.హెచ్.వి.ఎస్.ఎన్.కిషోర్కుమార్ శనివారం డ్రెస్ కోడ్ పాటించకుండానే అమ్మవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణకు భిన్నంగా వన్థర్డ్ (షార్ట్), టీషర్టుతో అమ్మవారిని దర్శించుకోవడంతోపాటు ఆలయ పరిసరాలను సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఆలయ ఉద్యోగులు అందరూ తెల్లని సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంది. ఉద్యోగులందరికీ మార్గదర్శకంగా ఉండాల్సిన ఆలయ కార్య నిర్వాహణాధికారే డ్రెస్ కోడ్ పాటించకపోవడంపై భక్తులు అభ్యంతరం తెలుపుతున్నారు. దుర్గమ్మ సన్నిధిలో సమంత ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను హీరోయిన్ సమంత శనివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సమంతను ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి అమ్మవారి ప్రసాదాలు, రవికను అందజేశారు. ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఆలయంలోకి రావడానికి అభిమానులు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. -
కొల్లగొట్టేస్తున్నారు
●యథేచ్ఛగా మట్టి, బుసక తవ్వకాలు ●రోజుకు రూ.కోటికి పైగా అక్రమ వ్యాపారం ●కూటమి నేతల అక్రమ దందా ●ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు ●రాత్రీ పగలు తేడా లేకుండా తవ్వకాలు అవనిగడ్డ: కృష్ణా జిల్లాలో కూటమి నేతలు సహజ వనరులను కొల్లగొట్టేస్తున్నారు. రాత్రీ పగలు తేడా లేకుండా పలు ప్రాంతాల్లో మట్టి, బుసక, ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా జరిగే ఈ తవ్వకాలతో ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. రోజుకు రూ.కోటికి పైగా అక్రమ రవాణా జరుగుతుందంటే ఏ స్థాయిలో దందా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. టిప్పర్ బుసక రూ.5 వేలు జిల్లాలోని అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో పలుచోట్ల పెద్ద ఎత్తున మట్టి, బుసక అక్రమ రవాణా సాగుతోంది. ఈ ప్రాంతాల్లో రోజుకు కోటి రూపాయలకు పైగా అక్రమ రవాణా జరుగుతుందంటేనే ఏ స్థాయిలో దందా చేస్తున్నారో తెలుస్తోంది. చెరువులు పూడిక, పొలాల మెరక పేరుతో అనుమతులు తీసుకుని యథేచ్ఛగా వ్యాపారం సాగిస్తున్నారు. ట్రక్కు ట్రాక్టర్ మట్టి రూ.1,200 నుంచి రూ.1,600, టిప్పర్ బుసక రూ.4 వేల నుంచి రూ.5 వేలకు అమ్ముతున్నారు. నాగాయలంకలో టీడీపీ బడానేతదే దందా.. నాగాయలంక, కోడూరు, ఘంటసాల మండలాల్లో పెద్ద ఎత్తున మట్టి అక్రమ రవాణా సాగుతోంది. ‘నాగాయలంక’లో టి.కొత్తపాలెం, పెదపాలెంలో పంట పొలాల మెరక తీసే పేరుతో మట్టి మాఫియాను అడ్డం పెట్టుకుని ఓ బడా టీడీపీ నేత గత పది రోజుల నుంచి మట్టి అక్రమ దందా సాగిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘కోడూరు’లో స్వతంత్య్రపురం, కృష్ణాపురం, కోడూరు, ఉల్లిపాలెం, ‘ఘంటసాల’లో జోడిగూడెం, తాడేపల్లిలో మట్టి అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. పెడనలో ఎమ్మెల్యే అనుచరులే.. పెడన నియోజకవర్గంలో బంటుమిల్లి, గూడూరు, కృత్తివెన్ను, పెడన మండలాల్లో పెద్ద ఎత్తున మట్టి, బుసక తవ్వకాలు జరుగుతున్నాయి. పెడనలో ఎమ్మెల్యే అనుచరులే రాత్రి వేళలో బుసక, మట్టి తవ్వకాలు చేస్తున్నారు. గూడూరులో టీడీపీ నాయకులు సాగిస్తున్న అక్రమ తవ్వకాలపై జనసేన నేతలు ఫిర్యాదులపై ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకున్నవారే లేరు. బంటుమిల్లిలో అక్రమ తవ్వకాలు చేస్తున్న పార్టనర్స్ ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి నెలకొంది. మంత్రి హెచ్చరికతో పెట్రేగి పోతున్నారు.. ఇటీవల చల్లపల్లిలో జరిగిన టీడీపీ సమావేశంలో మట్టితోలుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి సుభాష్ దృష్టికి తీసుకురాగా ఆయన ఓ పోలీస్ బాస్కు ఫోన్ చేసి మా వాళ్ల జోలికి రావొద్దని హెచ్చరించినట్టు తెలిసింది. అప్పటి నుంచి దివిసీమలో మట్టి అక్రమ దందా మరింత పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తులు ప్రమాదాలు జరుగుతున్నా పట్టడం లేదు.. మట్టి, బుసక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్ల స్పీడుకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇష్టారాజ్యంగా స్పీడుగా వాహనాలు నడపడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకో కపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మచిలీపట్నం మండలం బుద్దాయిపాలెంలో మట్టి ట్రాక్టర్ కింద పడి ఇటీవల విద్యార్థి మరణించగా, నాగాయలంక మండలం టి.కొత్తపాలెంలో రెండు రోజుల వ్యవధిలో మట్టి ట్రాక్టర్లు ఢీ కొని ఇద్దరు గాయాల పాలయ్యారు. టిప్పర్లు, ట్రాక్టర్లపై ఎలాంటి పట్టాలు లేకుండా తోలడం వల్ల స్పీడ్ బ్రేకర్లు, గోతుల వద్ద మట్టిగడ్డలు, బుసక పడి వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. మచిలీపట్నంలో మంత్రి అనుచరులే.. మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రి అనుచరులే మట్టి, బుసక అక్రమ దందా సాగిస్తున్నారు. చిన్నాపురం, చినయాదర, పెద పట్నం, పోతేపల్లి, గూడూరు, మంగినపూడి పోర్టు భూముల్లో కొన్ని చోట్ల మట్టి, బుసక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి ప్రతి రోజూ రాత్రి వేళల్లో వందలాది టిప్పర్లు మట్టి, బుసకను ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారు. ట్రాక్టర్ల సంగతి చెప్పనక్కర లేదు. టీడీపీ నాయకులతో పాటు జనసేన నేతలు ఇక్కడ మట్టి, బుసక దందా సాగిస్తున్నారు. అవనిగడ్డ: మట్టి అక్రమంగా రవాణా చేస్తున్న టిప్పర్లు అధిక లోడుతో వెళ్లడంతో రహదారులు దెబ్బతింటున్నాయని, వీటిని వెంటనే ఆపాలని నాగాయలంక మండల పరిధిలోని గణపేశ్వరం గ్రామస్తులు శనివారం ఆందోళన చేశారు. పుల్లయ్యగారిదిబ్బ, దిండి, సొర్లగొంది, పెదగౌడపాలెం నుంచి మూడురోజులుగా విచ్చలవిడిగా టిప్పర్లు వెళ్తున్నాయని దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియడం లేదని, వీటితో రోడ్లు దెబ్బతింటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నాగాయలంక తహసీల్దార్తో చెప్పినా ఫలితం లేదని, అక్రమ మట్టి తవ్వకాలను ఆపకపోతే తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. -
విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన సురేష్ సాధారణ విద్యార్థి. పదో తరగతి పాస్ మార్కులతో గట్టెక్కాడు. గణితం, సైన్సు సబ్జెక్టులపై పట్టు లేదు. అయితే స్నేహితులు ఎంపీసీ, బైపీసీ తీసుకోవడంతో తాను గొప్పగా చెప్పుకోవడానికి ఎంపీసీని ఎంచుకున్నాడు. సబ్జెక్టులు కష్టం కా
బలవంతం చేయడం సరికాదు విద్యార్థులను సాధ్యమైనంత వరకూ వారికి నచ్చిన గ్రూపులోనే చేర్పించాలి. పదో తర్వాత ఇంటర్ మీడి యెట్ ప్రవేశంలో పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. వారికి నచ్చిన కోర్సుల్లో చేరేందుకు సహకరించాలి. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను చెప్పడం వరకే సరి పెట్టుకోవాలి. వారి అభిప్రాయాలను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయకూడదు. ఇరుగుపొరుగు పిల్లలతో పోల్చకూడదు. –డాక్టర్ డి. కై లాసరావు, విద్యావేత్త ● ఒత్తిడి పెట్టడంతో ఇబ్బందులే పిల్లల అభిప్రాయాలు తెలుసుకోకుండా చదవాలంటూ ఒత్తిడి పెట్టడితే ఇబ్బందులు తలెత్తుతాయి. పిల్లల సామర్థ్యాలను తెలుసుకోవాలి. –డాక్టర్ ప్రసాద్బాబు, సైకాలజిస్ట్, అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్, ఇగ్నో -
సైనికుల త్యాగాలు మరువలేనివి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. వీర జవాన్ మురళీనాయక్కు నివాళులర్పిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన స్వరాజ్య మైదానంలోని అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం (సామాజిక న్యాయ మహా శిల్పం) వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి.. మురళీనాయక్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన చేసి రెండు నిముషాలు మౌనం పాటించారు. వుయ్ స్టాండ్ విత్ ఇండియన్ ఆర్మీ, మురళీ నాయక్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ యుద్ధంలో మురళీనాయక్ మరణించాడన్న వార్త తెలిసిన వెంటనే మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారని, ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ఓదార్చారన్నారు. ఈనెల 13న వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా మురళీనాయక్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదారుస్తారన్నారు. మాజీ మంత్రి విడదల రజనిపై పోలీసుల దాడి దుర్మార్గమన్నారు. రజనిపై పోలీసుల దాడి అమానుషం మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీసీ మహిళ, మాజీ మంత్రి విడదల రజనిపై పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమన్నారు. సెంట్రల్ సమన్వయకర్త మల్లాది విష్ణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ● వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి అండగా ఉంటాం -
జల్లు స్నానాలకూ అవకాశం లేదు !
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సార్ కృష్ణా నదిలో నీళ్లు అడుగు ఎత్తు కూడా లేవు.. కనీసం జల్లు స్నానాలు చేసేందుకు కూడా అవకాశం లేకుండా ఉందని పలువురు భక్తులు దుర్గాఘాట్లో పుణ్యస్నానాల గురించి ఈవో వీకే శీనానాయక్ ఎదుట ఏకరువు పెట్టారు. నదీ తీరంలో ఉన్నా తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు. కృష్ణమ్మ చెంతనే ఉన్నా భక్తులు నీళ్లు కొనుక్కొవాల్సి వస్తుందని మరో మహిళా భక్తురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సార్ బట్టలు మార్చుకునేందుకు గదులు కట్టారు.. అందులో క్షణం కూడా ఉండలేని పరిస్థితి.. ఉక్కపోతతో అల్లాడుతున్నామని.. కనీసం గదులకు మరమ్మతులు చేయించాలని మరో భక్తురాలి విన్నపం... దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్ దుర్గాఘాట్, కేశ ఖండనశాల, హెడ్ వాటర్ వర్క్స్ వద్ద కొండ ప్రాంతం, శివాలయం, యాగశాల, నూతన పూజా మండపాలు, జమ్మిదొడ్డిలోని దేవస్థాన భవనాలను శనివారం పరిశీలించారు. తాగేందుకు నీళ్లు లే వు దుర్గాఘాట్కు చేరుకున్న ఈవో శీనానాయక్కు పుణ్యస్నానాలు ఆచరించేందుకు విచ్చేసిన భక్తులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. నదీ తీరం పక్కనే ఉన్నా తాగేందుకు నీళ్లు అందుబాటులో లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈవో ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా స్నానఘాట్లో పూజా సామగ్రి విక్రయించే వారు అధిక ధరలకు విక్రయిస్తున్నారని గుర్తించారు. దుస్తులు మార్చుకునే గదులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న పూజా మండపం, యాగశాలలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఈవో శీనానాయక్ ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలోని నూతన నిర్మాణాలతో పాటు మరమ్మతులకు గురైన అర్చక క్వార్టర్స్, వాటర్ ట్యాంక్లను పరిశీలించారు. వాటర్ ట్యాంక్లను ఎప్పుడు శుభ్రం చేసింది వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం దుర్గాఘాట్కు ఎదురుగా ఉన్న కేశ ఖండన శాలను పరిశీలించి ప్రతి నిత్యం ఎంత మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తారు.. తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈవో వెంట ఈఈలు కోటేశ్వరరావు, వైకుంఠరావు, ఏఈలు కుటుంబరావు, మస్తాన్రావు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నదీ తీరం పక్కనే ఉన్నా తాగేందుకు నీళ్లు లేవు దుర్గాఘాట్లో సమస్యలపై ఈవోకు భక్తుల ఏకరువు -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 20257బైక్ చోరీల ముఠా ఆటకట్టు కంకిపాడు పోలీసులు మోటారు బైక్ల చోరీ ముఠా ఆటకట్టించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు కృష్ణా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. –8లో.. దుర్గమ్మకు నృత్యార్చన ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు శనివారం విజయవాడలో నర్తన డ్యాన్స్కు చెందిన నృత్య విద్యార్థులు కూచిపూడి నృత్యార్చన చేశారు.సుబ్రహ్మణ్యేశ్వరుడి సేవలో.. మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని సోషల్ వెల్ఫేర్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. -
నరసింహస్వామికి వైభవంగా హనుమంతు సేవ
వేదాద్రి(జగ్గయ్యపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరుక్కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం హనుమంతు సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హనుమంతు వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అర్చకులు శ్రీధరాచార్యులు, వాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో సురేష్బాబు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు స్వామి వారి కల్యాణం జరుగుతుండటంతో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీక్షా స్వాముల ఇరుముడి సమర్పణ, అమ్మ, స్వామి వారి ఎదురుకోలోత్సవానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చిల్లకల్లు పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేశారు. సీఎస్ఎస్ఎస్ఎన్రెడ్డికి డీఐఈఓగా ఉద్యోగోన్నతి పాయకాపురం(విజయవాడరూరల్): ఎన్టీఆర్ జిల్లా డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్చార్జిగా పని చేస్తున్న సీఎస్ఎస్ఎస్ఎన్ రెడ్డిని ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లా డీఐఈఓగా ప్రమోషన్ ఇచ్చి బదిలీ చేసింది. ఆయన పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా, జిల్లా ఒకేషనల్ ఆఫీసర్గా పని చేశారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ఏలూరు నుంచి బి.ప్రభాకర్ను ప్రభుత్వం ఎఫ్ఏసీగా నియమించింది. -
విద్యార్థులకు స్వేచ్ఛనిద్దాం
మచిలీపట్నానికి చెందిన కుమార్కు ఆర్ట్స్ గ్రూపు అంటే ఇష్టం. చిన్నతనం నుంచే సోషల్ సంబంధిత సబ్జెక్ట్లపై మంచి పట్టుసాధించాడు. గ్రూప్స్ రాయాలనేది అతని కోరిక. పది పూర్తయ్యాక ఆర్ట్స్ గ్రూపులో చేరాలనుకున్నాడు. ఇంట్లో పెద్దల బలవంతంతో ఎంపీసీలో చేరాడు. అతను చదవలేక ఫెయిలయ్యాడు. గుడివాడకు చెందిన గణేష్కు చిన్నతనం నుంచే సీఏ చేయాలన్నది కోరిక. పది పూర్తయ్యాక ఎంఈసీలో చేరాలనుకున్నాడు. తల్లిదండ్రులేమో కొడుకును ఇంజినీరుగా చూడాలనుకున్నారు. అతన్ని బలవంతంగా ఎంపీసీలో చేర్పించారు. అయిష్టంతో చదివిన అతను ఎంపీసీని పాస్ మార్కులతో గట్టెక్కాడు. ఇంజినీరింగ్లో సీటు రాకపోవడంతో డిగ్రీలో ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నాడు. జగ్గయ్యపేటకు చెందిన హారికకు చిన్నప్పటి నుంచే లెక్కలు అంటే ఇష్టం. ఇంజినీరింగ్ చేయాలన్నది ఆమె కోరిక. తల్లిదండ్రులకు కుమార్తెను డాక్టరుగా చూడాలనుకున్నారు. ఆ తపనతో వారు ఆమెను బైపీసీలో బలవంతంగా చేర్పించారు. పాస్ మార్కులతో గట్టెక్కడంతో మెడిసిన్లో సీటు రాలేదు. అప్పటికిగానీ తల్లిదండ్రులు వారి తప్పును తెలుసు కోలేకపోయారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్లో గ్రూపులు ఎంచుకునే స్వేచ్ఛను పిల్లలకివ్వాలి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రుల ఒత్తిడితో మక్కువ లేని సబ్జెక్టులు తీసుకుని చదవలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇంటర్ ప్రవేశ సమయంలో తల్లిదండ్రుల బల వంతంతో కొందరు, గొప్పగా చెప్పుకోవాలనే ఆలోచనతో మరికొందరు ఇష్టం లేని గ్రూపుల వైపు అడుగులేసి చతికిలపడుతున్నారు. ఇంటర్ కీలకం విద్యార్థి దశలో ఇంటర్ కీలకం. ఈ దశలో పడిన అడుగు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పది పరీక్షలు రాసి ఇంటర్ ప్రవేశాల కోసం వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. పిల్లల ఆసక్తి తెలుసుకుని ప్రోత్సహించాలి. అప్పుడే వారు రాణించగలుగుతారు. ఇష్టాన్ని గుర్తించాలి పిల్లల ఇష్టాలను పక్కనబెట్టి డాక్టర్, ఇంజినీర్ చేయాలని తల్లిదండ్రులు కలలుకంటున్నారు. తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దుతున్నారు. మేము చెప్పే కోర్సులను తీసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. దీంతో విద్యార్థులు వారి ఆసక్తిని పక్కనబెట్టి తల్లిదండ్రులు చెప్పిన కోర్సులో చేరి రాణించలేకపోతున్నారు. పిల్లల ఇష్టాన్ని గుర్తించినప్పుడే రాణిస్తారన్న సత్యాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలని మానసిక శాస్త్రవేత్తలు హితవు పలుకుతున్నారు. జిల్లాలో పది ఉత్తీర్ణులైనవారు 41,260 మంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో 48,243 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 41,260 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో కొందరు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో చేరడానికి సన్నద్ధమవుతున్నారు. ఇంకొందరు ప్రభుత్వ కళాశాలల్లో చేరనున్నారు. మరికొందరు పాలిటెక్నిక్, ఏపీఆర్ జేసీ వంటి పోటీ పరీక్షలతో ఆయా కోర్సుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పాస్ మార్కులతో గట్టెక్కిన విద్యార్థులు తక్కువ సమయంలో ఉపాధి లభించే ఐటీఐ, ఒకేషనల్ కోర్సులను ఎంచుకుంటున్నారు. సామర్థ్యాన్ని అంచనా వేసుకుని ఇప్పటికే విద్యార్థులు ప్రణాళిక రచించుకున్నారు. ఇలాంటి సమయంలో ఏది ఉత్తమం, ఏ కోర్సులు తీసుకోవాలి వంటి సలహాలు ఇవ్వడం వరకే తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావించాలి. గ్రూపుల ఎంపికలో పిల్లలకు స్వేచ్ఛ నివ్వాలని నిపుణులు చెబుతున్నారు. పిల్లల భవిత.. పెద్దల బాధ్యత గ్రూపుల ఎంపికలో పిల్లలకు స్వేచ్ఛనివాలంటున్న విద్యావేత్తలు తల్లిదండ్రుల నిర్ణయాలతో పిల్లలకు కష్టాలు వారి ఇష్టాన్ని గుర్తించాలంటున్న విద్యావేత్తలు బలవంతం చేస్తే మొదటికే మోసం -
పెళ్లి ఇంట మృత్యు గంట!
హనుమాన్జంక్షన్ రూరల్/గన్నవరం రూరల్: చెన్నై–కోల్కతా జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెళ్లింట తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నవ వరుడు, అతడి బావ మృతి చెందగా, ముగ్గురు చిన్నారులుసహా ఆరుగురు గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన ఇరువురిలో ఒకరికి గత నెల 30వ తేదీన వివాహమయ్యింది. కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం, వీరవల్లి వద్ద శనివారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, హనుమాన్జంక్షన్కు చెందిన మూడెడ్ల స్వామి వెంకట ధీరజ్ (37) సీఏ పూర్తి చేసి హైదరాబాద్లో ఆడిటర్గా పనిచేస్తున్నాడు. అతడి చిన్న బావ చీరా నవీన్ (35) కెనరా బ్యాంక్ మేనేజర్గా పని చేస్తున్నారు. గత నెల 30న ధీరజ్కు వివాహమైంది. ధీరజ్ భార్య రూప (32)తో కలిసి శనివారం సాయంత్రం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు బయలుదేరారు. వీరితో పాటుగా ధీరజ్ అక్క అలేఖ్య, మరో సోదరి ప్రవల్లిక, ఆమె భర్త చీరా నవీన్తో పాటు ముగ్గురు చిన్నారులు కూడా విజయవాడకు కారులో పయనమయ్యారు. ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి.. మార్గం మధ్యలో వీరవల్లి వద్ద ఎదురుగా అవతలి వైపు రోడ్డులో వేగంగా వస్తున్న కారు ఒకటి అదుపు తప్పి డివైడర్ను ఢీకొని, ఎగిరి వీరు ప్రయాణిస్తున్న కారుపై పడింది. అప్పటి వరకూ కారులో సరదాగా మాటలు చెప్పుకుంటూ వెళుతున్న వీరంతా తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. అంబులెన్స్, ట్రక్కు ఆటోలో క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన చిన్నవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ ఆస్పత్రికి తరలించారు. ధీరజ్, నవీన్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ధీరజ్ భార్య రూప అపస్మారక స్థితిలో ఉంది. మృతుడు నవీన్కు కూడా రెండేళ్ల క్రితమే ప్రవల్లికతో వివాహం కావడం గమనార్హం. అలేఖ్య, ఆమె మూడేళ్ల కుమార్తె హంస్విక (4), కుమారుడు తనుష్ సాయి (2), ప్రవల్లిక, ఆమె రెండేళ్ల కుమార్తె ఎస్.జాని్వక గాయత్రి (1) కూడా ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఎదుటి కారు డ్రైవర్ నిర్లక్ష్యంఎదురుగా వస్తున్న కారు డ్రైవర్, వీడియోగ్రాఫర్ కోసూరు శ్రీనివాసరావు తీవ్ర నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ఘటనను బట్టి స్పష్టమవుతోంది. విజయవాడకు చెందిన అతడు హనుమాన్జంక్షన్లో ఒక శుభకార్యానికి వీడియోగ్రఫీ పని నిమిత్తం వస్తున్నాడు. శ్రీనివాసరావు కూడా గాయాలపాలై ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.మానవత్వం చాటుకున్న వైద్యుడురోడ్డు ప్రమాదానికి గురై రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులను గుర్తించిన డాక్టర్ బి.కిషోర్రెడ్డి మానవత్వం చాటుకున్నారు. ఈ మార్గంలో కారులో వెళుతున్న హైదరాబాద్ ఎమ్మోర్ హస్పటల్స్ ఎండీ డాక్టర్ బి.కిషోర్రెడ్డి రోడ్డు ప్రమాదాన్ని గమనించి హుటాహుటిన కిందకు దిగారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు ప్రాథమిక చికిత్స అందించారు. -
ఇంటర్ సప్లిమెంటరీకి ఏర్పాట్లు షురూ
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. జిల్లా వ్యాప్తంగా 73 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనుంది. మధ్యాహ్నం పరీక్షలను 23 పరీక్ష కేంద్రాలను ఇంటర్మీడియెట్ బోర్డు ఎంపిక చేసింది. అన్ని పరీక్షలకు కలిపి మొత్తం సుమారు 34,564 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో ఫస్టియర్కు సంబంధించి సుమారుగా 28,999 మంది విద్యార్థులు పరీక్షకు హజరవుతున్నారు. వీరిలో అత్యధికంగా బెటర్మెంట్కు హజరవుతున్నవారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సుమారుగా 5,565 మంది సెకండియర్ పరీక్షకు హాజరవుతున్నారు. ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రెండు రోజుల్లో సమన్వయ సమావేశం ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ నేతృత్వంలో త్వరలో విజయవాడ నగరంలో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఇంటర్ బోర్డు అధికారులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ, పోలీసు, పోస్టల్, రెవెన్యూ, మున్సిపల్, డీఈఓ, డీపీవో తదితర ఎనిమిది శాఖలతో కూడిన సమావేశం జరగనుంది. ప్రధానంగా పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డెస్క్లు, తాగునీరు, టాయిలెట్లు తదితర సౌకర్యాలను కల్పించే అంశంపై సమీక్షించనున్నారు. ముఖ్యంగా మండుతున్న ఎండలకు విద్యార్థులు అవస్థలు పడకుండా జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుంది. జిల్లాలో పరీక్ష రాయనున్న 34,564 మంది విద్యార్థులు మొదటి ఏడాదికి 73, రెండో ఏడాదికి 23 పరీక్ష కేంద్రాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. విద్యార్థులు చక్కగా పరీక్షలకు హాజరయ్యేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వివిధ శాఖల సాయంతో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు వీలుగా ఆయా ఏర్పాట్లు చేస్తున్నాం. కలెక్టర్ అధ్యక్షతన త్వరలో సమన్వయ సమావేశం జరగనుంది. వివిధ శాఖలకు చెందిన అధికారులు అందులో పాల్గొని ఏర్పాట్లకు చర్యలు తీసుకోనున్నారు. మౌలిక సదుపాయాలతో పాటు మండుతున్న ఎండల నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. – ప్రభాకరరావు, ఆర్ఐఓ, ఎన్టీఆర్ జిల్లా -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 202511సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 513.40 అడుగుల వద్ద ఉంది. ఇది 137.5158 టీఎంసీలకు సమానం. మిర్చి యార్డుకు సెలవులు గుంటూరు మిర్చి యార్డుకు శనివారం నుంచి జూన్8వ తేదీ వరకూ సెలవులు ప్రకటిస్తున్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ. చంద్రిక శుక్రవారం తెలిపారు. బాధ్యతల స్వీకారం దుర్గగుడి నూతన ఈవోగా డెప్యూటీ కలెక్టర్ వీకే శీనానాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్ను దర్శించుకున్నారు.– 12లో..