కొనసాగుతున్న కక్ష.. వల్లభనేని వంశీపై మరో పీటీ వారెంట్‌ దాఖలు | Another Pt Warrant Filed Against Vallabhaneni Vamsi | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న కక్ష.. వల్లభనేని వంశీపై మరో పీటీ వారెంట్‌ దాఖలు

May 15 2025 9:24 PM | Updated on May 15 2025 9:30 PM

Another Pt Warrant Filed Against Vallabhaneni Vamsi

సాక్షి, విజయవాడ: వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగుతోంది. వల్లభనేని వంశీపై మరో పీటి వారెంట్‌ దాఖలైంది. నూజివీడు కోర్టులో పీటీ వారెంట్‌ను పోలీసులు దాఖలు చేశారు. బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారంటూ పీటీ  వారెంట్‌ దాఖలు చేశారు. వంశీతో పాటు మరో 10 మందిపై కేసు నమోదైంది

కాగా, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేశారనే అభియోగంపై అరెస్టైన మాజీ ఎమ్మెల్యే వల్లభ­నేని వంశీమోహన్‌ బెయి­ల్‌ పిటీషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. బెయిల్‌ పిటీషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసిన అనంతరం ప్రాసిక్యూషన్‌ తరపున జా­యింట్‌ డైరెక్టర్‌ రాజేంద్రప్రసాద్, స్పెషల్‌ పబ్లి­క్‌ ప్రాసిక్యూటర్‌ కళ్యాణి వాదనలు వినిపించ­గా, వంశీ తరపున సత్య దేవిశ్రీ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం 12వ అదనపు జిల్లా న్యాయస్థానం జడ్జి తీర్పును శుక్రవారం వెల్లడించనున్నారు. ఈ కేసులో వల్లభనేని వంశీ మోహన్‌ ఎ71 నిందితునిగా ఉన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement