
హైదరాబాద్ : కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు ట్రాఫిక్ చిక్కులు తొలగించేందుకు నిర్మిం చిన శిల్పా లేఔట్-2 ఫ్లై ఓ వర్ను ఈ నెల 28న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దివంగత పి.జనార్దన్రెడ్డి (పీజేఎర్) జ్ఞాపకార్థం ఈ ఫ్లైఓవర్కు పీజేఆర్ పేరు పెట్టాలని సీఎం సూచించారని తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవానికి ముందే పెయింటింగ్, సుందరీకరణలతో సహా అన్ని పనులను పూర్తి చేయాలని మేయర్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ను ఆదేశించారు.

నగర పౌరులకు ప్రయోజనం చేకూర్చే నాణ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అందించడానికి జీహెచ్ఎంసీ కట్టుబడి ఉందని 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.








