breaking news
Bapatla
-
సమస్యలు పరిష్కరించకపోతే విధుల బహిష్కరణ
తాడేపల్లి రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో విధులు బహిష్కరిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో గల సీడీఎంఏ కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో గత 52 రోజుల నుంచి నిరసనలు తెలుపుతున్నా కూటమి ప్రభుత్వంలో స్పందన లేదని తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్మిక సంఘాలను ప్రభుత్వం చర్చలకు పిలిచిందని, జీతం పెంచే విషయమై ఎటువంటి స్పష్టత ఇవ్వని కారణంగా ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని వెల్లడించారు. 30వ తేదీ నుంచి విధులను బహిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు జోన్ల చైర్మన్లు బాబా ఫకృద్దీన్, మధుబాబు, సత్యం, శ్రీనివాసులు, రాజేష్బాబు, ఏసుబాబు, జిల్లా కన్వీనర్లు సతీష్కుమార్, మురళీకృష్ణ, ముకుందం, సురేష్, ప్రసాద్, రామ్మూర్తి, సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని హెచ్చరించిన కార్మిక జేఏసీ నాయకులు సీడీఎంఏ కార్యాలయం ముట్టడి -
రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ కేసులు
వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గణేష్ రేపల్లె: రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో కుటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ విమర్శించారు. గుళ్లపల్లిలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజలను పక్కదోవ పట్టిస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా తప్పుడు కేసులు బనాయించి అణగద్రొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పోలీసులను పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటూ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తుందన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అదరరు బెదరరు అన్నారు. పార్టీ అధినేత పిలుపు మేరకు ప్రజా సమస్యలపై ప్రజలతో నిత్యం పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు. జగన్పై కేసులు రాజకీయ కుట్రపూరితమే రాజకీయ కక్ష సాధింపు, కుట్రలలో భాగంగానే వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని విమర్శించారు. పల్నాడు పర్యటనలో భాగంగా గుంటూరు సమీపంలో ప్రమాదవశాత్తూ సింగయ్య మృతి చెందితే కూటమి ప్రభుత్వం తమ రాజకీయ కక్షకు వాడుకుంటోందన్నారు. ప్రమాదం జరిగిన రోజు సాక్షాత్తూ ఆ జిల్లా ఎస్పీనే ప్రమాదానికి మాజీ సీఎం జగన్ కాన్వాయ్కు సంబంధం లేదని, ప్రైవేటు వాహనం ఢీకొనటంతో సింగయ్య మృతి చెందినట్లు తాము గుర్తించామని బహిరంగంగా ప్రకటించారన్నారు. ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తేవటంతో ఎస్పీ మాట మార్చి జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. కుట్రలో భాగంగా జగన్మోహన్రెడ్డికి చెందిన బులెట్ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేయటం తగదన్నారు. ఇప్పటికై నా కూటమి పాలకులు రాజకీయ కక్ష సాధింపులు వీడి ప్రజాసంక్షేమంపై దృష్టి సారించాలని హితవు పలికారు. లేనిపక్షంలో భవిష్యత్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
వేటపాలెం: బైపాస్ రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చి ఆటో ఢీ కొట్టిన సంఘటనలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. 216 జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల దగ్గరలో సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. చీరాల వైపు నుంచి మామిడి కాయల లోడుతో ఆటో ఒంగోలు వైపు వేగంగా వెళుతోంది. సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద రోడ్డు దాటుతున్న కొమరగిరి బాబూరావుని ఆటో ఢీ కొట్టింది. బాబూరావు ఎగిరి పక్కన పడ్డాడు. అతనికి కాలుకి తీవ్రగాయాలయ్యాయి. 108కి సమాచారం ఇవ్వగా క్షతగాత్రుని చీరాల ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. ఆటో ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. -
అమ్మో.. కిలేడీ కిల్లర్స్!
తెనాలి: గతేడాది జూన్లో స్థానిక యడ్ల లింగయ్య కాలనీకి చెందిన రజిని, తనకు పరిచయస్తురాలైన నాగూర్బీని ఆటోలో ఎక్కించుకుని తెనాలి–నారాకోడూరు రోడ్డులోని వడ్లమూడి వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. మార్గమధ్యంలో ఆటో డ్రైవర్తో రజిని బ్రీజర్ కొనిపించింది. అదే కాలనీవాసి వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి బైకుపై వీరిని వెన్నంటి వచ్చింది. ముగ్గురూ నిర్మాన్యుష ప్రదేశానికి వెళ్లారు. అక్కడ బ్రీజర్లో సైనేడ్ కలిపి నాగూర్బీకి ఇచ్చారు. ఆ వెంటనే ఆమె చనిపోయింది. ఒంటిపై బంగారు ఆభరణాలను దోచుకుని రజిని, వెంకటేశ్వరి తాపీగా ఇంటికి వచ్చారు. నాగూర్బీ మృతదేహం వెలుగులోకి రావడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ను గుర్తించి ప్రశ్నించడంతో రజని గురించి చెప్పాడు. ఆమెను తీసుకొచ్చి విచారించాక మరిన్ని సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. నాగూర్బీ హత్యనే కాదు..రజని, వెంకటేశ్వరితోపాటు ఆమె తల్లి రమణమ్మ కలిసి 2022 నుంచి మరో ముగ్గురిని సైనేడ్తో హత్య చేశారని, వీరి అరెస్టు చూపుతూ జిల్లా ఎస్పీ సతీష్కుమార్ చెప్పారు. అప్పు ఎగ్గొట్టేందుకు హత్య మార్కాపురానికి చెందిన సుబ్బలక్ష్మిని ఆమె ఆస్తి, డబ్బులు, బంగారు ఆభరణాలు కోసం ఇదే తరహాలో మద్యంలో సైనేడ్ కలిపి ఇచ్చి చంపారు. వెంకటేశ్వరికి సుబ్బలక్ష్మి స్వయాన అత్త అవుతుంది. ఆ తర్వాత 2023లో నాగమ్మ అనే మహిళను థమ్సప్లో సైనేడ్ కలిపి హతమార్చారు. ఆమె వద్ద తీసుకున్న రూ.20 వేల అప్పు ఎగ్గొట్టేందుకు చంపేశారు. భార్యతో చేతులు కలిపి హత్యకు పథకం తెనాలికి చెందిన పీసు అలియాస్ మోషే తరుచూ భార్యను వేధిస్తున్నాడు. అతన్ని చంపేందుకు భార్యతో చేతులు కలిపి 2024లో మద్యంలో సైనేడ్ కలిపారు. అతను చనిపోయిన తర్వాత వచ్చే పెన్షన్, ఇన్స్యూరెన్స్ డబ్బులు పంచుకునేందుకు ఆమెతో అగ్రిమెంట్ కుదర్చుకున్నారు. ఈ నాలుగు హత్యలే కాకుండా మరో ముగ్గురిపై హత్యాయత్నం చేశారు. చివరిసారి పథకం పారలేదు. అప్పులు ఎగ్గొట్టడం, వారి వద్ద నున్న బంగారు ఆభరణాలు దోచుకోవాలన్న ఉద్దేశంతోనే సైనేడ్ కలిపి హత్యలు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ వెల్లడించారు. వీరికి సైనేడ్ విక్రయించిన నేరంపై మరొకరిని అరెస్టు చేశారు. ఆడతనానికి మాయని మచ్చ ! ఆభరణాల కోసం హత్యలు చేస్తున్న మహిళలు నాడు సైనేడ్తో నలుగురి హత్య నేడు దాడిచేసి ముగ్గురి హత్య అన్నీ పట్టపగలు.. బెరుకులేని దారుణాలు పోలీసుల అప్రమత్తతతో జైలుపాలు -
సీ మౌత్ను ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి
బాపట్లటౌన్: ఈపురుపాలెం స్ట్రైట్కట్ సీ మౌత్ కాలువను ఆక్రమించిన భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీపీఎం కేంద్రకమిటీ సభ్యురాలు డి.రమాదేవి డిమాండ్ చేశారు. తీరప్రాంతం ఆక్రమణకు గురైన సీమౌత్ను శుక్రవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ శ్రీ భ్రమరా డెవలపర్స్ సారథ్యంలోని ఆలోహ రిసార్ట్స్ కోసం ఇక్కడ సహజ సిద్ధంగా ఎల్ ఆకారంలో ఉన్న సీ మౌత్ ప్రాంతాన్ని సుమారు 15.35 ఎకరాలు పీడబ్ల్యూడీ కాలువ భూమిని మాయం చేశారని ఆరోపించారు. కాలువకు, సముద్రానికి మధ్య హై టైడ్ లైన్ పరిధిలో ఉన్న సహజ సిద్ధమైన ఇసుక దిబ్బలు కూడా పూర్తిగా తొలగించి పెద్దమొత్తంలో ఇసుకను తరలించి సమీపంలోని రొయ్యల చెరువులను పూడ్చారని చెప్పారు. దీంతో మత్స్యకారుల వృత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కబ్జాదారులతో కుమ్మక్కయ్యారని ఎద్దేవా చేశారు. ఇంత విధ్వంసం జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా భూ కబ్జాదారులకు కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు. మండుటెండలో మత్స్యకారులు ఆందోళన చేస్తుంటే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే కనీసం మత్స్యకారులతో మాట్లాడకుండా ఆక్రమణదారులతో మాట్లాడి తిరిగి వెళ్లడంపై మండిపడ్డారు. ఏకంగా సముద్రాన్నే కబ్జా చేస్తుంటే రాష్ట్రంలోని మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరుకు చెందిన ఎమ్మెల్యేకు చెందిన భ్రమరా కంపెనీ ఈ విధమైన ఆక్రమణకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం దేనికి సంకేతమన్నారు. మత్స్యకారులు ఆందోళనతో ఎంతో కొంత కదిలిన జిల్లా అధికార యంత్రాంగం కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరైనది కాదని హితవు పలికారు. తక్షణమే ఆక్రమణకు గురైనా ఎల్ ఆకారంలో ఉన్న సీ మౌత్ను పూర్తిగా పునరుద్ధరించాలని కోరారు. కాలువను ఆక్రమించిన వారిపై, ఇసుక దిబ్బలు చదును చేసిన వారిపై, వారికి దొంగ పట్టాలు ఇచ్చి సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మత్స్యకారులకు అండగా సీపీఎం ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆండ్రా మాలాద్రి, జిల్లా కార్యదర్శి జి.గంగయ్య, నాయకులు ఎన్.బాబూరావు, పి.కొండయ్య, జి.ఏసుబాబు, వాడరేవు మాజీ సర్పంచి ఏరిపిల్లి రమణ, చొక్కా రాంబాబు, పీక్కి డేవిడ్, దోనీ కనకరాజు పాల్గొన్నారు. సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి డిమాండ్ ఆక్రమణకు గురైన సీమౌత్ను పరిశీలించిన రమాదేవి -
ఆటో ఢీకొని ఒకరికి గాయాలు
కొల్లూరు: ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో వాహనదారుడు తీవ్ర గాయాలబారిన పడిన ఘటన మండలంలోని పెదలంక వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, క్షతగాత్రుడి బంధువుల కథనం మేరకు.. చుండూరుకు చెందిన పడాల సప్తగిరి మండలంలోని సుగ్గునలంకకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సప్తగిరి అత్తగారి ఇంట్లో ఉన్న భార్య వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మండలంలోని పెదలంక వద్ద ఎదురుగా కనిగిరిలంక వైపు నుంచి వస్తున్న ఆటో సప్తగిరి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోకు సంబంధించిన ఇనుప బద్దె ద్విచక్ర వాహనదారుడి తొడలో నుంచి వెనుక తుంటిపై భాగం నుంచి బయటకు చొచ్చుకువచ్చింది. స్థానికులు వ్యక్తి తొడలోంచి చొచ్చుకు వెళ్లిన ఇనుప బద్దెను తమ వద్ద అందుబాటులో ఉన్న పరికరాలతో కట్ చేసి 108లో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు క్షతగాత్రుడి తొడ ప్రాంతం నుంచి చొచ్చుకొని వెళ్లిన ఇనుప బద్దెను తొలగించారు. శరీరం అంతర్భాగంలో ఉన్న కొని అవయవాలు దెబ్బతిన్నట్లు వైద్యులు సూచించడంతో క్షతగాత్రుని బంధువులు మెరుగైన వైద్యసేవల కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగానే ఉన్నట్లు బంధువులు చెప్పారు. తొడలో దిగిన ఇనుప బద్దె తొలగించిన వైద్యులు -
పవర్ లిఫ్టింగ్ ఓవరాల్ చాంపియన్ లక్ష్మి
చీరాల రూరల్: జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సమరోతు లక్ష్మి, ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించింది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన లక్ష్మి, గుంటూరు జిల్లా తాడికొండలో డిగ్రీ చదువుతోంది. రాష్ట్ర జట్టు తరఫున కర్ణాటక రాష్ట్రంలో ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంది. అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 69 కేజీల జూనియర్ బాలికల విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించింది. స్క్వాడ్లో 177 కేజీలు ఎత్తి ద్వితీయస్థానంలో నిలిచింది. బెంచ్ప్రెస్లో 77.5 కేజీలు, డెడ్లిఫ్ట్లో 155 కేజీలు కలిపి మొత్తం 410 బరువులు అలవోకగా ఎత్తి ఓవరాల్గా మూడో స్థానంలో చాంపియన్గా నిలిచి పతకాలతో పాటు సర్టిఫికెట్లను అందుకుంది. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ అన్నదాత ప్రసాద్, సంఘ అధ్యక్షులతో పాటు సహచరులు ఆమెను అభినందించారు. -
స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరి
జిల్లా ట్రాన్స్ఫోర్ట్ అధికారి కె. పరంధామరెడ్డి బాపట్లటౌన్: పాఠశాలలు, కళాశాలల స్కూల్ బస్సులకు తప్పని సరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని జిల్లా ట్రాన్స్ఫోర్ట్ ఆఫీసర్ కె. పరంధామరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. స్కూల్ పిల్లల విషయంలో అశ్రద్ధ తగదని, ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయించుకోవాలన్నారు. వాహనాలు రిపేరుకు గురైతే తక్షణమే రిపేర్లు కంప్లీట్ చేయించుకొని ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని డ్రైవర్లుగా నియమించవద్దని సూచించారు. డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అర్హులైన డ్రైవర్లను మాత్రమే బస్సులను నడిపేందుకు అనుమతించాలన్నారు. మద్యం తాగి, సెల్ ఫోన్ నడుపుతూ వాహనాలను నడపవద్దని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడువుతూ తమ తనిఖీలలో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ఆరోగ్య పథకం ఎల్ఏసీ మెంబర్గా గుమ్మడి లక్ష్మీపురం: సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లోకల్ అడ్వైజరీ కమిటీ(ఎల్ఏసీ) సభ్యునిగా గుంటూరుకు చెందిన విశ్రాంత సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ గుమ్మడి సీతారామయ్యని నియమిస్తూ సీజీహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తరఫున నియమితులైన సీతారామయ్యని శుక్రవారం సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ కన్నవారితోటలోని కార్యాలయంలో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మల్లిక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పరిరక్షణకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సీతారామయ్య కృషి చేయాలని సూచించారు. సీజీహెచ్ఎస్ పరిధిలోకి మరిన్ని ఎంప్యానల్డ్ ఆసుపత్రులను తీసుకురావాలని కోరారు. డిపార్ట్మెంట్కు చేసిన సేవలు అందించిన సీతారామయ్యకు ఈ హోదా దక్కడం శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.విశ్రాంత జీవితంలో సేవ చేసే బాధ్యత ఇచ్చిన సీజీహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ రోహిణికి సీతారామయ్య కృతజ్ఞతలు తెలిపారు. -
పారదర్శకంగా జరపాలి
నెహ్రూనగర్: ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 అర్బన్ లోకల్ బాడీస్లో పనిచేసే సచివాలయ సెక్రటరీలకు బదిలీల కౌన్సెలింగ్ శనివారం, ఆదివారం గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రెండు రోజుల పాటు జరగనుంది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తెనాలి, నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, రేపల్లే, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లి, చిలకలూరిపేట, గురజాల మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డు అడ్మిన్ సెక్రటరీలు, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలు, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్వెంట్ సెక్రటరీలు, వార్డ్ ఎమినిటీ సెక్రటరీలు, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలు హాజరుకావాలి. ఈ మేరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు. రూరల్ ప్రాంతంలో కూడా ఈ నెలఖారులోపు నిర్వహించేందుకు అధికారులు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. వీరికి ప్రాధాన్యత వార్డు సచివాలయ సెక్రటరీల బదిలీల్లో దివ్యాంగులకు, విజువల్లీ చాలెంజ్డ్ సిబ్బందికి, మెడికల్ గ్రౌండ్స్ కింద క్యాన్సర్, హార్ట్ సర్జరీ, కిడ్నీ మార్పిడీ, మానసిక వ్యాధుల కలిగిన పిల్లల తల్లిదండ్రులకు, స్పౌజ్ కేటగిరి వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఐదేళ్లు దాటితే తప్పనిసరిగా బదిలీలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదేళ్లులోపు సర్వీస్ ఉన్నవారికి రిక్వస్ట్ మీద బదిలీలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. మిగులు సిబ్బందిని ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు వారికి కేటాయించిన సచివాలయంలో పరిధిలోనే విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించనున్నారు. అర్బన్ లోకల్ బాడీస్(యూఎల్బీ)అయితే సొంత వార్డులో పోస్టింగ్ రాదు. రూరల్ ప్రాంతాల్లో అయితే సొంత మండలంలో పోస్టింగ్ కేటాయించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11082 మంది సెక్రటరీలు గుంటూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అర్బన్, రూరల్ కలుపుకుని 1344 సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 11082 మంది సెక్రటరీలు పని చేస్తున్నారు. వీరిలో కొంత మంది సెక్రటరీలు డెప్యూటేషన్పై వెళ్లిన వారు ఉన్నారు. వీరు కూడా కౌన్సెలింగ్కు హాజరై మిగుల ఉద్యోగుల కింద ఉండనున్నారు. వీలైతే డెప్యూటేషన్పై పనిచేసే సెక్రటరీలకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కార్పొరేటర్ల దందా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న సెక్రటరీలు వేరే సచివాలయానికి బదిలీ కావడానికి ఆయా ప్రాంత కార్పొరేటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేల నుంచి సిఫార్సులు లేఖలు ఇప్పిస్తున్నట్లు సమాచారం. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గళ్లా మాధవి, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో బూర్ల రామాంజనేయులు దగ్గర నుంచి తమకు అనుకూలంగా ఉండే సచివాలయ ఉద్యోగులను పోస్టింగ్ ఇప్పించుకునేందుకు లెటర్లు ఇప్పిస్తున్నారు. దీనికి గానూ ఒక్కో సెక్రటరీ నుంచి రూ.20 నుంచి 25 వేలు దాకా కార్పొరేటర్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేటి నుంచి సెక్రటరీల బదిలీలకు కౌన్సెలింగ్ నచ్చిన సచివాలయంలో పోస్టింగ్ కోసం ఎమ్మెల్యేల నుంచి సిఫార్సుల లేఖలు లెటర్లు ఇప్పిస్తామంటూ కార్పొరేటర్లు నగదు వసూలు పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్న సెక్రటరీలు గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. ఉద్యోగుల సీనియారిటీ/ర్యాంక్ ఆధారంగా కౌన్సెలింగ్ చేపట్టాలి. ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని ఉన్న ప్రతి ఉద్యోగి పోస్ట్ను ఖాళీగా చూపించాలి. కౌన్సెలింగ్ సమయంలో ఏ ఒక్క ఖాళీ కూడా బ్లాక్ చేయకుండా చూడాలి. బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం. 5, 6లో విధివిధానాలను కచ్చితంగా పాటించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలి. ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిపార్సు లేఖల వల్ల ఏ ఒక్క ఉద్యోగి నష్టపోకుండా చూడాలి. – షేక్ అబ్దుల్ రజాక్, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం -
ప్రణమిల్లిన భక్త జనం
అమ్మవారి సారె సమర్పణకు తరలివస్తున్న భక్త బృందాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తజనం ప్రణమిల్లారు. ఆషాఢ మాసోత్సవాలు, శుక్రవారం నేపఽథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి ఈవో వి. సుబ్బారావు దంపతులు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి పట్టుచీర, సారెను సమ ర్పించారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ● ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు బృందాలుగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి సారెను సమర్పించారు. దీంతో మహా మండపం ఆరో అంతస్తులో పండుగ వాతావరణం నెలకుంది. కిటకిటలాడిన క్యూలైన్లు ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. మహా మండపం, లిప్టు, మెట్ల మార్గంతో పాటు ఘాట్ రోడ్డులో కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో సర్వ దర్శనం క్యూలైన్తో పాటు రూ. 100, రూ. 300 టికెటు క్యూలైన్లు కిటకిటలాడాయి. సాయంత్రం 4 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించగా, సేవలో పాల్గొనే టికెట్లకు డిమాండ్ కనిపించింది. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. మౌలిక వసతుల పరిశీలన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఉత్సవాల నేపఽథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను, ఏర్పాట్లను నోడల్ అధికారి టి.చంద్రకుమార్ పరిశీలించారు. ఆయన వెంట దుర్గగుడి ఈవో శీనానాయక్, ఆలయ అధికారులు ఉన్నారు. -
గంగమ్మ తల్లికి వెండి కవచం బహూకరణ
కారంచేడు: గ్రామ దేవతగా విరాజిల్లుతున్న గంగమ్మ తల్లికి భక్తులు 9 కేజీల వెండి కవచం బహూకరించారు. శుక్రవారం మండల కేంద్రమైన కారంచేడు పుట్టాయిపాలెంలో కొలువైన గంగమ్మకి గ్రామానికి చెందిన ఒక భక్తుని కుటుంబం మొత్తం 9 కేజీల వెండితో తయారు చేసిన కవచాన్ని కమిటీ సభ్యులకు అందించింది. వెండి కవచం, కిరీటాన్ని అమ్మవారికి ఆలయ అర్చకులు ఆవుల రాజేష్ ధరింపజేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సీ మౌత్ అభివృద్ధికి రూ. 2 కోట్లు బాపట్ల టౌన్: అడవి పంచాయతీ ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్ కాలువ సిమెంట్ కాంక్రీట్ పనులకు రూ. 2 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి చెప్పారు. శుక్రవారం కాలువను ఆయన పరిశీలించి, మాట్లాడుతూ వివాదానికి కారణమైన భూమిపై కమిటీ ఏర్పాటు చేశామన్నారు. సీ మౌత్ కాలువ వద్ద డ్రెడ్జింగ్ ద్వారా పూడిక వెలికి తీసే పనులు త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సీ మౌత్ తీర ప్రాంతంలో జెట్టి నిర్మాణం చేపడతామని తెలిపారు. దీంతో మత్స్యకారులు పడవలు నిలపడానికి సులువుగా ఉంటుందన్నారు. ఆరు నెలల్లో అభివృద్ది పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, తహసీల్దార్ సలీమా పాల్గొన్నారు. బాపట్లలో ఆక్రమణల తొలగింపు బాపట్ల టౌన్: తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న తమ షాపులను ఎందుకు కూల్చుతున్నారంటూ మున్సిపల్ అధికారులను దుకాణ యజమానులు నిలదీశారు. రోడ్డుపైకి షాపులు కట్టి... డ్రైనేజీలను ఆక్రమించిన వారి నిర్మాణాలను వదిలిపెట్టి తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. శుక్రవారం పట్ణణంలోని త్రవ్వకాలువ నుంచి చీలురోడ్డు వరకు షాపులను జేసీబీలతో మున్సిపల్ అధికారులు తొలగించే కార్యక్రమం చేపట్టారు. ముందు మున్సిపల్ కాంప్లెక్స్లోని ఆక్రమణలు తొలగించిన తర్వాతే తమ దగ్గరకు రావాలని దుకాణ యజమానులు ఆందోళనకు దిగారు. దీంతో మున్సిపల్ అధికారులు తాత్కాలికంగా తొలగింపు పనులు నిలుపుదల చేశారు. సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెండి నాగపడగ మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యే శ్వర స్వామికి దర్శికి చెందిన యారాశి శ్రీకాంత్ రెడ్డి, చంద్రిక కుటుంబ సభ్యులు వెండి నాగపడగను శుక్రవారం సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు.. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణకు 550 గ్రాముల బరువున్న సుమారు రూ. 60 వేలతో చేయించిన నాగపడగను స్వామివారి కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. నేడు పానకాల స్వామి గుడిలో సహస్ర దీపాలంకరణ మగళగిరి: మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం(పానకాల స్వామి)లో శనివారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈవో సునీల్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకోవాలన్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. -
టెండర్లలో తిరకాసు
బాపట్లసాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 514.30 అడుగుల వద్ద ఉంది. ఇది 139.0872 టీఎంసీలకు సమానం. అమ్మవారికి బోనాలు పిడుగురాళ్ల: ఆషాఢ మాసం నేపథ్యంలో పట్టణ భవానీనగర్లోని శ్రీ కనకదుర్గ దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి మహిళా భక్తులు బోనాలు సమర్పించారు. రాజధాని రైతులపై ‘పూలింగ్’ పిడుగు సి‘ఫార్సు’ల బది‘లీలలు’ ముగిసిన సదరం క్యాంప్ తెనాలి అర్బన్: వికలాంగుల ధ్రువపత్రాల పునఃపరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ శుక్రవారంతో ముగిసింది. శనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, గుంటూరు: రూసా 2.0 కింద ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రూ. 10కోట్లతో హబ్ సెంటర్, రూ. 4 కోట్లతో ఎకామిడేషన్ బ్లాక్ ఫర్ ఎంప్లాయిబిలిటీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ భవనం నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానిస్తూ ఈ ఏడాది మే 2న విజయవాడకు చెందిన ఏపీఈడబ్ల్యూఐడీసీ (ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) వేర్వేరుగా ప్రకటనలు జారీ చేసింది. నిర్మాణ రంగంలో అపార అనుభవం, అన్ని అర్హతలు, ఆసక్తి ఉన్న సంస్థలు ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేశాయి. రూ. 10కోట్లతో భవన నిర్మాణానికి ఏడు, రూ. 4 కోట్లతో నిర్మించే భవనానికి నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. గడువు కూడా మే 30తో ముగిసింది. ఒకే సంస్థ టెండర్ ఆమోదం టెండర్లను వెంటనే తెరవాల్సి ఉన్నా 20 రోజుల వరకు ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు తాత్సారం చేశారు. తెరిచిన తర్వాత రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించే భవనానికి దాఖలు చేసిన ఆరు సంస్థల బిడ్లను తిరస్కరించారు. ఒక సంస్థకు మాత్రమే అర్హత ఉన్నట్లుగా పేర్కొన్నారు. రూ. 4 కోట్లతో నిర్మించే భవనానికి దాఖలైన నాలుగు బిడ్లలో మూడింటిని తిరస్కరించారు. ఒక బిడ్కు అర్హత ఉన్నట్లు తేల్చారు. విచిత్రమేమంటే రెండు భవనాల నిర్మాణానికి ఒకే సంస్థ దాఖలు చేసిన బిడ్కు అర్హత ఉన్నట్లుగా పొందు పరిచారు. మిగితా వారందరికీ అర్హత ఉన్నా ఎందుకు తిరస్కరించారనేది అం తుచిక్కని విషయం. ఈ అంశాన్ని బయటకు కూడా వెల్లడించడం లేదు. ఏపీఈడబ్ల్యూఐడీసీ చీఫ్ ఇంజనీర్ కూడా ఫోన్లు ఎత్తడం లేదని, ఒకవేళ ఎత్తినా విషయం అడగగానే కట్ చేస్తున్నట్లు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహించే శాఖలో, ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న పనుల టెండర్లలో అక్రమాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. విస్తుపోతున్న కాంట్రాక్టర్లు రూ.10కోట్లతో నిర్మించే భవనాల కోసం జరిగే టెండర్ల ప్రక్రియలో సాధారణంగా అన్ని అర్హతలు, ప్రమాణాలు ఉన్న సంస్థలే బిడ్లు దాఖలు చేస్తాయి. ఒక వేళ పేర్కొన్న నిబంధనల ప్రకారం ప్రమాణాలు లేకపోతే ఒకటి, రెండు సంస్థలు తిరస్కారానికి గురవుతాయి. కానీ ఏడు సంస్థలు బిడ్లు దాఖలు చేస్తే ఆరు తిరస్కారానికి గురవ్వడంపై కాంట్రాక్టర్లు విస్తుపోతున్నారు. మరో భవన నిర్మాణానికి నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేస్తే, మూడు తిరస్కారానికి గురవ్వడం నిర్మాణ రంగంలో నైపుణ్యం ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 7న్యూస్రీల్నచ్చిన వారికి కట్టబెట్టేందుకే.. తమకు నచ్చిన వారికి కట్టబెట్టేందుకే ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులకు చెందిన సంస్థలకే నిర్మాణ బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. పేరుకు నిబంధనల, ప్రక్రియ ప్రకారం అంతా చేపట్టామని చెప్పుకునేందుకు టెండర్లు ఆహ్వానించారని విమర్శిస్తున్నారు. నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించిన ఏపీఈడబ్ల్యూఐడీసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వంగానీ, నిధులు వెచ్చిస్తున్న యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ విభాగం, ఉన్నతాధికారులు చోద్యం చూడటం తగదని పేర్కొంటున్నారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. విద్యలకు నిలయమైన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పలు భవనాల నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇటీవల పిలిచిన టెండర్ల వ్యహారంలో పెద్దఎత్తున గోల్మాల్ జరిగింది. సొమ్మొకరిది.. పెత్తనమొకరిది అన్నట్లుగా టెండర్లను పర్యవేక్షిస్తున్న ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు వ్యవహరించారు. అస్మదీయులుకు కోట్ల రూపాయల పనులను కట్టబెట్టేందుకు నిబంధనలను కాలరాశారు. నిర్మా ణ రంగంలో అపార అనుభవం, అన్ని అర్హతలున్న కాంట్రాక్టర్లను పక్కన బెట్టారు. యూనివర్సిటీ, ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులపై ఏపీఈడబ్ల్యూఐడీసీ పెత్తనంపై కాంట్రాక్టర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక పెద్దఎత్తున చేతులు తడిపినట్లు ఆరోపిస్తున్నారు. ఏఎన్యూలో నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియపై ఆరోపణలు అన్ని అర్హతలూ ఉన్న కాంట్రాక్టర్ల దరఖాస్తులు తిరస్కారం నచ్చినవారికి కట్టబెట్టేందుకే నాటకం కాంట్రాక్టర్ల మండిపాటు చిన్నబాబు ఇలాకాలో ఇష్టారాజ్యం ఏపీఈడబ్ల్యూఐడీసీ తీరుపై తీవ్ర విమర్శలు -
హత్యాయత్నం కేసులో ఆరుగురికి జైలు శిక్ష
అద్దంకి: ఇద్దరు వ్యక్తులపై ఆరుగురు హత్యాయత్నం చేసిన కేసులో నిందితులపై నేరం రుజువు కావడంతో జడ్జి ఒక్కొక్కరికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.17 వేల చొప్పున జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించినట్లు సంతమాగులూరు ఎస్సై పట్టాభి తెలిపారు. కేసు వివరాలు.. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని కుందుర్రు గ్రామానికి చెందిన బొమ్మినేని కృష్ణయ్యతో నిందితులు జడ వెంకటేశ్వర్లు, జడ వీరాంజనేయులు, జడ వెంకట్రావు, జడ శ్రీనివాసరావు, జడ గోపి, కొనికి యోగయ్యలకు పాత గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో 2020 నవంబర్ 11న కృష్ణయ్య, ఆయన బాబాయి వీరాస్వామి కొమ్మాలపాడు వెళ్లి పని అయిన తర్వాత తిరిగి కుందుర్తికి బయలుదేరారు. కొమ్మాలపాడు ఎన్ఎస్పీ కెనాల్ వద్ద నిందితులు కాపు కాచి మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. కృష్ణయ్య కాలు, వీరాస్వామికి చెయ్యి విరిగాయి. తీవ్ర గాయాలైన వారిని 108 అంబులెన్స్లో హాస్పిటల్కు తరిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు అప్పట్లో ఈ ఘటనపై సంతమాగులూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి.శివన్నారాయణ హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి సంబంధిత కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. నిందితులకు 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.17 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం అద్దంకి కోర్టు న్యాయమూర్తి డి. నాగ వెంకటలక్ష్మి తీర్పు వెలువరించారు. -
రైతుల్లో వ్యతిరేకత
సాక్షి ప్రతినిధి, గుంటూరు / తాడికొండ: రాజధాని పరిసర ప్రాంత అన్నదాతల నెత్తిన మళ్లి భూ సమీకరణ పిడుగు పడనుంది. రెండు రోజుల కిందట కేబినెట్ భేటీలో మరో 43వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి అవసరమంటూ సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెదవి విరుస్తున్న రైతులు ప్రస్తుతం సమీకరించిన 33 వేల ఎకరాల భూమి గడచిన 12 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చెందలేదని, వారికే న్యాయం జరగనప్పుడు తాము భూ ములు ఇస్తే ఏం చేస్తారంటూ రైతులు పెదవి విరిస్తున్నారు. రాజధానిలో గతంలో భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ఇంత వరకు పూర్తి కాలేదు. మళ్లీ భూసమీకరణ అంటే ఎలా ? అని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రభుత్వం సమీకరణ సమయంలో ఇచ్చిన ఒప్పందాలు కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల ప్రక్రియలో భాగంగా అభివృద్ధి చేసిన లే–అవుట్లను అందజేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కాని ఇప్పటి వరకు రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడ ఇచ్చారు.. దానికి రోడ్లు, ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. త్యాగం చేసిన రైతులకు నష్టం ప్రైవేటు సంస్థలకు భూములు కట్టబెట్టడం మినహా భూములిచ్చి త్యాగం చేసిన రైతులకు గత 12 ఏళ్లల్లో ఒరిగిందేమీ లేదు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో రానున్న నాలుగేళ్లలో సమీకరణ ప్రక్రియ పూర్తి కాదని, ఒకవేళ భూములిస్తే తరువాత తమ సంగతేంటనేది ఆ ప్రాంత రైతుల నుంచి వస్తున్న ప్రశ్న. రైతుల్లో పలు సందేహాలు ఇటీవల తాడికొండ మండలంలో నిర్వహించిన గ్రామసభల్లో స్థానిక రైతులు పలు సందేహాలు లేవనెత్తారు. ఒక వేళ పూలింగ్కు తీసుకుంటే కౌలు రూ. 40 నుంచి రూ.50వేలు ఇవ్వాలని కొంత మంది కోరారు. మరికొంత మంది అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో భూ సమీకరణ జరుగుతున్నప్పుడు చిన్న గ్రామాలు తొలగిస్తే తమ సంగతేంటని ప్రశ్నించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి గ్రామాలు తొలగించమని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ రైతులు నమ్మడం లేదు. తమ గ్రామాలు తొలగించేందుకు కుట్ర జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇవ్వమని కరాఖండిగా చెబుతున్న రైతులు ముందు 33వేల ఎకరాల్లో అభివృద్ధి చేసి చూపించిన తరువాత తాము పూలింగ్కు సహకరిస్తామని, ఇప్పుడికిప్పుడు తమ భూములు వదులుకోబోమని కరాఖండిగా రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే వ్యతిరేకించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయా వర్గాలకు చెందిన వారి భూములు ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న నేపథ్యంలో పూలింగ్ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని వారే ప్రస్తావిస్తుండటం గమనార్హం. పరిధి విస్తరణ పేరుతో 43వేల ఎకరాల సమీకరణ భూముల రేట్లు అధికంగా ఉండటంతో ఇచ్చేందుకు రైతుల విముఖత అవసరాల మేరకే తీసుకోవాలంటూ సీఎంని కోరిన అధికార పార్టీ నేతలు అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో తమ భూములకు గండికొట్ట వద్దంటున్న రైతులు రెండు గ్రామాలు కాలగర్భంలో కలిసిపోతాయని భయపడుతున్న గ్రామస్తులు తాడికొండ మండలానికి చెందిన ఓ సీనియర్ టీడీపీ నాయకుడు ఇటీవల పొన్నెకల్లు గ్రామంలో జరిగిన పీ –4 సదస్సుకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం అందజేశారు. అందులో రైల్వే లైనులు, అంతర్గత రహదారుల వరకు భూ సమీకరణ చేస్తే తమకు అభ్యంతరం లేదని, అన్ని పొలాలు పూలింగ్కు ఇవ్వాలంటే సుముఖంగా లేమంటూ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అనుకున్నదే తడవుగా భూ సమీకరణ పేరుతో నిర్ణయం తీసుకుని మంత్రివర్గ భేటీలో ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకు తీకున్న నిర్ణయంపై రైతులు బహిరంగంగానే తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ప్రస్తుతం పూలింగ్కు తీసుకున్న భూములకు ధరలు తగ్గి, తీవ్రంగా నష్టపోతామంటూ గతంలో పూలింగ్కు ఇచ్చిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందాన తమ పరిస్థితి మారిందని వాపోతున్నారు. తరతరాలుగా ఉన్న పంట భూములను ప్రభుత్వం తీసుకునేందుకు చేస్తున్న కుట్రలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాలు చాలని గతంలో ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు అంతర్జాతీయ వినామాశ్రయం పేరుతో తమ పొట్ట గొడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రాజధాని ప్రాంతంలోనే ఎక్కువ
మంగళగిరి ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్ర యాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క ఈ స్టేషన్ పరిధిలోనే గత సంవత్సరం ఆగస్టులో 231.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడంతోపాటు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 234.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 38 మందిని అరెస్ట్ చేశారు. దీంతోపాటు మెత్, ఎండీఎంఏ 23 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మూడు కేసులు నమోదు చేయడంతోపాటు 17 మందిని అరెస్ట్ చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సుమారు వంద కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 20 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో వైపు అధిక ధర పెట్టి మద్యం కొనుగోలు చేయలేక చాలా మంది పేదలు, రోజువారీ కూలీలు తక్కువ ధరకు లభించే శానిటైజర్ను మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి మత్తులో తేలుతున్నారు. ఆయా షాపుల్లో ఇలాంటివి విక్రయించడంపై నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. -
మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనలో భాగస్వాములు కావాలి
రేపల్లె: మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని ఆర్డీవో నేలపు రామలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. మాదక ద్రవ్యాలను సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మాదక ద్రవ్యాలతో కుటుంబాలు నాశనమవ్వటంతోపాటు సమాజం పెడద్రోవ పడుతోందన్నారు. మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు మాదక ద్రవ్యాలపై అవగాహన ఉండి వీటికి దూరంగా ఉండాలన్నారు. సమాజంలో తోటి వారికి వీటిపై అవగాహన కల్పించాలని కోరారు. ఏబీఆర్ డిగ్రీ కళాశాల నుంచి రింగు రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, సీఐలు సురేష్బాబు, మల్లికార్జునరావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఇన్చార్జి ఎంపీడీవో ప్రసాద్, టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్, వివిధ కళాశాలల, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్డీవో రామలక్ష్మి -
బతుకే చిత్తు
ముంచెత్తే మత్తు.. కూటమి పాలనలో విచ్చలవిడిగా డ్రగ్స్ విక్రయాలు విద్యార్థులే లక్ష్యంగా... ● కళాశాలల యువతే లక్ష్యంగా అమ్మకాలు ● శివారు ప్రాంతాలలో జోరుగా సాగుతున్న దందా ● ఏడాదిలోనే 300 కేజీల గంజాయి స్వాధీనం ● కట్టడిలో పూర్తిగా విఫలమైన కూటమి సర్కార్ శివారు ప్రాంతాలలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి నుంచి నగరంలోకి సిగరెట్స్, చాకెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో తీసుకొస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. కేజీ గంజాయి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. అదే విధంగా గ్రాము చొప్పున క్రిస్టల్ను రూ.8 వేలు నుంచి రూ.10 వేలు, మెత్ను రూ.5 వేలు నుంచి రూ.6 వేలు, ఎండీఎంఏను రూ.3 వేలు నుంచి రూ. 5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లాకు మాదకద్రవ్యాలు చేరుతున్నాయి. నెహ్రూనగర్ : రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో గంజాయి, కొకై న్, మెత్, ఎండీఎం వంటి మాదకద్రవ్యాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విశాఖపట్నం, పాడేరు, అరకు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు గంజాయి భారీగా సరఫరా అవుతోంది. ముఖ్యంగా యువతే లక్ష్యంగా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. -
వైద్యులకు క్రీడలతో ఉపశమనం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): వృత్తిపరంగా పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు వైద్యులు నిత్యం క్రీడా సాధన చేయాలని డాక్టర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (డీఎస్సీవో) కార్యదర్శి డాక్టర్ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. గురువారం స్థానిక గుంటూరు మెడికల్ అసోసియేషన్ భవన సముదాయంలో నిర్వహించిన క్యారమ్స్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పని ఒత్తిడిని అధిగమించడంతోపాటు ఆటవిడుపు కోసం ప్రతి ఏడాది వైద్యుల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు భాగంగా క్యారమ్స్తోపాటు క్రికెట్, చెస్, కల్చరల్ విభాగాల్లో పోటీలు కొనసాగుతాయని చెప్పారు. సుమారు 50 మంది పేరొందిన వైద్యులు పాల్గొంటారని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో డీఎస్సీవో అధ్యక్షుడు డాక్టర్ టి.సి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్యారమ్స్ పోటీలకు ఏపీ క్యారమ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్ రిఫరీగా వ్యవహరించారు. -
‘దారి తప్పుతున్న కూటమి ఏడాది పాలన’ పుస్తకావిష్కరణ
సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పుతుంబాక భవన్లో సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రచురించిన ‘దారి తప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన’ అనే పుస్తకాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. విజయ్కుమార్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత గ్యాస్ నగదు పడక ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. తల్లికి వందనం మొదటి సంవత్సరం డబ్బులు వేయకుండా రెండవ సంవత్సరం వేశారని, అయినా కరెంటు బిల్లులు, కార్లు అని అనేక మందికి నగదు వేయలేదన్నారు. అంగన్వాడీలు, స్కీం వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులనే పేరుతో వారికి కూడా నగదు వేయకపోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వంలో స్మార్ట్మీటర్లు పెడితే పగలగొట్టమని నారా లోకేష్ పిలుపునిచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇళ్లకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చి మోడల్ స్కూల్ పేరుతో 3,4,5 తరగతులను విడదీసి దూరంగా ఉన్న హైస్కూళ్లకు విలీనం చేయడంతో ఉన్న స్కూల్లో పిల్లల సంఖ్య తగ్గిపోయిందని, ఆ స్కూల్ను కూడా మూసివేసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గద్దె చలమయ్య, పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అనుముల లక్ష్మీశ్వర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ధరణికోట విమల, పెండ్యాల మహేష్, గుంటూరు మల్లేశ్వరి, గుంటుపల్లి బాలకృష్ణ, నాయకులు ఎం.హరిపోతురాజు, గుంటుపల్లి రజని, స్పందన, జడ రాజకుమార్, షేక్ మస్తాన్ వలి, తదితరులు పాల్గొన్నారు. -
మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ
మార్టూరు: దేశంలో ఐదు దశాబ్దాల క్రిందటి ఎమర్జెన్సీలో ప్రజలు, ఉద్యోగులు విద్యార్థులు, మేధావులు తదితర అన్ని రంగాలకు చెందిన వారు సంక్షోభాన్ని ఎదుర్కొంటే నేడు మోదీ పాలనలో అంతకంటే ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి సీహెచ్ గంగయ్య అన్నారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో గంగయ్య మాట్లాడారు. 1975 జూన్ 25వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి మేధావులు, ఉద్యోగులు, ప్రజల హక్కులు కాలరాశారన్నారు. కానీ ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించి.. అన్ని రంగాలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ, తదితర రాజ్యాంగ వ్యవస్థలను నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తన గుప్పెట్లో పెట్టుకున్నారని తెలిపారు. దీనివలన రైతులు, కార్మికులు, ప్రజల హక్కులకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండగా సంస్కరణల బాట పట్టించాల్సింది పోయి వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు పాదాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మతం ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న విధానాలను పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ఏకతాటిపై నిలిచి ఎదురుకోవాలని లేకుంటే గత ఎమర్జెన్సీ పాలన మించిన గడ్డు పరిస్థితులను ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు బత్తుల హనుమంతరావు, విశ్రాంత ఉద్యోగులు ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
అప్రకటిత ఎమర్జెన్సీ కోరల్లో ప్రజాస్వామ్యం
మచిలీపట్నంటౌన్: దేశంలో 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ పోకడల కారణంగా ఎమర్జెన్సీ విధిస్తే నేడు దేశంలో ప్రధాని మోదీ నియంతృత్వ పోకడలతో అప్రకటిత ఎమ ర్జెన్సీ రూపంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు ఆందో ళన వ్యక్తం చేశారు. బుట్టాయిపేటలోని మహాత్మ జ్యోతిబాపూలే విజ్ఞానకేంద్రంలో గురువారం ‘ఎమర్జెన్సీ నాడు–నేడు’పై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లక్ష్మణరావు మాట్లాడుతూ.. నాడు ఇందిరాగాంధీ తనకు ఎదురులేదని నిరూపించుకోవడానికి ఎమర్జెన్సీ విధిస్తే, నేడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల్లో హిందువులు, ముస్లింలు పాతిపదికన విభజన తీసుకురావడానికి నిరంకుశ విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజలను చైతన్య పరుస్తున్న గౌరీ లంకేష్, నరేంద్ర దంబుల్కర్ గోవింద పనసరే తదితరులను ఆర్ఎస్ఎస్ ముష్కరులు చంపేశారని ఆందో ళన వ్యక్తంచేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెసర్ సాయిబాబాకు కోర్టు లో బెయిల్ ఇచ్చినా కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమిత్షా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అత్యవసరంగా సమావేశ పరిచి బెయిల్ రద్దు చేయించి ఆయన జైలులో మగ్గిపోయేలా చేశారన్నారు. కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలకు పాల్పడుతోందన్నారు.మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు -
చిన్నారులు పోటీతత్వాన్ని పెంచుకోవాలి
గుంటూరు వెస్ట్ (క్రీడలు): చిన్నారులు క్రీడా సాధన ద్వారా పోటీతత్వాన్ని అలవరచుకోవాలని ఏసీఎంఈ స్కూల్ డైరెక్టర్ నందమూరి సౌగంధ కృష్ణ తెలిపారు. గుంటూరు ఫెన్సింగ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు రూరల్ మండలం పొత్తూరులోని ఏసీఎంఈ స్కూల్ ప్రాంగణంలో జరిగిన అండర్–10, 12 బాలబాలికల జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో శారీరక పటుత్వానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన క్రీడలో సాధన చేయాలని తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.అశోక్ బాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 50 మంది చిన్నారులు పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఎంపికై న వారిని ఈ నెల 29వ తేదీన విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు సౌగంధ కృష్ణ, అశోక్ బాబు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ డీఎస్ క్రిష్టోఫర్, పీఈటీ రాజేష్ ఇజ్రాయేల్ తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే... ● అండర్ 12 బాలుర విభాగంలో.. సాబర్ విభాగం: చైతన్య కృష్ణ, పృథ్వీ వినయ్, ఫాయిల్ విభాగం: ఇ.కౌశిక్. బాలికల విభాగంలో.... సాబర్ విభాగం: ఆరోహి, హన్సిక, ఎప్పి విభాగం: జోష్నిక, లక్ష్మీ కార్తిక, ఫాయిల్ విభాగం: శ్లోక, హస్నా. ● అండర్–10 బాలుర విభాగంలో... ఫాయిల్ విభాగం: రిశాంక్, సంజయ్, ఎప్పి విభాగం: హర్షవర్ధన్. బాలికల విభాగంలో.. ఎప్పి విభాగం: దీక్షిత, తన్మయి శ్రీ. -
మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా మార్చండి
బల్లికురవ: దూరంలో ఉన్న పాఠశాలలకు తమ బిడ్డలను పంపలేమని తమ పాఠశాలలను మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా మార్చాలని చిన అంబడిపూడి, కొణిదెన హెచ్సీ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు.. గురువులను డీఈఓ, డిప్యూటీ ఈవోలకు గురువారం విన్నవించారు. ఇటీవల ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను బేసిక్, ఫౌండేషన్, మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా మార్పుచేసింది. రెండు పాఠశాలల్లో ఫౌండేషన్తో 1,2 తరగతులను నిర్వహిస్తూ, 3,4,5 తరగతులను మరో పాఠశాలలకు విలీనం చేశారు. చిన అంబడిపూడి పాఠశాలను పెద అంబడిపూడి హెచ్సీ పాఠశాలకు, కొణిదెన హెచ్సీ పాఠశాలను హెచ్ఈ పాఠశాలలో కలపటంతో గ్రానైట్ లారీలు రాకపోకలు, ట్రాఫిక్ దృష్ట్యా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు వివరించారు. ఇటీవల మోడల్ పాఠశాలలుగా మార్చాలని కలెక్టర్ జె.వెంకట మురళి, డీఈవో ఎస్ ఎస్ పురుషోత్తం, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు వినతి పత్రాలు అందజేశారు. డీఈవో రెండు పాఠశాలల తనిఖీ, విలీనం అయిన పాఠశాలలను పరిశీలించి ఎంఈవో 1, 2 వస్త్రం నాయక్, రమేష్బాబు, కాంప్లెక్స్ చైర్మన్లు జె.హనుమంతరావు, కేబీ వెంకటేశ్వరరావుతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు రెండు పాఠశాలలను, రికార్డులు తనిఖీ చేశారు. 1 నుంచి 5 తరగతుల్లో ఆధార్ డేటా ప్రకారం 45 పైగా విద్యార్థులు ఉండాలని అప్పుడే మోడల్ పాఠశాలగా మార్పు చేసేందుకు నివేదిస్తామని ప్రకటించారు. -
మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను నిర్మూలించాలి
బాపట్ల: మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను సమాజంలో పూర్తిగా నిర్మూలించినప్పుడే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బాపట్ల పార్లమెంట్ సభ్యుడు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమం గురువారం బాపట్లలో నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పోలీసులు, వివిధ శాఖల సమన్వయంతో బాపట్ల పట్టణంలో చేపట్టిన భారీ ర్యాలీని పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మాదకద్రవ్యాలను వినియోగించరాదంటూ ర్యాలీలో పాల్గొన్న యువత ప్లకార్డులు చేతబూని పెద్ద పెట్టున నినదించారు. మున్సిపల్ ఉన్నత పాఠశాల నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహం కూడలిలో మానవహారం నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని నిరోధించడం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. ఎంపీ మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు చిన్నారులు, యువతనే లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్నారని చెప్పారు. ఇలాంటి దుశ్చర్యలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ బాపట్లను నషా ముక్త్ జిల్లాగా నిలపడానికి అందరూ కృషి చేయాలన్నారు. మాదకద్రవ్యాలు తయారీ, వినియోగం, రవాణా విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఏడాది 80 శాతం మేర గంజాయి కేసులు తగ్గాయన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు జిల్లాలో ఈగల్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, బుడా చైర్మన్ సలగాల రాజశేఖర్బాబు పాల్గొన్నారు. ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ బాపట్లలో భారీ ర్యాలీ -
జిల్లాలో రెడ్క్రాస్ సేవలు విస్తరింపజేయాలి
బాపట్ల: జిల్లాలో రెడ్క్రాస్ సంస్థ సేవలను విస్తరింప చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్లో ఇండియన్ రెడ్క్రాస్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం గురువారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెడ్క్రాస్ సేవలు వెలకట్టలేనివని అన్నారు. రెడ్క్రాస్ సభ్యత్వ నమోదుతో రాష్ట్రంలో బాపట్ల జిల్లాకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. గవర్నర్ చేతుల మీదుగా ‘రెడ్క్రాస్ బెస్ట్ అవార్డు’ అందుకోవటం గర్వంగా ఉందన్నారు. కృష్ణానది వరదల సమయంలో వరద బాధితులకు రెడ్క్రాస్ బృందం అందించిన సేవలు కొనియాడారు. విపత్తులు, అత్యవసర సమయాల్లో రెడ్క్రాస్ సేవలు అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా రెడ్క్రాస్ సేవలను కొనసాగించాలని అన్నారు. ప్రజల ఆరోగ్యం, సంరక్షణలో రెడ్క్రాస్ ముందు ఉంటుందని అన్నారు. సభ్యత్వ నమోదులో ముఖ్య పాత్ర పోషించిన అధికారులకు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అవార్డులు ప్రదానం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా, రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షుడు నారాయణ భట్టు అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
కస్పా నిధులు కై ంకర్యం
యద్దనపూడి: దొంగలు.. దొంగలు కలసి ఊళ్లు పంచుకోవటం అంటే ఇదేనేమో. ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండానే చేసినట్లు రికార్డుల్లో నమో దు చేస్తూ లక్షలాది రూపాయల దేవస్థానం భూము ల ఆదాయాన్ని ఆ శాఖాధికారులు నొక్కేస్తున్నారు. కానీ ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు చెరువుని అభివృద్ధి చేయండి మహాప్రభో అంటూ మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఫలితంగా గతంలో ఎంతో అందంగా.. స్వచ్ఛమైన నీరు ఉండే చెరువు నేడు మురుగు, దుర్వాసనతో తాగునీటికే కాదు..వాడుకకి కూడా పనికి రాని దుస్థితికి చేరింది. రికార్డులు మాయం యద్దనపూడి మండలం పూనూరు గ్రామంలోని కస్పా చెరువు 40 ఎకరాల విస్తీర్ణంలో రెండు భాగాలుగా విస్తరించి ఉంటుంది. గ్రామంలోని 6,700 మందికి ఈ చెరువు నీరే ఆధారం. ఈ చెరువు దేవదాయ శాఖ ఆధీనంలో ఉంది. కాగా చెరువు మరమ్మతుల కోసం పూర్వం దాతలు ఇచ్చిన మాన్యం భూములు 20 ఎకరాలున్నాయి. ఈ 20 ఎకరాలపై సంవత్సరానికి రూ.4.80 లక్షల వరకు ఆదాయం వస్తుంది. 15ఏళ్లుగా భూముల ఆదాయ, వ్యయాలకు సంబంధించి అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పదేళ్ల క్రితం రికార్డులు సైతం మాయమవటం ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ఆ తరువాత నుంచి రికార్డులు అధికారుల దగ్గర ఉన్నప్పటికీ జమా, ఖర్చుల గురించి గ్రామస్తులు ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడంలేదు. వేలంలో చెరువు మాన్యం భూములు కౌలుకు తీసుకున్న కొందరు రైతులతో ఎండోమెంట్ అధికారులు కుమ్మకై ్క పాడుకున్న మొత్తాన్ని వసూలు చేయకపోవటం ఒక ఎత్తైతే.. అరకొర జమ అయిన నగదును లేనిపోని ఖర్చులు చూపి సిబ్బంది మింగటం అలవాటుగా మారింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువు అభివృద్ధికి 2022 సంవత్సరంలో రూ.50 వేలు మాత్రమే అధికారులు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఇలా సంవత్సరానికి సరాసరి రూ.4లక్షలపైగా ఆదాయం వేసుకున్నా 15 సంవత్సరాలకు కలిపి రూ.60లక్షలు ఆదాయం ఏమైనట్లు అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం లక్ష రూపాయలు మాత్రమే బ్యాంకు అకౌంట్లో ఉందని అధికారులు చెప్పటం గమనార్హం. గతంలోని ఓ అధికారి చెరువుకి లేని మెట్లు కూడా రిపేరు చేసి నట్లు, చెరువు చుట్టూ చెట్లు పీకి మట్టి తోలినట్లు, చెరువులోని నాచు, జమ్ము, తొగించకుండానే తొలగించినట్లు రికార్డుల్లో నమోదుచేసి లక్షలాది రూపాయలను డ్రా చేసి సస్పెండ్ కావడం గమనార్హం. చేయని పనులకు లక్షల్లో బిల్లులు చేసుకోవడం ఎండోమెంట్ అధికారులకు పరిపాటిగా మారింది. కలుషితమవుతున్న నీరు 15 సంవత్సరాల కాలంలో ఎంతోమంది అధికారులు మారినా చెరువును అభివృద్ధి చేసే నాథుడే కరువయ్యాడు. ప్రస్తుతం చెరువు చుట్టూ చిల్లచెట్లు మొలచి అధ్వానంగా మారింది. కట్టలపై వ్యర్థాలను పోయటంతో చెరువు చుట్టూ పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అలాగే చెరువు చుట్టూ కంచె లేకపోవటంతో పశువులు ఆ చెరువులోనే దిగుతున్నాయి. ముఖ్యంగా కొందరు ఆ చెరువును బహిర్భూమికి వినియోగిస్తున్నారు. చెరువులో నాచు, జమ్ము, తూటాకు పెరగడంతో నీరు రంగు మారింది. ప్రస్తుతం ఆ నీటినే గ్రామస్తులు వినియోగించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కర్పూరంలా కరిగిపోతున్న కస్పా మాన్యం నిధులు చెరువు అభివృద్ధి చేయకుండానే రూ.60 లక్షలు స్వాహా సంబంధిత కార్యాలయాల్లో ఏళ్ల నాటి రికార్డులు మాయం పూనూరు గ్రూపు దేవస్థానం మాన్యం భూముల్లో అవినీతి -
బడులను సందర్శించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్
విజయపురి సౌత్: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకర్రావు బుధవారం మాచర్ల మండలం ఎత్తిపోతల (7 మైలు) గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఇంటర్మీడియట్ వరకు బడిని అప్గ్రేడ్ చేయించాలని గిరిజన నాయకులు, ప్రధానోపాధ్యాయురాలు దుర్గాభవాని కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చైర్మన్ హామీ ఇచ్చారు. విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి, అభినందించారు. తర్వాత బ్రహ్మానందపురం తండాను సందర్శించి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. విజయపురి సౌత్లోని పీటీజీ పాఠశాల విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ఎస్టీ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ సాంబయ్య, డీటీడబ్ల్యూ జోత్న్స, తహసీల్దార్ కిరణ్ కుమార్, పీటీజీ పాఠశాల ప్రిన్సిపల్ మురళీ శ్రీనివాస్, గిరిజన సలహా మండలి సభ్యులు రావుల కొండలు, జెడ్పీటీసీ మల్లుస్వామి, మాజీ సర్పంచ్ కరంటోత్ పాండు నాయక్, నాగేశ్వరరావు నాయక్, బొల్లా వెంకటేశ్వర్లు చౌదరి, బాలాజీ నాయక్, బామల నాయక్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్లు బదిలీ నరసరావుపేట: జిల్లాలో పలువురు డిప్యూటీ తహసీల్దార్లు (డీటీ)లను బదిలీ చేస్తూ పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు టి.కొండారెడ్డిని నకరికల్లుకు, అరుణదేవిని బెల్లంకొండకు, షేక్ సాల్మన్ను నాదెండ్లకు, ఎస్.శ్యామలతను పెదకూరపాడుకు, కె.శ్రీనివాస రావును నరసరావు పేటకు, బి.సుబ్బారావును శావల్యాపురానికి, పి.తులసీ రామ్ను నూజెండ్లకు, జి.వెంకట రమణను రెంటచింతలకు, పి.బ్రహ్మయ్యను దాచేపల్లికి, కె.రాజశేఖర్ నాయక్ను వెల్దుర్తికి, పి.వెంకటరెడ్డిని రొంపిచర్లకు, కె.బాల వెంకటేష్ను ముప్పాళ్లకు, ఎన్.అనూరాధను యడ్లపాడుకు, షేక్ బాషాను మాచర్లకు, ఎం.రాజాను అమరావతికి, సీహెచ్ లక్ష్మీప్రసాద్ను సత్తెనపల్లికి, పి.నరసయ్యను బొల్లాపల్లికి, ఐ.ఫణీంద్రను గురజాల ఆర్డీవో కార్యాలయానికి, జి.విద్యాసాగర్ను కారం పూడికి బదిలీ చేశారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలు వినుకొండ: పట్టణంలోని షిరిడీ సాయిబాబా దేవస్థానంలో 34వ గురుపౌర్ణమి ఉత్సవాల సందర్భంగా బుధవారం భారీ గణపతి రూపం ఏర్పాటు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
తీరంలో అధికార భూతాలు
పచ్చ నేతలకు ప్రభుత్వ, అసైన్డ్ భూముల్ని కట్టబెడుతున్న రెవెన్యూ అధికారులుతీరంపై అధికార పార్టీ గద్దలు వాలాయి.. రూ.కోట్ల విలువైన భూముల్ని కొందరు అధికారుల సాయంతో తన్నుకుపోతున్నాయి. ప్రజా ఆస్తులను ఫలహారంలా మింగేస్తున్నాయి. ప్రజా సంక్షేమం పక్కనపెట్టి దొరికిన కాడికి దోచుకుని జేబులు నింపుకొనే పనిలో పచ్చ పార్టీ నేతలు ఉన్నారు. అధికారులూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు.సాక్షి ప్రతినిధి, బాపట్ల: కొన్నిచోట్ల నేతలు, అధికారులు కలిసి భూములను కబ్జా చేసి ఆక్రమిత భూములను రిసార్ట్ల నిర్మాణదారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు పచ్చనేతలు, అధికారులు ఆక్రమిత స్థలాల్లో స్వయంగా రిసార్ట్లు నిర్మిస్తున్నారు. ఇంకొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న మిత్రులను పిలిపించి రిసార్ట్ల వ్యాపారానికి తెరలేపినట్లు తెలుస్తోంది. వేటపాలెం, బాపట్ల, చినగంజాం మండలాల పరిధిలో ఈ తరహా ఒప్పందాలతో ప్రభుత్వ, అసైన్డ్ భూములను అధికారులతో కలిసి పచ్చ నేతలు కొల్లగొట్టి రూ.కోట్ల మేరకు అక్రమార్జనకు తెరతీశారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కొందరు అధికారుల తీరుపై జిల్లా రెవెన్యూ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తక్కువ ధరకే కట్టబెడుతూ.. వేటపాలెం మండలం పరిధిలోని విజయలక్ష్మీ పురం, ఓడరేవు, రామాపురం, కటారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం సముద్రం తీరంలో(బీచ్) ఉన్న ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూములను కొందరు రెవెన్యూ అధికారులు, పచ్చనేతలు కలిసి రిసార్ట్స్ యజమానులకు కట్టబెట్టి రూ.కోట్లు దండుకుంటున్నారు. ఎకరం రూ.5 కోట్ల ధర పలుకుతున్న ఈ భూములను రూ. 2 కోట్ల నుంచి రూ.3 కోట్లకు రిసార్ట్స్ యజమానులకు విక్రయిస్తున్నారు. చీరాల నియోజకవర్గ పచ్చ నేతకు పదుల ఎకరాల అసైన్డ్ భూములను అప్పగించిన రెవెన్యూ అధికారి.. ఇక్కడి మాజీ ఎమ్మెల్యేకు వేటపాలెం, చినగంజాం మండలాల్లో ఏకంగా వందలాది ఎకరాల అసైన్డ్ భూములు కట్టబెట్టినట్లు సమాచారం. పచ్చనేత ఆ ఆక్రమిత భూముల్లో రియల్ ఎస్టేట్ చేస్తుండగా, మాజీ ఎమ్మెల్యే ఆక్రమిత భూముల్లో దర్జాగా రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. ఉన్నతాధికారులకు అవినీతి చిట్టా రెవెన్యూ అధికారి అవినీతి శ్రుతి మించడంతో ఏసీబీ పట్టుకుంది. రెవెన్యూ ఉన్నతాధికారుల సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ వెంకట మురళి వేటపాలెం అధికారిని సరెండర్ చేశారు. జిల్లా కలెక్టర్ చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఆ అధికారి అవినీతి చిట్టాతో కలెక్టర్ ఒక పెద్ద గ్రంథాన్నే సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పక్కా వివరాలతో నివేదించినట్లు సమాచారం. ఇక్కడే పనిచేస్తూ భూ కబ్జాల్లో సిద్ధహస్తుడైన మరో రెవెన్యూ అధికారిని బదిలీ చేశారు. ఈ వ్యవహారంపై చర్చ కొనసాగుతూ ఉండగానే జిల్లా కేంద్రమైన బాపట్ల రెవెన్యూ అధికారుల వ్యవహారం తెరపైకిచ్చింది. మరికొంతమందిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి అక్రమాలను అడ్డుకోవచ్చని ప్రజలు భావిస్తున్నారు. అవినీతిలో కూరుకుపోయిన రెవెన్యూ అధికారులు సముద్రతీర భూములూ కూటమి నేతలకు ధారాదత్తం ‘పచ్చ’ ముఠాతో కలిసి భూదందాలు శ్రుతి మించిన అక్రమాలతో ఇప్పటికే వేటపాలెం తహసీల్దారు సరెండర్ అదే బాటలో బాపట్ల రెవెన్యూ అధికారులపైనా చర్యలు? వివాదంలో పాండురంగాపురం తీరం భూముల వ్యవహారం పచ్చ నేతలకు భూములు అప్పగించారని రెవెన్యూ శాఖపై ఆరోపణలు ప్రభుత్వ భూములకు డీకేటీ పట్టాలిచ్చిన వైనంపై విమర్శలు విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ లోతుగా విచారణ చేపడితే వెలుగులోకి మరిన్ని అక్రమాలు అటకెక్కిన కమిటీ.. ఈ భూకబ్జాల వ్యవహారం తేల్చేందుకు జిల్లా కలెక్టర్ వెంకట మురళి విచారణ కమిటీని నియమించారు. నెల లోపు విచారణ పూర్తి చేస్తామన్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఒక్క పాండు రంగాపురం భూ కబ్జాల వ్యవహారంలోనేకాక వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలోని ప్రభుత్వ, అసైన్డ్ భూముల కబ్జాలపైనా విచారణ నిర్వహించాలని ప్రజాసంఘాలతోపాటు పలు మత్స్యకార సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అన్యాక్రాంతమైన వాటిని కాపాడాలని కోరుతున్నాయి. ఆక్రమణల వ్యవహారంపై ఎప్పటికప్పుడు దృష్టి నిలిపి వేటపాలెం రెవెన్యూ అధికారి తరహాలో అక్రమాలకు తెగబడిన మిగిలిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ స్పందించి వేటు వేస్తే మిగిలిన వారు అక్రమాలకు దూరంగా ఉండే అవకాశముంది. తీరాన్ని ఆక్రమించి మరీ... చీరాలకు చెందిన పచ్చ నేత బుర్లా వెంకట్రావు, ఆయనతో కలిసి వ్యాపారం చేస్తున్న గుంటూరుకు చెందిన భ్రమర ఇన్ఫ్రా సంయుక్తంగా బాపట్ల మండలం పాండురంగాపురం వద్ద ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్ సీ మౌత్తోపాటు అలల వరకూ సముద్రాన్ని ఆక్రమించారు. కొంత భాగానికి ఏకంగా డీకేటీ పట్టాలు పొందారు. ఈ ప్రాంతంలోని 9 గ్రామాల మత్స్యకారులు వ్యవహారాన్ని బయటపెట్టారు. అంతటితో ఊరుకోక ఆందోళనకు దిగారు. అధికారులు తాము పట్టాలివ్వలేదని బుకాయిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు మాత్రం ఆ డీకేటీ పట్టాలు కొత్తగా ఇచ్చినవని చెబుతున్నారు. మరోవైపు చుట్టుపక్కల వందలాది ఎకరాల అసైన్డ్ భూములకు సైతం రెవెన్యూ అధికారులు రూ.కోట్లు దండుకొని డీకేటీ పట్టాలిచ్చినట్లు ప్రచారం సాగుతోంది. -
మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు పురస్కారాలు
గుంటూరు ఎడ్యుకేషన్: సీఎంఏ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో ప్రథమ ర్యాంకులను సాధించిన మాస్టర్ మైండ్స్ విద్యార్థులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నట్లు సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది డిసెంబర్లో జరిగిన సీఎంఏ ఫైనల్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ ర్యాంకు సాధించిన ఆర్. రిషబ్ ఓస్వాల్, జూన్–2024లో జరిగిన సీఎంఏ ఫైనల్ పరీక్షలో ప్రథమ ర్యాంకు కై వసం చేసుకున్న కొత్తపేట తేజస్వినిని ఈనెల 23న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి సత్కరించారని వివరించారు. వివిధ కామర్స్ కోర్సుల్లో మాస్టర్మైండ్స్ విద్యార్థులు 55 సార్లు ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు సాధించారని, అయితే గతేడాది జరిగిన సీఎంఏ ఫైనల్ పరీక్షలో ఇద్దరు విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులను కై వసం చేసుకోవడం అరుదైన సంఘటనగా ఆయన పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేసిన విద్యార్థులు, సహకరించిన తల్లిదండ్రులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి మోహన్ అభినందనలు తెలియజేశారు. -
కాలువ పూడ్చి సీసీ రోడ్డు నిర్మాణానికి యత్నం
పెరవలిపాలెం(వేమూరు): కూటమి నాయకులు డ్రైనేజీ కాలువ పూడ్చి మరీ సిమెంట్ రోడ్డు వేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో రైతులు ఆ పనులు చేపట్టరాదని అడ్డుకున్నారు. వేమూరు మండలంలోని పెరవలి పాలెం గ్రామంలో కూటమి నాయకులు పొలాల మురుగు నీరు వెళ్లే కాలువ పూడ్చి సిమెంట్ రోడ్డు వేసేందుకు సిద్ధం అయ్యారు. దీంతో గ్రామంలోని రైతులు వచ్చి రోడ్డు వేయరాదని అడ్డుకున్నారు. పంట పొలాలు మునిగి పోతాయని, రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. దీంతో పనులు నిలిపి వేశారు. సిమెంట్ రోడ్డు కమీషన్ కోసం కాలువలు కూడా పూడ్చి వేయడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
కోడి పందేల నిర్వాహకులు అరెస్టు
ఇంకొల్లు(చినగంజాం): మండలంలోని దుద్దుకూరు గ్రామ శివారులో కోడి పందేలు ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 3,300 నగదు, రెండు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను ఎస్ఐ జి. సురేష్ బుధవారం వెల్లడించారు. తాళం పగులగొట్టి నగదు, బంగారం చోరీ సంతమాగులూరు (అద్దంకి): తాళం వేసిన ఇంటిలో బంగారం, నగదు చోరీకి గురైన సంఘటన కుందుర్రులో మంగళవారం సాయంత్రం జరగ్గా, బుధవారం వెలుగు చూసింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు.. ఆలకుంట లింగయ్య భార్య గురవమ్మ ఈ నెల 24న తన ఇంటికి తాళం వేసి తాళం చెవిని ఇంటి గుమ్మంపైన పెట్టింది. తర్వాత పొలం పనులకు వెళ్లింది. తిరిగి సాయంత్రం ఆరు గంటలకు వచ్చి చూడగా, ఇంటి తాళం తీసి ఉంది. ఇంట్లోని బీరువాలో దాచిన రూ.20 వేలు, నాలుగు గ్రాముల బంగారు దుద్దులు చోరీకి గురయ్యాయి. బుధవారం క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పట్టాభి తెలిపారు. -
తిమ్మరాజుపాలెంలో రైతుల రాస్తారోకో
పర్చూరు (చినగంజాం): వాడ రేవు నుంచి చిలకలూరిపేట వరకు చేపట్టిన 167ఏ జాతీయ రహదారి నిర్మాణ పనులతో అవస్థలు పడుతున్నామని తిమ్మరాజుపాలెం రైతులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. రోడ్డు నిర్మాణం వలన వరద ముంపు సమయాల్లో తమ పొలాలు మునిగి పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక విద్యుత్ కార్యాలయం వద్ద వరద నీరు పారేలా తూములు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో కిలోమీటరు మేర పదుల సంఖ్యలో రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన టిప్పర్లు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. హైవే అధికారులతో మాట్లాడి వెంటనే తూములు ఏర్పాటు చేయిస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో వారు తాత్కాలికంగా రాస్తారోకో విరమించారు. జాతీయ రహదారి నిర్మాణంతో అవస్థలపై నిరసన వరద నీటి తూముల ఏర్పాటుకు డిమాండ్ -
మత్తు పదార్థాలతో ఎన్నో అనర్థాలు
రేపల్లె: మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన కలిగి ఉండాలని సీడీపీవో ఎం.సుచిత్ర చెప్పారు. మండలంలోని బేతపూడి ప్రాథమిక పాఠశాలలో బుధవారం నిర్వహించిన నిషా ముక్త భారత్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసలైతే బంగారు భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. మత్తు పదార్థాలతో నష్టాలను తెలుసుకుని తల్లిదండ్రులకు, తోటి వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హెచ్ఎం సునీల్ భాస్కర్, సూపర్వైజర్ హిమబిందు, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, కృష్ణారావు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. మిర్చి రైతులను గాలికొదిలిన చంద్రబాబు పిడుగురాళ్ల: కూటమి ప్రభుత్వం చేసేది గోరంత చెప్పేది కొండంత అనే చందగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ ప్రభుత్వం మిర్చి రైతుల సమస్యలపై అశ్రద్ధ వహిస్తుందన్నారు. మిర్చి సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్వింటా సుమారు రూ.25,000 పలికిన మిర్చి ధర కూటమి ప్రభుత్వంలో రూ.6వేలకు పడిపోయిందన్నారు. ఫిబ్రవరిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు మిర్చి యార్డు పర్యటనతో బెంబేలెత్తిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు కనీస మద్దతు ధర రూ.11,700 ఉండబోతుందంటూ ఆర్భాటపు ప్రకటన చేశారన్నారు. -
జిల్లా కోర్టు భవన సముదాయానికి భూమి కేటాయింపు
బాపట్ల: జిల్లా కోర్టు భవన సముదాయానికి అవసరమైన 2.80 ఎకరాల భూమి సిద్ధంగా ఉంచామని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. రాజధాని అమరావతి నుంచి సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో జిల్లా కోర్టు భవన సముదాయానికి కావలసిన భూమి సిద్ధంగా ఉంచినట్లు ఆమె దృష్టికి కలెక్టర్ తీసుకువెళ్లారు. పీజీఆర్ఎస్ అర్జీలపై ఆడిట్ నిర్వహించాలని జయలక్ష్మి అన్నారు. జాతీయ రహదారులకు భూ సేకరణ వేగంగా పూర్తి చేయాలన్నారు. జిల్లా నుంచి జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, ఆర్డీఓపీ గ్లోరియా, ఉప కలెక్టర్ లవన్న, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కనకరాజు, వ్యవసాయశాఖ అధికారి రామకృష్ణ, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు. బాపట్ల: నాటు సారా రహిత జిల్లాగా బాపట్ల నిలిచిందని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. నవోదయం 2.0 నాటు సారా నిర్మూలన కమిటీ జిల్లా స్థాయి సమావేశం బుధవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. ఈ సందర్భంగా రూపొందించిన గోడపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. నాటు సారా ఉత్పత్తిని జిల్లాలో పూర్తిగా అరికట్టామని చెప్పారు. గడిచిన రెండు నెలల్లో విస్తృతంగా దాడులు నిర్వహించి 5,240 లీటర్ల నాటు సారా ధ్వంసం చేశామన్నారు. 17 గ్రామాలలో 42 కేసులు నమోదు చేశామని తెలిపారు. 34 మందికి పునరావాస కల్పనకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 64 మందిని బైండోవర్ చేశామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేశారని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ సహాయ కమిషనర్ హేమంత్ నాగరాజు తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, కమిటీలోని అధికారులు పాల్గొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ లక్ష్యాలు సాధించాలి -
రోబోటిక్ సర్జరీల్లో భారత్ పురోభివృద్ధి
గుంటూరు మెడికల్: మోకీలు, తుంటి మార్పిడి శస్త్రచికితల్లో రోబోటిక్, కృత్రిమ మేధస్సు (ఏఐ) పురోగతిని రష్యన్లకు పరిచయం చేయడం ఆనందంగా ఉందని సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి పేర్కొన్నారు. రష్యా రాజధాని మాస్కోలో నాలుగు రోజులు పాటు జరిగిన యూరో ఆసియన్ ఆర్థోపెడిక్ ఫోరం ప్రదర్శనలో పాల్గొని వచ్చిన ఆయన బుధవారం స్థానిక అరండల్పేటలోని సాయి భాస్కర్ హాస్పిటల్స్లో అక్కడి అనుభవాలను విలేకరులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థోపెడిక్ విభాగంలో వినియోగం పెంచాలని సూచిస్తూ పలు రోబోటిక్లను ప్రారంభించినట్లు తెలిపారు. దానికి అనుగుణంగా రష్యాలో జరిగిన ఈ ప్రదర్శనలో భారత్లో ఆర్థోపెడిక్ రంగంలో రోబోటిక్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వినియోగాన్ని, అనుసరిస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులను రష్యన్ సర్జనులకు వివరించడం కొత్త అనుభూతిని మిగిల్చిందని పేర్కొన్నారు. జాయింట్ రీప్లేస్మెంట్లో రోబోటిక్ వాడకంపై రష్యన్ సర్జన్లు ప్రత్యేక ఆసక్తిని కనబరిచారని వివరించారు. రష్యాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ సమావేశాలకు దాదాపుగా 500 మందికి పైగా ఎముకలు, కీళ్ల వైద్య నిపుణులు హాజరయ్యారని తెలిపారు. భారత్లో మోకీలు, తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలలో రోబోటిక్ పాత్ర, అనుభవాలను అక్కడి వారికి వివరించినట్లు డాక్టర్ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి -
బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలు పెంచుతాం
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలను పెంచి కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులకు ఆదేశించారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుపై మార్క్ఫెడ్, వ్యవసాయశాఖ అధికారులు, ఎంపీడీవోలు మండల స్థాయి అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బ్లాక్ బర్లీ పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. సీఎం యాప్లో రైతుల పేర్ల నమోదు వేగంగా చేపట్టాలన్నారు. జిల్లాలో మూడు కేంద్రాలలో బ్లాక్ బర్లీ కొనుగోలు కొనసాగుతుందని, వీటిని ఎనిమిది కేంద్రాలకు విస్తరించాలని అందుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ మార్క్ఫెడ్ ఏడీని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుకు 30 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు జరుగుతుందని, దీనిని 50 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు ప్రతిపాదన తయారు చేయాలని అధికారులకు సూచించారు. సీఎం యాప్లో ఇంకొల్లు, యద్దనపూడి, మార్టూరుకు చెందిన రైతులు సుమారు 3000 మంది రిజిస్టర్ అయ్యారని, వీరి కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని మ్యాపింగ్ చేయాలన్నారు. జిల్లాలో సుమారు 13 వేల మంది పొగాకు రైతులు ఉన్నారని, సీఎం యాప్లో 7, 270 మంది పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. యాప్లో నమోదైన రైతులకు తేదీలు కేటాయించినట్లు తెలిపారు. ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు 97 మందికి కొనుగోలుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. రైతులు వారికి కేటాయించిన తేదీల్లో మాత్రమే పొగాకు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఒకవేళ వారు వారికి కేటాయించిన తేదీల్లో తీసుకురాని వారికి మాన్యువల్గా కొనుగోలుకు అవకాశం కల్పించాలని మార్క్ఫెడ్ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, మార్క్ఫెడ్ ఏడీ కరుణశ్రీ, ఉప కలెక్టర్ లవన్న, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి శ్యాంసన్ తదితరులు పాల్గొన్నారు. దేవాదాయశాఖ భూములను పరిరక్షించాలి ఆక్రమణకు గురైన దేవాదాయ శాఖ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లాస్థాయి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆక్రమణకు గురైన దేవాదాయ ధర్మాదాయశాఖ భూములపై సర్వే చేపట్టినట్లు తెలిపారు. సర్వేలో బాపట్ల పట్టణంలోని భావన్నారాయణస్వామి ఆలయానికి చెందిన 6 ఎకరాల 62 సెంట్లు, శ్రీ ఈస్ట్రన్ చౌల్ట్రీకి సంబంధించి 28 సెంట్ల స్థలం ఆక్రమణకు గురైందని తెలిపారు. పర్చూరు మండలంలో శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయానికి చెందిన 4 ఎకరాల 71 సెంట్లు, చీరాల మండలంలో శ్రీ మదనగోపాలస్వామి ఆలయానికి సంబంధించి 5 ఎకరాల 36 సెంట్లు, భట్టిప్రోలు మండలంలో శ్రీ విఠలేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 97 సెంట్ల భూమి ఆక్రమణకు గురైందని తెలిపారు. ఆక్రమించిన స్థలంలో పక్కా గృహాల నిర్మాణం జరిగిందని దేవాదాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. స్థలాలను ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్న వారిని పిలిపించి కార్డు ధర మేరకు లేక లీజుకు తీసుకొని ప్రభుత్వానికి డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కొల్లూరు మండలంలో శ్రీ సోమశేఖర్స్వామి దేవస్థానం సంబంధించి 222 ఎకరాల 89 సెంట్లు, భట్టిప్రోలులో శ్రీ నరేంద్రస్వామి దేవస్థానానికి చెందిన 62 ఎకరాల 31 సెంట్లు, భట్టిప్రోలులో శ్రీ వరదరాజస్వామి దేవస్థానానికి చెందిన 81 ఎకరాల 42 సెంట్లు ఆక్రమణకు గురయ్యాయని, స్థలంలో రైతులు సాగు చేసుకుంటున్నారని దేవాదాయ శాఖ అధికారులు వివరించారు. ఆర్ఓఆర్ కింద కేసు నమోదుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో గంగాధర్ గౌడ్, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి సూర్య ప్రకాష్రావు, డీపీఓ ప్రభాకర్, బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, పురపాలక సంఘ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. -
రెడ్బుక్ పోలీస్
గుంటూరు జిల్లాలో అడ్డగోలుగా పోలీసుల తీరు సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెడ్బుక్ రాజ్యాంగం అమలులో గుంటూరు జిల్లా పోలీసులు రెండు ఆకులు ఎక్కువే చదివారు. మంత్రి లోకేష్ ఆదేశాలను అమలు చేయడమే విధిగా పెట్టుకుని పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీకి జిల్లాలో రోజురోజుకు మరింత ఆదరణ పెరుగుతుండటంతో పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనపై ఆంక్షలు విధించిన పోలీసులు.. దీన్ని అడ్డం పెట్టుకుని పార్టీలో చురుకుగా ఉండే నేతలకు నోటీసులు జారీ చేశారు. కేసులు నమోదు చేస్తూ వేధింపులకు దిగుతున్నారు. తెరపైకి పాత అక్రమ కేసులు ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన మిర్చి రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంగా పెట్టిన అక్రమ కేసులను ఇప్పుడు తిరగతోడుతున్నారు. ఆ సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు నేతలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కావటి మనోహర్నాయుడు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పేర్ని నాని తదితరులపై బీఎన్ఎస్ 223, 189(2), 329(4), 292, 126(2), 195(1) రెడ్విత్ 190 బీఎన్ఎస్, 125 ఆర్పీఏ 1951 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసలు ఆ పర్యటనకు రాని పేర్ని నాని పేరు కూడా అప్పట్లో నమోదు చేయడం విమర్శలకు దారితీసింది. తాజాగా ఆ కేసులో అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్నాయుడు, మోదుగుల వేణుగోపాలరెడ్డికి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. మాజీ సీఎం కారు స్వాధీనం తాజాగా సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో చీలి సింగయ్య మృతి చెందడంతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందిన బుల్లెట్ ప్రూఫ్ కారును స్వాధీనం చేసుకుని నల్లపాడు స్టేషన్కు తరలించారు. ఈ కేసులో ప్రభుత్వ డ్రైవర్తోపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పీఏ కె.నాగేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నోటీసుల పేరిట బెదిరింపులు వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా కేసులు, నోటీసులు విమర్శలకు దారి తీస్తున్న ఉన్నతాధికారుల వైఖరి వైఎస్సార్సీపీకి ఆదరణ పెరగడంతో కూటమి సర్కార్ కుట్ర పాలకుల మెప్పు పొందేందుకు పలువురు పోలీసులు తహతహ పాత కేసులు తిరగతోడుతూ ఎప్పడికప్పుడు కొత్తగా నమోదు అధికార పక్షమైతే ఓకే... వైఎస్ జగన్ ఇంటిపైకి తాటికాయలు విసిరిన వారిని పిలిచి స్టేట్మెంట్ తీసుకుని పంపించేశారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైకి ఇలా విసిరినా.. కేస విషయంలోనే ఎంతో ఉదాసీనంగా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న కారణంగా సాక్షి కార్యాలయంపై అమరావతి జేఏసీ పేరుతో కొందరు మూకుమ్మడిగా వచ్చి విధ్వంసం సృష్టించినా ఇప్పటివరకూ కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడంలో గుంటూరు పోలీసులు ముందుంటున్నారు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులు చూపిస్తున్న ఉత్సాహంపై పోలీసుల పట్ల ప్రజల్లో ఉండే నమ్మకం సడలిపోయేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డితోపాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. పర్యటన ముందు కూడా నోటీసులు ఇచ్చి కార్యక్రమానికి వెళ్లవద్దంటూ బెదిరింపులకు గురిచేశారు. పాత గుంటూరు ప్రాంతానికి చెందిన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, స్వర్ణలత, పార్టీ మహిళా విభాగం నేత గనిక ఝాన్సీలకు ర్యాలీకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ ముందుగానే నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో పోలీసులు నోటీసులు ఇస్తామని భయపెట్టిన నేపథ్యంలో ఝాన్సీ, స్వర్ణ ర్యాలీకి వెళ్లలేదు. అయినప్పటికీ పాత గుంటూరులో వీరిద్దరూ ర్యాలీకి వెళ్లినట్లు కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
సీపీవోగా ఏ.షాలెమ్రాజు
బాపట్ల: బాపట్ల జిల్లా ప్రణాళిక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఏ.షాలెమ్ రాజు జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఇప్పటివరకు ఇక్కడ సీపీఓగా పనిచేసిన కె. శ్రీనివాసరావు విశాఖపట్నం జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న షాలెమ్ రాజు నియమితులయ్యారు. ప్రణాళిక శాఖలోని అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.అమరేశ్వర స్వామికి ఆదాయంఅమరావతి (పెదకూరపాడు): అమరావతిలోని అమరేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించి ముప్పాళ్ళ మండలం మాదల, దమ్మాలపాడు గ్రామాల్లోని సుమారు 70 ఎకరాల భూములను బహిరంగ వేలం వేయగా, గత ఏడాది కంటే రూ.8,14,500 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ కార్యదర్శి రేఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2022–23, 2024–25 కాలానికి గతంలో రూ. 6,13,000 ఆదాయం వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం 2025–26, 2026–27 సంవత్సరాలకు రూ.14,27,500 ఆదాయం సమకూరిందన్నారు. గతంతో పోల్చుకుంటే రూ. 8,14,500 ఆదాయం వచ్చిందని ఆమె తెలిపారు.పులిచింతల వద్ద మొసళ్లుఅచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు జలాశయంలోనే కాదు. ఇటీవల కాలంలో ప్రాజెక్టు మీదకు కూడా మొసళ్లు వస్తున్నాయి. ఈ ప్రాంతం రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు కావడంతో రాకపోకలు కొనసాగించాలంటే ప్రాజెక్టు మీద నుంచే వెళ్లాలి. కొంత మంది ప్రాజెక్టు మీదుగా నడిచి కూడా వెళుతున్నారు. ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా మొసళ్లతో ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని వాహనారులు, పాదచారులు గుర్తుంచుకోవాలి.ఆలయ నిర్మాణానికి విరాళంనరసరావుపేట రూరల్: ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన వేమ వెంకటేశ్వరరావు, నాగ రజిని దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు. ఆలయ ఈవో నలబోతు మాధవిదేవిని మంగళవారం ఆలయ కార్యాలయంలో కలిసిన దాతలు విరాళం మొత్తాన్ని అందించారు. ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని ఈ సందర్భంగా ఈవో కోరారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కొత్తలంక కార్తికేయ శర్మ, నండూరి కాళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఐషర్ లారీలో మంటలునరసరావుపేట రూరల్: షార్ట్ సర్కూట్తో మంటలు చెలరేగి ఓ లారీ దగ్ధమైన ఘటన కోటప్పకొండ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాలు... బొప్పాయి లోడ్ కోసం పశ్చిమబెంగాల్ నుంచి ఐషర్ వాహనం కోటప్పకొండకు వచ్చింది. లారీని రోడ్డు పక్కన నిలిపి డ్రైవర్, క్లీనర్ టిఫిన్ చేస్తుండగా ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. సమీపంలోని వారు గమనించి మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఇంజిన్, క్యాబిన్కు మంటలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీధర్ పరిశీలించారు.భక్తి శ్రద్ధలతో చండీహోమంనగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు బృందావన్గార్డెన్స్లోని వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో చండీహోమం నిర్వహించా రు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ హోమం చేపట్టారు. బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులతో తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణా హుతి చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు. -
గుంటూరు వైద్య కళాశాల విద్యార్థుల ప్రతిభ
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న అండర్ గ్రాడ్యుయేట్ గవర్నమెంట్ స్టూడెంట్స్ రీసెర్చ్ స్కీంకు గుంటూరు మెడికల్ కాలేజ్కు చెందిన పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. తమ పరిశోధనా ప్రాజెక్టుల ఆధారంగా ఈ సంవత్సరానికి వారిని ఎంపిక చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తి పెంపొందించడమే ముఖ్య ఉద్దేశంలో ఈ స్కీం అమలు చేస్తున్నారు. విద్యార్థుల ప్రతిపాదనలను కాలేజ్, విశ్వవిద్యాలయ స్థాయి కమిటీలు పరిశీలించాక ఎంపిక చేశారు. ఎంపికై న విద్యార్థులకు మంగళవారం రూ. 10 వేల వంతున చెక్కులను పరిశోధన గ్రాంటుగా అందించారు. ఈ నిధులు ప్రాజెక్ట్ నిర్వహణ, డేటా సేకరణ. ఇతర అవసరాల కోసం వినియోగించనున్నారు. ఈ పథకం ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు పరిశోధన చేసి, తమ ప్రతిభను విశ్వవిద్యాలయ స్థాయిలో చాటనున్నారు. ఇది విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడమేకాకుండా భవిష్యత్తులో మంచి వైద్యులుగా ఎదగడానికి సహాయపడుతుందని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.సుందరాచారి అన్నారు. ఎంపికై న విద్యార్థులను గుంటూరు మెడికల్ కాలేజ్ అధ్యాపకులు అభినందించారు. -
డయేరియాపై అవగాహన కల్పించాలి
గుంటూరు మెడికల్: ప్రజలకు డయేరియాపై అవగాహన కల్పించి వ్యాధి బారిన పడకుండా కాపాడాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు ‘స్టాప్ డయేరియా క్యాంపెయిన్’పై వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ జూన్ 16 నుంచి జూలై 31వ తేదీ వరకు జరిగే క్యాంపెయిన్లో ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో జింక్, ఓఆర్ఎస్ కార్నర్లు ఏర్పాటు చేసి డయేరియాపై అవగాహన కల్పించాలన్నారు. ఓఆర్ఎస్ కార్నర్లు ఏర్పాటు చేయడం ద్వారా పిల్లల్లో సహజసిద్ధంగా కలిగే నీళ్ల విరోచనాలపై తల్లిదండ్రులకు అవగాహన కలుగుతుందన్నారు. క్యాంపెయిన్ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఎంఎల్హెచ్పీలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ. శ్రావణ్ బాబు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఇ.అన్నపూర్ణ, డాక్టర్ రోహిణి రత్నశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
ఖతార్లో ఉద్యోగావకాశాలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఖతార్ దేశంలో టీఐసీ అండ్ ఏ, ఆర్సీ మల్టీ వెల్డర్ సర్వీసుల కింద ఉద్యోగం చేయాలనుకునే పురుష అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తోందని గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ, ఐటీసీ విద్యార్హతలతో 24 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు, సంబంధిత వృత్తి నైపుణ్యంలో నాలుగేళ్ల కనీస అనుభవం ఉండాలని తెలిపారు. టీఐజీ అండ్ ఏఆర్సీ మల్టీ వెల్డర్కు వేతనం నెలకు రూ.51,939 నుంచి, టీఐజీ అండ్ ఏఆర్సీ వెల్డర్కు రూ.42,478 నుంచి ఉంటుందని వివరించారు. కనీసం రెండేళ్లు అక్కడ పనిచేయాల్సి ఉంటుందనానరు. సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యాల ఆధారంగా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత వసతి, భోజన, వైద్య, రవాణా సదుపాయాలతో కూడిన ఈ ఉద్యోగావకాశాల కోసంఅభ్యర్థులు ఈ నెల 25లోపు 99888 53335, 87126 55686 ఫోను నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. ఉపాధి పనుల్లో లోపాలు రికవరీలకు డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి ఆదేశాలు యడ్లపాడు: ఉపాధి హామీ పథకం కింద నిర్వహించిన పనులపై 17వ విడత సామాజిక తనిఖీ నివేదికను ప్రతిపాదిస్తూ ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం బహిరంగ సభ (ప్రజావేదిక) నిర్వహించారు. 024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2025 మార్చి 31 వరకు మండలం పరిధిలో 1125 పనులను రూ.9,40,60,750 ఉపాధి నిధులతో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీ బృందం ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించింది. ఈ పనుల్లో అనేక నిర్వహణ లోపాలు ఉన్నట్లు డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి వెల్లడించారు. ఎంపీపీ పిడతల ఝాన్సీసాగర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎంపీడీవో వి హేమలతాదేవి, ఏపీడీ హీరాలాల్, ఏపీవో విజయకుమారి, ఏపీవో డి సుందర్రావు, టీఏ మాధవి, ఎస్ఆర్పీ బి ఆవులయ్య పాల్గొన్నారు. పీడీ వెల్లడించిన వివరాల ప్రకారం జంగిల్ క్లియరెన్స్ పనులకు సంబంధించి సరైన ఆధారాలు లేకుండానే బిల్లులు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. అలాగే శ్రామికుల మస్టర్లు అసంపూర్ణంగా ఉన్నాయన్నారు. పంటకాల్వల పూడిక తీతల పనుల్లోనూ అవకతవకలు ఉన్నట్లు తేలిందన్నారు. పనుల ప్రదేశాల్లో నేమ్బోర్డుల ఏర్పాటు చేయని విషయాలు వెలుగు చూశాయన్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ పనులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయన్నారు. 5 శాతం రాయితీ జీవోను చూపకుండా 20 శాతం చెల్లింపులు చేయడం వంటి విషయాలు బయటపడ్డాయన్నారు. గత 16వ విడతలో రూ.1.73 లక్షల రికవరిలో ఇంకా రూ.63,390 బకాయి ఉందన్నారు. దీనిని వెంటనే రికవరీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. -
ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడులు
చినగంజాం: రైతులు రాబోయే సీజన్లో పొగాకుకు ప్రత్యామ్నాయంగా వివిధ పంటలు సాగు చేపట్టాలని జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు రత్నకుమారి సూచించారు. మండలంలోని చింతగుంపల, కడవకుదురు గ్రామాల్లో మండల వ్యవసాయాధికారి ఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రత్నకుమారి మాట్లాడుతూ.. మండలంలో పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వాటిలో రైతుల నమోదు ప్రక్రియ జరుగుతోందన్నారు. ముందస్తుగా మార్క్ఫెడ్ నుంచి షెడ్యూల్ ఇస్తామని, ఆ షెడ్యూల్ ప్రకారం పొగాకు కొనుగోలు కేంద్రాలకు ఉత్పత్తులను తీసుకెళ్లాలన్నారు. అనంతరం వేరుశనగ పైరును పరిశీలించి రైతులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే సంవత్సరంలో మొక్కజొన్న తదితర పంటలను సాగు చేసుకోవాల్సిందిగా సూచించారు. కౌలు రైతు కార్డులు పంపిణీ చేస్తున్నామని, అర్హులైన వారు రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో వీఏఏలు సంధ్య, కిషోర్, గ్రామ రైతులు పాల్గొన్నారు. గ్రామాలను తీర్చిదిద్దడమే లక్ష్యం బాపట్ల: గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సమన్వయంతో యంత్రాంగం పని చేయాలని బాపట్ల జిల్లా పంచాయతీ అధికారి కె.ఎల్.ప్రభాకరరావు చెప్పారు. మంగళవారం స్థానిక ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ – 2025 గురించి జరిగిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో డీపీఓ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో తడి, పొడి వ్యర్థాల నిర్వహణ కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల అమలు తీరు పరిశీలన నిమిత్తం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం వస్తోందని తెలిపారు. స్వచ్ఛతపై వివిధ అంశాలను చూసి మార్కులు కేటాయిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి గ్రామాలకు మంచి ర్యాంకులు సాధించాలని సూచించారు. గ్రామీణ మంచినీటి సరఫరా జిల్లా ఎస్ఈ అనంతరాజు మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణం, ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడం వంటి వాటిలో ఉద్యోగులు కృషి చేయాలని కోరారు. డీడీఓలు, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, డెప్యూటీ ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లు, ఎంఆర్సీలు, పంచాయతీ కార్యదర్శులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ‘పశ్చిమ’ సమన్వయకర్తగా అంబటి పట్నంబజారు (గుంటూరుఈస్ట్) : వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే అంబటి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వై.ఎస్.జగన్ సత్తెనపల్లి సీటు ఇవ్వడంతో ఆయన అక్కడ విజయం సాధించారు. కేబినెట్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా అంబటి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత జిల్లా అధ్యక్షులుగా నియమితులైనప్పటి నుంచి అధిష్టానం పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమాల్లో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. -
జీజీహెచ్ సీఎస్ ఆర్ఎంఓ బాధ్యతల స్వీకరణ
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ వైద్యశాల సివిల్ సర్జన్ ఆర్ఎంఓగా డాక్టర్ బుజ్జ వెంకటేశ్వరరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఆయన ఆంధ్ర మెడికల్ కాలేజీలో 1982లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1992లో పీజీ వైద్యవిద్యను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నిమ్స్ మెడికల్ కాలేజీలో చదివారు. 1997లో శంషాబాద్ సివిల్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్గా ప్రభుత్వ సర్వీస్లోకి వచ్చారు. 2006 –10 వరకు గాంధీ అసుపత్రిలో పనిచేస్తూ బదిలీపై ఉమ్మడి రాష్ట్ర సచివాలయంలో స్టాటిటిక్ ప్లానింగ్ విభాగంలో పనిచేశారు. 2012లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పదోన్నతి పొంది రాష్ట్ట్ర వైద్య విద్య సంచాలకుల కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా 2022 వరకు విధులు నిర్వర్తించారు. తర్వాత నుంచి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో సివిల్ సర్జన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పని చేస్తూ బదిలీపై గుంటూరుకు వచ్చారు. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఆయనకు వైద్యులు, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. -
గుంటూరు కాపు హాస్టల్లో ప్రవేశాలకు ప్రకటన
గుంటూరు రూరల్: నగర శివారు గోరంట్ల గ్రామం హోసన్నా మందిరం వెనుక ఉన్న కాపు విద్యార్థి వసతి గృహంలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలగ అభ్యుదయ సంఘం కార్యదర్శి బాలిశెట్టి విజయ్కుమార్ మంగళవారం తెలిపారు. వసతి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ, దూరప్రాంతాలకు చెందిన కాపు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ నుంచి పీహెచ్డీ వరకూ చదువుతున్న విద్యార్థులు, ప్రొఫెషనల్ కోర్సులు చదివేవారు, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, సీపీటీ, సివిల్ సర్వీసులు, గ్రూప్స్, ఎస్ఎస్సీ, బ్యాంక్ పీవో వంటి పోటీ పరీక్షలు రాసేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు ఫోను నంబర్లు 85208 71568, 86865 55999 లలో సంప్రదించాలన్నారు. సమావేశంలో పూరిబండి శ్రీకాంత్, డేగల వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
పౌడా సమావేశంలో 15 అంశాలు ఏకగ్రీవ ఆమోదం
నరసరావుపేట: స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని జేసీ చాంబర్లో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అధ్యక్షతన మంగళవారం పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పౌడా) కమిటీ సాధారణ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన అధికారులు అజెండాలో ప్రభుత్వం విడుదల చేసిన 15 అంశాలపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. పౌడా అభివృద్ధికి చేయాల్సిన అంశాలపై చర్చించారు. సమావేశంలో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రీజినల్ డెప్యూటీ డైరెక్టర్ పి.మధుకుమార్, ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజానాయక్, విద్యుత్శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ సీహెచ్.రాంబొట్లు, పర్యాటక శాఖ జిల్లా అధికారి జి.నాయుడమ్మ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి జి.అనీల్కుమార్, పరిశ్రమల శాఖ జిల్లా అధికారి జి.కృష్ణారావు, పౌడా ప్లానింగ్ అధికారి పాల్గొన్నారు. -
ఆశ వర్కర్లపై రాజకీయ వేధింపులా?
యడ్లపాడు: కూటమి ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆశవర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమారి డిమాండ్ చేశారు. యడ్లపాడు పీఆర్ విజ్ఞాన కేంద్రంలో కె.బుజ్జి అధ్యక్షతన ఆశవర్కర్ల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ చెప్పిన సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆశ వర్కర్ల సమస్యల్ని తప్పక పరిష్కరిస్తామంటూ వాగ్దానం చేసి తీరా అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయినా నేటికీ ఒక్క సమస్యను ముఖ్యమంత్రి పరిష్కరించలేదన్నారు. పైగా రాజకీయంగా స్థానిక టీడీపీ నాయకులే వేధింపులకు గురి చేయడం, ఆశ వర్కర్లను తమ విధుల నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారం చేపట్టాక ప్రస్తుతం చేస్తున్న చిరుద్యోగులను తొలగిస్తున్న విషయాలను గమనించి న్యాయం చేయాలని లేకుంటే ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు రెడ్కార్పెట్ పరుస్తోందని విమర్శించారు. బ్రిటీష్ కాలానికి ముందే పోరాడి, ఎందరో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, కేవలం నాలుగు కోడ్లుగా మార్చి తీరని ద్రోహం చేస్తుందన్నారు. దీనిని నిరసిస్తూ జులై 9వ తేదీన జరిగే ఆశ వర్కర్ల సమ్మెలో అందరూ భాగస్వాములై తమ సమస్యల గళాన్ని ప్రభుత్వానికి వినిపించాలని పిలుపునిచ్చారు. కొత్త కమిటీ ఎన్నిక సమావేశం అనంతరం ఆశ వర్కర్ల నూతన కమిటీ ఎన్నిక జరిగింది. నూతన అధ్యక్షురాలు పి.నాగలక్ష్మి, ఉపాధ్యక్షులు ఎం.మల్లేశ్వరి, పి.సుశీల, ప్రధాన కార్యదర్శి వేళంగిని దేవి, కోశాధికారి, సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఆశవర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమారి యడ్లపాడు పీహెచ్సీలో సమావేశం జూలై 9న సమ్మెకు సిద్ధం కావాలంటూ పిలుపు -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ఈ నెల 26న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు నగరంలో పర్యటించే మార్గాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నగరపాలక సంస్థ నుంచి తగిన ఏర్పాట్లు చేయాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఎం ఆ రోజు నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యానగర్, రింగ్ రోడ్డు, తదితర ప్రాంతాల్లో నగరపాలక సంస్థ అధికారులతో కలిసి మేయర్ పర్యటించారు. నగరపాలక సంస్థ, పోలీస్ విభాగాలు సమన్వయంతో ఎటువంటి సమస్యల తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్ నుంచి జేకేసీ కాలేజీ రోడ్ వైపుగా గుజ్జనగుండ్ల సెంటర్, రింగ్ రోడ్, విద్యానగర్ మెయిన్ రోడ్ వరకు ఏఎస్పీ రమణ మూర్తి, గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్లతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. -
వాగులో లారీ బోల్తా
ప్రత్తిపాడు: వాగులో లారీ బోల్తా పడిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమద్రాసు రోడ్డు వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరు నుంచి గుంటూరు వైపు ధనియాల లోడుతో వెళుతున్న లారీ మంగళవారం రాత్రి ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం లోలెవల్ చప్టా సమీపంలో కొండవాగులో బోల్తా పడింది. చప్టా ఇరుకుగా ఉండటం, ముందు వెనుకలు ఎలాంటి సైన్బోర్డులూ లేకపోవడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి మార్జిన్లు అర్థం కాక లారీ వాగులో బోల్తా పడినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. -
రెచ్చిపోతున్న
బుధవారం శ్రీ 25 శ్రీ జూన్ శ్రీ 2025గుంటూరు జిల్లా పోలీసులు రెచ్చిపోతున్నారు. నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాల్సి ఉన్నా కూటమి పాలకుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. రెడ్బుక్ రాజ్యాంగం అమల్లో అత్యుత్సాహం చూపుతున్నారు. ప్రజలకు రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ గాలికొదిలేసి ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా కేసులు పెడుతున్నారు. అడ్డగోలుగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనపై నానా రాద్ధాంతం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి సంబంధం ఉంటే చాలు.. ఎవరిమీద పడితే వారిమీద కక్ష సాధిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూస్రీల్ -
క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం
కర్లపాలెం: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం కలుగుతాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి చెప్పారు. కర్లపాలెం ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో జరుగుతున్న శ్రీ కోదండరామస్వామి జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు మంగళవారం ముగిశాయి. విజేత జట్టు అయిన ఏట్రవారిపాలెం పులుగు శ్రీనివాసరెడ్డి మెమోరియల్ క్రికెట్ టీమ్కు ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి రూ.30 వేల నగదు బహుమతితోపాటు కప్పు ప్రదానం చేశారు. రన్నర్స్గా నిలిచిన గని ఫ్రెండ్స్ సర్కిల్ ఎంవీరాజుపాలెం జట్టుకు చెన్ను జనార్దన్ స్పాన్సర్ చేసిన రూ.25 వేల నగదు బహుమతి, కప్పును మార్కెట్ యార్డ్ చైర్మన్ దొంతిబోయిన సీతారామిరెడ్డి అందజేశారు. తృతీయ స్థానంలో నిలిచిన ఇండియన్ పెట్రోల్ బంక్ జట్టుకు మార్కెట్ యార్డ్ చైర్మన్ సీతారామిరెడ్డి స్పాన్సర్ చేసిన రూ.15వేల నగదు బహుమతి, కప్పును కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్ సీపీ యువజన విభాగ జోనల్ కన్వీనర్ కల్లం హరికృష్ణారెడ్డి అందజేశారు. నాలుగో స్థానంలో నిలిచిన శివారెడ్డి ఫ్రెండ్ సర్కిల్ నందాయపాలెం జట్టుకు వైఎస్సార్ సీపీ నాయకుడు ఆట్ల హరిబాబురెడ్డి రూ.10 వేల నగదు బహుమతి, కప్పు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ యువకులంతా ఐకమత్యంగా జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించటం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కర్లపాలెం మండల అధ్యక్షుడు యల్లావుల ఏడుకొండలు, మండల పరిషత్ వైస్ ఎంపీపీలు పందరబోయిన సుబ్బారావు, కాగిత బుల్లియ్య, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆట్ల నాగేశ్వరరెడ్డి, పెదపులుగువారిపాలెం సర్పంచ్ అక్కల శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొంతిబోయిన జయభారత్రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు పేరాల వెంకటసురేష్, ఆట్ల పోలిరెడ్డి, పందరబోయిన శ్రీనివాసరావు, మార్పు రత్నం, కమిటీ సభ్యులు ఆట్ల నాగిరెడ్డి, తుమ్మా సుబ్రమణ్యంరెడ్డి, ఆట్ల హరికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి జిల్లా స్థాయి క్రికెట్ పోటీల విజేతగా ఏట్రవారిపాలెం జట్టు -
బర్లీ కొనుగోలులో జాప్యం తగదు
జిల్లా రైతు సంఘం నాయకులు పర్చూరు(చినగంజాం): బర్లీ పొగాకును రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసే విషయంలో జాప్యం చేస్తే తగదని.. మరింత వేగవంతం చేయాలని జిల్లా కౌలు రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు మంగళవారం పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ రైతుల వద్ద నుంచి రోజుకు 200 బేళ్ల చొప్పున మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, ఇదే విధంగా కొనుగోలు సాగితే రైతుల వద్ద ఉన్న పంట అంతా అమ్ముడుపోయేందుకు ఆరు, ఏడు నెలలు పైగానే సమయం పడుతుందన్నారు. జాప్యం చేయకుండా త్వరితగతిన కొనుగోళ్లు పూర్తి చేయాలని కోరారు. రోజుకు కనీసం 1000 బేళ్లు చొప్పున పాగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్క్ఫెడ్ నిర్ణయించిన హై గ్రేడు ధర రూ.12 వేలు, లోగ్రేడ్ ధర రూ.6 వేలు చొప్పున ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నారన్నారు. మధ్య గ్రేడు పొగాకు ధర క్వింటా రూ.9 వేలు నిర్ణయించి కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బండి శంకరయ్య మాట్లాడుతూ పొగాకు రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా పొగాకు కొనుగోలు వేగవంతం చేయడంతోపాటు మరికొన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కే శ్రీనివాసరావు, ఎం డేవిడ్, ఎర్రం శ్రీనివాసరెడ్డి, వీ పుల్లారెడ్డి, కే నాగురు తదితరులు పాల్గొన్నారు. -
బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీలతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వేర్వేరు పాఠశాలలకు బదిలీ అయిన ఉపాధ్యాయులను తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈవో సీవీ రేణుకను కలసి వినతి పత్రం సమర్పించారు. వివిధ కేటగిరీలకు చెందిన 5,147 మంది ఉపాధ్యాయులు బదిలీ కాగా.. వారిలో కొంత మంది బదిలీ అయిన పాఠశాలలకు వెళ్లారన్నారు. మిగిలిన వారిలో ఎక్కువమంది పాతస్థానాల నుంచి రిలీవ్ కాలేదని పేర్కొన్నారు. వీరివల్ల మిగిలిన టీచర్లు సైతం ఆగిపోవాల్సి వస్తోందని, ఎంటీఎస్ టీచర్లతోపాటు సర్ప్లస్లో ఉన్న టీచర్లను సర్దుబాటు చేయడం ద్వారా బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని కోరారు. క్యాడర్ వివరాలు అప్డేట్ చేసి, వేతనాలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల పేర్లను సంబంధిత ప్రైవేటు పాఠశాలలు డ్రాప్బాక్స్లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీఈవోను కలిసిన వారిలో యూటీఎఫ్ నాయకులు జి. వెంకటేశ్వర్లు, కె.సాంబశివరావు, ఎం.గోవిందు, బి. ప్రసాద్, ఎం.కోటిరెడ్డి, కె.ప్రేమ్కుమార్, ధనలక్ష్మి, ప్రసన్న ఉన్నారు. -
ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలి
ిపడుగురాళ్ల: రైతులు విక్రయించిన ధాన్యానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి చెల్లించక పోవడం రైతులను మోసం చేయడమేనని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర వైద్యుల విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ విమర్శించారు. పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రైతులకు మే 9 నుంచి ధాన్యం బకాయిలు చెల్లింపులు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. రబీలో రైతులకు ఇంకా రూ. కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ధాన్యాన్ని అమ్మిన రైతులకు కూటమి ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము చెల్లించకపోవడంతో రైతులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద రైతులు వినతి పత్రాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవట్లేదన్నారు. రబీ పంట డబ్బులు తక్షణం చెల్లించకపోతే రైతులు ఖరీఫ్ సాగు చేయడం కష్టమని తెలిపారు. రైతులు క్రాఫ్ట్ హాలిడే ప్రకటిస్తే ఆహార సంక్షోభం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించాలన్నారు. సాగు చేసుకోవడానికి అందించాల్సిన ప్రభుత్వ ప్రోత్సాహం సాగు సాయం కూడా రైతులకు ప్రభుత్వం అందించట్లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళారీ వ్యవస్థను రద్దుచేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు అందించారన్నారు. రైతుల సాగు చేసిన పంటలు కొనుగోలు జగన్ ప్రభుత్వమే చేసిందన్నారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం రైతుల సమస్యను పరిష్కారం చేసి కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే రైతుల ఖాతాలో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి చింతలపూడి అశోక్ కుమార్ -
కదంతొక్కిన కడలి పుత్రులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: చీరాల టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ఆక్రమించి ధ్వంసం చేసిన ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్ సీ మౌత్ను తక్షణం పురుద్ధరించి వెంకట్రావుతోపాటు భాగస్వామిగా ఉన్న గుంటూరు భ్రమర ఇన్ఫ్రాకు చెందిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ మత్స్యకారులు మంగళవారం బాపట్లలో పెద్దఎత్తున ఆందోళన చేశారు. తీరగ్రామాలకు చెందిన మత్స్యకారులు బాపట్ల చేరుకుని ర్యాలీ చేపట్టారు. పాతబస్టాండు వద్ద ధర్నా నిర్వహించి.. ఆ తర్వాత చీలురోడ్డులో మానవహారం చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్తుండగా.. పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. కలెక్టర్తో చర్చలు జరిపేందుకు వస్తున్నామని ఆందోళనకారులు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. తర్వాత 20 మందిని మాత్రమే కలెక్టర్ కార్యాలయానికి అనుమతిస్తామని చెప్పడంతో అందరినీ అనుమతించాల్సిందేనంటూ అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. కలెక్టర్తో చర్చించేందుకు 25 మందికి అనుమతి లభించడంతో పోలీసులు మత్స్యకార నాయకులతోపాటు ప్రజాసంఘాల వారిని పోలీసులు లోపలికి అనుమతించారు. 2 గంటలపాటు మత్స్యకారులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులతో చర్చించిన కలెక్టర్ వెంకటమురళి ఈపూరుపాలెం సీమౌత్కు అడ్డుగా వేసిన రాళ్లను తొలగించి మత్స్యకారులు తక్షణం వేటకు వెళ్లేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్నారు. తర్వాత జిల్లా అధికారులతో కమిటీ వేసి నెల రోజుల్లో తీరంలో సీఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాలను తేల్చి భూ ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో కాలువ పూడికతీత పేరుతో 500 లారీల ఇసుకను అక్రమంగా తీసుకెళ్లిన వారిపైనా క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఆందోళన నిర్వహిస్తున్న మత్స్యకారులపై పెట్టిన కేసులను సైతం తొలగిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు. -
ట్రిపుల్ ఐటీలో సీట్లకు 89 మంది విద్యార్థుల ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: రాజీవ్గాంధీ సాంకేతిక, విజ్ఞాన విశ్వ విద్యాలయాల్లో (ట్రిపుల్ ఐటీ) ప్రవేశాలకు గుంటూరు జిల్లా నుంచి 89 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 2025–26 విద్యా సంవత్సరానికి సోమవారం ప్రకటించిన జాబితాలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి టెన్త్ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు ఇంటర్మీడియెట్తో పాటు బీటెక్తో ఆరేళ్ల ప్రోగ్రామ్కు అర్హత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు 94.78 శాతం మేరకు ఉన్నట్లు ప్రవేశాల జాబితాలో పొందుపర్చారు. గుంటూరు జిల్లా నుంచి ట్రిపుల్ ఐటీల వారీగా నూజివీడు–31, ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ– 16, ఒంగోలు–35, శ్రీకాకుళంలో–7 చొప్పున ఉన్నారు. ఎంపికై న విద్యార్థులు ఆర్జీయూకేటీ వెబ్సైట్తో పాటు ప్రభుత్వ వాట్సాప్ సేవల నంబరు 95523 00009 ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆయా క్యాంపస్లలో ఈనెల 30 నుంచి జూలై 5వ తేదీ వరకు జరగనున్న కౌన్సెలింగ్కు విద్యార్థులు హాజరు కావాలి. ● గుంటూరు చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని పి.నాగసాయి రోషిణి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల్లో అత్యధికంగా 573 మార్కులు సాధించడం ద్వారా ప్రవేశం పొందిన ఆమెను డీఈవో సీవీ రేణుక, ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి.పద్మజ అభినందించారు. -
27న క్రోసూరులో జాబ్మేళా
క్రోసూరు: డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో క్రోసూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 27న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి.వి.రమాదేవి సోమవారం తెలిపారు. ఈ జాబ్డ్రైవ్ను పెదకూరపాడు నియోజకవర్గ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాబ్ మేళాలో సుమారు 10 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. జీతం విద్యార్హతను బట్టి సుమారు రూ.12000 – రూ.35,000 ఉంటుందని తెలిపారు. ఈ జాబ్ డ్రైవ్కు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ చదువుకుని, 18–40 మధ్య వయసు గల నిరుద్యోగ యువతి యువకులు వారి బయోడేటా, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ నకలు, పాస్పోర్ట్ ఫొటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చునన్నారు. మరిన్ని వివరాలకు 7779858789, 8074393466 నంబర్లలో సంప్రదించాలన్నారు. రైలు నుంచి జారిపడి ప్రయాణికుడు మృతి దాచేపల్లి: రైలు నుంచి జారిపడి ప్రయాణికుడు మృతి చెందిన సంఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. లింగంపల్లి నుంచి నర్సాపూర్ వెళుతున్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలు నుంచి గుర్తు తెలియని ప్రయాణికుడు జారిపడి మృతి చెందినట్లు రైల్వే జీఆర్పీ పోలీసులు తెలిపారు. నర్సాపూర్ రైలు నడికుడి రైల్వే స్టేషన్కు చేరుకునే సమయంలో జనరల్ కోచ్లో ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు రైలు వాకిట్లో కూర్చొని నిద్రపోతూ ప్రమాద వశాత్తూ జారి కిందపడటంతో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతుడి వయస్సు సుమారుగా 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, మృతుడు ఇటుక రంగు పైన ఎరుపు, తెలుపు, నలుపు చెక్స్ బారుచేతుల చొక్కా, బ్లూ రంగు జీన్స్ ప్యాంట్ ధరించాడన్నారు. మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించామని, పూర్తి వివరాలకు నడికుడి రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ వి.శ్రీనివాసరావు నాయక్ తెలిపారు. వివరాలకు 8074274484, 9949063960 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు. ఉరివేసుకుని యువకుడి బలవన్మరణం చిలకలూరిపేట టౌన్: పట్టణంలోని టిడ్కో గృహాల్లో విషాదం చోటు చేసుకుంది. 52 ఎకరాల టిడ్కో గృహాల్లో నివసిస్తున్న యువకుడు దేవగిరి తేజారెడ్డి (28) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్యానుకు లుంగీతో ఉరివేసుకుని తన స్నేహితుడి నివాసంలో జీవితం ముగించుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేజారెడ్డి పర్చూరు మండలం అన్నవరం గ్రామానికి చెందినవాడు. చిన్నతనంలోనే తల్లి మృతిచెందగా, తండ్రి రెండో వివాహం చేసుకుని వేరుగా నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తేజారెడ్డిని నాయనమ్మ పెంచింది. అయితే కొంతకాలం కిందట ఆమె మృతిచెందడంతో అతను పూర్తిగా ఒంటరివాడయ్యాడు. పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగించిన తేజారెడ్డి మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడల్లా టిడ్కో గృహంలో ఉన్న తన స్నేహితుడి వద్దకు వచ్చి ఒకటి రెండు రోజులు ఉండి వెళ్లిపోతాడు. ఇదే విధంగా ఆదివారం స్నేహితుడి ఇంటికి రావడంతో సాయంత్రం 4 గంటలకు మిత్రుడు పనిమీద బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి వచ్చి గది తలుపులు తీయగా తేజారెడ్డి ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు, గుంటూరు మండలం అంకిరెడ్డిపాలెంలో ఉంటున్న అమ్మమ్మకు సమాచారం అందించడంతో ఆమె పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అర్బన్ సీఐ పి.రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. -
వరి విత్తనాలు సిద్ధంగా ఉంచాలి
నరసరావుపేట రూరల్: ఖరీఫ్ సీజన్లో జిల్లాకు సరిపడా వరి విత్తనాలు డీలర్ల వద్ద అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళి సూచించారు. నరసరావుపేట సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో సోమవారం నరసరావుపేట, రొంపిచర్ల, నకరికల్లు మండలాల పరిధిలోని వరివిత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లాలో 53,650 హెక్టార్లలో వరి సాగవుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం 26,825 క్వింటాళ్ల వరి విత్తనం అవసరం అవుతుందని తెలిపారు. ఈ అంచనాల మేరకు బీపీ, జేజీఎల్, కేఎన్ఎమ్, ఎన్ఎల్ఆర్, అంకుర్ సోనా, హెచ్ఎంటీ, బీపీటీ రకాలను డీలర్ల వద్ద అందుబాటులో ఉంచి అవసరం మేర సకాలంలో సరఫరా చేయాలని ఆదేశించారు. విత్తన దుకాణాదారులు ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు విత్తనాలను అధీకృత డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని తెలిపారు. విత్తనాలు కొనుగోలు సమయంలో బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఏడీఏ మస్తానమ్మ, ఏఓలు శాంతి, పి.శివలలిత, వ్యవసాయ విస్తరణ అధికారి బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి మురళి -
28న తెనాలిలో మానవ హక్కుల పరిరక్షణ సదస్సు
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): తెనాలి పోలీసుల అరాచకత్వాన్ని, మానవ హక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ తెనాలి పట్టణంలో జూన్ 28న సాయంత్రం 4 గంటలకు మానవ హక్కుల పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో సోమవారం పరిరక్షణ సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ తెనాలి పోలీసులు దళిత మైనారిటీ యువకులపై అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో, బహిరంగ ప్రదేశాల్లో అరికాళ్లపై లాఠీలు విరిగేటట్లుగా అమానుషంగా దాడి చేసిన సంఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన సీఐ రాముల నాయక్, తెనాలి త్రీ టౌన్ సీఐ రమేష్ బాబులతో పాటు కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. దళిత యువకులపై నడిరోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని సమర్థించి వత్తాసు పలికిన గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మానవ హక్కుల పరిరక్షణ సదస్సులో ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి, దళిత బహుజన ఫ్రంట్, ప్రజాస్వామిక వాదులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో మాల మహానాడు అధ్యక్షుడు తుమ్మల ఫ్రాన్సిస్, కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్, రెల్లి సంఘం అధ్యక్షుడు ఎర్రంశెట్టి ప్రసాద్ పాల్గొన్నారు. – ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు -
సంక్షేమ పథకాలు కోరుతూ ఆందోళన
బాపట్ల: అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులనే పదాన్ని తొలగించి వారికి వేతనాలు పెంపుదల చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రేఖ ఎలిజబెత్, జిల్లా అధ్యక్షురాలు కె.ఝాన్సీ డిమాండ్ చేశారు. సోమవారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు తల్లి వందనం అమలుచేయకుండా మోసం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు నోరు మెదపకపోవడం వల్ల అంగన్వాడీలకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ బాపట్ల జిల్లా అధ్యక్షులు సీహెచ్.మణిలాల్, ప్రధాన కార్యదర్శి సీహెచ్.మంజూదార్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చిరు కార్మికులు సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపడం లేదన్నారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే గత ప్రభుత్వాలకు పట్టినగతే పడుతుంద న్నారు. అనంతరం జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా నాయకులు కే శరత్, శైలశ్రీ, అనిత, వై.మేరీమణి, బ్యూలా, ఎన్.కృష్ణకుమారి, డి.జ్యోతి, బుచ్చిరాజు పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి బాపట్ల: మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాల అమలు చేయాలని కోరుతూ సోమవారం బాపట్లలోని కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ ధర్నా చేశారు. యూనియన్ జిల్లా కన్వీనర్ వీరాస్వామి మాట్లాడుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పక్షపాత వైఖరిని అవలంభిసోందని, మునిసిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు కావట్లేదన్నారు. కేవలం రూ.12వేల నుంచి రూ.15వేలు మాత్రమే వీరి వేతనాలు ఉన్నాయన్నారు. మునిసిపల్ ఇంజినీరింగ్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసి జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్లో డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ మజుందార్, కే శరత్, మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల యూనియన్ నాయకులు కోటేశ్వరరావు, ప్రమీల, మురళి, రత్నం, అంకారావు పాల్గొన్నారు. -
సమ్మెలోకి అవుట్ సోర్సింగ్ కార్మికులు
నెహ్రూనగర్: రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ విభాగ అవుట్ సోర్సింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆదివారం రాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. నగరపాలక సంస్థ కార్యాలయం ముందు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ ఈదులమూడి మధుబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం కార్మికులు, కార్మిక సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఈనెల 9న కమిషనర్కు సమ్మె నోటీస్ ఇచ్చినా స్పందించలేదని విమర్శించారు. కార్మికులకు జీతాలు పెంచమని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. విధి లేని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నట్లు మధుబాబు తెలిపారు. గత ప్రభుత్వం పారిశుద్ధ్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకు, డ్రైవర్లకు అప్పుడున్న జీతంపై రూ.6000 అదనంగా పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో పనులు చేసే కార్మికులకు కమిటీ వేసి దాని సిఫార్సు మేరకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిందని తెలిపారు. ఈనెల రెండో తేదీన జరిగిన జాయింట్ మీటింగ్లో ఈ విషయాన్ని మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లగా ముఖ్యమంత్రితో మాట్లాడి చెప్తామని చెప్పి, ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని వివరించారు. రిటైర్మెంటు వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు వెంటనే గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరినీ హెచ్ఆర్ పాలసీ పరిధిలోకి లేదా మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని కోరారు. సీనియార్టీ ప్రకారం సంవత్సరానికి ఆరు పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇస్తూ జీతాలు చెల్లించాలని లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ గుంటూరు నగరపాలక సంస్థ కమిటీ ప్రధాన కార్యదర్శి రాయపూడి కోటి బాబు, కోశాధికారి నాగిపోగు సుమన్, కార్యనిర్వాహక అధ్యక్షుడు గాలి ఏసుబాబు, సంయుక్త కార్యదర్శి వేపూరి రవిశంకర్ పాల్గొన్నారు. -
బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలి
సచివాలయ ఉద్యోగుల వినతి నెహ్రూనగర్: బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం.5ను సవరించాలని సచివాలయ ఉద్యోగులు విన్నవించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యాలయంలో అదనపు కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా బదిలీలు జరపాలని కోరారు. సొంత మండలాల నిబంధనను తీసివేయాలని, అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సొంత మండలాల ప్రాతిపదికగా కాకుండా అర్బన్ లోకల్ బాడీ(యుఎల్బీ)లోని వార్డును తీసుకోవాలని, గ్రామాల్లో పంచాయతీని ప్రాతిపదికగా తీసుకోవాలని కోరారు. ప్రమోషన్తో పాటు స్పష్టమైన సర్వీస్ రూల్స్ను రూపొందించిన తర్వాతనే బదిలీలు చేపట్టాలని విన్నవించారు. మిగులు ఉద్యోగులను సీనియారిటీ ఆధారంగా వివిధ శాఖల్లోనికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గుంటూరు వార్డు సచివాలయాల అసోసియేషన్ నాయకులు అబ్దుల్ రజాక్, ధనలక్ష్మి, అనురాధ, మధు, రామకృష్ణ, రాజకుమార్ పాల్గొన్నారు. అండర్–14 టెన్నిస్ విజేత విన్సెంట్ గుంటూరువెస్ట్ (క్రీడలు): గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్, వీవీవీ హెల్త్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులో సోమవారం జరిగిన అండర్–14 టెన్నిస్ పోటీల్లో మిక్స్డ్ సింగిల్స్ విజేతగా కె. విన్సెంట్, రన్నర్గా జి.దిశాంత్ నిలిచారు. డబుల్స్ విభాగంలో దిశ, విన్సెంట్ జోడీ విన్నర్గానూ జి.దిశాంత్, కల్యాణీలు రన్నర్స్గా నిలిచారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో విజేతలకు ఆపిల్ డెంటల్ కేర్ అధినేత డాక్టర్ హనుమంతరావు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వీవీవీ హెల్త్ క్లబ్ డెరెక్టర్ హరికృష్ణ, మధుస్మిత, గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్, ఆనంద్ కుమార్, అరుణ్ కుమార్, చరణ్ పాల్గొన్నారు. ‘ఫలక్నుమా’లో ఆరుగురు బాల కార్మికులు గుర్తింపు రాజుపాలెం: నడికూడి గవర్నమెంట్ రైల్వే పోలీసు, గుంటూరు ఆర్పీఎఫ్, బచపన్ బచావో ఆందోళన్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో గుంటూరు నుంచి పిడుగురాళ్ల వరకు ట్రైన్లో రిస్క్ ఆపరేషన్ నిర్వహించగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన ఆరుగురు బాలురను గుర్తించి వారి వివరాలను సేకరించారు. వీరిని ఇతర ప్రాంతాలకు బాల కార్మికులుగా పనిచేయించేందుకు తీసుకెళుతున్నట్లు తెలిసింది. వారివారి గ్రామాలకు పంపించే వరకు మండలంలోని కొండమోడు పరిధిలో గల వీరమ్మ కాలనీలోని అనాధ పిల్లల ఆశ్రమం నిర్వాహకులు గరికపాటి శంకరరావుకు ఆదివారం రాత్రి స్థానిక ఎస్ఐ వేణుగోపాల్ సహకారంతో అప్పగించారు. ఈ బాలురు జార్ఖండ్, బిహార్, వెస్ట్ బెంగాల్కు చెందిన వారిగా గుర్తించారు. వారి తల్లిదండ్రులకు అప్పగించే వారకు జాగ్రత్తగా చూసుకోవాలని ఆశ్రమ నిర్వాహకులకు సూచించారు. తప్పుడు విధానాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం సత్తెనపల్లి: ప్రజలకు సూపరిపాలన అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తప్పుడు విధానాలను అమలు చేస్తుందనిసీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు దూళ్ళిపాళ్ల రమాదేవి విమర్శించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో రమాదేవి ఆధ్వర్యంలో సీపీఎం బృందం సోమవారం పర్యటించింది. అనంతరం సత్తెనపల్లి పుతుంబాక భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉందన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే పేదలందరికీ రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇచ్చి అక్రమ రవాణా అరికట్టవచ్చునన్నారు. రేషన్ షాపుల వద్దకు వెళ్లి బియ్యం తీసుకోవాలంటే ప్రజలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇంటి వద్దకే రేషన్ బియ్యం వాహనాలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారన్నారు. 1 నుంచి 5 తరగతుల వరకు ఉన్న ఎలిమెంటరీ స్కూల్ నుంచి 3,4,5 తరగతులను విడదీసి దూరంగా ఉన్న హైస్కూల్కు తరలించడంతో పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి హామీ కూలీల వేతనాలు 3,4 నెలల పాటు పెండింగ్లో పెడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే పెండింగ్ వేతనాలు వారి అకౌంట్లో జమ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల మాట్లాడుతూ హిందూ మతాన్ని విమర్శిస్తున్న వారి సంగతి తేలుస్తానని అనడం సరికాదన్నారు. దేవుళ్లను, మతాలను రక్షించడానికి పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చారా? లేదా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వచ్చారా? అని ఆమె ప్రశ్నించారు. సీపీఎం పల్నాడు జిల్లా కమిటీ సభ్యురాలు గుంటూరు మల్లేశ్వరి, సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్, పట్టణ కార్యదర్శి డి.విమల తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3,70,41,400
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం (దుర్గగుడి)కి హుండీ కానుకల ద్వారా రూ.3,70,41,400 ఆదాయం లభించింది. ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వర మహామండపం ఆరో అంతస్తులో సోమవారం హుండీ కానుకల లెక్కింపు చేర్చారు. 18 రోజులకు రూ.3,70,41,400 నగదు, 501 గ్రాముల బంగారం, 6,948 గ్రాముల వెండి లభించాయి. కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి శీనానాయక్ పర్యవేక్షించగా అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ రంగారావు, దేవదాయ శాఖ సిబ్బంది, వన్టౌన్ పోలీసులు, ఎస్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు. -
గంగపుత్రులపై కేసులు దుర్మార్గం
చీరాల టౌన్: ప్రకృతి వనరులు దోచుకోవడంతోపాటుగా అధికారమే శాశ్వతం అనుకుని అక్రమాలు చేయడంతోపాటుగా బీచ్నే కబ్జా చేసి మత్స్యకారుల జీవనానికి అడ్డుగా నిలిచి సీ మౌత్ను మూసేసిన బుర్ల వెంకటరావుపై చర్యలు తీసుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఏపీ మత్స్యకార, మత్య్సకార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని విజయలక్ష్మీపురంలోని మత్స్యకారులకు సీపీఎం నాయకులు సంఘీభావం ప్రకటించారు. మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిఽ కొల్లాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారి బుర్ల వెంకటరావు అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతో సముద్రాన్ని కజ్జా చేయడం దారుణమన్నారు. చీరాల, బాపట్ల నియోజకవర్గాల పరిధిలోని 12 మత్స్యకార గ్రామాల ప్రజలు, మెకనైజ్డ్ బోట్లు, 2 వేల మోటార్ బోట్లుతో 14వేల మంది మత్స్యకారులు సముద్రంలో వేట చేస్తున్నారని, వేట అనంతరం బోట్లు, పడవలను ఈపురుపాలెం స్ట్రయిట్కట్ ప్రాంతంలో నిలుపుదల చేస్తున్నాన్నారు. సీఆర్జడ్ పరిధి దాటి సీ మౌత్ను మూసేసి, ఇరిగేషన్ భూమిని ఆక్రమించి మత్య్సకారులు వేటకు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. గంగపుత్రులను సామాజికంగా, ఆర్థికంగా నష్టపరుస్తున్న బుర్ల వెంకటరావుపై కఠిన చర్యలు తీసుకోకుండా అధికారులు, పోలీసులు రక్షణగా నిలవడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్రమణలు, కబ్జాలు, ప్రభుత్వ పెద్ద అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో ఆన్లైన్ చేయించుకున్నారన్నారు. వెంకటరావు ఆగడాలకు అధికారపార్టీ అండగా నిలవడం తగదన్నారు. తమ జీవనానికి ఇబ్బందులు పడుతున్నామని సీమౌల్ మూయవద్దని కోరిన మత్స్యకారులపై కేసులు పెట్టించడం క్షమించరానిదని, మత్స్యకారుల సత్తా ఏంటో చూపుతామని హెచ్చరించారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం, బుర్ల వెంకటరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నామని, మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని స్ట్రయిట్ కట్ మొగ పునరుద్ధరణ సాధన సమతి కన్వీనర్ ఎరిపిల్లి రమణ పిలుపునిచ్చారు. చీరాల–బాపట్ల సరిహద్దు ప్రాంతంలోని సమస్యను అధికారులు పరిష్కరించి మత్స్యకారులకు అండగా నిలవకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మత్స్యకారులు, నాయకులు బాబురావు ఉన్నారు. కబ్జాదారుడు వెంకటరావుపై చర్యలు తీసుకోవాలి లేకపోతే పోరాటం చేస్తాం ఏపీ మత్య్సకార, మత్య్సకార్మిక సంఘం డిమాండ్ -
నమ్మించి..నట్టేట ముంచి...
యద్దనపూడి: ఆరుగాలం కష్టించి రూపాయి రూపాయి కూడబెట్టుకొని కొందరు.. ప్రతి నెలా వచ్చే సామాజిక పింఛన్లో కొంత మిగుల్చుకొని మరికొందరు.. తమ పిల్లల భవిష్యత్ కోసం మరికొందరు నెలనెలా పోస్టాఫీసులో పొదుపు చేస్తూ వస్తున్నారు. వారికి చేయూత అందించాల్సిన పోస్టుమాస్టర్లు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి మోసాలు నియోజకవర్గంలో నాగండ్ల, చెరుకూరు, నాగులపాలెం బ్రాంచ్ల్లో వెలుగులోకి రావడం గమనార్హం. తాజాగా యద్దనపూడి మండలం పూనూరు పోస్టాఫీస్లో పోస్టుమాస్టర్ నకిలీ పాస్పుస్తకాలతో ఖాతాదారులను మోసం చేసిన విషయం వెలుగు చూసింది. పూనూరు పోస్టాఫీసులో కల్యాణ్రావు 22 సంవత్సరాలుగా పోస్టుమాస్టర్గా పనిచేస్తున్నాడు. పోస్టాఫీస్కు వచ్చే వారితో బాగా పరిచయాలు పెంచుకున్నాడు. దీంతో సూమారు 1200కు పైగా ఖాతాదారులు పోస్టుమాస్టర్పై నమ్మకంతో నెలనెలా పొదుపు సొమ్ము కడుతూ వస్తున్నారు. గడువు ముగిసినా నగదు ఇవ్వకపోవడంతో.. గడువు ముగిసినా నగదు ఇవ్వకపోవటంతో కొందరు ఖాతాదారులు చీరాల ఏఎస్పీ శ్రీనివాసరావుకి ఏప్రిల్ నెల15న ఫిర్యాదు చేశారు. 19వ తేదీన తనిఖీకి వచ్చిన శ్రీనివాసరావు విచారణ చేపట్టి జిల్లా ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక ఇచ్చాడు. దీంతో కొందరు ఈ విషయాన్ని విజయవాడలోని పోస్టాఫీస్ ప్రధాన కార్యాలయంలో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. పోస్టాఫీస్ విజిలెన్స్ అధికారులు మే 22వ తేదీన పూనూరు పోస్టాఫీస్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో పోస్టుమాస్టర్ అవినీతి బండారం బట్టబయలైంది. తప్పుడు నివేదిక ఇచ్చిన చీరాల ఏఎస్పీ శ్రీనివాసరావును హిందుపురం బదిలీ చేశారు. పూనూరు పోస్టుమాస్టర్ను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం విచారణాధికారిగా ఒంగోలు ఏఎస్పీ మధుసూదనరావును వేశారు. కానీ విచారణ మాత్రం నత్తనడకన సాగటంతో ఖాతాదారులు తమ సొమ్ము వస్తుందో రాదోనంటూ భయపడుతున్నారు. చేతివాటం ప్రదర్శిస్తున్న పోస్టుమాస్టర్లు తాజాగా పూనూరు పోస్టుమాస్టర్ లీలలు నకిలీ పాస్పుస్తకాలతో ఖాతాదారులకు శఠగోపం లబోదిబోమంటున్న ఖాతాదారులు కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ అవకతవకలు వాస్తవమే.. పూనూరు పోస్టాఫీస్లో అవకతవకలు జరిగిన మాట వాస్తవమే. 1200 మంది ఖాతాదారులు ఉండగా ఇప్పటి వరకు 50 శాతం పుస్తకాలు పరిశీలించాం. పూర్తిస్థాయి విచారణ ముగియగానే ఆధారాలు ఉన్నవారికి తిరిగి వడ్డీతో సహా నగదు చెల్లిస్తాం. చాలా మంది ఆధారాలు లేకుండా డబ్బు ఇచ్చినట్లు ఫోర్జరీ సంతకాలతో నగదు తీసుకున్నాడని చెప్తున్నారని వారిని కూడా పిలిచి ఒక లిస్టు తయారుచేసి న్యాయం జరిగేలా చూస్తాం. –సాధిక్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, ఒంగోలు -
గర్జించిన యువత
వంచనపై నిరసనలతో దద్దరిల్లిన కలెక్టరేట్ ‘‘మేము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం..ఉద్యోగాలు ఇస్తాం...ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి నెలకు రూ.మూడు వేలు ఇస్తాం’’ అంటూ కూటమి నేతలు ఊరువాడా ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను వంచించారు. కూటమి ప్రభుత్వ వంచనపై యువత పోరుబాట పట్టింది. వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పించినా లెక్క చేయక ముందుకు సాగారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. బాపట్ల: యువత, అంగన్వాడీలు, ఇంజినీరింగ్ కార్మికుల ఆందోళనలతో సోమవారం బాపట్ల కలెక్టరేట్ దద్దరిల్లింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, యువతకు ప్రభుత్వం కల్పిస్తామని చెప్పిన నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు సక్రమంగా అమలు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోయింది. తమకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలతోపాటు మున్సిపల్ కాంట్రాక్టు ఇంజినీరింగ్ విభాగం కార్మికులు ధర్నాలు చేపట్టారు. పోలీసులు అనుమతులు ఇవ్వకపోవటంతో ప్లై ఓవర్ వద్దనే నిరసనలు తెలియజేశారు. కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన వారు సైతం ఇబ్బందులకు గురయ్యారు. బాపట్ల: కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన యువత పోరుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి యువత పెద్ద ఎత్తున తరలివచ్చింది. బాపట్ల పట్టణంలో కదం తొక్కారు. కలెక్టరేట్కు వెళ్లే రహదారులన్నీ యువతతో కిక్కిరిసిపోయాయి. పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పించినప్పటికీ యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీ నాయకులు ముందుకు కదిలారు. ప్రదర్శన స్థానిక రథం బజారులోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు సాగింది. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య నాయకత్వంలో వహించారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున, బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు కోన రఘుపతి, వరికూటి అశోక్బాబు, ఈవూరి గణేష్ ప్రారంభించారు. యువత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్గౌడ్కు వినతి పత్రం ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవటంతో ఎట్టకేలకు పదిమంది నాయకులు లోనికి వెళ్లి డీఆర్ఓకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, కోకి రాఘవరెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ నక్కా వీరారెడ్డి, సెక్రటరీ దొంతిబోయిన జయభారత్రెడ్డి, చేజర్ల నారాయణరెడ్డి, జిల్లా అధికారప్రతినిధి వీరేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాదరెడ్డి, శంకర్రెడ్డి, దొంతిబోయిన సీతారామిరెడ్డి, షేక్ సయ్యద్ పీర్, శాయిల మురళి, చల్లా రామయ్య, నియోజకవర్గ అధ్యక్షులు దొంతిబోయిన ఏడుకొండలరెడ్డి, మధు, యువజన విభాగం మండల, పట్టణ అధ్యక్షులు ఊరబండి గోపీనాథ్, రవితేజ, సాగర్, షేక్ మౌలాలి, గోపి, నాయకులు వడ్డిముక్కల డేవిడ్, మహ్మద్ హుస్సేన్, జోగి రాజా, నర్రావుల వెంకట్రావు, మోర్ల సముద్రాల గౌడ్, గంగిశెట్టి రత్తయ్య, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేప్రయత్నం మానుకోవాలి ప్రతిక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం మానుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున అన్నారు. నేడు యువత ఉద్యోగాలు లేక అల్లాడుతుంటే ఇచ్చిన వాగ్దానాలను పెడచెవిన పెట్టి ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందన్నారు. యువతను మోసం చేసిన చంద్రబాబునాయుడు రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించకుండా ఘోరంగా మోసం చేశాడని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోపై నిలదీస్తాం ఎన్నికల మేనిఫెస్టోపై ప్రతిపక్షంగా మేము నిలదీస్తామని బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి పేర్కొన్నారు. ఎన్నికల ముందుకు ఇచ్చిన సూపర్సిక్స్ హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ ఇస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ఉన్న పెన్షన్లు తొలగించేందుకు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. స్థానిక నాయకులు సముద్రాన్ని సైతం కబ్జా చేస్తుంటే అధికారులు మౌనంగా ఉండిపోతున్నారని అన్నారు. వైఫల్యాలను ఎండగడతాం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవటంతో కళాశాలల యాజమాన్యం హాల్ టికెట్లు ఇవ్వడం లేదని రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ఈపూరి గణేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలలను సైతం పట్టించుకోకపోవటంతో అవి శిథిలావస్థకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మందికి వైద్య పరంగా అవకాశాలను కల్పించే మెడికల్ కళాశాలలను పట్టించుకోకపోవటం చూస్తుంటే పేదోడికి వైద్యం అక్కరలేదన్నట్లు ఉందన్నారు. ప్రభుత్వ వైఫలాలను ఎండగట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు అనుమతులు కూటమి ప్రభుత్వం చేపట్టే కోడిపందెలు, పేకాట స్థావరాలకు అనుమతులు ఉంటాయి గానీ, శాంతియుతంగా యువత, నిరుద్యోగులు తమ సమస్యలు చెప్పుకునేందుకు అనుమతులు ఇవ్వకపోవటం బాధాకరమని పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు అన్నారు. పోలీసులు తమ తీరును మార్చుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై గ్రామస్థాయి నుంచి నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రజావ్యతిరేక విధానాలను సహించేదిలేదు కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను యువత చూస్తూ ఊరుకోదని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య అన్నారు. నిరుద్యోగులు ఉపాధి కోసం ఒక పక్కన ప్రశ్నిస్తుంటే వారిపై అక్రమ కేసులు బనాయించటం సరికాదన్నారు. యువత పోరుకు విశేష స్పందన బాపట్లలో నిరుద్యోగుల భారీ ప్రదర్శన జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన యువత అడుగడుగునా పోలీసుల ఆంక్షలు కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు ప్రభుత్వ తీరును ఎండగడుతూ నినాదాలు హోరెత్తిన కలెక్టర్ ప్రాంగణం యువతకు అండగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉద్యోగాల కల్పన ఏదీ? వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేరుగ చంద్నాగ్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందుకు చంద్రబాబునాయుడు యువతకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదన్నారు. లక్షలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా వివిధ సాకులు చూపి చిరుద్యోగులను తొలగిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఏడాది గడిచినా దాని ఊసేత్తడం లేదని అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కేసులు మోపి జైళ్లకు పంపుతున్నారని విమర్శించారు. -
కాలువల మరమ్మతులకు చర్యలు తీసుకోండి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): జిల్లాలో సాగునీటి కాలువలు మురుగునీటి మయమై ప్రజారోగ్యానికి ముప్పుగా మారాయని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి కె.వి.వి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. పశ్చిమ కృష్ణా డెల్టా ఆయకట్టు సుమారు 5.71 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉందని తెలిపారు. కాలువలు సక్రమంగా లేకపోవడంతో ఆయకట్టు రైతులంతా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి సాగునీటి కాలువల పరిస్థితి నిదర్శనమని విమర్శించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి జమలయ్య ,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వి.జగన్నాథం, అధ్యక్షులు కంజుల విఠల్రెడ్డి, నాయకులు పాపారావు, రైతులు పాల్గొన్నారు. హైవేలపై ప్రమాదాల నివారణకు ఆధునిక వాహనాలు ఆర్టీఓ బి.సత్యనారాయణ ప్రసాద్ పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): జాతీయ రహదారులపై ప్రమాదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధునిక వాహనాలను ప్రవేశపెట్టినట్లు ఆర్టీఓ బి.సత్యనారాయణ ప్రసాద్ తెలిపారు. గుంటూరులోని కార్యాలయంలో సోమవారం నంది ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగు పెట్రోలింగ్ ఆధునిక వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వాహనాలు 5, 9 నంబర్ల జాతీయ రహదారులపై నిత్యం అందుబాటులో ఉంటాయని చెప్పారు. నంది ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ సర్వీసెస్ ఎండీ, విశ్రాంత అడిషనల్ ఎస్పీ కాళహస్తి సత్యనారాయణ పాల్గొన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ముందుగా బ్రిడ్జి మీదకు బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు రాకుండా డైవర్ట్ చేశారు. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా లాడ్జి సెంటర్ వద్ద, డొంక రోడ్డు నుంచి కొత్తపేట వైపు వెళ్లేటప్పుడు మలుపుల వద్ద డివైడర్లు ఏర్పాటు చేశారు. నాట్యంపై రాత పరీక్షలు ప్రారంభం కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠంలో మూడు రోజుల పాటు సాగే కూచిపూడి నాట్య సర్టిఫికెట్, డిప్లమో రాత పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు పరిశీలకులుగా హైదరాబాద్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డి. వెంకట సత్యనారాయణ, ఇన్విజిలేటర్లుగా పసుమర్తి హరినాధశాస్త్రి, ఏలేశ్వరపు శ్రీనివాసులు వ్యవహరిస్తున్నారు. తొలి రోజు పరీక్షకు 37 మంది విద్యార్థులకు 31 మంది హాజరయ్యారని ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ తెలిపారు. -
ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ నాయుడమ్మ
తెనాలి: పట్టణానికి చెందిన ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ 40వ వర్ధంతిని సోమవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. ప్రొఫెసర్ వి.బాలమోహన్దాస్ సెమినార్ హాలులో ఉదయం 11 గంటలకు ఏర్పాటయే సభలో డాక్టర్ నాయుడమ్మపై రూపొందించిన సావనీరును ఆవిష్కరిస్తారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.గంగాధర్రావు, చైన్నెలోని సీఎస్ఐఆర్–సీఎల్ఆర్ఐ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ స్వర్ణ వి.కాంత్ పాల్గొంటారు. కార్యక్రమాన్ని యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. తోలు పరిశ్రమకు సాంకేతిక పరిజ్ఞానం తోలు శుద్ధి చేసే ప్రక్రియకు సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తే పరిశ్రమకు సమస్యగా ఉన్న మకిలి మాయమైంది. కొన్ని వర్గాలకే పరిమితమైన చర్మ పరిశ్రమ అందరిదైంది. చర్మకారుల నైపుణ్యం పెరిగింది. కులాని కతీతంగా చర్మ పరిశ్రమ విస్తరించి, ఆ రంగంలోనూ దేశానికి కీర్తిని తీసుకొచ్చింది. నిశ్శబ్దంగా సాగిన ఈ విప్లవాన్ని సాధించిన ఘనత ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మకు దక్కుతుంది. ‘జన్మతః రైతును...వృత్తిరీత్యా అస్పృశ్యుడను’ అని చెప్పుకున్న నాయుడమ్మ, తన వృత్తితో చర్మ పరిశ్రమను ఇతర పరిశ్రమలకు దీటుగా తీర్చిదిద్దారు. గుంటూరు జిల్లా ముద్దుబిడ్డ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అమృతలూరు మండల గ్రామం యలవర్రు డాక్టర్ నాయుడమ్మ స్వస్థలం. 1922 సెప్టెంబరు 10న జన్మించారు. దగ్గర్లోని తురుమెళ్లలో హైస్కూలు విద్య, గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ తర్వాత, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కెమికల్ టెక్నాలజీలో బీఎస్సీ చేశారు. 1943లో చైన్నెలో లెదర్ టెక్నాలజీలో చేరారు. అమెరికాలోని లీహై విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ చర్మశుద్ధిపై ఎంఎస్, డాక్టరేట్ పొందారు. 1951లో తిరిగొచ్చి, చైన్నెలోని కేంద్ర చర్మ పరిశోధన సంస్థ (సీఎల్ఆర్ఐ)లో శాస్త్రవేత్తగా చేరారు. ఆ సంస్థను సాటిలేని పరిశోధన సంస్థగా రూపొందించే కృషితో 1958లో అదే సంస్థ డైరెక్టర్గా నియమితులయ్యారు. పరిశోధనలు చర్మకారులకు వరప్రసాదాలు నాయుడమ్మ పరిశోధనలు దేశీయ చర్మ పరిశోధనకు, చర్మకారులకు వరప్రసాదాలు. ఆయన సారథ్యంలో సీఎల్ఆర్ఐ సంస్థ, పారిశ్రామికాభివృద్ధి, గ్రామీణాభివృద్ధిలో గణనీయమైన పాత్ర వహించింది. పలు దేశాలు చర్మ సంపద సద్వినియోగానికి నాయుడమ్మ సలహాలను స్వీకరించాయి. ఐక్యరాజ్య సమితి సలహాదారుగా వివిధ దేశాల్లో తోళ్ల పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడ్డారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ శాస్త్రసాంకేతిక విషయాల శాఖ కార్యదదర్శిగా, భారత విజ్ఞానశాస్త్ర పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్గా ఏకకాలంలో ఆరుసార్లు పనిచేశారు. సీఎస్ఐఆర్ డీజీ ఇరత దేశాల్లో ఉన్నతోద్యోగాల్లో ఉన్న భారతీయ శాస్త్ర సాంకేతిక నిపుణులను స్వదేశానికి రప్పించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. శాస్త్ర సాంకేతిక కమిటీకి రథసారథి 1980లో అభివృద్ధి చెందిన దేశాల్లోని శాస్త్ర సాంకేతిక కమిటీకి అధ్యక్షులుగా నాయుడమ్మ అనేక సృజనాత్మక పథకాలను ప్రవేశపెట్టారు. ఆసియా ఖండానికి చెందిన అసోసియేషన్ ఫర్ సైన్స్ కో–ఆపరేషన్కు వ్యవస్థాపక సభ్యునిగా వ్యవహరించారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ఛాన్సలర్గా, ఐక్యరాజ్యసమితి సీనియర్ సలహాదారుగా, కెనడాలోని అంతర్జాతీయ అభివృద్ధి పరిశోధన కేంద్రం గవర్నర్గా, సైన్స్ టెక్నాలజీ హైపర్ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవ సలహాదారుగా పనిచేశారు. చర్మవిజ్ఞానంపై 200 పరిశోధన పత్రాలు, 100 వ్యాసాలను సమర్పించారు. నాయుడమ్మ కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వ పద్మశ్రీ గౌరవం సహా ప్రతిష్టాత్మక రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డును, పలు యూనివర్సిటీల గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. 1985లో జూన్ 23న ఆయన ప్రయాణిస్తున్న ఎంపరర్ కనిష్క–బోయింగ్ 747 విమానం బాంబు పేలుడుకు గురై పేలిపోయింది. దేశం ఒక మహోన్నత శాస్త్రవేత్తను కోల్పోయింది. దేశంలో తోలు పరిశ్రమ అభివృద్ధికి కృషి నేడు 40వ వర్ధంతిని ఏఎన్యూలో నిర్వహిస్తున్న సందర్భంగా నివాళి -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
రెంటచింతల: రెంటచింతల గ్రామ సమీపంలోని గొట్టిముక్కల మేజర్ కాలువ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఆంజనేయస్వామి మాన్యం కాలనీకి చెందిన దేవరకొండ నాసరయ్య నర్సరీ పనులు ముగించుకుని నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా దుర్గి మండలం ఓబులేశునిపల్లెకు చెందిన గాజుల ఆంజనేయులు ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తూ బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. నాసరయ్యకు ఎడమకాలు విరిగింది. ఆంజనేయులుకు తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 ద్వారా గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
దాచేపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన శనివారం రాత్రి జరిగింది. దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వంగూరు మరియదాసు కుమారుడు యశ్వంత్(18) ఈ దుర్ఘటనలో మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యశ్వంత్ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని నీట్ ప్రవేశ పరీక్ష రాసి ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి అతను ఇద్దరు స్నేహితులతో కలిసి వాహనంపై దాచేపల్లి వచ్చారు. తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో దాచేపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ముందుగా కట్టెల లోడుతో వస్తున్న ఎద్దుల బండిని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో యశ్వంత్ కడుపులోకి కట్టె దిగబడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. యశ్వంత్ని వైద్యం కోసం నరసరావుపేట తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం యశ్వంత్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. చదువులో చక్కగా రాణిస్తూ కుటుంబానికి అండగా ఉన్న యశ్వంత్ మృతితో తంగెడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
‘ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు అధికమయ్యాయి’
గుంటూరు ఎడ్యుకేషన్: దేశంలో యాభై ఏళ్ల కిందట నెలకొన్న పరిస్థితులతో పోల్చితే ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఇప్పుడే ఎంతో ఉందని పూర్వ విప్లవ విద్యార్థి వేదిక రాష్ట్ర కన్వీనర్ భరద్వాజ పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు మెడికల్ కళాశాల ఎదుట ఉన్న ఎన్జీవో కల్యాణ మండపంలో యాభై ఏళ్ల విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నవజ్యోతి అధ్యక్షతన జరిగిన సదస్సులో భరద్వాజ మాట్లాడారు. మావోయిస్టులు శాంతి చర్చలకు ముందుకు వచ్చినా కేంద్రం వారిని అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో మావోయిస్టులతో చర్చలు జరిపి, వారిని జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారని గుర్తు చేశారు. ఎల్టీటీఈతో పాటు అనేక వేర్పాటువాద ఉద్యమాలు నిర్వహించిన సంస్థలతో సైతం చర్చలు జరిపిన ప్రభుత్వాలు ప్రస్తుతం మావోయిస్టులతో చర్చలకు అంగీకరించేది లేదని చెప్పడం వెనుక కార్పొరేట్ సంస్థల ఒత్తిడి కారణమని పేర్కొన్నారు. వీక్షణం పత్రిక సంపాదకుడు వేణుగోపాల్ మాట్లాడుతూ యాభై ఏళ్ల వామపక్ష విద్యార్థి ఉద్యమ ప్రస్థాన యాత్రలో సాధించిన ఎన్నో విజయాలను తెలియజేశారు. ఇప్పటికీ రాడికల్స్ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారని పేర్కొన్నారు. నేడు ఎందరో త్యాగమూర్తులు అమరులయ్యారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని పూర్వ విద్యార్థి నాయకులుగా మన కర్తవ్యాన్ని నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. విరసం నాయకులు సీఎస్ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యమంలో ఒడిదుడుకులు వస్తుంటాయని, అంతమాత్రాన అది ముగిసిపోయినట్లు కాదని, ఉద్యమ వారసత్వ పరంపర కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం నాయకులు వెంకటేశ్వరరావు, డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ ఆర్ఎస్యూ విజయాల్ని మననం చేసుకున్నారు. మధ్యాహ్నం జరిగిన సెషన్కి న్యాయవాది సురేష్ అధ్యక్షత వహించారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం ప్రజలపై యుద్ధం చేస్తోందని విమర్శించారు. ప్రజలకు మద్దతుగా నిలిచిన మావోయిస్టులను, వారితో పాటు అమాయక గిరిజనులను హత్య చేస్తోందని ఆరోపించారు. ప్రజలను అణచివేయడం కోసమే ప్రభుత్వాలు మావోయిస్టులపై దాడి చేస్తున్నాయనే వాస్తవం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. కార్యక్రమంలో విరసం రాష్ట్ర కార్యదర్శి రివేరా, కార్యవర్గ సభ్యుడు పాణి, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన నాట్య మండలి కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు ఆకట్టుకున్నాయి. పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక రాష్ట్ర కన్వీనర్ భరద్వాజ -
తెలుగు ప్రాచీనతకు దర్పణం ‘వ్యాస మంజూష’
అద్దంకి: తెలుగు సాహిత్యంలోని ప్రాచీనతను తెలియజేస్తూ దాన్ని నూతన దృక్పథంతో ఆవిష్కరించిన పుస్తకమే ‘వ్యాస మంజూష’ అని సాహితీవేత్త, శాతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం అన్నారు. డీవీఎం సత్యనారాయణ రచించిన ‘వ్యాస మంజూష’ పుస్తక పరిచయ సభ పుట్టంరాజు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. ఈసభా కార్యక్రమానికి సాహితీవేత్త మోటుపల్లి రామదాసు అధ్యక్షత వహించారు. ప్రముఖ సాహితీ విమర్శకుడు నారాయణం బాలసుబ్రహ్మణ్యం ‘వ్యాస మంజూష‘లోని ప్రత్యేకతలను సభకు వివరించారు. గాడేపల్లి దివాకరదత్తు, ఆర్వీ రాఘవరావు, జాగర్లమూడి ప్రతాప్ వంటి సాహితీ ప్రియులు తమ లఘు పరిచయాలతో పుస్తకంలోని విశేషాలను వివరించారు. శ్రీనాథుని కనకాభిషేక విశేషాల నుంచి ‘పాయసమెరుక’ చర్చకు అన్న పద్యం వరకు వీనుల విందుగా చదివి వివరించారు. ఈ గ్రంథంలో శ్రీనాథుని ప్రాచీన కవిత్వాన్ని అత్యంత లోతుగా అధ్యయనం చేసిన రచయిత, శ్రీనాథ–పోతనల సాహితీ బంధాన్ని విశ్లేషించారని సాహితీవేత్తలు ప్రశంసించారు. రచయిత సత్యనారాయణ కవిత్వం ఆలోచింపజేస్తుంది.. శ్రీనాథుని రచనలలో ప్రత్యక్షమైన ఆంధ్ర వంటకాల ప్రస్తావన, అల్లసాని పెద్దన, మొల్ల, గురజాడ, విశ్వనాథ, త్యాగయ్య, అన్నమయ్య వంటి కవుల విశేషాల గురించి రచయిత చేసిన ప్రయత్నం పాఠకులను ఆకట్టుకునేలా ఉందని సాహితీవేత్తలు కొనియాడారు. డీవీఎం సత్యనారాయణ వాచో విధేయత, నిత్య పరిశీలన, వినయ శీలత, ప్రజాకర్షణ పటిమలు ఆయనను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖ్యాతిని సాధించే సాహితీశిఖరంగా తీర్చిదిద్దగలవని వక్తలు ప్రశంసించారు. సభ అనంతరం పుట్టంరాజు బుల్లెయ్య–రామలక్ష్మమ్మల ట్రస్టు తరఫున శ్రీరామచంద్రమూర్తి, శైలజ రచయితను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సాహితీ కౌముది అధ్యక్షుడు వారణాసి రఘురామశర్మ, కార్యదర్శి కేవీ పోలిరెడ్డి, కోశాధికారి చుండూరి మురళీసుధాకరరావు, నిమ్మరాజు నాగేశ్వరరావు, పాటిబండ్ల శ్రీమన్నారాయణ, గోగులమూడి శేషగిరి, ఆర్టిస్టు బాలు, పీసీ హెచ్ కోటయ్య, కే రామమోహనరావు ఎ.యోగయ్య, మలాది శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య, మక్కెన వెంకటేశ్వర్లు, వినుకుండ సుధాకర్, అళహరి హరిప్రసాద్బాబు, కందికట్టి సత్యనారాయణ, పెండ్యాల అంకయ్య, కేఎస్ఆర్ కోటేశ్వరరావు, పుట్టంరాజు సాయికుమార్, బాచిన పూర్ణచంద్రరావు, కూరపాటి రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ‘వ్యాస మంజూష’ పుస్తకావిష్కరణ రచయిత సత్యనారాయణకు సత్కారం -
సీఎం పేషీ అక్షింతలతోనే నాయకుల్లో చలనం
పిడుగురాళ్ల: వైఎస్సార్ వైద్యశాల, కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని చేపట్టిన సెల్ఫీ వీడియో ఉద్యమంతో సీఎం పేషీ నుంచి అక్షింతలు పడడంతో స్థానిక నాయకుల్లో చలనం వచ్చిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తాను చేపట్టిన సెల్ఫీ వీడియో ఉద్యమంతో సీఎం కార్యాలయం నుంచి ఆక్షింతలు పడటం వలనే స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వంలో చేపట్టిన వైఎస్సార్ వైద్యశాల, కళాశాలను పరిశీలించినట్లు చెప్పారు. అయితే మెడికల్ కాలేజీ 2019 జనవరి 20న మంజూరు అయిందని శ్రీనివాసరావు చెబుతన్నారని, కనీసం పేపర్ చూసి కూడా చదవలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. మొన్నటి వరకు రాయపాటి శ్రీనివాస్ మంజూరు చేయించాడని చెప్పుకొచ్చారని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీ మీద అవగాహన లేకపోవడం హాస్యాస్పదం అన్నారు. మూడేళ్లలో 70శాతం పనులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 20 మార్చి 2020లో పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నం కేంద్ర ప్రభుత్వం నిధులతో మంజూరు చేసినట్లు వివరించారు. 2020 జనవరిలో కరోనా వచ్చిందని, 2021 కరోనా వలన పనులు చేపట్టలేకపోగా, మిగిలిన మూడేళ్లలోనే మెడికల్ కాలేజీ 60 నుంచి 70 శాతం పనులు పూర్తి చేశామన్నారు. హాస్పటల్ను 90 శాతం పూర్తి చేశామని కాసు మహేష్రెడ్డి పేర్కొన్నారు. ప్రజల పక్షాన పోరాటం.. ఏది ఏమైనా ప్రతిపక్షమా, పాలకపక్షమా కాకుండా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని కాసు పేర్కొన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలో కప్పం కట్టాలని 40 రోజులు మూసి వేయించింది మీరు కాదా అని ప్రశ్నించారు. చివరికి వైఎస్సార్ సీపీతరఫున మేము ఉద్యమం చేస్తాం అనగానే తెల్లారే ఓపెన్ చేయించారని గుర్తు చేశారు. జానపాడు ఆర్ఓబీని రూ.52 కోట్లతో పనులు మొదలు పెడితే సంవత్సరం నుంచి ఆపివేశారని ఆరోపించారు. తిరిగి మళ్ళీ మేమే ఆర్ఓబీ నిర్మించకపోతే ఉద్యమం చేస్తాం అనగానే వెంటనే నిర్మాణ పనులు మొదలుపెట్టారని పేర్కొన్నారు. అదేవిధంగా మెడికల్ కాలేజ్ సెల్ఫీలు విడుదల ఉద్యమం చేపట్టడంతో నేడు సీఎం కార్యాలయం నుంచి అక్షింతలు పడటంతో యరపతినేని సందర్శించడం జరిగిందని కాసు మహేష్ రెడ్డి ఆ వీడియోలో వివరించారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి
అమరావతి: వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. మండలంలోని నరుకుల్లపాడులో ఆదివారం వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. వివరాలు.. మండలంలోని నరుకుళ్లపాడుకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నల్లిబోయిన వినోద్, గుంటూరులోనూ, బోదా గోపి, సుద్దపల్లిలోనూ గత ఏడాదిగా తలదాచుకుంటున్నారు. శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడి వెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు వెంకటేశ్వర్లు, తిరుపతిరావు, సీతరామయ్య మరి కొంతమంది నల్లిబోయిన వెంకటసుబ్బారావు, పెదవీరబాబు, చినవీరబాబు ఇంటిమీద దాడికి వెళ్లారు. మధ్యాహ్నమే వినోద్, గోపిలు వెళ్లిపోయారని తెలుసుకుని వారి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకుని పోలీసులు రావటంతో గొడవ సద్దుమణిగింది. ముందు జాగ్రత్త చర్యగా సీఐ అచ్చియ్య శనివారం రాత్రి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వైఎస్సార్ సీపీకి చెందిన బొంతా శ్రీను, ఇంటి ముందు కూర్చుని పేపర్ చదువుకుంటుండగా టీడీపీ చెందిన చింకా వెంకటేశ్వర్లు కర్రతో దాడి చేయగా అతని ఎడమ చేతికి గాయమై అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఇరువర్గాలను బైండోవర్ చేసినట్లు సీఐ అచ్చియ్య తెలిపారు. -
గీత కార్మికుల సమస్యలపై దృష్టిసారిస్తాం
ఏపీ గీత కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి నిజాంపట్నం: గీత కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఏపీ గీత కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి అన్నారు. మండలంలోని కళ్లిఫలం గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించి గీత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుందన్నారు. గీత కార్మికుల ఉత్పత్తులను గుర్తింపు తీసుకువస్తామని పేర్కొన్నారు. తాటి కల్లు నుంచి తాటి బెల్లం తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో న్యాయవాది సుభాషిణి, టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్, కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు, తదితరులు పాల్గొన్నారు. ఖతార్లో ఉద్యోగాలకు అవకాశం క్రోసూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) ఖతార్ దేశంలో వెల్డర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా అధికారి తమ్మాజీరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 24 నుంచి 45 సంవత్సరాలు, పురుషులు ఐటీఐ లేదా ఐటీసీ, పూర్తి చేసి 4 సంవత్సరాలు అనుభవం ఉండాలని చెప్పారు. నిబంధనల మేరకు పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నెల 25 వ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. http// nai punyam.ap.gov.in రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వివరాల కోసం 9988853335, 8712655686, 8790118349, 8790117279 సంప్రదించాలని కోరారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం నూజెండ్ల: నూజెండ్ల మండలం త్రిపురాపురం గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన సంఘటన ఆదివారం జరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఐనవోలు ఎస్సై బీవీ కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం.. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో గుర్తు పట్టలేని విధంగా ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం అనంతరం వివరాలు అందజేస్తామన్నారు. -
సైక్లింగ్ చాంపియన్ షిప్ నిర్వహణ అభినందనీయం
చీరాల: నియోజకవర్గంలో మొదటిసారిగా చీరాల సైక్లింగ్ చాంపియన్ షిప్–2025 పోటీలను ఆదివారం ప్రారంభించారు. వాడరేవు నుంచి ప్రారంభించిన ఈ పోటీలను ఎమ్మెల్యే ఎంఎం.కొండయ్య జెండా ఊపి ప్రారంభించారు. పోటీలను 60 కిమీ, 20 కిమీల విభాగంలో నిర్వహించారు. పంజాబ్, కేరళ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణా, ఏపీ రాష్ట్రాల నుంచి సైక్లింగ్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన విజేతలకు నగదు బహుమతులు, మెమోంటోలను ఎమ్మెల్యే కొండయ్య, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మలు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారులు, నాయకులు పాల్గొన్నారు. 60 కిమీ విభాగంలో విజేతలు సిద్ధార్థ్ లింగ్ (కర్ణాటక) రూ.లక్ష, అర్హద్ ఫరీద్ (ఢిల్లీ) రూ.50 వేలు, నవీన్ కర్ణాటక రూ.30 వేలు, 20 కిమీల విజేతలు ఎస్.అబ్రహాం (తమిళనాడు) రూ.50 వేలు, రాజు పాండీ (తమిళనాడు) రూ.30 వేలు, సోహెల్ రియాజ్ (మహారాష్ట్ర) రూ.20 వేలు బహుమతులు గెలుచుకున్నారు. చీరాల ఒన్టౌన్, రూరల్ సీఐలు ఎస్.సుబ్బారావు, పీ శేషగిరిరావు, ఎస్సైలు ఎ.చంద్రశేఖర్, పీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. పంజాబ్, కేరళ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి క్రీడాకారుల రాక -
వైఎస్సార్ మెడికల్ కళాశాల పనులు పూర్తి చేయాలి
పిడుగురాళ్ల: డాక్టర్ వైఎస్సార్ మెడికల్ కళాశాల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం పల్నాడు హాస్పిటల్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఏకకాలంలో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం గొప్ప విషయమని అన్నారు. పల్నాడు ప్రజలకు హెల్త్ కేర్ యాక్సెస్ ప్రతి ఒక్కరికి అందుతుందని చెప్పారు. వైద్య విద్య, ఉపాధి, అభివృద్ధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎక్కడ ప్రమాదాలు చోటుచేసుకున్నా గుంటూరు వరకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని గుర్తు చేశారు. ప్రస్తుతం మెడికల్ కాలేజ్ నిర్మాణ పనుల గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష నిర్వహించి గతప్రభుత్వంలో 30 శాతం మాత్రమే పూర్తిందనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ ఆస్పత్రి అందుబాటులోకి తీసుకురాకపోతే గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో కలసి ప్రత్యక్ష పోరాటానికి దిగితామని ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ హెచ్చరించారు. డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ -
లాభాల తీపి పంచుతున్న నల్ల చెరకు
బల్లికురవ: ఆహార ధాన్యమైన వరి సాగుకు పెట్టుబడులు పెరగటం, గిట్టుబాటు ధర దక్కనందున రైతులు నల్లచెరకు వైపు చూస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలో తిరనాళ్లు, జాతర్లలో అమ్మే నల్లచెరకు సాగు విస్తీర్ణం ఏటికేడు పెరుగుతోంది. 18 ఏళ్ల క్రితం మండలంలోని కూకట్లపల్లి, గొర్రెపాడు గ్రామాల్లో 15 ఎకరాల్లో చేపట్టిన సాగు నియోజకవర్గంలోని బల్లికురవ, అద్దంకి మండలాల్లో 960 ఎకరాలకు చేరింది. సారవంతమైన భూముల ఎంపికతో.. నీటి వసతి, సారవంతమైన భూములను చెరుకు సాగుకు ఎంపిక చేస్తారు. వేసవి దుక్కుల అనంతరం ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు తోలి భూముల్లో చల్లారు. తర్వాత మే రెండవ వారంలో కురిసిన వర్షాలకు ట్రాక్టర్తో చెరుకు ముక్కలు నాటేందుకు బోదెలు చేశారు. ఆ బోదెల్లో నీటిని వదులుతూ అడుగు ముక్కలను ఎకరాకు 8 వేల నుంచి 9 వేల వరకు నాటుతున్నట్లు రైతులు తెలిపారు. 960 ఎకరాల్లో సాగు.. బల్లికురవ మండలంలోని గొర్రెపాడు, కూకట్లపల్లి, కొత్తూరు, కొప్పరపాడు, వైదన, ఎస్ఎల్ గుడిపాడు, రామాంజనేయపురం, అద్దంకి మండలంలోని శింగరకొండపాలెం, చక్రాయపాలెం గ్రామాలు చెరకు సాగుకు పెట్టింది పేరు. వాతావరణం అనుకూలిస్తే పంట వేసిన ఎనిమిది నెలల నుంచి గడలు పక్వానికి వచ్చి అమ్మకానికి సిద్ధమవుతాయి. ఒక్కో గడ దాదాపు 6 నుంచి 7 అడుగుల వరకు పెరుగుతుంది. నాటిన ముక్కలు పిలకలతో ఎకరాకు 20 వేలకుపైచిలుకు గడలు ఇస్తాయి. వ్యాపారులు ఆయా తోటల వద్దకు వచ్చి కొనుగోళ్లతో దళారుల బెడద లేదు. ఆదాయం ఆర్జిస్తున్న రైతన్నలు.. సొంత భూమి కలిగిన రైతుకు ఎకరా పంటకు రూ. 1.5 లక్షల నుంచి రూ 1.7 లక్షల వరకు పెట్టుబడులు అవుతున్నాయి. ఫిబ్రవరి ఆరంభం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే తిరునాళ్ల, ఉత్సవాలకు ఇక్కడి నుంచే గడలు వ్యాపారులు కొనుగోలుతో ఎగుమతి చేస్తున్నారు. గడల వంతున ఒక్కో గడ రూ. 15 నుంచి రూ. 17, ఎకరాల వంతున రూ. 3 లక్షలకు గత రెండేళ్లు ధర పలికాయి. పెట్టుబడులు పోను ఎకరాకు రూ. 1.5 లక్షల నుంచి రూ. 1.7 లక్షల వరకు నికర ఆదాయం దక్కిందని రైతులు వివరించారు. అకాల వర్షాలతో ఇబ్బంది మే నెలలో కురిసిన అకాల వర్షాలు తమను నట్టేట ముంచాయని రైతులు తాడిపర్తి అంజిరెడ్డి, పులి శరత్, గోగులమూడి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బోదెలు చేసి చెరుకు ముక్కలు నాటగా.. అకాల వర్షాలకు ఆ బోదెల్లో నీరు నిల్వతో ముక్కలు కుళ్లి మొలక శాతం తగ్గిందన్నారు. చేసేదిలేక తిరిగి బోదెలు వేసి ముక్కలు నాటుతున్నట్లు రైతులు వివరించారు. రెండేళ్లుగా లాభాలు రావడంతో పెరిగిన సాగు విస్తీర్ణం అద్దంకి నియోజకవర్గంలో 960 ఎకరాలలో సాగు చేస్తున్న రైతులు ఎకరాకు రూ. 1.5 లక్షల నుంచి రూ. 1.7 లక్షల వరకు లాభం -
మోసకారి బాబుపై యువత పోరు
