ప్రాంగణ ఎంపికల్లో 64 మందికి ఉద్యోగాలు | - | Sakshi
Sakshi News home page

ప్రాంగణ ఎంపికల్లో 64 మందికి ఉద్యోగాలు

Jun 22 2025 3:38 AM | Updated on Jun 22 2025 3:38 AM

ప్రాంగణ ఎంపికల్లో 64 మందికి ఉద్యోగాలు

ప్రాంగణ ఎంపికల్లో 64 మందికి ఉద్యోగాలు

నిజాంపట్నం: మండల కేంద్రమైన నిజాంపట్నంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌కు కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న 144 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 64 మంది విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్‌ ఉమామహేశ్వరిదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రిక్రూట్‌మెంట్‌ మేళాలో ఎంఎస్‌ మహేంద్ర ఆటో పయనీర్‌ వరల్డ్‌, ఎన్‌ఎస్‌ఎల్‌ టెక్స్‌టైల్స్‌, నిర్మల ఇండస్ట్రీస్‌, పవర్‌ సర్వీసెస్‌, బెంగళూరు గ్రీన్‌ టెక్‌ ఇండస్ట్రీస్‌లతో పాటు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు. విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక చేశారన్నారు. ఎంపికై న వారికి అప్రంటీస్‌ శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశం కల్పిస్తారని తెలిపారు. శిక్షణ కాలంలో భృతి అందించనున్నట్లు వివరించారు.

మార్టూరులో గడ్డివామి దగ్ధం

మార్టూరు: మండల కేంద్రం మార్టూరులో శనివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో వరిగడ్డి వామి దగ్ధమైంది. స్థానిక తూర్పు బజారుకు చెందిన పుట్టా విలాస్‌ బాబు గొడ్ల చావిడిలో ఉన్న వరి గడ్డి వామిపై బాణసంచా పడటంతో మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో చిలకలూరిపేట నుంచి వచ్చిన అగ్నిమాపక కేంద్ర సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 60 వేల ఆస్తినష్టం జరిగినట్లు రైతు వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement