breaking news
pjr
-
Hyd: నగర వాసులకు శుభవార్త.. ఫైఓవర్ను ప్రారంభించిన సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: నగర వాసులకు శుభవార్త. ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు ఇంధనం, సమయం ఆదా చేయడానికి నిర్మించిన మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. 1.2 కిలో మీటర్ల మేర ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పీజేఆర్) ఫ్లైఓవర్ను శనివారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మాదాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. ట్రాఫిక్ కష్టాలు తొలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది.ఫ్లైఓవర్ విశిష్టతలు.. ఫైనాన్షియల్ డిస్టిక్ట్, మాదాపూర్, శంషాబాద్ వెళ్లేందుకు ట్రాఫిక్ కష్టాలు ఉండవు శిల్పా లేఔట్ ఫేజ్–2 ఫ్లైఓవర్ కాగా.. దీనికి పీజేఆర్ ఫ్లైఓవర్గా నామకరణం చేశారు ప్రాజెక్టు మొత్తం వ్యయం 446.13 కోట్ల అంచనాఇందులో ఫేజ్–2 ఫ్లైఓవర్ పూర్తి అంచనా వ్యయం రూ.182.72 కోట్లు ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ రోడ్డు వరకు 630 మీటర్లు ఆబ్లిగేటరీ స్పామ్ (స్టీల్) 450 మీటర్లు త్రీ లేన్, వెడల్పు 24 మీటర్లు క్యారెట్ వే 6 లైన్ల బై డైవర్షనల్ కొండాపూర్ వైపు డౌన్ ర్యాంప్ రెండు వైపులా 165 మీటర్లు వెడల్పు 12 మీటర్లు ఆరు లేన్ల ఫ్లైఓవర్గా నిర్మాణం ఉపయోగాలు ఇలా.. మోహిదీపట్నం, మాదాపూర్, జూబ్లీహిల్స్ వైపు నుంచి వచ్చే వాహనాలతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్కు ఉపశమనం ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వైపు వాహనాలు అంతరాయం లేకుండా వెళ్లొచ్చు ఉదయం, సాయంత్రం వేళల్లో హైటెక్సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య మెరుగైన కనెక్టివిటీ గచ్చిబౌలి జంక్షన్ వద్ద పీక్ అవర్లో దాదాపు 10.5 నిమిషాలు ఆదా ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్, సైబరాబాద్ నుంచి గచ్చిబౌలి జంక్షన్లకు వేగంగా చేరుకునే వీలు గణనీయమైన ఇంధన ఆదా -
పీజేఆర్ ఫ్లైఓవర్పై.. రయ్ రయ్
గచ్చిబౌలి: ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు ఇంధనం, సమయం ఆదా చేయడానికి నిర్మించిన మరో ఫ్లైఓవర్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. పీజేఆర్ ఫ్లైఓవర్ శనివారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మాదాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుతో పాటు ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ ప్రాంతానికి వెళ్లడానికి మార్గం సుగమమవుతుంది. ట్రాఫిక్ కష్టాలు తొలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఫ్లైఓవర్ విశిష్టతలు.. ూ ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, మాదాపూర్, శంషాబాద్ వెళ్లేందుకు ట్రాఫిక్ కష్టాలు ఉండవు. ూ శిల్పా లేఔట్ ఫేజ్–2 ఫ్లైఓవర్ కాగా.. దీనికి పీజేఆర్ ఫ్లైఓవర్గా నామకరణం చేశారు ూ ప్రాజెక్టు మొత్తం వ్యయం 446.13 కోట్ల అంచనా ూ ఇందులో ఫేజ్–2 ఫ్లైఓవర్ పూర్తి అంచనా వ్యయం రూ.182.72 కోట్లు ూ ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ రోడ్డు వరకు 630 మీటర్లు ూ ఆబ్లిగేటరీ స్పామ్ (స్టీల్) 450 మీటర్లు ూ త్రీ లేన్, వెడల్పు 24 మీటర్లు ూ క్యారెట్ వే 6 లైన్ల బై డైవర్షనల్ ూ కొండాపూర్ వైపు డౌన్ ర్యాంప్ రెండు వైపులా 165 మీటర్లు ూ వెడల్పు 12 మీటర్లు ూ ఆరు లేన్ల ఫ్లైఓవర్గా నిర్మాణం ఉపయోగాలు ఇలా.. మోహిదీపట్నం, మాదాపూర్, జూబ్లీహిల్స్ వైపు నుంచి వచ్చే వాహనాలతో గచ్చిబౌలి జంక్షన్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్కు ఉపశమనం ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వైపు వాహనాలు అంతరాయం లేకుండా వెళ్లొచ్చు ఉదయం, సాయంత్రం వేళల్లో హైటెక్సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య మెరుగైన కనెక్టివిటీ గచ్చిబౌలి జంక్షన్ వద్ద పీక్ అవర్లో దాదాపు 10.5 నిమిషాలు ఆదా ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్, సైబరాబాద్ నుంచి గచ్చిబౌలి జంక్షన్లకు వేగంగా చేరుకునే వీలు గణనీయమైన ఇంధన ఆదా ఫ్లైఓవర్ పరిశీలన.. శుక్రవారం పీజేఆర్ ఫ్లైఓవర్ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాం«దీ, అధికారులతో కలిసి పరిశీలించారు. వీరి వెంట వెస్ట్జోన్ జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవ్రావు, ప్రాజెక్ట్ సీఈ భాస్కర్రెడ్డి, ఎస్ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ ఈఈ, ఇతర అధికారులు ఉన్నారు. సీఎం రేవంత్కు కృతజ్ఞతలు పీజేఆర్ సతీమణి ఇందిర శిల్పా లేఅవుట్ రెండో దశ ఫ్లై ఓవర్కు దివంగత నేత పి.జనార్దన్ రెడ్డి పేరు పెడుతున్నట్లు జీఓ విడుదల చేయడంతో ఆయన సతీమణి సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో సంతోషాన్నిచి్చందన్నారు. ఫ్లై ఓవర్ ప్రారం¿ోత్సవానికి వచ్చి సీఎం, మంత్రులకు నేరుగా కృతజ్ఞతలు చెప్పాలని ఉందని, ఆరోగ్యం సహకరించకపోవడంతో రాలేకపోతున్నానని ఆమె తెలిపారు. మరో ప్రాజెక్టు అందుబాటులోకి రావడం హర్షణీయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాక్షి, సిటీబ్యూరో: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద మరో ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుండటం సంతోషంగా, గర్వంగానూ ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం పీజేఆర్ (శిల్పా లే ఔట్ ఫేజ్–2) ఫ్లై ఓవర్ ప్రారం¿ోత్సవాన్ని పురస్కరించుకొని ఎక్స్ వేదికగా ఫ్లై ఓవర్ వీడియోను శుక్రవారం ఆయన షేర్ చేశారు. ఎస్సార్డీపీలోని 42 ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం 36 ప్రాజెక్టులను పూర్తి చేసిందని గుర్తు చేశారు. -
పీజేఆర్ జ్ఞాపకార్థం కొండాపూర్లో ప్లై ఓవర్.. 28న సీఎం చేతుల మీదుగా ప్రారంభం.. (ఫొటోలు)
-
వారసులొచ్చారు..