● ఉద్యోగాల పేరిట చంద్రబాబు మోసం ● ఏడాదిగా నిరుద్యోగ భృతికి ఎగనామం ● ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ● గద్దెనెక్కాక ఒక్క ఉద్యోగమూ ఇవ్వని వైనం ● జిల్లాలో 5 లక్షల మంది నిరుద్యోగులు ● కూటమి సర్కారు తీరుతో ఆందోళనలో యువత ● వైఎస్ జగన్ పాలనలో పుష్కలంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ● కూటమి పాలకుల తీరును నిరసిస్తూ నేడు ‘యువత పోరు’ సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఎన్నికల సమయంలో చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్తు బాధ్యత తనదేఅంటూ అడ్డగోలుగా హామీలు కురిపించారు. అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలన్నారు. అది ఆలస్యమయితే ఇచ్చేవరకూ నెలకు రూ. 3 వేల వంతున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కలలకు రెక్కల పథకం ద్వారా రుణాలు అన్నారు. ఎయిడెడ్ కళాశాలల్లో ప్రైవేట్ పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరణ చేస్తామని చెప్పారు. కాలేజీలకే రుసుము చెల్లించి విద్యార్థులకు సర్టిఫికెట్ చిక్కులు లేకుండా చేస్తామని పేర్కొన్నారు. జీవో 117 రద్దు చేస్తామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విదేశీవిద్య పథకం పునరుద్ధరణ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. గద్దెనెక్కగానే మెగా డీఎస్సీ అన్నారు. ఇంకా ఏవేవో చెప్పారు. కూటమి ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తుందని విద్యార్థులు, నిరుద్యోగులు గంపెడాశతో ఎన్నికల్లో కూటమికి ఓట్లేశారు. సీఎం కాగానే తీరులో మార్పు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే మెగా డీఎస్సీ అని చంద్రబాబు ఆర్భాటంగా సంతకం చేశారు. ఇక ఉద్యోగాల కల్పన అంటూ ప్రకటనలతో హోరెత్తించారు. డీఎస్సీ నోటిఫికేషన్ రావడానికే ఏడాది పట్టింది. మెగాకు బదులు నామమాత్రంగా పోస్టులు ప్రకటించారు. ఇక మిగిలిన తంతు పూర్తయ్యేసరికి ఇంకెంతకాలం పడుతుందో తెలియదు. మిగిలిన అన్ని విభాగాల్లోనూ ఉద్యోగ ఖాళీల భర్తీ అని చెప్పినా ఎప్పటికి ఆ ప్రక్రియ మొదలువుతుందో అంతుచిక్కని పరిస్థితి. ఎన్నికల సమయంలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చేవరకూ నెలకు రూ. 3 వేలు భృతి ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఆయన గద్దెనెక్కి ఇప్పటికే ఏడాది అయినా ఆ ఊసు కూడా ఎత్తడం లేదు. 2014లోనూ చంద్రబాబు ఇంటికొక ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని నమ్మబలికారు. అధికారంలోకి వచ్చాక యువతను ముంచేశారు. 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు? కూటమి పాలనలో ఉద్యోగాలు లభిస్తాయని, లేకుంటే నిరుద్యోగ భృతి వస్తుందని యువత ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే చదువుకోసం, ఇతర నైపుణ్య శిక్షణల కోసం రూ.లక్షల్లో వెచ్చించి వారి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఇంటికొక నిరుద్యోగి.... జిల్లాలో 459 గ్రామపంచాయతీల పరిధిలో 944 గ్రామాలు ఉన్నాయి. వాటి పరిధిలో 4,97,000 గృహాలు ఉన్నాయి. ఈ లెక్కన ఇంటికొకరు అనుకున్నా జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారంతా ఉద్యోగాలతోపాటు తక్షణ సాయంగా నిరుద్యోగ భృతిని ఆశిస్తున్నారు. ఇంటికొకరికి నిరుద్యోగ భృతి అనుకుంటే నెలకు రూ.149.10 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే ఏడాది అయినందున ఈ మేరకు యువతకు చంద్రబాబు సర్కారు బాకీ పడినట్టైంది. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంతోపాటు ఉద్యోగాలు రాని వారికి నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని యువత డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇలా... వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో చదువుకున్న యువతకు ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విరివిగా కల్పించింది. జిల్లాలో 477 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 5,247 ఉద్యోగాలు ఇచ్చింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల పరిధిలో వేలాది మందికి వలంటీర్ ఉద్యోగాలు వచ్చాయి. 348 హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి 348 ఎంఎల్హెచ్పీ ఉద్యోగాలు కల్పించింది. ఇవికాకుండా ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చింది. ఇక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చింది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచి, వారి శ్రమను గుర్తించింది. ఇవి కాకుండా ఎంఎస్ఎంఈల ద్వారా జిల్లాలో 705 యూనిట్లు ఏర్పాటు చేసింది. వారికి రూ. 110.69 కోట్ల మేర రాయితీలు కల్పించింది. యువతకు ఉద్యోగాలిస్తామని, లేదంటే భృతి ఇస్తామని మోసంయువత ఆశలను కూటమి ప్రభుత్వం నీరుగార్చింది. చదువుతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో దారుణంగా విఫలమైంది. ఓట్ల కోసం కూటమి నేతలు నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు. ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని పేర్కొన్నారు. తీరా అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీలను తుంగలో తొక్కింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునందుకొని సర్కార్ వంచనను నిరసిస్తూ యువత పోరు పేరుతో పార్టీ శ్రేణులు సోమవారం ఆందోళన చేపట్టనున్నాయి. బాపట్ల పట్టణం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పిస్తారు. బాపట్ల, రేపల్లె, వేమూరు, చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నాయి. -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం కలెక్టరేట్లో జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతోపాటు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాల్లో, తహసీల్దార్ కార్యాలయాల్లో అర్జీలను సమ ర్పించవచ్చని పేర్కొన్నారు. అర్జీదారులు మీకోసం వెబ్సైట్లో కూడా అర్జీలు నమోదు చేయవచ్చని తెలిపారు. అర్జీల స్థితికి సంబంధించి సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబరుకు కాల్ చేయవచ్చని వివరించారు. నేడు దుర్గగుడి మాస్టర్ప్లాన్పై సమీక్ష ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి మాస్టర్ప్లాన్పై సోమవారం సమీక్ష సమావేశం జరగనుంది. మహామండపంలోని ఏడో అంతస్తులో సమీక్ష జరగనుంది. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరయ్యే అవకాశాలున్నాయి. దేవస్థానంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, మాస్టర్ప్లాన్ అమలుపై దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. దసరా నాటికి మహామండపం ఎదుట అన్నదాన భవనం, ప్రసాదాల పోటులను సిద్ధం చేయడానికి ఆలయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంజినీరింగ్ పనులు, ఇతర అభివృద్ధి పనులకు ఆలయ ఈవో శీనానాయక్ ఇప్పటికే పలుసార్లు సమీక్షించారు. కనకదుర్గనగర్, గోశాల ఎదుట ఉన్న దుకాణాలను మహా మండపం 5వ అంతస్తులోకి తరలించే అంశం కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఆ దుకాణాలను తరలిస్తేనే అభివృద్ధి పనులకు అటంకం లేకుండా సకాలంలో పూర్తి చేసే వీలుందని ఆలయఅధికారులు భావిస్తున్నారు. -
ఎకరాకు రూ.లక్ష ఆదాయం
నాలుగేళ్లుగా చెరకు సాగు చేస్తున్నా. పెట్టుబడులు పోను ఎకరాకు రూ.లక్ష పైచిలుకు ఆదాయం వస్తోంది. దళారుల బెడద లేదు. అందువల్లే ప్రతి సంవత్సరం చెరకు సాగుకు మొగ్గు చూపుతున్నా. – గోగులమూడి దానారెడ్డి, రైతు ఏడు సంవత్సరాలుగా సాగులో మెలుకువలతో ఎకరాలో చెరకు సాగు చేస్తున్నా. పెట్టుబడులు పోను నికర ఆదాయం ఏ ఇతర పంటకూ దక్కడం లేదు. తిరునాళ్లలో అమ్మే చెరకు కావటంతో తోటల వద్దకు వచ్చి వ్యాపారులు కొంటున్నారు. – భవనం అంజిరెడ్డి, రైతు -
ప్రాంగణ ఎంపికల్లో 64 మందికి ఉద్యోగాలు
నిజాంపట్నం: మండల కేంద్రమైన నిజాంపట్నంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్కు కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న 144 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 64 మంది విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ ఉమామహేశ్వరిదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రిక్రూట్మెంట్ మేళాలో ఎంఎస్ మహేంద్ర ఆటో పయనీర్ వరల్డ్, ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్, నిర్మల ఇండస్ట్రీస్, పవర్ సర్వీసెస్, బెంగళూరు గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్లతో పాటు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు. విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక చేశారన్నారు. ఎంపికై న వారికి అప్రంటీస్ శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తారని తెలిపారు. శిక్షణ కాలంలో భృతి అందించనున్నట్లు వివరించారు. మార్టూరులో గడ్డివామి దగ్ధం మార్టూరు: మండల కేంద్రం మార్టూరులో శనివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో వరిగడ్డి వామి దగ్ధమైంది. స్థానిక తూర్పు బజారుకు చెందిన పుట్టా విలాస్ బాబు గొడ్ల చావిడిలో ఉన్న వరి గడ్డి వామిపై బాణసంచా పడటంతో మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో చిలకలూరిపేట నుంచి వచ్చిన అగ్నిమాపక కేంద్ర సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 60 వేల ఆస్తినష్టం జరిగినట్లు రైతు వాపోయారు. -
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
తల్లీకూతుళ్లకు స్వల్ప గాయాలు పెదకాకాని: గ్యాస్ సిలిండర్ పేలి తల్లీకూతుళ్లకు గాయాలైన సంఘటన శనివారం మండలంలోని తక్కెళ్లపాడులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాటా సామ్రాజ్యం కుమార్తెలు భూలక్ష్మి, కృష్ణకుమారి ఇటీవల పుట్టింటికి వచ్చారు. వారితో పాటు భూలక్ష్మి కుమార్తె అలేఖ్య కూడా వచ్చింది. ఆమె ప్రస్తుతం గర్భిణి. ఏడాది పాప ఉంది. అంతా కలసి పిండివంటలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో గ్యాస్ సిలిండర్ నుంచి పొగలు రావడంతో సామ్రాజ్యం, భూలక్ష్మి, కృష్ణకుమారి బయటకు పరుగులు తీశారు. బెడ్రూంలో ఏడాది పాప ఉండటంతో అలేఖ్య లోపలకు వెళ్లి తలుపులు వేసుకుంది. బయటకు వెళ్లిన వారు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని గది తలుపులు పగులగొట్టి, అలేఖ్య, ఆమె కుమార్తెను క్షేమంగా బయటకు తీసుకు వచ్చారు. కొద్దిసేపటికే సిలిండర్ పెద్ద శబ్దంతో పేలడంతో సామ్రాజ్యం, ఆమె కుమార్తె భూలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. -
భార్యను హతమార్చి, గొంతు కోసుకున్న భర్త
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : భార్యపై అనుమానంతో గొంతు కోసి హత మార్చి.. తానూ గొంతు కోసుకొని భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన గుంటూరు నగరంలోని కన్నవారితోటలో శనివారం మధ్యాహ్నం జరిగింది. మృతురాలు లక్ష్మి కుమారుడు శివ తెలిపిన వివరాల ప్రకారం...కన్నవారితోటలోని రఘురామ్నగర్ గోరీలదొడ్డి ప్రాంతానికి చెందిన దారబోయిన లక్ష్మి (40), భర్త రాజులకు ఇద్దరు సంతానం ఉన్నారు. లక్ష్మి ఇళ్లల్లో పని చేస్తుంటుంది. భర్త వంట పనులు, కూలీ పనులకు వెళుతుంటాడు. లక్ష్మికి 17 ఏళ్ల కిందట వేరే వ్యక్తితో వివాహమైంది. భర్త వేధింపులు భరించలేక అతడ్ని వదిలేసి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కళాశాలలో వంట పని చేసుకుంటూ బతుకుతోంది. అదే కళాశాలలో వంట పని చేసే రాజు పరిచయం కాగా, ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి గుంటూరు కన్నవారితోటలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కొద్ది కాలంగా రాజు, భార్యని అనుమానించడం ప్రారంభించాడు. నిత్యం మద్యం తాగి అసభ్యపదజాలంతో వేధించడం ప్రారంభించాడు. రెండు నెలలుగా పనికి వెళ్లకుండా భార్యని కూడా ఇంట్లోనే ఉండాలంటూ వేధిస్తున్నాడు. శనివారం ఉదయం భార్యాభర్తల మధ్య వివాదం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గట్టిగా కేకలు వినిపించడంతో స్థానికులు సమాచారం అందించడంతో నగరంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చూసే సరికి ఇద్దరు రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు. అప్పటికే లక్ష్మి మృతి చెందింది. రాజు కొనఊపిరితో ఉన్నాడు. పోలీసులు అతడ్ని జీజీహెచ్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్, అరండల్పేట సీఐ ఆరోగ్యరాజు, నగరంపాలెం ఎస్ఐ రమాదేవి సిబ్బందితో ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. లక్ష్మిని భర్త మెడ వంచి వెనుక భాగం నుంచి కత్తితో కోసి ఉన్నట్లు గుర్తించారు. అదే కత్తితో రాజు గొంతు కోసుకున్నట్లు గుర్తించారు. క్లూస్ టీమ్ ఘటనా ప్రదేశానికి చేరుకుని ఆధారాలను సేకరించింది. లక్ష్మి మృతదేహాన్ని జీజీహెచ్కి తరలించారు. కుమారుడు శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రికి తరలించిన పోలీసులు గుంటూరు కన్నవారి తోటలో ఘాతుకం -
‘కిల్లర్ లేడీ’ ఆటకట్టు
తెనాలి: ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధ మహిళలను హత్య చేసి బంగారు నగలను అపహరించిన కేసులో మారీసుపేటకు చెందిన అత్తోట కుసుమ ప్రధాన సూత్రధారిగా పోలీసులు నిర్ధారణ కొచ్చారు. ఆమెను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. విచారణలో మరో వృద్ధురాలి హత్య తోపాటు, ఇంకొకరి హత్యకు రెక్కీ నిర్వహించినట్టు తెలి సి, ఆ కోణంలో దర్యాప్తు జరుగుతోందని విశ్వసనీయ స మాచారం. మారీసుపేట, మల్లెపాడులో కలకలం రేగింది. ఇన్స్యూరెన్స్ ఏజెంటుగా వివరాల సేకరణ తెనాలి పట్టణం మారీసుపేటలో కుసుమ నివాసం. ఆమె భర్త 15 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. ఇద్దరు సంతానం. కాలేజీకి వెళుతున్నారు. గతంలో ‘మెప్మా’ విభాగంలో తాత్కాలికంగా పని చేసింది. ప్రస్తుతం ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటుగా పని చేస్తోంది. పాలసీల పేరుతో అందరినీ కలుస్తూ వారి వివరా ల ఆధారంగా నేరాలకు ప్రణాళికను రచిస్తోంది. తన సహాయకులతో పక్కాగా అమలు చేస్తోంది. తెనాలి నుంచి చినపరిమి వెళ్లే రోడ్డులో మూతపడిన అప్పడాల కంపెనీ పైభాగంలో వితంతువులైన వియ్యపురాళ్లు దాసరి రాజేశ్వరి (65), పిట్టా అంజమ్మ (70) నివసిస్తున్నారు. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం ఆ ఇద్దరు హత్యకు గురయ్యారు. వీరి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఈ కేసులో కుసుమ సహా ఆటోడ్రైవర్, మరొక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ప్లాన్ ఇలా.. హత్యకు గురైన వృద్ధుల ఇంటికి ఆ రోజు ఒక ఆటోలో కుసుమ సహా మరో ఇద్దరు యువకులు వచ్చారు. ‘ఆంటీ...ఇల్లు చూట్టానికి వచ్చారు...కిందకు రండి !’ అని కుసుమ పిలవడంతో ఒక వృద్ధురాలు కిందకు వచ్చారు. కిందకు వెళ్లినామె ఎంతకీ పైకి రాకపోవటతో ఇంకో వృద్ధురాలు, ‘ఇంకా రాలేదేంటి...పైకి రా!’ అని వియ్యపురాలిని కేకేసింది. దీనితో మళ్లీ కుసుమ, ఆమెను కూడా ‘కిందకు రండి...పిలుస్తున్నారు !’ అనడంతో ఆమె కూడా దిగివచ్చింది. తర్వాత ఆ ముగ్గురూ అదే ఆటోలో తిరిగి వెళ్లిపోయారు. ఇదంతా ఇంటిముందున్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు కుసుమతో సహా ఆ ఇద్దరు యువకులను తేలిగ్గా పట్టుకోగలిగారు. విచారణలో వారు కూడా విస్తుపోయే మరికొన్ని నిజాలు తెలిసినట్టు విశ్వసనీయ సమాచారం. వృద్ధురాలి మృతి వెనుక కూడా ఆమె హస్తం కుసుమ నివాసానికి ఎదురుగానే రోడ్డుకు అవతల ఒంటిరిగా నివసిస్తున్న ఓ వృద్ధురాలు రెండు వారాల క్రితం చనిపోయింది. ఆ సమయంలో ఆమె ఒంటిపై గాట్లు ఉండటం, బంగారు నగలు కనిపించకపోవటాన్ని బిడ్డలు గుర్తించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అంత్యక్రియలు చేశారు. ఆ వృద్ధురాలి మృతి వెనుక కుసుమ, ఆమె బ్యాచ్ హస్తమున్నట్టు నిర్ధారణకొచ్చారు. జంట హత్యల సూత్రధారి అరెస్టు ? మరో ఇద్దరితో కలిసి ఘోరాలు ఇప్పటికే పోలీసుల అదుపులో ఆ ముగ్గురు పోలీస్ విచారణలో మరికొన్ని నేరాలు వెలుగులోకి...! -
బస్సులు లేక ప్రయాణికులకు ఇక్కట్లు
పట్నంబజారు: అంతర్జాతీయ యోగ డే సందర్భంగా జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు వైజాగ్కు తరలి వెళ్లడంతో ప్రయాణికులు రెండు రోజులుగా ఇక్కట్లు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్లో శనివారం నిర్వహించిన యోగాంధ్రా కార్యక్రమానికి గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లాల నుంచి భారీ సంఖ్యలో బస్సులను తరలించారు. గుంటూరు డిపో –1 నుంచి 35, గుంటూరు డిపో –2 నుంచి 35, తెనాలి డిపో –25, మంగళగిరి–20, పొన్నూరు– 20, బాపట్ల– 18, రేపల్లె –22, చీరాల – 18, అద్దంకి నుంచి 22 బస్సులను యోగాంధ్రాకు తరలించారు. దీంతో పల్లె ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు బస్సులు కిక్కిరిసి కనిపించాయి. మూడు కార్గో బస్సులను మెకానిక్లతో కలిపి వైజాగ్కు పంపడంతో ఇక్కడ గ్యారేజీల్లో వారి కొరత ఏర్పడినట్లు తెలుస్తుంది. ఫిట్గా లేని బస్సులను గ్యారేజీ నుంచి బయటకు తీయకుండా అలాగే ఉంచారు. కొన్ని సర్వీసులు మాత్రమే నడిపారు. గతంలో సైతం రాజధాని ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పుడు బస్సులను తీసుకెళ్లడంతో ఇబ్బందులు పడినట్లు ప్రయాణికులు వాపోయారు. వైజాగ్కు తరలించడంతో అవస్థలు -
జీవితంలో యోగా భాగం కావాలి
బాపట్ల: యోగా వలన కలిగే లాభాలను, ప్రయోజనాలను తెలుసుకొని దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ప్రజలకు సూచించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం సూర్యలంక బీచ్లో యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. 10 వేల మంది పాల్గొని యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మరాజు, చీరాల శాసనసభ్యులు ఎం.ఎం.మాలకొండయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో కేర్ యోగా నాచురోపతి మెడికల్ కాలేజీ విద్యార్థిని, విద్యార్థులు నిర్వహించిన యోగా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నెల రోజులుగా యోగా కార్యక్రమాన్ని జిల్లాలో, మండలాల్లో, ప్రతి పంచాయతీలో జరుపుకుంటున్నామని తెలిపారు. జీవితాన్ని ఆహ్లాదంగా, సంతోషకరంగా మలచుకోవాలని ఉద్దేశంతో ఋషులు పరిశోధించారని అన్నారు. మనం దైనందిన జీవిత ప్రవాహంలో కొట్టుకుపోయే క్రమంలో చిన్న వయసులోనే వృద్ధులుగా తయారవుతున్నామని అన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని అన్నారు. ఎక్కువ సంవత్సరాలు జీవించినప్పటికీ అది ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన, ఆనందదాయకమైన జీవితం గడపటంలేదని అన్నారు. యోగ వలన ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని తెలిపారు. జీవన క్రమంలో వచ్చే ఆరోగ్య సమస్యలు దరిచేరవన్నారు. యోగాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితికి పరిచయం చేసి ప్రపంచానికి పరిచయం చేసిన రోజు ఈ రోజు అని తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలో సూర్యలంక బీచ్ లో జిల్లా స్థాయి యోగా దినోత్సవం ఇంత ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్గౌడ్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ బి.శ్రీనివాసరావు, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి పి.గ్లోరియా, జిల్లా అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి సూర్యలంక తీరంలో యోగా దినోత్సవం వేలాది మంది హాజరు -
జగ్జీవన్రామ్ విగ్రహావిష్కరణ
దుగ్గిరాల: మండలంలోని పెదకొండూరులో మాజీ ఉప ప్రధాని జగ్జీవన్రామ్ విగ్రహాన్ని శనివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగ్జీవన్రామ్ వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు సమర్థంగా నిర్వహించి, దేశ ఉప ప్రధానిగా ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఈ సందర్భంగా వీర్లపాలెం నుంచి పెదకొండూరు గ్రామం వరకు ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ మందా కృష్ణని ఊరేగింపుగా తీసుకువచ్చారు. కార్యక్రమాన్ని విగ్రహ కమిటీ పర్యవేక్షించింది. విద్యుత్ పర్యవేక్షక ఇంజినీర్గా రమేష్ బాధ్యతల స్వీకరణ కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు సర్కిల్ విద్యుత్ శాఖ నూతన పర్యవేక్షక ఇంజినీరుగా పొన్నూరు రోడ్డులోని కార్యాలయంలో చల్లా రమేష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన కేవీఎల్ఎన్ మూర్తి ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం జనరల్ మేనేజర్గా బదిలీ అయ్యారు. రమేష్ కార్పొరేట్ కార్యాలయంలో జనరల్ మేనేజర్గా పనిచేస్తూ బదిలీపై గుంటూరు పర్యవేక్షక ఇంజినీరుగా వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుంటూరు సర్కిల్ను కంపెనీలో ప్రథమ స్థానానికి తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు. పానకాలస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం మంగళగిరి: మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి (పానకాల) ఆలయం శనివారం భక్తులతో రద్దీ మారింది. ఎగువ, దిగువ సన్నిధుల వద్ద కోలాహలం కనిపించింది. ఎగువ సన్నిధిలో భక్తుల రద్దీతో దర్శనానికి గంటకుపైగా సమయం పట్టింది. వైకుంఠవాసుడికి ఊయల సేవ తెనాలి టౌన్: స్థానిక శ్రీ లక్ష్మీపద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో శనివారం సాయంత్రం ఊయల సేవను కన్నుల పండువగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని, శ్రీ స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. కొండెపి వసుంధర బృందం వీనులవిందుగా భక్తి గీతాలు అలపించింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ మాట్లాడతూ ప్రతి శనివారం సాయంత్రం 6గంటలకు ఊయల సేవను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. -
నిలిచిన జోధ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు
చీరాల రూరల్: బాపట్ల జిల్లా చీరాలలో జోధ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు దాటుతున్న గేదెను ఢీకొట్టింది. దీంతో రైలు 26 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఈ సంఘటన శనివారం సాయంత్రం సమారు 6:15 గంటలకు చీరాల రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు చైన్నె నుంచి విజయవాడ వైపు వెళ్లే జోధ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు చీరాల రైల్వేష్టేషన్ సమీపంలోకి రాగానే ఓ గేదె పట్టాలు దాటుతోంది. ఈ క్రమంలో ఎక్స్ప్రెస్ రైలు గేదెను ఢీకొట్టింది. ఈ సంఘటనలో గేదె కళేబరం ఇంజిన్లో ఇరుక్కుపోవడంతో ఇంజిన్ మొరాయించింది. ఒక్కసారిగా రైలు ఆగిపోవడంతో ఏమి జరిగిందో అర్థంకాక ప్రయాణికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న రైల్వేశాఖాధికారులు, రైల్వే పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు ఇంజిన్ ముందుభాగంలో ఇరుక్కుపోయిన గేదె కళేబరాన్ని తొలగించారు. దీంతో రైలు యథావిధిగా సాగిపోవడంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్స్ప్రెస్ రైలు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆర్ఫీఎఫ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. గేదెను ఢీకొట్టడంతో ఇంజిన్లో ఇరుక్కుపోయిన కళేబరం 26 నిమిషాల పాటు మొరాయించిన రైలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళన చెందిన ప్రయాణికులు ఘటనపై కేసు నమోదు చేసిన ఆర్ఫీఎఫ్ పోలీసులు -
కూటమి ప్రభుత్వం
యువతను నట్టేట ముంచిన బాపట్ల: రాష్ట్రంలో యువతను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మేరుగ చంద్నాగ్ పేర్కొన్నారు. యువతకు వైఎస్సార్ సీపీ అండగా నిలిచేందుకు ఈనెల 23వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈమేరకు శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్లు ఆవిష్కరించారు. మేరుగ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేలు ఇస్తామని ఇచ్చిన హామీని నేరవేర్చలేదన్నారు. ప్రతి ఏడాదీ జనవరిలోనే జాబ్క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారని విమర్శించారు. యువత నేడు అయోమయ పరిస్థితిలో కూరుకుపోయిందన్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ యువజన విభాగం యువత పోరు కార్యక్రమం చేపట్టిందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, పార్టీ పట్టణ అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ నక్కా వీరారెడ్డి, సెక్రటరీ దొంతిబోయిన జయభారత్రెడ్డి, జిల్లా అధికారప్రతినిధి వీరేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాదరెడ్డి, శంకర్రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు దొంతిబోయిన ఏడుకొండలరెడ్డి, మధు, మండల, పట్టణ యువజన విభాగం అధ్యక్షులు ఉరబిండి గోపినాఽథ్, రవితేజ, సాగర్, షేక్ మౌలాలి, గోపి, నాయకులు వడ్డిముక్కల డేవిడ్, మహ్మద్ హుస్సేన్, జోగి రాజా, నర్రావుల వెంకట్రావు, మోర్ల సముద్రాల గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేపు యువత పోరు వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మేరుగ చంద్నాగ్ -
వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు తగదు
పిడుగురాళ్ల: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అధికార పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని పార్టీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ అశోక్ కుమార్ అన్నారు. పిడుగురాళ్లలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పట్టుకుని నిన్ను చంపేస్తే తప్పేముంది. అంటూ అధికారపార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడటం దుర్మార్గమన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. దీనిపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ -
యువతకు స్ఫూర్తి రాజేంద్రప్రసాద్ జీవితం
తెనాలి: సైన్యంలో దేశ రక్షణ విధుల్లో కొనసాగి, బయటకొచ్చాక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి క్రీడారంగ అభివృద్ధికి తోడ్పడుతూ సమాజసేవలో కొనసాగుతున్న చలసాని బాబూ రాజేంద్రప్రసాద్ జీవితం నేటియువతకు స్ఫూర్తిదాయకమని ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ బి.కె.రావు అన్నారు. రాజేంద్రప్రసాద్ నిర్వహిస్తున్న సీబీఆర్ అకాడమీ రజతోత్సవాల సందర్భంగా తపాలా శాఖ తీసుకొచ్చిన ప్రత్యేక కవరును శనివారం సాయంత్రం తెనాలిలోని ప్రధాన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. సభకు మా–ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్రాజా అధ్యక్షత వహించారు. రాజేంద్రప్రసాద్ నినాదం ‘విన్ ఫర్ ఇండియా...డై ఫర్ కంట్రీ’ తనను ఎంతగానో ఆకర్షించిందని బీకే రావు చెప్పారు. రాజేంద్రప్రసాద్ సేవల్ని గుర్తించి తపాలశాఖ ప్రత్యేక కవరును విడుదల చేయడంఅభినందనీయమని తెలిపారు. తెనాలి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎం.శ్రీనివాసు మాట్లాడుతూ దేశభక్తుడి గురించి ప్రత్యేక కవరును విడుదల చేయటం సంతోషంగా ఉందన్నారు. సైనిక్ వెల్ఫేర్ బోర్డు బ్రిగేడియర్ వెంకటరెడ్డి మాట్లాడుతూ సంపాదించిన డబ్బును సమాజసేవకు వినియోగిస్తున్న మాజీ సైనికుడు సీబీఆర్ ప్రసాద్ను భారత ప్రభుత్వం గుర్తించాలని అభిప్రాయపడ్డారు. -
భర్తపై భార్య కత్తితో దాడి
నరసరావుపేటటౌన్: భర్తపై కత్తితో దాడికి పాల్పడిన భార్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ ఎం.విజయ్ చరణ్ శనివారం తెలిపారు. షాలెంనగర్కు చెందిన జంపాని అజయ్ కుమార్కు రొంపిచర్ల మండలం అన్నవరం గ్రామానికి చెందిన ధనూషలకు మూడేళ్ల క్రితం వివాహమైంది. భార్య, భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి ధనూష ఇటీవల పుట్టింటికి వెళ్లింది. భర్త ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరగా, శనివారం షాలెంనగర్కు వచ్చింది. మళ్లీ భార్యా, భర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో ఇంట్లో ఉన్న కూరగాయలు కోసే కత్తితో అజయ్ కుమార్పై ధనూష దాడికి పాల్పడింది. స్థానికులు క్షతగాత్రుడిని ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి పట్నంబజారు: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన శనివారం గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంకరగుంట సమీపంలోని స్కైలోన్ అపార్ట్మెంట్లో నివసించే నరహరి శైలజ (54) భర్త శ్రీనివాసరావుకు మార్కెట్లో కిరాణా దుకాణం ఉంది. ఇద్దరు సంతానం ఉన్నారు. కుమార్తెకు వివాహం అవ్వగా, కుమారుడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం జిన్నాటవర్ సెంటర్లోని ఒక దుకాణంలో దుస్తులు కొనుగోలు చేసేందుకు శైలజ వచ్చారు. అక్కడ కొనుగోలు చేసి కిందకు దిగారు. అప్పుడే గుంటూరు– 1 డిపో నుంచి క్రోసూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆపబోయాడు. ఈ క్రమంలో శైలజ బస్సు ముందు నుంచి నడిచి వెళ్తుండగా, గమనించని డ్రైవర్ ముందుకు నడిపాడు. బస్సు టైర్ కింద పడి శైలజ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కి తరలించారు. ప్రత్యామ్నాయ పంటలను సూచించండి యడ్లపాడు: ఈ ఏడాది పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేయాలో ప్రభుత్వం రైతులకు సూచించాలని, అదేవిధంగా ఆయా పంటలకు గిట్టుబాటు ధర సైతం కల్పిస్తామనే గ్యారెంటీని రైతులకు ఇవ్వాలని కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వై.రాధాకృష్ణ డిమాండ్ చేశారు. యడ్లపాడు మండలం మైదవోలు – వంకాయలపాడు పరిధిలోని స్పైసెస్ పార్కులోని జిల్లా పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. నాణ్యత సాకులు చూపకుండా, షరతులంటూ ఇబ్బందులు పెట్టకుండా రైతుల పొలాల్లోని నిల్వలన్నింటినీ పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలన్నారు. -
మోసానికి ప్రతిరూపం చంద్రబాబు
అద్దంకి: ‘జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకొచ్చే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరవాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు అంటే మోసం అనేలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా తన తండ్రి తరువాత రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి, అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పకుండా హామీలన్నీ నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ అంటే నమ్మకం అని ప్రజలు అనుకునేలా చేశారని తెలిపారు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవి వాస్తవాలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ‘యువత పోరు’ జయప్రదం చేయండి అద్దంకి: బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయర్త పానెం చిన హనిమిరెడ్డి పిలుపునిచ్చారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. నిరసన కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున యువత తరలి రావాలని కోరారు. బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు అనుచితం అద్దంకి: వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకుడు బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు అనుచితమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ తీరుపై మండిపడ్డారు. బుచ్చయ్య చౌదరికి నిబద్ధత ఉందా అని ప్రశ్నించారు. ఆయన మొదట ఎన్టీఆర్ వద్ద నుంచి లక్ష్మీపార్వతి దగ్గరకు, ఆ తరువాత చంద్రబాబు వద్దకు వచ్చాడన్నారు. నాలుగు మాటలు చెప్పి బాబును మెప్పించి మంత్రి పదవి పొందాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన మాటలు వింటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రతి కార్యక్రమానికి వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేక ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు అడ్డంకులు కల్పిస్తున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని చెప్పిన సూపర్ సిక్స్ హామీల ఊసే నేడు లేదన్నారు. సంవత్సరం గడిచినా హామీలు నెరవేర్చకపోవడంతోనే ప్రజలు వైఎస్సార్ సీపీ వైపు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ పట్టం కట్టాలనే ఆలోచనకు వచ్చారని చెప్పారు. దాని ఫలితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలకు అనూహ్యంగా లభిస్తున్న జనాదరణ అన్నారు. జమిలి ఎన్నికలు అంటున్నారని.. మరో రెండు సంవత్సరాల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్సీపీ అత్యధిక మెజారిటీలో గెలవడం ఖాయమని చెప్పారు. సమావేశంలో అద్దంకి మండల కన్వీనర్ గుజ్జుల జగన్మోహన్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, బల్లికురవ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు, కొరిశపాడు మండల కన్వీనర్ పాలపర్తి శ్రీధర్, బీసీ సెల్ అధ్యక్షుడు గోలి రమణబాబు, కొల్లా భువనేశ్వరి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి -
జాబ్మేళాలో 60 మందికి ఉద్యోగాలు
పిడుగురాళ్ల: జాబ్ మేళాలో 60 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఇ.తమ్మాజీ రావు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శనివారం మెగా జాబ్మేళా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆదేశాలతో ఈ జాబ్మేళా నిర్వహించారు. తమ్మాజీ రావు మాట్లాడుతూ జాబ్మేళాకు 10 కంపెనీలు హాజరు కాగా, 214 మంది నిరుద్యోగులు హాజరయ్యారని, అందులో 60 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ బి.వి.కృష్ణారెడ్డి, జిల్లా ఉద్యోగ కల్పనా అధికారి ఎం.రవీంద్ర నాయక్, పిడుగురాళ్ళ స్కిల్ హబ్ కో–ఆర్డినేటర్ పి. శ్రీకాంత్, వీరాంజినేయులు, రమ్య, అంజిరెడ్డి, సురేష్, మస్తాన్, కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఇ.తమ్మాజీ రావు -
పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: పాలిసెట్–2025 కౌన్సెలింగ్ శనివారం ప్రారంభమైంది. గుంటూరు నగర శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ కేంద్రంలో సమన్వయకర్త టి. శేఖర్ పర్యవేక్షణలో సిబ్బంది విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. శనివారం ఒకటో ర్యాంకు నుంచి 15వేలు ర్యాంకు వరకు పూర్తయింది. ఆదివారం 15,001 నుంచి 32వేలు వరకు ర్యాంకు విద్యార్థులు హాజరుకావాలి. ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు నరసరావుపేట పల్నాడు బస్టాండ్ సమీపంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ పాత క్యాంపస్, రేపల్లెలోని ప్రభుత్వ పాలిటెక్నిక్, బాపట్లలోని బాపట్ల పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ కేంద్రాల్లోనూ విద్యార్థులు ఆయా తేదీల్లో ర్యాంకులు వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని అధికారులు సూచించారు. కృష్ణా నదిలో పడి న్యాయవాది మృతి రేపల్లె: ప్రమాదవశాత్తూ కృష్ణా నదిలో పడి న్యాయవాది మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పట్టణ సీఐ మల్లికార్జునరావు కథనం ప్రకారం.. పట్టణంలోని 7వ వార్డుకు చెందిన కొండపల్లి శ్రీనివాసరావు (48) మానసిక ప్రశాంతత కోసం శుక్రవారం సాయంత్రం పెనుమూడి కృష్ణా నది వద్దకు వెళ్లాడు. కాసేపు పుష్కర ఘాట్పై సేదతీరి కాళ్లు కడుక్కోవడానికి నది ఒడ్డుకు వెళ్లాడు. కాళ్లు కడుక్కుంటూ ప్రమాదవశాత్తూ నదిలో పడి మృతి చెందాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడు శ్రీనివాసరావు గతంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. శ్రీనివాసరావు మృతిపై బార్ అసోసియేషన్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన విద్యార్థులు -
పచ్చనేత ఆక్రమణలపై పెల్లుబికిన ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: చీరాల పచ్చనేత బుర్ల వెంకట్రావు ఆక్రమించి ధ్వంసం చేసిన ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్ను తక్షణమే పునరుద్ధరించాలంటూ తీర గ్రామాల మత్స్యకారులు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉదయమే పాండురంగాపురం పరిధిలో ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్ సముద్రంలో కలిసే ప్రాంతానికి చేరుకున్నారు. ప్రధాన కాలువను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పందించకపోతే యంత్రాలతో తామే కాలువను పునరుద్ధరించుకుంటామని తేల్చి చెప్పారు. మత్స్యకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో టీడీపీ నేత బుర్ల అనుచరులు పోలీసులకు సమాచారమందించారు.దీంతో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులుతోపాటు, సిబ్బంది హుటాహుటిన తీరప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మత్స్యకారులు అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. తక్షణమే టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ధ్వంసం చేసి ఆక్రమించిన స్ట్రెయిట్కట్ను, ప్రధానంగా సీ మౌత్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాలువలో ఉన్న వెయ్యికి పైగా పడవలు వేటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని, దీనివల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని వాపోయారు. అందుకు కారణమైన వెంకట్రావును అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. సముద్ర తీరంలో ఆక్రమిత భూములకు డీకేటీ పట్టాలిచి్చన రెవెన్యూ అధికారులపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్పందించిన కలెక్టర్.. మత్స్యకారులు ఆందోళన తీవ్రతరం చేయడంతో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి స్పందించారు. తీరం ఆక్రమణలపై బాపట్ల ఆర్డీవో గ్లోరియా, చీరాల ఆర్డీవో చంద్రశేఖరనాయుడుతో విచారణ కమిటీని నియమించారు. వెంటనే నివేదిక సమరి్పంచాలన్నారు. అంతవరకూ వివాదాస్పద భూమిగా ఉన్న సర్వేనంబర్ 499–1, 2లోని 1.50 ఎకరాల్లో ఎవరూ దిగవద్దని ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదిక వచ్చాక సదరు భూమిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారులు శాంతించి ఆందోళనను విరమించారు. మత్స్యకారులపై కేసులు? తీరంలో ఆక్రమణలను అడ్డుకుంటున్న మత్స్యకారులపై టీడీపీ నేత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తమ ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొనడంతో 20మందికి పైగా మత్స్యకారులపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. వెంకట్రావుపై మత్స్యకారుల ఫిర్యాదు.. ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్ సీ మౌత్ పూడ్చివేసి 12 వేల కుటుంబాల మత్స్యకారుల కడుపు కొట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బుర్ల వెంకట్రావుపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలంటూ మత్స్యకారుడు కనకారావు శుక్రవారం బాపట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలువలను ధ్వంసం చేస్తున్న అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. తమను దూషించి, చంపేస్తామంటూ బెదిరించారని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.పాండురంగాపురం సముద్ర తీరం వద్ద మత్స్యకారుల ఆందోళన -
పంటలకు జీవన ఎరువులు వాడండి
పిడుగురాళ్ల: రైతులు పంటలకు రసాయన ఎరువుల వాడకం తగ్గించి జీవన ఎరువులు ఎక్కువగా వాడాలని పల్నాడు జిల్లా వ్యవసాయ వనరుల కేంద్రం డీడీ శివకుమారి తెలిపారు. మండలంలోని జూలకల్లు గ్రామంలో శుక్రవారం పత్తి పంటను ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వేసవిలో వేసిన ముదురు పత్తి పంట ఈ ప్రాంతంలో బాగానే ఉన్నప్పటికీ పోషక విలువలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ అధికారుల సూచనలను రైతులు తప్పనిసరిగా పాటిస్తే దిగుబడి ఎక్కువగా ఉంటుందని సూచించారు. ఈ పత్తి పంటను పెట్టకు రాకుండా సరైన సమయంలో నీళ్లు పెట్టాలని, అలాగే లింగాకార బుట్టలు, సేంద్రియ ఎరువులు వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పిడుగురాళ్ల ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకానికి ఈకేవైసీ చేయించుకొని వారు వెంటనే చేయించుకోవాలని తెలిపారు. కౌలు రైతు కార్డుల కోసం అర్హులైన వారు తమ సమీపంలోని సచివాలయాల్లో సంప్రదించాలని కోరారు. పంట రుణాలు అందించేందుకు అప్పుడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని పత్తి పంటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
ఐటీఐ రెండో విడత కౌన్సెలింగ్కు దరఖాస్తుల ఆహ్వానం
తెనాలి అర్బన్: జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో రెండో విడత ప్రవేశాల కోసం ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ విడుదలైనట్లు తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రావి చిన వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 15వ తేదీలోపు దరఖాస్తులను iti.ap.gov.in వైబ్సైట్లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం తెనాలి, గుంటూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో జూలై 15వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. జూలై 21న ఉదయం 9గంటలకు తెనాలి, గుంటూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 250 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని పది ప్రైవేటు కళాశాలల్లో ఖాళీగా ఉన్న 1,070 సీట్లకు జూలై 23, 24,25 తేదీల్లో కౌన్సెలింగ్ జరుగుతుందని తెలియజేశారు. వివరాలకు 63045 72793, 93914 02684లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు సంప్రదించాలని ఆయన సూచించారు. కులధ్రువీకరణ పత్రాలు లేక అవస్థలు రాష్ట్ర బేడ బుడగ జంగం ఐక్యవేదిక జేఏసీ వ్యవస్థాపకులు శ్రీనివాస్ లక్ష్మీపురం: రాష్ట్రంలో బేడ బుడగ జంగం కులస్తులు 20 సంవత్సరాల నుంచి కుల ధ్రువీకరణ పత్రాలు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర బేడ బుడగ జంగం ఐక్యవేదిక జేఏసీ వ్యవస్థాపకులు కడమంచి శ్రీనివాన్ తెలిపారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయం మల్లయ్య లింగం భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్షణమే ఎస్సీలుగా గుర్తించి కుల ధ్రువీకరణ ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని ఆయన కోరారు. పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించి, బిల్లు పాస్ చేయించి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఎంతటి పోరాటాలకై నా సిద్ధపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు. -
నేడు విశాఖలో ‘సిడ్స్’ సదస్సు ప్రారంభం
గుంటూరు మెడికల్: క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ (సిడ్స్) ఆంధ్ర ప్రదేశ్ చాప్టర్ సదస్సును శనివారం విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నట్లు ప్రముఖ ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్ట్, సిడ్స్ ప్రెసిడెంట్, గుంటూరు హెల్ప్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కోనగంటి కల్యాణ చక్రవర్తి తెలిపారు. అరండల్పేటలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన సదస్సు వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిజీషియన్లు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, మైక్రో బయాలజిస్టులు, పీజీ వైద్య విద్యార్థులు సదస్సుకు హాజరవుతారని పేర్కొన్నారు. విశాఖపట్నం హోటల్ గ్రీన్ పార్క్లో జరిగే సదస్సులో యాంటీబయోటిక్స్లో వచ్చిన ఆధునిక మందులు, చికిత్స పద్ధతుల గురించి వివరిస్తారన్నారు. ‘రైట్ డ్రగ్ – రైట్ టైమ్– రైట్ స్టేజ్’ అనే నినాదంతో సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు. డాక్టర్ వి.రామసుబ్రహ్మణ్యం, డాక్టర్ మోహన్ మహరాజ్, డాక్టర్ శ్రీధర్ శ్రీనివాసన్లు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సీనియర్ సిడ్స్ మెంబర్ డాక్టర్ నర్రెడ్డి సునీత, డాక్టర్ గాయత్రి, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రామసుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. దేశంలోనే ఇన్ఫెక్షన్లపై పోరాటంలో అతి పెద్ద సొసైటీగా తమ సంస్థకు గుర్తింపు వచ్చిందని చెప్పారు. సదస్సులో పలు పరిశోధన, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డాక్టర్ కల్యాణ చక్రవర్తి వివరించారు. నేడు సీబీఆర్ అకాడమీ రజతోత్సవాల పోస్టల్ కవరు విడుదల తెనాలి: కృష్ణాజిల్లాలోని సీబీఆర్ స్పోర్ట్స్ అకాడమీ రజతోత్సవాల సందర్భంగా పోస్టల్ శాఖ ప్రత్యేక కవరును విడుదల చేస్తోంది. చలసాని బాబు రాజేంద్రప్రసాద్ స్థాపించిన స్పోర్ట్స్ అకాడమీతో క్రీడారంగంలో ఆయన విశిష్ట సేవలు, సామాజిక సేవలను గుర్తించి తీసుకొచ్చిన ప్రత్యేక పోస్టల్ కవరును శనివారం సాయంత్రం 4 గంటలకు ఇక్కడి ప్రధాన పోస్టాఫీసులో విడుదల చేయనున్నారు. కార్యక్రమ వివరాలను పోస్టల్ సూపరింటెండెంట్ ఎం.శ్రీనివాసు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రత్యేక పోస్టరు కవరు విడుదలకు ముఖ్య అతిథిగా ఐఆర్ఎస్ అధికారి బీకే రావు హాజరుకానున్నారు. గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ డీవీఎస్సార్ మూర్తి, బ్రిగేడియర్ వెంకటరెడ్డి, సుశీల, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల సైనిక్ సంక్షేమ అధికారి హాజరవుతున్నట్టు వివరించారు. తెనాలి హెడ్ పోస్ట్మాస్టర్ ఈ.నాగేశ్వరరావు, సిబ్బంది నిర్వహించే ఈ కార్యక్రమానికి మా–ఏపీ అధ్యక్షుడు దిలీప్రాజా అధ్యక్షత వహిస్తారన్నారు. ఫిలాటిలిస్ట్స్లను కూడా ఆహ్వానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ వాణిశ్రీ రేపల్లె: అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వెంటనే వర్తింపజేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ బాపట్ల జిల్లా కన్వీనర్ సింగం వాణిశ్రీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేపల్లె ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీడీపీవో సుచిత్రకు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. వాణిశ్రీ మాట్లాడుతూ అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగి అనే పదం తొలగించాలని కోరుతూ 23 తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం ఇచ్చినా దానిలో అంగన్వాడీలకు ఇవ్వకుండా మోసం చేసిందని, ఎన్నికలకు ముందు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్కి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీనిచ్చి నేడు మొండి చెయ్యి చూపిందన్నారు. గతంలో పిల్లలు చదువుకి సంబంధించిన అమ్మఒడి అమలైందని పేర్కొన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఆదాయ నిబంధనలు పెట్టి సంక్షేమ పథకాలను దూరంచేయటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగి అనే పదం తొలగించాలని కోరుతూ జూన్ 23న జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాలో వర్కర్లు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, ఏఐటీయూసీ నాయకులు పడమటి బిక్షాలు, షేక్ బాజీ, నాగమల్లి, జ్యోతి, హేమలత, సీహెచ్ పద్మ, పాప, విజయలక్ష్మి, వై.శారద తదితరులు పాల్గొన్నారు. -
నడుములు విరుగుతున్నాయ్ !
గుంటూరు ఎడ్యుకేషన్: అమరావతి రోడ్డులోని అన్నదాన సత్రం పక్క రోడ్డు అధ్వానంగా మారింది. అమరావతి రోడ్డు మీదుగా కొరిటెపాడు సెంటర్కు వెళ్లేందుకు కీలకంగా ఉన్న ప్రధాన రహదారి పొడవునా గోతులు, గుంతలతో నిండి పోయింది. వాహనాల రాకపోకలకు ఏ మాత్రం అనువుగా లేదు. నిత్యం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్తులతో వందలాది ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు నిత్యం ఈ రోడ్డు మీదుగా ప్రయాణం సాగిస్తాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రహదారులను నిర్మిస్తున్న నగరపాలకసంస్థ అధికారులు అమరావతి రోడ్డు, కొరిటెపాడును కలుపుతూ సాగుతున్న ఈ రోడ్డు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా గుంతల్లో ప్రయాణంతో నడుములు విరుగుతున్నాయని వాహనదారులు, ప్రజలు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులతో పాటు నూతన రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ●లక్ష్మీపురం 3వ లైను రహదారిపై పడిన భారీ అగాధం ప్రమాదకరంగా మారింది. రోడ్డు ముఖ ద్వారంలో పైపులైనుకు ఏర్పడిన లీకేజీ కారణంగా దెబ్బతింది. అక్కడ భారీ గుంత ఉన్న సంగతి తెలియక వాహనదారులకు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించిన గుంతను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు. అధ్వానంగా మారిన అన్నదాన సత్రం పక్క రోడ్డు రోజూ వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు మరమ్మతులను పట్టించుకోని నగరపాలక సంస్థ అధికారులు -
సమ్మెలోకి ఇంజినీరింగ్ విభాగ కార్మికులు
నెహ్రూనగర్: రాష్ట్రవ్యాప్తంగా 22వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ గుంటూరు నగరపాలక సంస్థ కమిటీ ప్రధాన కార్యదర్శి రాయపూడి కోటి బాబు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం నగర మేయర్ కోవెలమూడి రవీంద్రకి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా కోటి బాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోని ఇంజినీరింగ్ విభాగంలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ నెల 2న కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి ఎటువంటి హామీ ఇవ్వలేదని, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెప్తానని చర్చలను అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారని విమర్శించారు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి పిలుపు రాకపోవడంతో ఈనెల 9న వడ్డేశ్వరంలో కమిషనర్ సంపత్ కుమార్ను కలిసి, 22వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్తున్నామని నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. -
నిత్య జీవితంలో యోగా అంతర్భాగం కావాలి
గుంటూరు ఎడ్యుకేషన్: నిత్య జీవితంలో యోగా అంతర్భాగం కావాలని టీజేపీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి పేర్కొన్నారు. పట్టాభిపురంలోని కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో యోగా సాధన చేయించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు భారతదేశం ఇచ్చిన గొప్పవరం యోగా అన్నారు. శ్వాసపై నియంత్రణ కలిగి, ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా జీవితాన్ని పొందగలరని తెలిపారు. కార్యక్రమంలో పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. అనితాదేవి, వైస్ ప్రిన్సిపాల్ భానుమురళి, గుంటూరు జిల్లా ఎన్ఎస్ఎస్ నోడల్ అధికారి జేవీ సుధీర్కుమార్, ఎన్సీసీ అధికారి మేజర్ పి. కుమార్ రాజా, పీడీలు ఆర్. శివాజీ, వాసుదేవరావు పాల్గొన్నారు. ●అమరావతి రోడ్డులోని శారదా స్కూల్లో విద్యార్థుల యోగా అక్షరమాల ఆకృతిలో కూర్చుని సాధన చేశారు. ఈ సందర్భంగా యోగా మాస్టారు జల్లేపల్లి వెంకటేశ్వరరావు విద్యార్థులకు యోగా ప్రాధాన్యతను తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆర్.ఎం. దాస్, డైరెక్టర్ వి.భారతీవాణి పాల్గొన్నారు. -
జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ
రెవెన్యూ శాఖతో ప్రజలకు నిత్యం అనుబంధం గుంటూరు వెస్ట్: పుట్టుక నుంచి మరణం వరకు ప్రజలకు రెవెన్యూ శాఖతో అనుబంధం ఉంటుందని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ తెలిపారు. స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో శుక్రవారం రాత్రి రెవెన్యూ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అంశంలో మరింత వేగంగా, పారదర్శకంగా రెవెన్యూ సిబ్బంది పని చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుత సమాజంలో పని వేగం పెరిగిందని, దీనికి తగ్గట్లు ఉద్యోగులు ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమంలో అందిన అర్జీలను అత్యంత వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించడం సంతోషమని పేర్కొన్నారు. ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు కిరణ్కుమార్ మాట్లాడుతూ రోజురోజుకూ తమ బాధ్యత మరింత పెరుగుతోందని తెలిపారు. ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. -
నారాయణ కళాశాల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ లక్ష్మీపురం: అక్రమంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాంను వేల రూపాయలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న కొత్తపేటలోని నారాయణ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నేతలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాసర్జీ మాట్లాడుతూ కళాశాలకు గుర్తింపు కూడా లేదని ఆరోపించారు. అధిక ఫీజుల దోపిడీలకు పాల్పడుతున్నారని, తక్షణమే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు పర్మిషన్ లేకుండా కళాశాల నిర్వహిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదని తెలిపారు. జిల్లా కార్యదర్శి యశ్వంత్ రఘువీర్ మాట్లాడతూ ముందస్తు అడ్మిషన్ల పేరుతో కళాశాల యాజమాన్యాలు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి, కల్లబొల్లి మాటలు చెప్పి అడ్మిషన్లు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిని విద్యాశాఖ అధికారులు అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. అక్రమాలకు పాల్పడున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రణీత్ , ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు డేవిడ్, అమర్నాథ్ , నగర సహాయ కార్యదర్శి వెంకట్, నాయకులు పాల్గొన్నారు. -
టెండరింగ్లో సిండి‘కేటులు’
● కూటమి కాంట్రాక్టర్లకు అండగా ఇంజినీరింగ్ అధికారులు ● గత నెల 8న ఓపెన్న్ చేసిన టెండర్లను సాకులు చూపి క్లోజ్ ● 18న జరగాల్సిన టెండర్లు కూడా వాయిదా నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు డూడూ బసవన్నలుగా మారారు. అభివృద్ధి పనుల టెండరింగ్లో కూటమి కాంట్రాక్టర్లు చెప్పినట్లు చేస్తున్నారు. వారి కనుసన్నల్లో ఇంజినీరింగ్ వ్యవస్థ నడుస్తోంది. గత నెల 8న 269 వర్కులు, ఈ నెల 18న రూ.20కోట్లు విలువైన 16 వర్కులకు వివిధ కారణాలు చూపి ఇంజినీరింగ్ అధికారులు టెండర్ ప్రక్రియ నిలిపివేశారు. దీనిపై కొంతమంది కాంట్రాక్టర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.గతంలో ఇలాంటి సంస్కృతి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాయిదా పడిన వర్కులకు నేడు టెండర్ నగరపాలక సంస్థ పరిధిలో జరిగే ప్రతి వర్కు తమకే చెందాలని, లేనిపక్షంలో టెండర్లు నిలిపి వేస్తామని ఇటీవల కాంట్రాక్టర్ల అసోసియేషన్న్ సమావేశంలో కూటమికి చెందిన కాంట్రాక్టర్లు బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. గత నెల 8న కొన్ని పనులకు టెండర్ తెరవాలి.వర్కుల్లో కూటమి నేతలు కాకుండా వేరే వారు ఉన్నారని, ఆపేయాలంటూ కూటమి ప్రజాప్రతినిధులు డ్రాయింగ్ బ్రాంచ్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. టెండర్ కాల్ ఫర్ చేసిన కొద్ది రోజుల్లోనే టెండర్ ఓపెన్న్ చేయాలనే నిబంధనల మేరకు డ్రాయింగ్ బ్రాంచ్లో పనిచేసే ఓ అధికారి 20 రోజుల తరువాత తెరిచారు. దీన్ని వ్యతిరేకించిన కొంతమంది బడా కాంట్రాక్టర్లు, అధికారులను అడ్డంపెట్టుకుని టెండర్లన్నింటిని రద్దు చేయించారు. జీఎస్టీ క్లియరెన్స్ లేకుండా ఏ విధంగా ఓపెన్ చేశావంటూ సదరు అధికారిని మాతృశాఖకు సరెండర్ చేశారు. గత నెల 8న ఆగిపోయిన 269 వర్కులకు ఈ నెల 18న తెరిచేందుకు అధికారులు ఓపెన్ టెండర్ ప్రక్రియ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. దీన్ని కూడా ఆపేశారు. దీనిపై ఇంజినీరింగ్ అధికారులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. సదరు టెండర్లల్లో ఎవరూ పాల్గొనలేదని, అందుకే రెండు రోజులు వాయిదా వేసినట్లు చెబుతున్నారు. 21న తిరిగి నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. షేరింగ్ కుదిరినట్లే ! నగరపాలక సంస్థలో జరగాల్సిన 269 వర్కులకు షేరింగ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏడు వార్డుల్లో ప్రాధాన్యత కలిగిన 40 నుంచి 50 వర్కులకు కూటమికి చెందిన కాంట్రాక్టర్లే పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రాధాన్యత లేని వర్కులకు మిగిలిన కాంట్రాక్టర్లు టెండర్ వేసే విధంగా ఒప్పందం కుదురుస్తున్నారు. ఓపెన్ టెండర్లో ఎవరూ పాల్గొనకుండా చేస్తున్నారు. ఉత్సవ విగ్రహంలా అసోసియేషన్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఉత్సవ విగ్రహంలా మారింది. కాంట్రాక్టర్లకు అండగా ఉండాల్సిన నేతలు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. డ్రాయింగ్ బ్రాంచ్లో నెలల తరబడి బిల్లులు పెండింగ్లో ఉన్నా పట్టించుకోవడం లేదు. మైనింగ్కు సంబంధించి బిల్స్ ఆగిపోయినా పట్టించుకునే వారు కరువయ్యారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. వర్కులు చేస్తున్నప్పుడు వాటర్ ట్యాంకర్కు రూ.500 వసూలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. కాంట్రాక్టర్ల సమస్యలు పట్టించుకోకుండా వర్కుల షేరింగ్ కోసమే మాట్లాడతారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
23 నుంచి ఫ్లైఓవర్ పనులు ప్రారంభం
గుంటూరు వెస్ట్: శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ పనులు ఈ నెల 23 నుంచి ప్రారంభవుతున్నాయని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం తన చాంబర్లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముందుగా ఏసీ కాలేజీ వైపు నుంచి పనులు ప్రారంభించాలని, దీనికి సంబంధించి సోమవారం నుంచి ట్రాఫిక్ మళ్లింపు చేపట్టాలని ఆదేశించారు. వాహనాల మళ్లింపు గురించి ట్రాఫిక్ పోలీసులు పత్రికలు, మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఆమె చెప్పారు. వాహనదారులకు వీలైనంత వరకు ఇబ్బంది లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. డొంక రోడ్డులోని మూడు వంతెనల వద్ద రోడ్డు లెవెలింగ్ చేయాలని ఆదేశించారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని ఆమె కోరారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ పి.విశ్వనాథరెడ్డి, జీఎంసీ ఎస్ఈ కె.నాగేశ్వరరావు, ట్రాఫిక్ సీఐ అశోక్ పాల్గొన్నారు. -
సొంత మండలంలోనే బదిలీ చేయాలి
నరసరావుపేట: తమను సొంత మండలంలోనే బదిలీ చేయాలని సచివాలయ ఉద్యోగులు కోరారు. ఈ మేరకు జీవో నంబరు ఐదును సవరించాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంతోపాటు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు వినతిపత్రాలు సమర్పించారు. మధ్యలో గాంధీవిగ్రహం, శివుని బొమ్మ ఐలాండ్, మల్లమ్మ సెంటర్లలో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ప్రమోషన్ ఫస్ట్–ట్రాన్స్ఫర్ నెక్స్ట్, క్యాడర్ తక్కువ–కొరడాలు ఎక్కువ, వార్డు నుంచి ఇద్దరికే బదిలీకి అవకాశం కల్పించాలి తదితర నినాదాల ప్లకార్డులు ప్రదర్శించారు. స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ షేక్ మహమద్ అలీ మాట్లాడుతూ బదిలీలకు సంబంధించిన జీవోను వ్యతిరేకిస్తున్నామన్నారు. తామంతా గ్రూప్–4 ఉద్యోగులమని, తమకు నెలకు రూ.30 వేల జీతం మాత్రమే వస్తోందన్నారు. ఈ జీతంతో వేరే మండలాలకు పిల్లలు, వృద్ధులతో కుటుంబాలను తీసుకెళ్లి ఉద్యోగ బాధ్య తల నిర్వహణ ఆర్థికభారంతో కూడుకున్న విషయమన్నారు. తమలో 50శాతానిపైగా మహిళలే ఉన్నారన్నారు. తామంతా ఉదయం 5 గంటల నుంచే విధి నిర్వహణలో పాల్గొంటున్నామని, సర్వేలన్నీ తామే పూర్తి చేస్తున్నామన్నారు. ఈ కేడర్లో ఉన్న తమను సొంత మండలాల్లో ఉద్యోగం చేయకూడదనటం చాలా దారుణమని అన్నారు. బయటి మండలాలకు వెళ్లి మహిళలు ఏవిధంగా పని చేస్తారని ప్రశ్నించారు. ఒక వేళ తప్పనిసరిగా తమను మార్చాలని అనుకుంటే జూనియర్ అసిస్టెంట్ కేడర్కు పెంచాలని, సాంకేతిక ఉద్యోగులకు తగ్గట్లుగా జీతా లు ఇవ్వాలని, సీనియర్ అసిస్టెంట్ కేడర్కు పదోన్నతులు కల్పించాలని కోరారు. ఇప్పటికే రేషనలైజేషన్ పేరుతో రెండు వార్డులను కలిపి బాధ్యతలు అప్పగించటంతో పనిభారంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. మిగులు ఉద్యోగులను ఏం చేస్తున్నా రనే దానిపై ప్రభుత్వానికి క్లారిటీ లేదని అన్నారు. జీవో నంబరు ఐదును సవరించి సొంత మండలాల్లో పనిచేసే అవకాశం కల్పించాల న్నారు. వార్డు నుంచి వార్డుకు బదిలీ చేయాలని సూచించారు. ఉద్యోగులు షేక్ కరిముల్లా, కె.విజయలక్ష్మి, పి.రమేష్, ఎం.రమేష్నాయక్, మహిమజ్యోతి ఉన్నారు. -
యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
బాపట్ల: అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా బాపట్ల మండలం సూర్యలంక బీచ్ తీరంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పరిశీలించారు. 10వేల మందితో సూర్యలంక బీచ్లో యోగాసనాలు చేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు చెప్పారు. కార్యక్రమానికి ప్రజలందరూ హాజరుకావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఉదయం 5 గంటలకు యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయమ్మ, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా తదితరులు పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
చల్లపల్లి: ఊక లోడుతో వస్తున్న లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో రెండు స్కూటీలు, ఒక బైకు, ఒక మినీ లారీ దెబ్బతిన్నాయి. చివరకు లారీ రెండు ఇళ్ల మధ్య ఉన్న సందులోకి దూసుకెళ్లి ఆగింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అవనిగడ్డకు చెందిన ఈ లారీ రేపల్లె మండలం పేటేరులోని ఒక రైసు మిల్లులో ఊక నింపుకొని పులిగడ్డ, చల్లపల్లి, పామర్రు మీదుగా గుడివాడకు వెళ్లేందుకు బయలుదేరింది. చల్లపల్లిలోని పాగోలు రోడ్డువద్ద గల బ్రహ్మంగారి గుడి వద్దకు రాగానే ఒక్కసారిగా మెలికలు తిరుగుతూ దూసుకురావడం ప్రారంభించింది. తొలుత ఒక మినీట్రాన్స్పోర్టు వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టగా, ఆ వ్యాను ఛాసిస్ ముందుకు జరిగి ఇంజిన్ను నొక్కటంతో అది నడిరోడ్డు మీదే ఆగిపోయింది. తర్వాత ఊకలారీ పాత ఇనుపసామాను కొట్టు వద్ద పనిచేస్తున్న వ్యక్తిపైకి దూసుకురాగా, అతను గమనించి పక్కకు తప్పుకోగా లారీ అక్కడ ఉన్న ఒక స్కూటీని ఢీకొట్టి రెండు ఇళ్ల మధ్య ఉన్న సందులోకి దూసుకెళ్లి ఆగింది. అక్కడ ఉన్న ఒక స్కూటీ, బైక్ కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. పక్కన ఉన్న షెడ్డు పాక్షికంగా దెబ్బతింది. కరెంటు స్తంభానికి ఉన్న సర్వీసు వైర్లు తెగిపడ్డాయి. ఊక లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. -
రెవెన్యూ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: భూమి దస్త్రాలతోనే రెవెన్యూ శాఖకు ప్రత్యేక గుర్తింపు ఉందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. రెవెన్యూ దినోత్సవం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ అవార్డులు, జ్ఞాపికలతో సత్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ విజ్ఞానం పెంచుకుంటేనే రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు విశేష సేవలు అందించగలమని అన్నారు. ప్రభుత్వ శాఖలన్నింటికీ మాతృ శాఖగా రెవెన్యూ నిలుస్తోందన్నారు. ప్రత్యేక గుర్తింపు ఉన్న రెవెన్యూ శాఖ పుట్టిన రోజును ప్రభుత్వం అధికారికంగా జరుపుకోవడానికి అనుమతులు ఇవ్వడం సంతోషదాయకమన్నారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తే ఎంతో విలువ, హోదా లభిస్తుందన్నారు. విపత్తు సమయాలలో రెవెన్యూ శాఖ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివన్నారు. అన్ని శాఖలతో సమన్వయంగా పనిచేసేది రెవెన్యూ శాఖ ఒకటేనన్నారు. రెవెన్యూశాఖలో అన్ని హోదాలలో శిక్షణ పొందిన తరువాతనే ఐఏఎస్లుగా నియమితులవుతారన్నారు. రెవెన్యూ శాఖలోకి వచ్చిన ప్రతి ఉద్యోగి చట్టాలు, జీవోలపై అవగాహన పొందితేనే ప్రాధాన్యం మరింత పెరుగుతుందన్నారు. ప్రజలకు విశేష సేవలందించే భాగ్యం రెవెన్యూశాఖ ద్వారానే ఏర్పడుతుందన్నారు. నూతనంగా రెవెన్యూ లోకి వచ్చే ఉద్యోగులకు చట్టాలపై కనీసం అవగాహన ఉండటం లేదన్నారు. విధి నిర్వహణలో మరింత ప్రావీణ్యం పొందాలన్నారు. ఈనెలఖారకు ఉద్యోగ విరమణ చేయనున్న ముగ్గురు తహసీల్దార్లు సీతారత్నం, త్రిపుర బాల సుందరమ్మ, వెంకటరత్నంలను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్గౌడ్ మాట్లాడుతూ జనన, మరణ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే ప్రత్యేక అధికారాలున్న రెవెన్యూశాఖ మాతృశాఖగా ప్రాచుర్యం పొందిందని చెప్పారు. విపత్తులు, ఎన్నికల నిర్వహణ సమయంలో రెవెన్యూ శాఖ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. రెవెన్యూ శాఖకు ఉన్న విస్తృతమైన అధికారాలను వివరించారు. బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం సేవలందించే ప్రత్యేక హోదా రెవెన్యూ శాఖకు ఉందని చెప్పారు. ప్రజలకు న్యాయం చేయడంలోనూ ప్రథమంగా నిలుస్తుందన్నారు. కేఆర్ఆర్సీ ఉపకలెక్టర్ లవన్న మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ సహాయ సంచాలకులు కనకరాజు, తహసీల్దార్లు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
బాపట్ల
శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2025ఆలయ నిర్మాణానికి విరాళం నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళి ఆలయ నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన జాజం నాగేశ్వరరావు, మాధవి దంపతులు రూ.1,01,116 విరాళం ఇచ్చారు.చౌడేశ్వరి ఆలయ వార్షికోత్సవాలు రెంటచింతల: శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ 17వ వార్షికోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకుడు ఓరుగంటి మారుతీ శర్మ నేతృత్వంలో పూజలు జరిగాయి. వృద్ధాశ్రమానికి విరాళంతెనాలి అర్బన్: ఐతానగర్కు చెందిన జెట్టి రవీంద్రనాథ్ చౌదరి, సంధ్యారాణిలు శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమానికి శుక్రవారం రూ.2.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. I -
దేవస్థాన భూముల్లో మట్టి తవ్వకాలు
నగరం: నగరం మండలం శిరిపూడి గ్రామంలో దేవస్థాన భూములలో టీడీపీ నేతలు అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. మట్టి అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. శిరిపూడి గ్రామదేవత శిరిపూడిమ్మ తల్లి దేవస్థానానికి 20 ఎకరాల భూమి ఉంది. సుమారు ఆరు ఎకరాలలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నాలుగు రోజులుగా మట్టిని తవ్వి తరలిస్తున్నాడు. ఇప్పటివరకు సుమారు 1500 ట్రాక్టర్ల మట్టిని తరలించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్ రూ.1500లకు అమ్ముతూ జేబులు నింపుకుంటున్నారు. పట్టపగలే యంత్రాలను ఉపయోగించి తవ్వకాలు జరుపుతున్నారు. ఽస్థానిక రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అండదండలతోనే శిరిపూడిలోని దేవస్థాన భూముల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా మంత్రి, అధికారులు స్పందించి మట్టి తవ్వకాలను నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు. శిరిపూడిలో పచ్చనేతల దందా అక్రమార్కులపై చర్యలు తీసుకొవాలంటున్న గ్రామస్తులు పట్టించుకోని అధికారులు మట్టి తరలించిన వారిపై చర్యలు తీసుకుంటాం శిరిపూడి దేవస్థాన భూములలో మట్టిని తరలిస్తున్నట్లు తన దృష్టికి వచ్చింది. అక్రమంగా మట్టి తరలింపుపై విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం. –రాజేశ్వరరావు, ఈఓ -
లోక్అదాలత్లో అధిక కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలి
సీనియర్ సివిల్ న్యాయమూర్తి వెన్నెల రేపల్లె: లోక్అదాలత్లో అధిక కేసులు పరిష్కారమయ్యేలా పోలీసులు పనిచేయాలని మండల న్యాయాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వెన్నెల కోరారు. జులై 5వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో అత్యధిక కేసుల పరిష్కారం కోసం శుక్రవారం స్థానిక కోర్టు హాలులో డివిజన్ పరిధిలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, పోలీసులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలన్న లక్ష్యంతో న్యాయశాఖ లోక్అదాలత్తోపాటు ప్రతి నెలా జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తోందన్నారు. డివిజన్ పరిధిలో పరిష్కారమయ్యే కేసులను గుర్తించి పరిష్కారం అయ్యేలా చేయాలన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవీసాయి శ్రావణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గీతా భార్గవి, రేపల్లె రూరల్ సీఐ సురేష్బాబు, నగరం ఎకై ్సజ్ సీఐ శ్రీరామ్ ప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీవీ గిరిధర్, కార్యదర్శి యు.శ్రీనివాసరావు, రేపల్లె, భట్టిపోలు, నిజాంపట్నం, చెరుకుపల్లి ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ యోగా ఒలింపియాడ్లో మహేష్కు పతకం వేటపాలెం: నేషనల్ యోగా ఒలింయాడ్లో మండలంలోని అక్కాయిపాలెం గ్రామానికి చెందిన అనుభం మహేష్కుమార్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు చైన్నె కన్యాకుమారిలో యోగా నేషనల్ ఒలింపియాడ్ పోటీలు జరిగాయి. ఈ ఒలింపియాడ్లో యువకుడు పాల్గొని మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించాడు. తండ్రి అనుభం వెంకట సురేష్ చేనేత కార్మికుడిగా పనిచేస్తుంటాడు. మహేష్ ఒంగోలు నవోదయలో ఇంటర్ చదువుతున్నాడు. మహేష్ని కుటుంబ సభ్యులు, అధ్యాపకులు అభినందించారు. వ్యవసాయ శాఖలో బది‘లీలలు’కొరిటెపాడు(గుంటూరు): వ్యవసాయ శాఖలో సహాయ సంచాలకుల(ఏడీఏ) బదిలీల్లో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నెల 10వ తేదీ ఉదయం మండల వ్యవసాయ అధికారులతో పాటు, ఏడీఏల బదిలీల ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నడూ లేని విధంగా పైరవీలు జరగడంతో మార్పులు, చేర్పులకు అంతే లేకుండా పోయింది. ఎట్టకేలకు వ్యవసాయ అధికారుల బదిలీల వ్యవహారం కొలిక్కి వచ్చినప్పటికీ.. ఏడీఏల బదిలీల వ్యవహారానికి ముగింపు లభించలేదు. ఏడీఏల బదిలీలను జోనల్ యూనిట్గా తీసుకొని చేపట్టారు. అయితే, ఒక పోస్టులో ఇద్దరు, ముగ్గురిని నియమించడం, జోన్–4కు చెందిన ఏడీఏను జోన్–3కి బదిలీ చేయడం వంటి తప్పిదాలు భారీగా జరిగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 19 మంది ఏడీఏలు బదిలీ అయ్యారు. వీటికి తోడు సిఫారసులు, పైరవీలు కూడా ఊపందుకోవడంతో బదిలీ ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల్లోనే వీటిని హోల్డ్లో పెట్టారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏడీఏలు ఎవ్వరూ రిలీవ్ కావద్దనే ఆదేశాలు వచ్చాయి. అయితే, పది రోజులు గడిచినా రివైజ్డ్ ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో పాత స్థానాల్లో కొనసాగలేక, కొత్త స్థానాల్లో చేరలేక ఏడీఏల పరిస్థితి దయనీయంగా మారింది. పైరవీలు పెద్దఎత్తున జరుగుతుండటంతో బదిలీలపై అనిశ్చితి మరో రెండు, మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 10వ తేదీ నుంచి బదిలీలపై బ్యాన్ వచ్చింది. ఏడీఏల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడాలంటే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం అవసరం ఉందనే చర్చ వ్యవసాయ శాఖలో కొనసాగుతోంది. నగదు రహిత వైద్యం అందించాలి నరసరావుపేట: డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవలో పేషెంట్లకు బిల్లులు లేకుండా నగదు రహిత వైద్యం అందించేలా ఆసుపత్రి యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవపై జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. ● ఏడీఏల బదిలీల్లో కొలిక్కిరాని పైరవీలు ● బదిలీల్లో భారీగా తప్పిదాలు ● ఒకే పోస్టులో ఇద్దరు, ముగ్గురు నియామకం -
సింగయ్య కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండ
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) కుటుంబానికి వైఎస్సార్ సీపీ నేతలు గురువారం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ బలసాని కిరణ్కుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి కొలకలూరి కోటేశ్వరరావు తదితరులు సింగయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులిర్పించారు. పిల్లల చదువులు, తదితర విషయాలను వాకబు చేశారు. కుటుంబానికి వైఎస్సార్ సీపీ కుటుంబం ప్రతి విషయంలో తోడుంటుందని తెలిపారు. పార్టీ తరఫున ఇప్పటికే రూ. 10 లక్షలను ప్రకటించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు కుటుంబాల అదృశ్యంపై ఫిర్యాదు తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రకాష్నగర్లో నివసించే రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు కనిపించడం లేదంటూ ఓ వ్యక్తి గురువారం తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు.. కారు డ్రైవింగ్కు వెళ్లిన బెవర దుర్గారావు ఇంట్లో ఉన్న భార్యకు ఫోన్ చేశాడు. ఆమె గానీ కుటుంబ సభ్యులు గానీ లిఫ్ట్ చేయలేదు. ఇంటికి వచ్చి చూడగా వారు కనిపించలేదు. తన భార్యతో పాటు తోడల్లుడి కుటుంబం కూడా కనిపించడం లేదని పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. కనిపించకుండా పోయిన వారిలో దుర్గారావు భార్య సుధారాణి, కుమారుడు నవీన్ కుమార్, కుమార్తె యశ్వణి, తోటికోడలు, మరో ఇద్దరు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాడేపల్లి ఎస్ఐ ప్రతాప్ కుమార్ కేసు నమోదు చేశారు. -
లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
సంతమాగులూరు(అద్దంకి): నిలిచి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, ఐదుగురికి గాయాలైన సంఘటన సంతమాగులూరు మండలంలోని పాతమాగులూరు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగింది. అందిన సమాచారం మేరకు.. తణుకు నుంచి నంద్యాల వైపు లోడ్తో వెళుతున్న లారీ పాత మాగులూరు వద్ద ఆగి ఉంది. ఈ క్రమంలో విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందున్న లారీని గమనించకుండా ఢీ కొట్టడంతో మూడో సీటులో కూర్చున్న అనంతపురం రూరల్ మండలానికి చెందిన హుస్సేన్(55) అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. రైలులో బెర్త్ లేక బస్సులో.. దూదేకుల హుస్సేన్ ఈ నెల 17వ తేదీన తన స్నేహితుడు అబ్దుల్ దౌలాతో పనిమీద విజయవాడ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఇద్దరూ రైలు ఎక్కడానికి మచిలీపట్నం రైల్వేస్టేషన్కు వెళ్లారు. అక్కడ ఒకే బెర్త్ ఉండటంతో, దౌలా రైలు ఎక్కాడు. హుస్సేన్ బస్సులో అనంతరపురం బయలుదేరాడు. ఆ బస్సు సంతమాగులూరు మండలం పాతమాగులూరు గ్రామ సమీపంలోకి రాగానే ముందు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో సీటులో కూర్చుని ఉన్న హుస్సేన్ తల ముందు సీటుకు తగిలి, తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని భార్య ఆశాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పట్టాభి తెలిపారు. ఒకరు మృతి.. ఐదుగురికి స్వల్ప గాయాలు -
డంపింగ్ యార్డుగా శ్మశాన వాటిక
చీరాలటౌన్: అంత్యక్రియలకు ఉపయోగించే శ్మశానవాటికను డంపింగ్ యార్డుగా మార్చేస్తున్నారు. ఈ క్రమంలో సమాధులను చూడాలన్నా.. మృతిచెందిన వారికి దహన సంస్కారాలు చేయాలన్నా వాడరేవు గ్రామస్తులు అల్లాడుతున్నారు. గ్రామంలో సేకరించిన చెత్తను శ్మశానవాటికలో వేస్తూ గ్రామస్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా చెత్తను తగలబెట్టడంతో వచ్చే పొగ, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకెళితే.. మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీతోపాటు తీర ప్రాంతంగా పేరొందుతున్న వాడరేవు గ్రామంలోని లైట్ హౌస్వద్ద ఉన్న శ్మశానవాటిక ప్రస్తుతం డంపింగ్ యార్డుగా మారింది. గ్రామం మొత్తంలో 14 వార్డులు, 8436 జనాభా ఉన్న వాడరేవులో మత్య్సకారులు, ఇతర సామాజిక వర్గాల వారు నివాసం ఉంటున్నారు. గ్రామంలో ఎవరైనా మృతి చెందితే లైట్హౌస్ వద్ద ఉన్న శ్మశానవాటికలో దహన సంస్కారాలు చేయడంతోపాటు సమాధులను నిర్మించుకుంటారు. అయితే వాడరేవులో ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ అక్కడ చెత్తను వేయకుండా గ్రామంలోని వీధుల నుంచి సేకరించిన చెత్త, వ్యర్థాలను ట్రాక్టరు, చెత్త రిక్షాల ద్వారా శ్మశానవాటికలో డంపింగ్ చేస్తున్నారు. పంచాయతీ సెక్రటరీకి ఈ విషయం తెలిసినా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని, కేవలం నాయకుల సేవలో తరిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి దూరంగా ప్రభుత్వ స్థలాలను డంపింగ్ యార్డుగా వినియోగించుకోవాలని గతంలో పనిచేసిన పాలవర్గం తీర్మానం చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రత్యేకాధికారుల పాలనలో అయినా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం వాడరేవులో గ్రామంలో ఉన్న శ్మశానవాటికలో చెత్తను డంపింగ్ చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. చెత్త సమస్యను పరిష్కరించేందుకు అభివృద్ధి పనులు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. త్వరలో వేరే ప్రాంతానికి డంపింగ్ చేసేలా కృషి చేస్తున్నాం. సమస్యను కలెక్టర్, ఎమ్మెల్యే, చీరాల ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లాం. అనుమతులు, నిధులు మంజూరు చేస్తే వేరే ప్రాంతంలో చెత్తను తరలించేందుకు కృషి చేస్తాం. –కోట నాగయ్య, పంచాయతీ సెక్రటరీ సమాధులను ముంచెత్తుతున్న చెత్త పట్టించుకోని అధికారులు -
ఘనజీవామృతంతో నేల సారవంతం
మాదల(ముప్పాళ్ళ): ప్రకృతి వ్యవసాయ విధానం పాటించే రైతులు పంటలను సాగు చేసే ముందుగా వారి పొలంలో ఘనజీవామృతం ఒక ఎకరాకు 500 కిలోలు చల్లితే భూమి ఆరోగ్యంగా ఉండి పంట దిగుబడి పెరుగుతుందని జిల్లా ప్రకృతి వ్యవసాయం ఏపీఎం కె.అమలకుమారి అన్నారు. మండలంలోని మాదల గ్రామంలో మాజీ ఎంపీపీ గోగినేని కోటేశ్వరరావు నిర్వహిస్తున్న గోశాలను గురువారం సందర్శించారు. గోశాలలో 400 టన్నుల ఆవు పేడ, మూత్రంతో 300 టన్నుల ఘనజీవామృతం, పంచగవ్య తయారు చేయడం జరుగుతుందన్నారు. వీటితో పాటుగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన కషాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ రైతులకు కావాల్సిన ఇన్పుట్స్ గోశాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. సత్తెనపల్లి ఎంటీ మధుబాబు, సౌజన్య పాల్గొన్నారు. -
హైవేపై మూడు వాహనాలు ఢీ
మార్టూరు: జాతీయ రహదారిపై ఒకదాని వెనుక మరొకటిగా వెళుతున్న మూడు వాహనాలు పరస్పరం ఢీకొన్న సంఘటన స్థానిక రాజుపాలెం, డేగరమూడి రెస్ట్ ఏరియా సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. హైవే పెట్రోలింగ్ సిబ్బంది నాయక్, శ్రీహరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలుకు చెందిన పద్మనాభయ్య శెట్టి తన వాహనంలో చిలకలూరిపేట నుంచి ఒంగోలు వెళ్తున్నాడు. రెస్ట్ ఏరియా సమీపంలోకి వెళ్లగానే వాహనాన్ని వెనుక నుంచి గ్రావెల్ తరలించే టిప్పర్ వాహన డ్రైవర్ బలంగా ఢీ కొట్టి రహదారి మధ్యలో తన వాహనాన్ని నిలిపివేశాడు. అదే మార్గంలో విజయవాడ నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళుతున్న కంటైనర్ వాహనం హఠాత్తుగా అడ్డుగా వచ్చిన టిప్పర్ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు మూడు వాహనాలు ధ్వంసం అయినప్పటికీ వాహనాల్లోని వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్, ట్రాఫిక్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని రహదారికి అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూశారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. -
ఆరోగ్య సంరక్షణలో అంగన్వాడీల పాత్ర కీలకం
సీడీపీవో సుచిత్ర రేపల్లె: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల నిరంతర ఆరోగ్య సంరక్షణ బాధ్యతలలో అంగన్వాడీ కార్యకర్తల పాత్రే కీలకమని సీడీపీవో ఎం.సుచిత్ర పేర్కొన్నారు. సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలతో పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీలు, ఆయాలు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందించటంతోపాటు చిన్నారులకు ఆట పాటలతో కూడిన విద్య అందించాలన్నారు. పనివేళల్లో ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కేంద్రాలలో అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి కేంద్రంలో మదర్స్ వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి పిల్లలు చేసే కార్యక్రమాలను గ్రూపు ద్వారా తల్లులకు తెలియజేయాలన్నారు. కేంద్రాలకు గుడ్లు, బాలామృతం, బాల సంజీవని, పాలు వంటి పదార్థాలు సకాలంలో రాకుంటే తమ దృష్టికి తీసుకువచ్చి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. కేంద్రాలలో నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలను వివరించారు. కార్యక్రమంలో ప్రధమ్ కోఆర్డినేటర్ త్రివేణి, సూపర్వైజర్లు సీహెచ్ హిమబిందు, టీ.రాధిక, ఎస్.సుజాత, విజయలక్ష్మి, మంజుల, నాగలక్ష్మి, అరుణ, అంగన్వాడీలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు. -
వెంకట జయవర్ధన్ రెడ్డి అకాలమృతి బాధాకరం
సత్తెనపల్లి: యువకుడు పాపసా ని వెంకట జయవర్ధన్రెడ్డి అకాల మరణం బాధాకరమని వైఎస్సా ర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి 16వ వార్డు వడ్డవల్లి ఏరియాకు చెందిన పాపసాని వెంకట జయవర్ధన్ రెడ్డి బుధవారం సొమ్మసిల్లి పడిపోయి గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం నిర్వహించిన అంతిమ యాత్రలో గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు, తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన కుమారుడు అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. వెంకట జయవర్ధన్రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతికలగాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుధవారం వెంకట జయవర్ధన్రెడ్డి మృతి వార్త తెలియడంతో డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డితో పాటు మాజీమంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్రెడ్డి, యర్రం వెంకటేశ్వరరెడ్డి, నాయకులు చిట్టా విజయభాస్కర్రెడ్డి, డాక్టర్ గజ్జల నాగభూషణ్రెడ్డి, రోళ్ల మాధవిలు పార్ధివదేహన్ని సందర్శించి నివాళులర్పించారు. అశ్రునయనాల నడుమ అంతిమయాత్ర జరిగింది. ప్రత్యేక వాహనంపై వెంకట జయవర్ధన్రెడ్డి పార్ధీవ దేహాన్ని ఏర్పాటు చేసి పట్టణంలో ప్రదర్శన చేశారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, మృతుడి మిత్ర బృందం, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జయవర్ధన్రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం పట్టణంలోని 16వ వార్డు వడవల్లి ఏరియాకు చెందిన యువకుడు పాపసాని వెంకట జయవర్ధన్రెడ్డి (32) బుధవారం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో సొమ్మ సిల్లి పడిపోగా వైద్యశాలకు తరలించగా గుండెపోటుతో మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. పాపసాని వెంకటజయవర్ధన్రెడ్డి మృతదేహానికి రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో గురువారం ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానాస్పద మృతిగా పట్టణ ఎస్ఐ ఎం.పవన్ కుమార్ కేసు నమోదు చేశారు. -
డిగ్రీ పట్టా వెనుక తల్లిదండ్రుల త్యాగం
● ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి ● ఘనంగా వీవీఐటీ స్నాతకోత్సవం పెదకాకాని: ప్రతి ఒక్క విద్యార్థి డిగ్రీ పట్టా వెనుక తల్లిదండ్రుల త్యాగాలు ఎన్నో ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి అన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల స్నాతకోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి, వీవీఐటీ విశ్వవిద్యాలయ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చాన్సలర్ కొడాలి రాంబాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.ప్రొఫెసర్ మధుమూర్తి మాట్లాడుతూ డిగ్రీ అంటే కేవలం పట్టా మాత్రమే కాదు జ్ఞానాన్ని సంపాదించడం అన్నారు. స్టార్టప్ కంపెనీలను స్థాపించి ఉద్యోగాలు అందించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని సూచించారు. వీవీఐటీ విశ్వవిద్యాలయ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వైస్ చాన్సలర్ కొడాలి రాంబాబు మాట్లాడుతూ 2007లో ప్రారంభమైన వీవీఐటీ కళాశాల అనతి కాలంలోనే అనేక విజయాలను సొంతం చేసుకొని 2025లో విశ్వవిద్యాలయంగా ఎదిగిందని చెప్పారు. వీవీఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి కళాశాల వార్షిక ప్రణాళికను, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. 2021–2025 విద్యా సంవత్సరానికి గాను అత్యుత్తమ ప్రతిభ కనబరచి కళాశాల టాపర్గా నిలచిన విద్యార్థిని పరుచూరి బిందు రేణుకకు వాసిరెడ్డి వెంకటాద్రి బంగారు పతకాన్ని ముఖ్య అతిథి ప్రొఫెసర్ కె. మధుమూర్తి అందజేశారు. క్లాస్ ఆఫ్ 2025కు ఉత్తమ ప్రతిభ కనబరచిన 11 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలతోపాటు 1195 మంది పట్టభద్రులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థులు వేషధారణలో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో వీవీఐటీ వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్, సెక్రటరీ ఎస్. బదరీ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ మామాళ్లపల్లి శ్రీకృష్ణ, డీన్ ఆఫ్ అకడమిక్ డాక్టర్ కె. గిరిబాబు, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
చీరాలలో ఆగని ఇసుక దందా
చీరాల టౌన్: ప్రకృతి సంపద అయిన ఇసుకను అప్పనంగా ఆరగిస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారు కూటమి నేతలు. 24 గంటలు ట్రాక్టర్లు, ట్రక్కులు, లారీలు, టైరు బండ్లలో ఇసుకను రవాణా చేస్తున్నా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మైనింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ‘‘ఇసుక ఎవరూ రవాణా చేయకూడదు.. మేము నిరంతరం నిఘా పెట్టాం.. అక్రమార్కులు ఎవరైనా వదలి పెట్టం’’ అంటూ జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి నిత్యం హెచ్చరిస్తుంటారు. కానీ చీరాల నియోజకవర్గంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. చీరాల మండలంలోని సముద్ర తీర ప్రాంతంతోపాటు ఈపూరుపాలెం, విజయనగర్కాలనీ, సావరపాలెం, బోయినవారిపాలెం, తోటవారిపాలెం, పాతచీరాల, 216 జాతీయ రహదారి తదితర ప్రాంతాల్లో ఇసుక దిబ్బలను పొక్లెయిన్లతో తవ్వుకోవడంతో ఆ స్థలాలు చెరువుల్లా మారాయి. ఈపురుపాలెంలో కూటమి నాయకుల కనుసన్నల్లోనే ఇసుక అక్రమాలు సాగుతున్నాయి. బోయినవారిపాలెం రోడ్డులో, 216 జాతీయ రహదారి సమీపంలో, సైఫన్ కాలువ సమీపంలో ఇసుక తరలించే లారీలు, రోడ్డు పక్కన తరలించేందుకు సిద్ధం చేసుకున్న ఇసుక డంపింగ్లు దర్శనమిస్తుంటాయి. టైరుబండి రూ.2000..ట్రాక్టర్ రూ.3,500 గతంలో అర్ధరాత్రి టైరుబండితో ఇసుకను తరలించే అక్రమార్కులు నేడు రోజంతా టైరు బండ్లు, ట్రాక్టర్లతో ఇసుక సరఫరా చేస్తున్నారు. టైరు బండికి రూ.2 వేలు, ట్రాక్టర్ రూ.3500 వరకు వసూలు చేస్తున్నారు. రోజుకు వంద వరకు ట్రాక్టర్లు, టైరు బండ్లు, ట్రక్కుల ద్వారా ప్రకృతి విధ్వంసం జరుగుతోంది. చీరాల మండలంలోని రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఈపురుపాలెం, బోయినవారిపాలెం, తోటవారిపాలెం, పాతచీరాల, గవినివారిపాలెంతోపాటు వేటపాలెంలో ఆరితేరిన ముగ్గురు నాయకుల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా జరుగుతోంది. చీరాల పోలీసు రూరల్ సర్కిల్ పరిధిలోని రూరల్ పోలీస్స్టేషన్, వేటపాలెం పోలీసుస్టేషన్ పరిధిలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రెచ్చిపోతున్న అక్రమార్కులు పట్టించుకోని రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు చర్యలు తప్పవు ఇసుక అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించం. గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందితో తనిఖీలు చేయిస్తున్నాం. ఈపురుపాలెం, బోయినవారిపాలెం, పాతచీరాల, తీర ప్రాంత గ్రామాల్లో అక్రమంగా ఇసుక క్వారీలు నిర్వహించినా, అమ్మకాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు. – కె.గోపికృష్ణ, తహసీల్దార్, చీరాల -
యోగాతో ఆరోగ్యానికి రక్ష
కలెక్టర్ వెంకట మురళి చీరాల టౌన్: ప్రతిరోజూ యోగా చేయడం వలన మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యం, ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. గురువారం మండలంలోని వాడరేవులోని నగరవనంలో (సిటీ ఫారెస్ట్) యోగా అవగాహన క్యాక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్తోపాటు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఆర్డీఓ టి.చంద్రశేఖర నాయుడు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈనెల 21న ప్రపంచమంతా జరుపుకుంటుందన్నారు. బాపట్ల జిల్లాలో మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 21న ఏపీలోని అన్ని జిల్లాలు, మండలాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వికసిత్ భారత్ వైపు దేశం, ఆంధ్రప్రదేశ్ పయనిస్తుందన్నారు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ యోగా చేయడం వలన చాలా మంచి ఫలితాలు ఉన్నాయని, యోగాను ప్రజలందరికీ అలవాటు చేసేందుకు సీఎం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారన్నారు. ఆరోగ్యపరమైన సమస్యలు తొలగి ప్రజలు ప్రశాంతంగా ఉండటానికి యోగా ఉపయోగపడుతుందన్నారు. డీఆర్వో గంగాధర్గౌడ్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, డీఎం అండ్ హెచ్వో విజయమ్మ, ఆయుష్ డాక్టర్ శ్రీనివాసరావు, పలుశాఖల అధికారులు, సిబ్బంది, పలువురు వైద్యులు, ఎస్సీపీ క్యాడెట్లు, ప్రజలు పాల్గొన్నారు. -
సికిల్ సెల్ వ్యాధిపై అవగాహన అవసరం
మంగళగిరి: సికిల్ సెల్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ సాంఘిక, గిరిజన సంక్షేమం శాఖ కార్యదర్శి ఎం.మల్లికార్జుననాయక్ తెలిపారు. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్)లో గురువారం ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, గిరిజన వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జుననాయక్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. వారసత్వంగా వచ్చే రుగ్మతకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంచాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ సరస్వతి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న, బ్లడ్ సెల్ కన్సల్టెంట్ డాక్టర్ సోనియా మోహన్, డీఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రంగారావు, ఎయిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ శ్రీమంత్కుమార్ దాస్, ఎయిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్మోహన్ పాల్గొన్నారు. సాంఘిక, గిరిజన సంక్షేమం శాఖ కార్యదర్శి మల్లికార్జుననాయక్ -
23న కలెక్టరేట్ వద్ద ధర్నా
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ రేపల్లె: అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగి అనే పదాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న బాపట్ల కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే.ఝాన్సీ తెలిపారు. గురువారం రేపల్లె సీడీపీవో సుచిత్రకు అంగన్వాడీల తరుపున ఆమె సమ్మె నోటీసు అందజేసి మాట్లాడారు. చాలీచాలని వేతనాలతో బాధ్యతలు నిర్వహిస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వ పథకాల నుంచి దూరం చేయటం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వాలు అంగన్వాడీలకు అన్ని సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నాయన్నారు. కేవలం జీతభత్యాల చెల్లింపుల్లో కార్మికులుగా చూస్తూ అరకొర జీతాలతో సరిపెడుతున్నారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయని పక్షంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని ప్రయోజనాలను వర్తింపజేయాలన్నారు. 23న జరిగే ధర్నాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రేపల్లె ప్రాజెక్ట్ అధ్యక్షురాలు కే.రత్నకుమారి, నాయకులు ఎన్.కృష్ణకుమారి, పి.నిర్మల, బి.జ్యోతి, తదితరులు పాల్గొన్నారు. పీజీ లాసెట్లో చిరువ్యాపారి కుమార్తెకు స్టేట్ మొదటి ర్యాంకు అద్దంకి: చిరు వ్యాపారి కుమార్తె ఏపీ పీజీ లాసెట్లో స్టేట్ మొదటి ర్యాంకు సాధించింది. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో నివాసం ఉంటున్న బైసాని శ్రీనివాసరావు చిరువ్యాపారి, ఆమె తల్లి సుజాత ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. వీరి కుమార్తె హరితశ్రీ చిన్న వయసు నుంచి చదువులో ప్రతిభ చూపుతూ వస్తోంది. పదో తరగతి వరకు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివింది. ఇంటర్, డిగ్రీ హైదరాబాన్లోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో చదివింది. తొలుత లా సెట్ రాసి ర్యాంకు సాఽధించి ఎల్ఎల్బీ చదివింది. అనంతరం పీజీ సెట్ రాసి ఏకంగా స్టేట్ మొదటి ర్యాంకు సాధించి అందరి మన్నన్నలు పొందింది. హరితశ్రీ మాట్లాడుతూ సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని తనకు పీజీ లా సెట్లో ర్యాంకు రావడానికి సహకారం అందించిన తన తల్లిదండ్రులతోపాటు, సిద్ధార్థ కళాశాల అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపింది. చీరాల విద్యార్థికి 20వ ర్యాంకు చీరాల రూరల్: ఆంధ్రప్రదేశ్ పీజీ లాసెట్ ఫలితాల్లో చీరాల విద్యార్థి అన్నపురెడ్డి దేవి వరప్రసాద్ రాష్ట్ర స్థాయిలో 20వ ర్యాంకు సాధించాడు. బాపట్ల జిల్లా చీరాల రామకృష్ణాపురానికి చెందిన దేవి వరప్రసాద్ ఒంగోలు ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో తృతీయ సంవత్సరం ఎల్ఎల్బీ పూర్తి చేశాడు. ప్రస్తుతం గురువారం ప్రభుత్వం విడుదల చేసిన లాసెట్ పోసు్ట్రగాడ్యూషన్ (పీజీ) పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 20వ ర్యాంకు సాధించాడు. దేవి వరప్రసాద్ తల్లి చీరాల కోర్టులో న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. తల్లిదండ్రులైన కల్పన, వెంకట శివ అందించిన ప్రోత్సాహంతోనే రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించినట్లు తెలిపాడు. భవిష్యత్తులో తాను న్యాయమూర్తి కావాలనేది లక్ష్యమని తెలిపాడు. రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన దేవి వరప్రసాద్ను తల్లిదండ్రులతోపాటు సహచర మిత్రులు అభినందించారు. నీటి కుంటలో పడి బాలుడి మృతి యద్దనపూడి: ప్రమాదవశాత్తు బాలుడు(4) నీటికుంటలో పడి మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పోలూరు ఎస్సీ కాలనీలోని ఓ కుటుంబానికి చెందిన బాలుడు అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్నాడు. మధ్యాహ్నం కేంద్రానికి పక్కనే ఉన్న ఇంటికి వెళ్లాడు. ప్రతి రోజూ తమ బంధువుల ఇంటి వద్ద ఆడుకొని ఇంటికి వచ్చే బాబు సాయంత్రం 3 గంటలైనా ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో ఇంటి సమీపంలోనే ఉన్న చెరువు వద్ద ఆర్వో ప్లాంటు కోసం తీసిన గోతిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఈ విషయమై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎస్సై రత్నకుమారి తెలిపారు. -
శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025
వాటాలు పంచుకుంటున్న రెవెన్యూ అధికారులు, పచ్చనేతలు సాక్షి ప్రతినిధి,బాపట్ల: తాజాగా బాపట్ల, వేటపాలెం, చీరాల మండలాల్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు పచ్చనేతలతో కలసి కబ్జా చేసినట్లు తెలుస్తోంది. బాపట్ల మండలం అడవి పంచాయతీలోని పాండురంగాపురం ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించిన కొందరు టీడీపీ నేతలు వాటిల్లో అక్రమంగా రొయ్యల చెరువులు సాగుచేస్తున్నారు. ఆక్రమిత భూముల్లో కొన్నింటికి డీకేటీ పట్టాలు పుట్టించారు. ఒక పచ్చనేత ఆక్రమణలోని 40 ఎకరాలకు డీకేటీలు పుట్టించి కొన్నింటిని ఎకరం రూ.4 కోట్లకు అమ్మగా మిగిలిన భూమిని రొయ్యల సాగుకు వినియోగిస్తున్నారు. ఇదే ప్రాంతంలో చీరాలకు చెందిన మరో టీడీపీ నేత 30 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని కొంతకాలం రొయ్యల చెరువులు సాగుచేసి ఆక్రమిత ప్రభుత్వ భూమిలో సుమారు పది ఎకరాల భూములకు డీకేటీలు పుట్టించి అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ఆక్రమిత భూములన్నింటిని సదరు పచ్చనేత గుంటూరు ప్రాంతానికి చెందిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. వారు కొన్న భూమితోపాటు సముద్ర తీరం వరకూ ఉన్న మరికొంత ప్రభుత్వ భూమిని ఇటీవల కబ్జా చేశారు. దీంతో తీరప్రాంతంలోని మత్స్యకారులు ఆక్రమణలకు అడ్డుతగిలారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన ఇద్దరు నేతలు బాపట్ల రెవెన్యూ అధికారులకు కోట్లలోనే ముడుపులు ముట్టజెప్పినట్లు ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఏకంగా సముద్రతీరం వరకూ ఆక్రమించినా ఉన్నతాధికారులు స్పందించక పోవడం విమర్శలకు దారితీస్తోంది. చీరాలలో భారీగా కబ్జాలు వేటపాలెం మండలంలోని తీర ప్రాంతంలో రిసార్ట్స్ నిర్మాణం అధికంగా ఉండడంతో ఇక్కడ పచ్చ కబ్జాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. ఇటీవల చీరాల పచ్చనేత 11 ఎకరాలు కబ్జా చేసినట్లు నియోజకవర్గం మొత్తం చర్చ జరుగుతుంది. ఎకరం రూ.5 కోట్లు విలువచేసే ఈ భూమితోపాటు మరో రెండు చోట్ల దాదాపు 22 ఎకరాలు ఆక్రమించినట్లు సమాచారం. వేటపాలెం రెవెన్యూ అధికారి అండతోనే ఈ మొత్తం వ్యవహారం నడిచినట్లు ప్రచారంలో వుంది. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ శాసనసభ్యుడికి సైతం సదరు రెవెన్యూ అధికారి వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలో వందలాది ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూములు కట్టబెట్టినట్లు ప్రచారం వుంది. దీంతో ఇటీవల వేటపాలెం తహసీల్దారును జిల్లా కలెక్టర్ వెంకట మురళి సరెండర్ చేశారు. అక్రమాల వ్యవహారాలతోపాటు విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారనే కారణంతో తహసీల్దారుపై చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది. బాపట్ల మండలం అడవి పంచాయతీలో సముద్రం అలల వరకూ పచ్చ నేత ఆక్రమించిన భూమి న్యూస్రీల్కక్షతోనే సరెండర్ రెవెన్యూ ఉన్నతాధికారులకు తీరప్రాంతంలో ప్రభుత్వ భూములు అప్పగించలేదన్న కక్షతోనే తనను సరెండర్ చేశారని, ఇప్పటికే ఉన్నతాధికారులు వేటపాలెం తీరప్రాంతంలో పెద్ద మొత్తంలో భూములు కబ్జాచేశారని, త్వరలోనే ఆ వివరాలు మీడియాకు వెల్లడిస్తానని సరెండర్ అయిన తహసీల్దార్ చెబుతున్నారు. కిందిస్థాయి రెవెన్యూ అధికారులు కొందరు దీనిని ధ్రువీకరిస్తున్నారు. ఆ వివరాలు బయటపడితే రెవెన్యూ ఉన్నతాధికారులు ఏ స్థాయిలో భూములు కబ్జా చేశారన్న విషయం వెల్లడి కానుంది. విలువైన ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూములను కాపాడాల్సిన అధికారులు పచ్చనేతలతో కలిసి వాటాలు పంచుకోవడం, కబ్జాలకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కబ్జా ఆరోపణలున్న పచ్చనేతలు, ఽఅధికారులపై విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశముంది. తీరం భూములను కబ్జా చేస్తున్న కూటమి నేతలు ఆక్రమించి రొయ్యల చెరువులుగా మార్చిన వైనం కొన్నింటికి డీకేటీలు పుట్టించి అమ్మకాలు బాపట్ల, చినగంజాం, నిజాంపట్నం ప్రాంతాల్లో రొయ్యల చెరువులు చీరాల వేటపాలెం మండలాల్లో వెంచర్లు, రిసార్ట్ల నిర్మాణాలు అక్రమాల పేరుతో వేటపాలెం తహసీల్దార్ను సరెండర్ చేసిన కలెక్టర్ చినగంజాం, బాపట్ల మండలాల్లో అధికారుల జోళికి వెళ్లని వైనం కూటమి అధికారంలోకి రాగానే పచ్చనేతల కబ్జా పర్వం -
వ్యవసాయాధికారుల సూచనలు తప్పనిసరి
పర్చూరు(చినగంజాం): రైతులు వ్యవసాయాధికారుల సూచనల మేరకే పంటలు సాగు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. పర్చూరులో నల్ల బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని గురువారం పునఃప్రారంభించారు. పర్చూరు వచ్చిన ఆయనకు స్థానిక రైతులు స్వాగతం పలికారు. పర్చూరు వై.జంక్షన్ నుంచి ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక బొమ్మల సెంటర్లోని ఎన్టీఆర్, అంబేడ్కర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డుకు చేరుకొని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఎటువంటి మేలు చేయలేదన్నారు. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం పెట్టిన రూ.1650 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. ఈ ఏడాది మిర్చి, పొగాకు, కోకో, మామిడి పంటలకు గిట్టుబాటు ధర లేదని ఆయన అంగీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం కిలో కోకో రూ. 50, కిలోమామిడి రూ. 4 వంతున అదనంగా రైతులకు చెల్లిస్తుందని వివరించారు. నల్లబర్లీ హై గ్రేడ్ పొగాకు కిలో రూ.12, లో గ్రేడ్ పొగాకు రూ.6 చొప్పున రైతులకు చెల్లిస్తుందని తెలిపారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభించడం సంతోషకరమైన విషయంఅన్నారు. ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న చివరి పొగాకు వరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. మార్క్ఫెడ్ సూచించిన నిబంధనల మేరకు నాణ్యమైన పొగాకుకు తీసుకొని వెళ్లి కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని సూచించారు. కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ గతంలో పొగాకు పంటకు లాభాలు వచ్చాయని, ప్రస్తుతం డిమాండ్ లేక గిట్టుబాటు ధర పడిపోయిందని వివరించారు. కొనుగోలు కేంద్రానికి రైతులు ఎప్పుడు రావాలో ఫోన్కు మెసేజ్ వస్తుందని తెలిపారు. పొగాకు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించిందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ తెలిపారు. వచ్చే ఏడాది రైతులు ఎవరూ పొగాకును పండించవద్దని సూచించారు. పొగాకు నారు, విత్తనాలు కూడా అందుబాటులో లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, మార్కెఫెడ్ ఎండీ మంజీర్ జిలానీ సామూన్, గోడౌన్ ఎండీ సురేష్, ఏఎంసీ చైర్మన్ గుంజి వెంకటరావు, కార్యదర్శి తిరుపతి రాయుడు,బాపట్ల ఆర్డీఓ గ్లోరియా తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రకారమే రైతులు పంటలు వేసుకోవాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పర్చూరులో నల్ల బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి -
సీఆర్డీఏ జాబ్మేళాలో 110 మంది ఎంపిక
తాడికొండ: ఏపీ సీఆర్డీఏ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ సహకారంతో తుళ్లూరు సీఆర్డీఏ స్కిల్ హబ్ ప్రాంగణంలో బుధవారం జాబ్ మేళా జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమొబైల్, ఫైనాన్స్, స్కిల్ డెవలప్మెంట్ రంగాలకు చెందిన కంపెనీలైన వరుణ్ మోటార్స్, స్కిల్ క్రాఫ్ట్ లిమిటెడ్, ఎంవీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు లిమిటెడ్, కేఎంవీ ప్రాజెక్ట్ లిమిటెడ్, శ్రీ రామ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థలు పాల్గొన్నాయి. మొత్తం 806 మంది దరఖాస్తు చేసుకోగా 264 మంది హాజరయ్యారు. ఇంటర్వ్యూ తర్వాత 110 మందికి ఆఫర్ లెటర్లు అందించారు. 137 మంది అభ్యర్థులను తదుపరి రౌండ్లకు ఎంపిక చేశారు. రాజధాని అమరావతిలో పర్యటిస్తున్న ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధుల బృందం ఈ జాబ్ మేళాను పరిశీలించింది. అభ్యర్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంది. సమన్వయ అధికారులుగా ఏపీ ఎస్ఎస్డీసీ నైపుణ్య శిక్షణాధికారి సాయి శ్రీనివాస్, ప్లేస్మెంట్ అధికారి అరుణకుమారి, ఎన్ఏసీ అసిస్టెంట్ డైరెక్టర్ వి.నరసింహారావు, సీఆర్డీఏ డీసీడీవో బి. శ్రీనివాసరావు, సీనియర్ లైవ్లీహుడ్ ఆఫీసర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో మానసిక ప్రశాంతత
బాపట్ల టౌన్: మానసిక ప్రశాంతతకు యోగాసనాలు ఎంతగానో దోహదపడుతాయని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో బుధవారం పోలీస్ సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మే 21 నుంచి జూన్ 21 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర‘ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో యోగా గురువులు ధూళిపాళ్ల శైలజ పాల్గొన్నారని తెలిపారు. 32 రకాల యోగాసనాలతో పాటు సూర్య నమస్కారాలును ఆమె పోలీసులతో సాధన చేయించడంపై హర్షం వ్యక్తం చేశారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సాధించవచ్చని తెలిపారు. ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయిస్తే ఒత్తిడిని అధిగమించవచ్చని చెప్పారు. పోలీస్ విధుల్లో పని ఒత్తిడి అధికంగా ఉండే నేపథ్యంలో యోగా ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ మౌలుద్దీన్, ఆర్ఎస్ఐ కల్యాణ్, యోగా మాస్టర్ ట్రైనర్స్ గురజాల శ్రీనివాసరావు, కర్పూరపు మంజులత, టి. కృష్ణారావు, ఎం.సూరిబాబు, బాజీ, ప్రసాద్ పాల్గొన్నారు. ఎస్పీ తుషార్ డూడీ -
సాగులో డ్రోన్ల వినియోగం పెంచుదాం
నరసరావుపేట: రైతులు సస్యరక్షణకు డ్రోన్లను ఉపయోగించడం ద్వారా తక్కువ సమయం, ఖర్చుతో సమర్థంగా పురుగుమందులను పిచికారీ చేయవచ్చని, సాగులో డ్రోన్ల వినియోగం పెంచాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. సాధారణ స్ప్రేయర్తో పిచికారీ చేసేందుకు వీలులేని ప్రదేశాల్లో సైతం డ్రోన్లతో పనిముగించవచ్చని సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో రాయితీపై వ్యవసాయ యంత్రపరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు హాజరయ్యారు. జిల్లాలోని 1267మంది రైతులకు రూ.2.22కోట్ల విలువైన యంత్రపరికాలు అందజేశారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను వినియోగించడంలో మహిళలు ముందంజలో ఉండాలని కోరుతూ నాదెండ్ల మండలానికి చెందిన సురేఖ అనే మహిళను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సూక్ష్మనీటిపారుదల ప్రాజెక్ట్ అధికారి ఆంజనేయులు, జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి మాట్లాడారు. ఇఫ్కో కంపెనీ రీజినల్ అధికారి లోకేష్ నానో యూరియా, డీఏపీ గురించి వివరించారు. వ్యవసాయ పరికరాలు, రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు, భూసార పరీక్షా విశ్లేషణ పత్రాలను రైతులకు అందజేశారు. సబ్డివిజనల్ వ్యవసాయాధికారి పి.మస్తానమ్మ, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు 1267 మంది రైతులకు రూ.2.22కోట్ల యంత్రపరికరాలు అందజేత -
యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం
ఏఎన్యూ: యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె. మధుమూర్తి అన్నారు. యోగాంధ్రలో భాగంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన యోగా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యోగా ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించి దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. ఏఎన్యూ వీసీ ఆచార్య కె. గంగాధరరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ యోగా ఆవశ్యకతను తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం అభినందనీయం అన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అకడమిక్ అడ్వైజర్ ఆచార్య జి.రోశయ్య, వర్సిటీ పాలకమండలి సభ్యులు ఆచార్య సుమంత్ కుమార్, ఆచార్య జగదీష్ నాయక్, రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం యోగా ఆవశ్యకతను తెలిపారు. ప్రిన్సిపల్ ఆచార్య వీరయ్య, ఆచార్య సురేష్ కుమార్, ఓఎస్డీ ఆచార్య రవికుమార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, యోగాంధ్ర నిర్వాహకులు ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్, దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి.వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య డి.రామచంద్రన్, రూసా డైరెక్టర్ ఆచార్య ఎస్.మురళీమోహన్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య దివ్య తేజోమూర్తి, సీడీసీ డీన్ ఆచార్య రవికుమార్, పీజీ, యూజీ పరీక్షల కోఆర్డినేటర్లు ఆచార్య సుబ్బారావు, ఆచార్య ఎన్వీ కృష్ణారావు, వర్సిటీ వసతి గృహాల చీఫ్ వార్డెన్లు ఆచార్య మల్లికార్జున్, డాక్టర్ మాధవి, ఆచార్య త్రిమూర్తి రావు, ఆచార్య బ్రహ్మాజీ, ఆచార్య సుధాకర్, డాక్టర్ చంద్రమౌళి, గుంటూరు జిల్లా పరిధిలోని పలు కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. -
పోలీసులకు, అంబటికి మధ్య వాగ్వాదం
● జగన్ కాన్వాయ్ నిలిపేందుకు బారికేడ్లు ఏర్పాటు ● పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి ఆగ్రహం మేడికొండూరు: కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. కూటమి అరాచక పాలనలో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం జననేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి తాడేపల్లి నుంచి తన కాన్వాయ్తో బయలుదేరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా జగనన్నకు జేజేలు కొడుతూ అభిమానాన్ని చాటారు. ప్రణాళిక ప్రకారమే... జగనన్నకు ప్రజా ఆదరణ ఇంకెంత లభిస్తుందో అని కూటమి నేతలు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. జగన్ తన కాన్వాయ్లో సత్తెనపల్లి పట్టణ శివారులో చేరుకునేటప్పటికీ కూటమి నేతలు జగనన్న తలపెట్టిన కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పథకం రచించారు. ఎలాగైనా జగన్ కాన్వాయ్కు పోలీసుల సహకారంతో బారికేడ్లు అడ్డుగా పెట్టి ఆపేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇది గమనించిన వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు బారికేడ్లను అడ్డు తీసివేయాలంటూ పోలీసులకు సూచించారు. దీంతో పోలీసులకు, అంబటి రాంబాబు మధ్య వాగ్వాదం జరిగింది. జగన్ కాన్వాయ్ ఆపే శక్తి ఎవరికీ లేదంటూ అంబటి రాంబాబు భావోద్వేగానికి లోనయ్యారు. జన సందోహం ఎక్కువగా ఉండటంతో బారికేడ్లను తీసివేయించారు. పోలీసులు చేసేదేమీ లేక బారికేడ్లను తొలగించి ముందుకు సాగించారు. ఇలా అడ్డుకోవడం కేవలం జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి కూటమి నేతలు చేస్తున్న వికృత చేష్టగా అంబటి మండిపడ్డారు. రౌడీ రాజ్యంగా మారుస్తున్నారని అక్కడ ఉన్న పోలీసులను దుయ్యబట్టారు. -
‘కృష్ణ’లో హద్దు వివాదాలకు పరిష్కారం
కొల్లూరు : కృష్ణా నదిలో రెండు జిల్లాల మధ్య సరిహద్దు వివాదం పరిష్కారం దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మండలంలోని జువ్వలపాలెం వద్ద ఇసుక తవ్వకాలలో సరిహద్దు సమస్యలు తలెత్తాయి. గ్రామాన్ని ఆనుకొని ఉన్న కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లంక ప్రాంత వాసులు, బాపట్ల జిల్లా హద్దులు అతిక్రమించి ఇసుక తవ్వకాలు చేపటడ్డంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు, కృష్ణా జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రెండు జిల్లాల కలెక్టర్ల ఆదేశాలతో రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి, మచిలీపట్నం ఆర్డీఓ స్వాతిలు జువ్వలపాలెం వద్ద సరిహద్దుల సమస్యను పరిష్కరించేందుకు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. చర్చల అనంతరం నదిలో కొలతలు చేపట్టి జిల్లా సరిహద్దులు నిర్ణయించాలని తీర్మానించారు. సర్వేయర్లతో కొలతలు వేయించి తాత్కాలిక హద్దులు ఏర్పాటు చేశారు. శాశ్వత హద్దు రాళ్ల ఏర్పాటుకు ఆదేశం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హద్దుల స్థానంలో యుద్ధప్రాతిపదికన శాశ్వత హద్దు రాళ్లను నదీ ప్రవాహాన్ని తట్టుకొని నిలిచే విధంగా ఏర్పాటు చేయాలని కొల్లూరు తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లును రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి ఆదేశించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఆర్డీఓలు మాట్లాడుతూ సరిహద్దు సమస్య పరిష్కారమైన నేపథ్యంలో సమస్యలు పునరావృతం కాకుండా రెండు జిల్లాల ప్రజలు వ్యవహరించాలని సూచించారు. నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టరాదని హెచ్చరించారు. నదిలో ఉచిత ఇసుక క్వారీలకు అనుమతులు మంజూరయ్యే వరకు ప్రస్తుతం అనుమతులున్న స్టాక్ యార్డుల నుంచి మాత్రమే రవాణా చేసుకోవాలని సూచించారు. నదిలో ఇసుకను అక్రమంగా తవ్వి రవాణా చేసిన పక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నదిలో సరిహద్దుల సమస్య, ఇసుక తవ్వకాలపై త్వరలో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించననున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వేమూరు సీఐ పి.వి.ఆంజనేయులు, కొల్లూరు ఎస్ఐ జానకి అమరవర్ధన్, కృష్ణా జిల్లా పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్డీఓల సమక్షంలో సర్వేయర్లతో కొలతలు తాత్కాలిక హద్దుల ఏర్పాటు -
పంపకాల్లో తేడాతో టెండర్లు వాయిదా
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన అభివృద్ధి పనులకు ఈ నెల 18వ తేదీన టెండర్లు ప్రక్రియ జరగాల్సి ఉండగా ఇంజినీరింగ్ అధికారులు ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక టెండర్లన్నీ ఆయా కూటమి పార్టీలకి చెందిన కాంట్రాక్టర్లు మాత్రమే ఎక్కువ లాభాలు వచ్చేలా వేయాలని.. తక్కువ లాభాలు వచ్చే టెండర్లు మాత్రమే వేరే కాంట్రాక్టర్లు వేసుకోవాలని కొద్ది రోజులుగా కాంట్రాక్టర్ల సమావేశంలో హుకుం జారీ చేసిన విషయం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. టెండర్ల విషయంలో తాము అనుకునే కాంట్రాక్టర్ కాకుండా వేరే వాళ్లు పోటీ పడనున్నారనే సమాచారంతో కొంత మంది కూటమి పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు వెంటనే రంగంలోకి దిగారు. ఇంజినీరింగ్ఽ అధికారులను అడ్డం పెట్టుకుని బుధవారం 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన టెండర్లలో సుమారు రూ.30 కోట్ల మేరకు 15 పనులను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసేలా చేశారు. దీనిపై ఇంజినీరింగ్ సూపరింటెండెంట్ను వివరణ కోరగా.. కొన్ని టెండర్లకు ఎవరూ దాఖలు చేయకపోవడం కారణంగానే వాయిదా వేశామని చెప్పారు. పోలీసుల పనితీరుపై అసహనం గుంటూరు ఎడ్యుకేషన్: పోలీసుల పని తీరు ఆశించిన స్థాయిలో లేదని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ అసహనం వ్యక్తం చేశారు. కేసుల దర్యాప్తు ఆలస్యం అవుతోందని, నిందితులను అరెస్ట్ చేయకపోవడంతోపాటు సరైన సెక్షన్లు నమోదు చేయటం లేదని తమకు ఫిర్యాదులు అందాయన్నారు. వాటిపై విచారణ జరిపి, కమిషన్కు గల జ్యూడీషియల్ అధికారాలను ఉపయోగించుకుని సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకునేలా పోలీసు శాఖను ఆదేశిస్తామని చెప్పారు. బుధవారం గుంటూరు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మహిళా జన్ సున్వాయ్’ కార్యక్రమంలో వివిధ సంఘటనలపై జాతీయ మహిళా కమిషన్కు అందించిన ఫిర్యాదులపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజతో కలిసి ఆమె విచారణ చేపట్టారు. తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలకు సంబంధించి ఫిర్యాదులపై విచారణ జరిపారు. జెడ్పీకి వచ్చిన అర్చనా మజుందార్కు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పుష్పగుచ్ఛం అందించారు. జిల్లా జైలు సందర్శన నగరంపాలెం: గుంటూరు జిల్లా జైలును బుధవారం డాక్టర్ అర్చనా మజుందార్, రాయపాటి శైలజలు బుధవారం సందర్శించారు. మహిళా ఖైదీల నివాస విభాగం, వంటశాల, రేషన్ గోదాం, ఖైదీలకు ఇచ్చే ఆహార పదార్థాలను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. మహిళల రక్షణకు ప్రాధాన్యత గుంటూరు వెస్ట్: మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జేసీ ఎ.భార్గవ్తేజ, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెల్ప్లైన్, మెయిల్ ద్వారా ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
నేటి నుంచి బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు
బాపట్ల: బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలును గురువారం నుంచి జిల్లాలో పునఃప్రారంభించాలని కలెక్టర్ జె. వెంకట మురళి అధికారుల్ని ఆదేశించారు. పొగాకు కొనుగోలుపై వ్యవసాయశాఖ, మార్క్ ఫెడ్ అధికారులతో కలెక్టరేట్ ఆవరణలోని ఈటీసీ సమావేశ మందిరంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ధరలు తగ్గి భయంతో ఆందోళన చెందుతున్న పొగాకు రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, వారి ఇబ్బందులను తొలగించేలా ప్రతి ఆకు కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేయడానికి సీఎం యాప్ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. ఇప్పుడు వరకు ఈ– క్రాప్, ఏపీ ఏఎంఎస్లో నమోదైన రైతుల వివరాలను సీఎం యాప్కు అనుసంధానించాలని ఆయన సూచించారు. ప్రతి పొగాకు రైతు వివరాలను అందులో నమోదు చేయాలని ఆదేశించారు. మార్క్ ఫెడ్ ద్వారా 25 మిలియన్ కేజీలను పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రైతుల కోసం పర్చూరులో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని, టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం గాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని మళ్లించాలని తెలిపారు.అవగాహనతో వేరొక పంటలు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సీఎం యాప్లో నమోదు చేసిన రైతుల నుంచి మాత్రమే పొగాకును కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతుల పేర్లు, పంట, భూమి, ప్రాంతం, సర్వే నంబర్లను అనుసంధానించాలని చెప్పారు. ప్రస్తుతం పర్చూరులో రెండు, చీరాలలో ఒక కొనుగోలు కేంద్రం ద్వారా మార్క్ ఫెడ్ కొనుగోలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, మార్క్ ఫెడ్ అధికారి కరుణశ్రీ , మార్కెటింగ్ శాఖ అధికారి రమేష్ బాబు, వ్యవసాయ, మార్కె ఫెడ్ అధికారులు పాల్గొన్నారు. రైతులకు రాయితీ చెక్కుల పంపిణీ బాపట్ల: చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ పరికరాల సరఫరాలో రాయితీ మొత్తాన్ని కలెక్టర్ జె. వెంకట మురళి బుధవారం అందజేశారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాయితీపై పనిముట్లు పొందని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫామ్ మెకనైజేషన్, అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద 50 శాతం రాయితీతో వ్యవసాయ యంత్ర పరికరాలను అందిస్తోందని తెలిపారు. కర్షక పోర్టల్ ఆధారంగా లబ్ధిదారులను సాంకేతికంగా ప్రభుత్వ వివరాలను వినియోగించి పారదర్శకంగా ఎంపిక చేసి యంత్రాలను అందజేసినట్లు చెప్పారు. 577 మందికి ట్రాక్టర్తో నడిచే యంత్ర పరికరాలు, 42 మందికి రోటమేటర్లు, 51 మందికి బ్యాటరీ స్ప్రేయర్లు, 374 మందికి పవర్ స్ప్రేయర్లు, ఐదుగురికి ట్రాక్టర్ స్ప్రేయర్లు, మూడు పవర్ వీడర్లు, నలుగురికి బ్రష్ కట్టర్, ఐదుగురికి పవర్ టిల్లర్లను కలిపి 1,061 మందికి అందించినట్లు తెలిపారు. యాభై శాతం రాయితీలో భాగంగా మొత్తం రూ.2,10,2,358ను రైతులకు అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు చిన్న, సన్నకారు రైతులకు తైవాన్ స్ప్రేయర్లను అందజేశారు. కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్రవర్మరాజు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు రామకృష్ణ, జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మి, బాపట్ల వ్యవసాయ అధికారి శారద, రైతులు పాల్గొన్నారు. కలెక్టర్ జె.వెంకట మురళినేడు పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభం పర్చూరు(చినగంజాం): పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెం నాయుడు గురువారం పర్చూరు రానున్నట్లు మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీ తెలిపారు. ఉదయం 10.40 గంటలకు ఆయన పర్చూరు చేరుకుంటారని ఆమె పేర్కొన్నారు. -
అన్నిదారులూ రెంటపాళ్లకే..
