
యోగాతో మానసిక ప్రశాంతత
బాపట్ల టౌన్: మానసిక ప్రశాంతతకు యోగాసనాలు ఎంతగానో దోహదపడుతాయని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో బుధవారం పోలీస్ సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మే 21 నుంచి జూన్ 21 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర‘ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో యోగా గురువులు ధూళిపాళ్ల శైలజ పాల్గొన్నారని తెలిపారు. 32 రకాల యోగాసనాలతో పాటు సూర్య నమస్కారాలును ఆమె పోలీసులతో సాధన చేయించడంపై హర్షం వ్యక్తం చేశారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సాధించవచ్చని తెలిపారు. ప్రతిరోజు కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయిస్తే ఒత్తిడిని అధిగమించవచ్చని చెప్పారు. పోలీస్ విధుల్లో పని ఒత్తిడి అధికంగా ఉండే నేపథ్యంలో యోగా ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ మౌలుద్దీన్, ఆర్ఎస్ఐ కల్యాణ్, యోగా మాస్టర్ ట్రైనర్స్ గురజాల శ్రీనివాసరావు, కర్పూరపు మంజులత, టి. కృష్ణారావు, ఎం.సూరిబాబు, బాజీ, ప్రసాద్ పాల్గొన్నారు.
ఎస్పీ తుషార్ డూడీ