
సీఆర్డీఏ జాబ్మేళాలో 110 మంది ఎంపిక
తాడికొండ: ఏపీ సీఆర్డీఏ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ సహకారంతో తుళ్లూరు సీఆర్డీఏ స్కిల్ హబ్ ప్రాంగణంలో బుధవారం జాబ్ మేళా జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమొబైల్, ఫైనాన్స్, స్కిల్ డెవలప్మెంట్ రంగాలకు చెందిన కంపెనీలైన వరుణ్ మోటార్స్, స్కిల్ క్రాఫ్ట్ లిమిటెడ్, ఎంవీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు లిమిటెడ్, కేఎంవీ ప్రాజెక్ట్ లిమిటెడ్, శ్రీ రామ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థలు పాల్గొన్నాయి. మొత్తం 806 మంది దరఖాస్తు చేసుకోగా 264 మంది హాజరయ్యారు. ఇంటర్వ్యూ తర్వాత 110 మందికి ఆఫర్ లెటర్లు అందించారు. 137 మంది అభ్యర్థులను తదుపరి రౌండ్లకు ఎంపిక చేశారు. రాజధాని అమరావతిలో పర్యటిస్తున్న ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధుల బృందం ఈ జాబ్ మేళాను పరిశీలించింది. అభ్యర్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంది. సమన్వయ అధికారులుగా ఏపీ ఎస్ఎస్డీసీ నైపుణ్య శిక్షణాధికారి సాయి శ్రీనివాస్, ప్లేస్మెంట్ అధికారి అరుణకుమారి, ఎన్ఏసీ అసిస్టెంట్ డైరెక్టర్ వి.నరసింహారావు, సీఆర్డీఏ డీసీడీవో బి. శ్రీనివాసరావు, సీనియర్ లైవ్లీహుడ్ ఆఫీసర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.