అరచేతిని అడ్డుపెట్టి అఖండ సూర్యుడి తేజస్సు అడ్డుకోలేనట్లు.. సంక్షేమ సూరీడు.. జన హృదయ నేతను చూసేందుకు వచ్చిన జన తరంగాన్ని ఆంక్షల వలయాలు అడ్డుకోలేకపోయాయి.. ఉవ్వెత్తున ఎగిసిన అభిమాన సంద్రం ముందు నిర్బంధ చట్రాలు చిన్నబోయాయి.. బారులు తీరిన అభిమానం ముందు బారికేడ్లు దూదిపింజలయ్యాయి. ఏమా జనం.. ఏమిటా ప్రభంజనం.. ఇసుకేస్తే రాలనట్లు.. నేల ఈనిందా అన్నట్లు వైఎస్ జగన్ కాన్వాయ్ అడుగు పెట్టిన ప్రతి ఊరు జనహోరుతో నిండగా.. ప్రతి సర్కిల్ అభిమాన సంద్రమైంది. తమ అభిమాన నేతను చూసిన ఆనందం.. ఏడాదిగా తాము పడుతున్న కష్టాలు, కన్నీళ్లు గుర్తుకు వచ్చిన భావోద్వేగం ఏకమై దిక్కులు పిక్కటిల్లేలా.. కూటమి కుర్చీలు కదిలేలా.. జగన్నినాదమై వినిపించింది. షెడ్యూలు ప్రకారం ఉదయం 11 గంటలకు సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి చేరుకోవలసిన జగన్మోహన్రెడ్డి అభిమాన హోరు ధాటికి సాయంత్రం 4:40 గంటలకు గ్రామానికి చేరుకున్నారు. కూటమి నేతల దాడులు, పోలీసుల వేధింపులతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల గ్రామ ఉపసర్పంచ్, వైఎస్సార్ సీపీ క్రియాశీలక కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడే పార్టీ జెండాను ఎగురవేశారు. మృతుడి తండ్రి కొర్లకుంట వెంకటేశ్వర్లును ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అన్నా అధైర్య పడవద్దంటూ ధైర్యం నూరిపోసి అండగా ఉంటానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, దాడులు, అక్రమ కేసులు, వైఎస్సార్ సీపీలో ఉన్న కమ్మ సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని బనాయిస్తున్న కేసులు, దాడులపై నిలదీశారు. అనంతరం సాయంత్రం 5:32 గంటలకు తిరిగి రోడ్డు మార్గాన తాడేపల్లి బయలుదేరారు. -
సింగయ్య కుటుంబానికి పరామర్శ
గుంటూరు రూరల్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంలో ఏటుకూరు బైపాస్ రోడ్డు వద్ద ప్రైవేటు వాహనం ఢీకొని తీవ్రగాయాలపాలై మృతిచెందిన వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) మృతదేహాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్లు సందర్శించి ఘన నివాళులర్పించారు. వెంగళాయపాలెం గ్రామంలోని మృతుని నివాసానికి వెళ్లి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంతాపం వ్యక్తం చేసి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండి, ఆర్థికంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ తరఫున బాధితుడి కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. సింగయ్య కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
ప్రారంభమైన వేధింపుల పర్వం
సత్తెనపల్లి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో రెంటపాళ్ల చుట్టూ పోలీసులు బారికేడ్లు పెట్టి ప్రధాన రహదారిలో సైతం రాకపోకలను పూర్తిస్థాయిలో అడ్డుకున్నారు. ద్విచక్ర వాహనాలపై వచ్చేవారిని సైతం ఆధార్ కార్డులు చూపాలంటూ ఆంక్షలు విధించడమే కాక అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించిన వారిని వేధించడం ప్రారంభించారు. దీనిలో భాగంగా క్రోసూరు మండలం పీసపాడుకు చెందిన గొర్రెపాటి జాన్, అచ్చంపేటకు చెందిన బాల సైదాలను సత్తెనపల్లి రూరల్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకొని సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ఎవరెవరైతే బారికేడ్ల వద్ద తాము వెళ్లాలంటూ గట్టిగా చెప్పారో వారిని గుర్తించి వేధించేందుకు పోలీసులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు నోటీసులు సైతం ఇచ్చారు. ప్రస్తుతం ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
కొనుగోళ్లు ఉన్నట్టా.. లేనట్టా!
పర్చూరు(చినగంజాం): బర్లీ పొగాకు కొనుగోలు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రైతుల పరిస్థితి అయోమయంగా తయారైంది. జిల్లాలో రైతుల వద్ద ఉన్న బర్లీ పొగాకు మొత్తం కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం మళ్లీ వెనకడుగు వేస్తోంది. పర్చూరులో ఈ నెలలో అధికారిక కొనుగోళ్లు ప్రారంభిస్తామన్న కూటమి ప్రభుత్వం వాగ్దానం ఇంకా నెరవేరలేదు. బర్లీ పొగాకు రైతులను మభ్య పెట్టేందుకు జూన్ 7వ తేదీన మంచి రోజు అంటూ హడావుడిగా మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీతో కొబ్బరి కాయ కొట్టించి పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మరో 15 రోజుల్లో కొనుగోలు కేంద్రం ద్వారా బర్లీ పొగాకు కొనుగోలు జరుపుతామన్నారు. అటు తరువాత స్థానిక శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడును కలిసి ఈనెల 17వ తేదీ పర్చూరు మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రం ద్వారా బర్లీ పొగాకు కొనుగోలు ప్రారంభిస్తామని అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కానీ మంగళవారం పర్చూరులో కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో రైతులు అయోమయ స్థితిలో ఉన్నారు. పగబట్టిన పొగాకు నాలుగేళ్లుగా లాభాలు రావడంతో ఈ సీజన్లో ఎక్కువ మంది రైతులు పొగాకు సాగు చేపట్టారు. దీంతో కౌలు, కూలీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అయినప్పటికీ రైతులకు ఆశ చావక పొగాకు పంటను విస్తృతంగా చేపట్టారు. ఈ క్రమంలో గిట్టుబాటు ధర మృగ్యమైంది. దీంతో వైఎస్సార్ సీపీ, రైతు సంఘం నాయకులు పొగాకు రైతుల తరఫున ఆందోళన బాట పట్టారు. ధర్నాలు, రాస్తారోకో నిర్వహించారు. మే 24న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లతో కూడిన బృందం పర్చూరు ప్రాంతంలో పర్యటించి రాష్ట్రంలోని 22 ప్రయివేట్ కంపెనీలు బర్లీ పొగాకును తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఆ కంపెనీలు 25 మెట్రిక్ టన్నులకు మించి కొనుగోలు చేయలేకపోయాయి. వ్యవసాయ శాఖ అందించిన లెక్కల ప్రకారం గత వారం నాటికి రైతుల వద్ద ఉన్న మొత్తం 87 మెట్రిక్ టన్నులకుగాను కేవలం 25 మెట్రిక్ టన్నులు కంపెనీలు కొనుగోలు చేశాయి. రైతు సంఘాలు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో మార్క్ఫెడ్ ద్వారా బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏడు మార్కెట్ యార్డుల ద్వారా.. రాష్ట్రంలో ఏడు మార్కెట్ యార్డుల ద్వారా బర్లీ పొగాకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో పంట నిల్వలకు గోడౌనులు, మార్కెటింగ్ మార్క్ఫెడ్ అధికారులు పరిశీలించారు. కంపెనీలు కొనగా మిగిలిన ఉత్పత్తి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలోని పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, మద్దిపాడు యార్డుల ద్వారా సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీన పర్చూరు మార్కెట్ యార్డును మార్క్ఫెడ్ ఎండీ మంజీర్ జిలానీ సామూన్ సందర్శించి రైతుల వద్ద ఉన్న బర్లీ పొగాకు నిల్వలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అయినా ఎటువంటి కదలిక రాలేదు. అయోమయంలో బర్లీ పొగాకు రైతులు పర్చూరు పొగాకు కొనుగోలు కేంద్రంలో ప్రారంభం కాని కొనుగోళ్లు నేటికీ ప్రారంభించని ప్రభుత్వ అధికారులు కంటి తుడుపు చర్యలతో సరిపెడుతున్న కూటమి ప్రభుత్వంఉన్నతాధికారుల ఆదేశాల అనంతరం కొనుగోళ్లు ప్రారంభిస్తాం గ్రేడింగ్ విషయంలో రైతులు ముందుకు రాకపోవడంతో కొనుగోళ్లు ప్రారంభించలేదు. రైతుకు మంచి ధర రావాలంటే గ్రేడింగ్ తప్పనిసరిగా చేయాల్సి ఉంది. పండిన పొగాకును మూడు గ్రేడులుగా విభజించాల్సిందిగా రైతులు సూచించి వారికి శిక్షణ ఇవ్వడం కూడా ఇచ్చాం. కానీ గ్రేడులు చేసేందుకు, ఆ విధంగా పంటను అమ్మేందుకు రైతులు ముందుకు రావడం లేదు. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి స్పష్టమైన ఆదేశాలు వచ్చాక కొనుగోళ్లు మొదలు పెడతాం. – కరుణశ్రీ,, డీఎం, మార్క్ఫెడ్ -
‘వెన్నుపోటు’ పుస్తకావిష్కరణ
చీరాల అర్బన్: రాష్ట్రంలో కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రామకృష్ణాపురంలోని పార్టీ కార్యాలయంలో కూటమి పాలన గురించి ప్రచురించిన ‘వెన్నుపోటు’ పుస్తకాన్ని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్బాబు ఆదేశాల మేరకు పార్టీ నాయకులు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందన్నారు. పాలనపై, ఇచ్చిన హామీలపై ఎవరు మాట్లాడినా కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి అరాచకాలు, మహిళలు, యువతులు, చిన్నారులపై అకృత్యాలు పెరిగాయన్నారు. కూటమి వైఫల్యాలపై ప్రశ్నిస్తే కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత పాలనకు ప్రజలు తేడా గమనిస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు హామీలు గుప్పించి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయినా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. రాష్ట్రంలో రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సుపరిపాలన అందిస్తున్నామంటూ ప్రగల్భాలు చెప్పుకోవడం దారుణమన్నారు. పార్టీ నాయకులు కావూరి రమణారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు వాసిమళ్ల వాసు, జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడు బత్తుల అనిల్, మచ్చా సువార్త, వేటపాలెం మండల అధ్యక్షులు సాధు రాఘవ, వేటపాలెం మైనార్టీ అధ్యక్షులు ఖాదర్, డి.మార్క్, తేళ్ల రాంబాబు, రామచంద్ర, జాన్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ గారూ అంతా ఓకే అట!
జె.పంగులూరు: జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ ఆదేశాలకే విలువ లేకుండా పోతోంది. పని చేయకుండానే చేసినట్లు ఏకంగా ఆన్లైన్లోనే అప్లోడ్ చేస్తున్న మండ ల స్థాయి అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ అంతా డొల్లేనని తేటతెల్లం చేస్తున్నారు. మండల పరిధిలో వివిధ కారణాలు వల్ల పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెళతారు. కలెక్టర్ పరిష్కరిస్తారనే నమ్మకంతో అర్జీ ఇచ్చి వారి సమస్యలను విన్నవించుకుంటారు. ఆ సమస్యను పరిష్కరించమని తిరిగి మండలాలకు కలెక్టర్ కా ర్యాలయం నుంచి వస్తాయి. కానీ మండల అధికారులు అర్జీదారునితో మాట్లాడకుండానే సమస్య పరిష్కరించినట్లు కలెక్టర్కు రిపోర్టులు పంపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పంగులూరు గ్రామానికి చెందిన పాలపర్తి ఏలియా రెండు నెలల క్రితం కలెక్టర్కు నివేశన స్థలానికి సంబంధించి కలెక్టర్కు అర్జీ పెట్టాడు. ఆ అర్జీ జె.పంగులూరు మండల తహసీల్దార్కు వచ్చింది. కానీ ఇక్కడ తహసీల్దార్ అర్జీదారునితో మాట్లాడకుండానే సమస్య పరిష్కారమైనట్లు నివేదికను పై అధికారులను పంపించారు. అర్జీదారునికి తెలియకుండా అతని ఫొటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఈవిషయమై అర్జీదారుని కి సమస్య పరిష్కారం అయిందని మెసేజ్తోపాటు ఫోన్ చేశారు. దీంతో అర్జీదారుడు తనను సంప్రదించకుండా నా అర్జీని ఎలా పరిష్కరిస్తారని తహసీల్దార్ని అడగగా వారి వద్ద నుంచి సరైన సమాధానం లేదు. జె.పంగులూరు మండ లం నుంచి బాపట్ల వెళ్లాలంటే సుమారు 60 కిలోమీటర్లు. వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం అందించినా ఉపయోగం లేకుండా పోతోంది. -
ధర ఢమాల్... రైతు డీలా..
బల్లికురవ: వాణిజ్య, వ్యాపార పంటలు సాగుచేసి విసిగి వేసారిన రైతులు దశాబ్దం నుంచి పండ్ల తోటల సాగు వైపు మళ్లారు. సాగులో ఉద్యానశాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఈ ఏడాది ధర దిగజారటంతో తోటల వద్దకు కొనేవారు కరువయ్యారు. దీంతో కాయలు పండి రాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1011 ఎకరాల్లో సాగు బల్లికురవ, సంతమాగులూరు, మార్టూరు మండలాల్లో 1011 ఎకరాల్లో అరటి, మామిడి, బొప్పాయి సాగు చేపట్టారు. ఖరీఫ్ ఆరంభంలో సారవంతమైన నీటి వసతి కలిగిన భూముల ఎంపికతో బల్లికురవ మండలంలోని వేమవరం, ఉప్పుమాగులూరు, కూకట్లపల్లి, వల్లాపల్లి, కొత్తూరు, రామాంజనేయపురం, వెలమవారిపాలెం, కొప్పర పాలెం, సంతమాగులూరు మండలంలోని చవిటిపాలెం, ఏల్చూరు, కుందుర్రు, కొప్పరం, మక్కెనవారిపాలెం, పాతమాగులూరు, మార్టూరు మండలంలోని జంగమహేశ్వరపురం, బొల్లాపల్లి, ఇసుకదర్శి, నాగరాజుపల్లి, తండాలో పండ్ల తోటల సాగు చేపట్టారు. ఫిబ్రవరి, ఏప్రిల్ వరకు ధరలు కొంత మేర ఆశాజనకంగానే ఉన్నాయి. బొప్పాయి కిలో రూ.15 నుంచి రూ.18 పలకగా మామిడి కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పలికింది. అకాల వర్షాలతో దిగజారిన ధరలు మే నెలలో కురిసిన అకాల వర్షాలకు తోడు ఎగుమతులు లేనందున గత నెల నుంచి బొప్పాయి కిలో రూ.3లకు, మామిడి కిలో రూ.30లకు పడిపోయింది. తీరా దిగుబడులతో ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికందే దశలో మార్కెట్ దిగజారటం, ఎగుమతులు లేనందున రైతులు చేసేది లేక తోటల వద్ద వచ్చిన కాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దిగజారిన ధరలతో పంటల సాగుకు తెచ్చిన పెట్టుబడులు ఎలా తీర్చాలో అంతుచిక్కటం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ పరంగా మార్కెటింగ్ చేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 1011 ఎకరాల్లో పండ్ల తోటల సాగు కొనే నాథుడు లేక తోటల్లోనే పండి రాలిపోతున్న కాయలు ఎకరాకు రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడులు ప్రభుత్వ ప్రోత్సాహం నిల్ మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని రైతుల వేడుకోలు రైతులను నట్టేట ముంచిన అకాల వర్షాలు -
క్వారీ గుంతలో పడి యువకుడు మృతి
గుంటూరు రూరల్: క్వారీ గుంతలో పడి వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామానికి చెందిన కట్టెపోగు నాగరాజు (30) ఆటోడ్రైవర్. అతనికి భార్య రూపకోటేశ్వరి, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. మరో రెండు రోజుల్లో కోటేశ్వరి ప్రసవించనుందని వైద్యులు తెలిపారు. దీంతో నాగరాజు ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం బయటకు వెళుతున్నానని ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. సాయంత్రానికి కూడా ఇంటికి రాకపోవటంతో స్థానికులు అంతటా వెతికారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లక్వారీ గుంత వద్ద నాగరాజు చెప్పులు, పక్కనే అతని ద్విచక్ర వాహనం కనిపించాయి. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. తొలుత మేడికొండూరు, నల్లపాడు పోలీసుల మధ్య సరిహద్దు వివాదం నడిచిన అనంతరం నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్ల కోసం సోమవారం వేచి చూశారు. రాత్రి కావటంతో మంగళవారం ఉదయం నుంచి వెతుకులాట ప్రారంభించగా, నాగరాజు మృతదేహం లభ్యమైంది. పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. నాగరాజు బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ జారి పడ్డాడా? ఇక్కడ ఎక్కువగా ఉన్న కోతులు దాడి చేస్తే తప్పించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు. మృత్యుపాశాలుగా క్వారీ గుంతలు అనుమతులు లేకున్నా అక్రమంగా మైనింగ్ క్వారీలను నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యవహరిస్తున్నారు. ఎక్కువ లోతులో క్వారీలను తవ్వి వదిలేస్తున్నారు. ఈ గుంతల్లో నీరు నిలిచిపోతోంది. విషయం తెలియని కొందరు వ్యక్తులు ఇటువంటి ప్రమాదాలతో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా మైనింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రాష్ట్రంలో రాజ్యమేలుతున్న అరాచక పాలన
చెరుకుపల్లి: రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతుందని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ అన్నారు. మంగళవారం గుళ్లపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ‘జగన్ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం’ అనే పేరుతో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో వైఫల్యాలపై రూపొందించిన పుస్తకాన్ని డాక్టర్ గణేష్ నియోజకవర్గ నాయకులతో కలసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అబద్దపు హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడంతో పథకాలను అరకొరగా అమలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా మహిళలకు, రైతులకు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని డాక్టర్ గణేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డి, చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రజలకు అండగా నిలుస్తున్న వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు, చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు యార్లగడ్డ మదన్మోహన్, కాటూరి శివ, బొర్రా శ్రీనివాసరావు, మండల కన్వీనర్లు దుండి వెంకటరామిరెడ్డి, ఇంకొల్లు రామకృష్ణ, యార్లగడ్డ రాంబాబు, నాయకులు చదలవాడ శ్రీనివాసరావు, నిజాంపట్నం కోటేశ్వరరావు, లుక్కా బాపనయ్య, ఉల్లంగుంట శ్రీరాంమూర్తి, వంగర భాను, ప్రభు కిరణ్, ఖుద్దూస్, చౌటూరి రమేష్, డి.కొండలురెడ్డి, శొంఠి సురేష్, రాజ్పాల్, కందుల సురేష్, పిట్టు సాంబశివారెడ్డి, గాలిమోటు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ ‘జగన్ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం’ పుస్తకావిష్కరణ -
కౌన్సిలర్ హుకుం... కమిషనర్ జీ హుజూర్
చీరాల: పట్టణంలోని పొలిమేర రోడ్డులోని ఓ అపార్టుమెంట్లో కింద ఫ్లోర్లో వస్త్ర, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కింద షాపులు, పైన నివాస సముదాయాలున్నాయి. అయితే ఇదంతా మామూలుగా ఉంది కదా అనుకుంటే పొరపాటే. మంగళవారం అందరినీ ఆశ్చర్యపరిచే సంఘటన చోటుచేసుకుంది. మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ వ్యాపారస్తుల వద్దకు వచ్చి షాపుల ముందు పెట్టిన బట్టల బేళ్లు తొలగించాలంటూ హుకుం జారీ చేశారు. సాయంత్రానికి తొలగించకుంటే బయటకు లాగేస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. జరిగింది ఇదీ.. చీరాల పట్టణంలోని 12వ వార్డులో పొలిమేర రోడ్డులోని ఓ అపార్టుమెంట్ కింద భాగంలో పలువురు ఎప్పటి నుంచో వస్త్రవ్యాపారాలు నిర్వహిస్తున్నారు. షాపుల బయట బట్టల బేళ్లు పెట్టుకుంటున్నారు. అయితే అదే అపార్టుమెంట్లో నివసిస్తున్న అధికార పార్టీ మహిళా కౌన్సిలర్కు మాత్రం ఇది నచ్చలేదు. బట్టల బేళ్లు బయట అడ్డంగా పెట్టవద్దంటూ వ్యాపారస్తులకు సూచించారు. సీజన్ కావడంతో బయట పెట్టుకుంటేనే వ్యాపారం జరుగుతుందని, వ్యాపారాలు సరిగా లేవు, కస్టమర్లు వెళ్లిన తర్వాత లోపల పెట్టుకుంటామని చెప్పారు. అంతే ఆమెకు కోపం వచ్చి వ్యవహారం ఇంకోలా మారింది. మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ను అక్కడకు పిలిపించారు. ఏదో తప్పు చేసినట్లుగా ఆయన అక్కడకు వచ్చి వ్యాపారస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కాంప్లెక్సులో షాపుల ముందు పెట్టిన బేళ్లు, బట్టలు సాయంత్రానికి తొలగించకుంటే మా మున్సిపాలిటీ వారు వచ్చి రోడ్డు మీద పడవేస్తారు’’ అంటూ బెదిరింపు ధోరణితో చెప్పి వెళ్లారు. దీంతో వ్యాపారస్తులందరూ ఒక్కసారిగా విస్తుపోయారు. ఇదేమీ మున్సిపల్ కాంప్లెక్సు కాదని, ప్రైవేటు కాంప్లెక్సులోని వస్త్ర వ్యాపారస్తులపై కమిషనర్ వచ్చి బెదిరింపు ధోరణిగా మాట్లాడడం ఏమిటని వ్యాపారస్తులు వాపోతున్నారు. తోటి వ్యాపారస్తులకు ఏ ఇబ్బందులు లేనప్పుడు ఓ అధికార పార్టీ మహిళా కౌన్సిలర్ మున్సిపల్ కమిషనర్ను పిలవడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. కాగా దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేశారా అని అడుగగా సమాధానం కరవవడం గమనార్హం. ప్రైవేటు అపార్టుమెంట్ వ్యవహారంలో కమిషనర్ అత్యుత్సాహం వ్యాపారస్తులపై కమిషనర్ హడావిడి -
వాగ్దానాల అమలులో ప్రభుత్వం విఫలం
వేమూరు: గత ఎన్నికల్లో కూటమి సూపర్ సిక్స్ పథకాలు వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గం సమన్వయకర్త వరికూటి అశోక్బాబు అన్నారు. ‘జగన్ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని చెరుకుపల్లి గ్రామంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధి చేయకపోగా వారు చేసిన మోసాలను, అరాచకాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమేనని అశోక్బాబు మండిపడ్డారు. ప్రజలకు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రజల కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు, ఆధారాలతో ఈ పుస్తకం రూపొందించడం జరిగిందన్నారు. మోసపు హామీలు, అబద్దపు మాటలతో మభ్య పెట్టి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గొట్టిపాటి హిమచంద్ర శ్రీనివాస్, సుజ్ణల నాగ మలేశ్వరరావు, పడమటి శ్రీనివాసరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కోగంటి లవకుమార్, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు ఇమామ్ హుస్సేన్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి సిరాజ్, దున్నా మేరీసుబాబు, గుమ్మడి దానియేలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త అశోక్బాబు ‘జగన్ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం’ పుస్తకావిష్కరణ -
ఎగవేతదారుల నుంచి పన్నులు వసూలు చేయాలి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: వాణిజ్య పన్నుల ఎగవేతదారుల నుంచి పన్ను వసూలుకు అధికారులు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. వాణిజ్య పన్నులు, అనుబంధశాఖల అధికారులతో జిల్లాస్థాయి సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. చట్టబద్ధంగా వాణిజ్య పన్ను వసూలుపై యంత్రాంగం దృష్టి పెట్టాలని కలెక్టర్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.95.14 కోట్లు వాణిజ్య పన్ను వసూలు జరిగిందన్నారు. ప్రస్తుతం గణనీయంగా పన్ను వసూలు తగ్గడంపై ఆరా తీశారు. గ్రానైట్ క్వారీలు, పరిశ్రమలు, రవాణాలో బోగస్ రిజిస్ట్రేషన్ల ద్వారా పన్నులు వసూలు కావడం లేదని తాజా సర్వేలో వెలుగులోకి వచ్చిందన్నారు. పన్నుల ఎగవేతను అరికట్టడానికి ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. తీర ప్రాంతాల్లోని రిసార్డ్స్ నిర్వహణ, ఆర్థిక లావాదేవీలపై పర్యాటకశాఖ, వాణిజ్య పనుల శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. జీఎస్టీ చెల్లించకుండా గుత్తేదారులు పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయితే వారిని బ్లాక్లిస్టులో పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో వాణిజ్య పన్నులశాఖ సంయుక్త కమిషనర్ బి గీతామాధురి, డీఆర్వో జి గంగాధర్ గౌడ్, జిల్లా వాణిజ్య పనుల శాఖ అధికారిని ఆర్ శ్రీదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకంతో ఉపయోగం వేటపాలెం: పీఎం సూక్ష్మ ఆహార శుద్ధి జీవనోపాధి (పీఎంఎఫ్ఈ) పథకాన్ని అందిపుచ్చుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ జె.వెంకట మురళి పేర్కొన్నారు. వేటపాలెం మండలం కొత్తపేటలోని సూక్ష్మ ఆహార శుద్ధి జీవనోపాధి లబ్ధిదారుల యూనిట్లను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ప్రసాద్నగర్లోని సాయి తేజ వేరుశనగ శుద్ధి యూనిట్ను పరిశీలించారు. లాభనష్టాలను, వ్యాపారసరళి, ముడి సరుకు కొనుగోలు వివరాల ను యజమానిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి కొత్తపేట బాల ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను పరిశీలించారు. విద్యుత్ సమస్యల వలన ఉత్పత్తి జరగటం లేదని తెలిపారు. సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఖలీం, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, ఆర్డీఓ చంద్రశేఖర్, తహసీల్దార్ గోపికృష్ణ పాల్గొన్నారు. -
చేనేతలకు మంచిరోజులొచ్చాయ్
● జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ● కలెక్టర్ను సన్మానించిన చేనేత సంఘాల నాయకులు బాపట్ల: కుప్పడం పట్టు చీరలకు జాతీయస్థాయి గుర్తింపు లభించడంతో చేనేతలకు మంచి రోజులు వచ్చాయని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. కుప్పడం పట్టు చీరలకు జాతీయస్థాయి గుర్తింపు లభించడంపై చేనేత సహకార సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా నివేదించడంతో జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కార్మికుల కలలు నెరవేరాయన్నారు. చీరాల కుప్పడం పట్టు చీరలకు గుర్తింపు లభించడం ద్వారా వాటికి మంచి డిమాండ్ పెరుగుతుందని కలెక్టర్ చెప్పారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న చేనేత కార్మికుల కలలు నెరవేరుతాయన్నారు. చేనేత వృత్తికి మంచి డిమాండ్ ఉంటుందన్నారు. తద్వారా చేనేతల సమస్యలన్నీ తీరిపోతాయన్నారు. చేనేత కార్మికులందరికీ మంచి జరగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్గౌడ్, జిల్లా చేనేత చేనేత జౌళి సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె నాగమల్లేశ్వరరావు, చేనేత సహకార సంఘాల నాయకులు దివి రాంబాబు, జీవీ నాగేశ్వరరావు, కె.వి నాంచారయ్య, శ్రీనివాసరావు, పి వెంకట సుబ్బారావు, పి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బంగారు కుటుంబాల ఆర్ధిక అభివృద్ధికి కృషి బాపట్ల: పి–4 బంగారు కుటుంబాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. పి–4 కింద డీఆర్డీఏ దత్తత తీసుకున్న బంగారు కుటుంబాలకు చేయూతనందించే కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. బంగారు కుటుంబాల జీవన స్థితిగతులను పరిగణలోకి తీసుకున్న డీఆర్డీఏ 13 కుటుంబాలను దత్తత తీసుకుంది. వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించడం కోసం రూ.10.95 లక్షలను జిల్లా కలెక్టర్ మంజూరు చేశారు. చెక్కు రూపంలో నగదును బంగారు కుటుంబాలకు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఒకరికి బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్, ముగ్గురికి వినికిడి యంత్రాలను ఉచితంగా పంపిణీ చేశారు. బాపట్ల జిల్లాలో బంగారు కుటుంబాలు 62వేలు ఉన్నాయన్నారు. వారికి చేయూతనందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, వెలుగు అధికారులు కె రవికుమార్, జి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని బాలిక మృతి
చిలకలూరిపేట సమీపంలో విషాద ఘటన చిలకలూరిపేటటౌన్: ఆర్టీసీ బస్సు ఢీకొని చిన్నారి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...వైఎస్సార్ కాలనీకి చెందిన గాలేటి రాంబాబు, కావేరి దంపతులు, వారి మేనకోడళ్లైన పాముసాని బాలసాహితి, వెంకట శృతితో కలిసి బైక్పై కనపర్రు చర్చికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. రూరల్ మండలంలోని లింగంగుంట్ల వంతెన దాటిన తరువాత అదే మార్గంలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ట్యాంక్పై కూర్చున్న వెంకట శృతి(9) బస్సు చక్రాల కింద పడడంతో తీవ్రంగా గాయపడింది. రాంబాబు, ఆయన భార్య కావేరికి స్వల్ప గాయాలు కాగా, మరో బాలిక బాల సాహితికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే పాపను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధితురాలు కావేరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.