బంజారాహిల్స్ : గ్రేటర్ రాజకీయాల్లో ‘నవశకం’ అడుగు పెట్టింది. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని బరిలోకి దిగారు. తండ్రి ఒడిలో కూర్చొని ఓనమాలు దిద్దినవారు ఇప్పుడు రాజకీయ చదరంగంలో ఎత్తుపల్లాలు చూసేందుకు సిద్ధమయ్యారు. పితామహులే వారికి తమ రాజకీయ అనుభవాన్ని పాఠంగా చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రధానమైన ఖైరతాబాద్, గోషామహల్ నియోజకవర్గంలో కనిపిస్తున్న ఈ పరిస్థితి రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖేష్ గౌడ్ తనయ.. అబిడ్స్ మాజీమంత్రి ముఖేష్గౌడ్ 1986లో మొదటిసారి జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్గా విజయం సాధించి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1989 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి మహరాజ్గంజ్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈయన మంత్రిగానూ సేవలందించారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకున్న ఆయన కూతురు శిల్ప ఇప్పుడు గన్ఫౌండ్రీ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా గ్రేటర్ బరిలోకి దిగారు. తండ్రి ముఖేష్ తొలిసారి రాజకీయ జీవితం ప్రారంభించిన ఏడాదిలో జన్మించిన ఈమె ఎంబీఏ చదివారు. ఇక్కడ ఈమె స్వయానా పిన్ని, బీజేపీ అభ్యర్థి సరితాగౌడ్తో పోటీ పడుతుండంతో రాజకీయ ఆసక్తి నెలకొంది. కేకే వారసత్వం.. శతృవులను కూడా మిత్రులుగా చేసుకొని ముందుకు సాగితేనే రాజకీయాల్లో విజయం సాధిస్తామని తన తండ్రి రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు ఇచ్చిన సలహా పాటిస్తున్నానని బంజారాహిల్స్ టీఆర్ఎస్ అభ్యర్థి గద్వాల్ విజయలక్ష్మి చెబుతున్నారు. బీఏ, ఎల్ఎల్బీ, జర్నలిజంలో డిప్లొమా చేసిన ఈమె, తనకు తండ్రి రాజకీయ అనుభవం ఉపయోగపడుతుందన్నారు. సొంత నిర్ణయాలనే అమలు చేస్తానని, ఇష్టం లేని సలహాలు తన తండ్రి ఇచ్చినా పాటించనన్నారు. ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలని, వారి అభిప్రాయాలే పరిగణలోకి తీసుకుంటానన్నారు. బరిలో పీజేఆర్ కుమార్తె.. హైదరాబాద్లో పీజేఆర్ పేరు వినని వారుండరు. ఆయన కూతురు విజయారెడ్డి ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమె పీజేఆర్ కూతురుగా సుపరిచితం. తండ్రి బాటలో నడవడమే లక్ష్యంగా పెట్టుకొని ఆయనలాగే ప్రజల మధ్య ఉంటూ వారితో మమేకమవుతున్నారు విజయ. ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాలలో ఎంటెక్ చదివిన విజయారెడ్డి ఇప్పటికే రాజకీయ అనుభవం సంపాదించుకున్నారు. జనంతో మమేకమవుతూ సమస్యలను వింటూ పరిష్కార మార్గాలు చూపడంలో ఆమె పీజేఆర్ను అనుసరిస్తున్నారు. ‘బంగారు’ ఫ్యామిలీ నుంచి.. తనకు రాజకీయాలంటే పెద్దగా తెలియదని, పెదనాన్న వారసురాలిగా బరిలోకి దిగినట్టు చెబుతున్నారు బంగారు స్రవంతి. వెంకటేశ్వరకాలనీ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈమె కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ తమ్ముడు కూతురు. పెద్దనాన్న రాజకీయాలను దగ్గరి నుంచి చూసి స్పూర్తి పొందానని చెప్పారామె. సికింద్రాబాద్ పీజీ కళాశాలలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంఏ చేసి ఇటీవల సివిల్స్ రాశానని, ఐఏఎస్ కావాలన్న లక్ష్యం ఉందన్నారు. ప్రజాసేవకు ఐఏఎస్ కాని రాజకీయం కాని దగ్గరి దారులని పేర్కొన్నారు స్రవంతి. -
గ్రేటర్లో టీడీపీకి మరో షాక్
-
గ్రేటర్లో టీడీపీకి మరో షాక్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి విజయ రామారావు రాజీనామా చేశారు. గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన మాజీ సీఎల్పీ నేత దివంగత పి.జనార్ధన్రెడ్డి(పీజేఆర్) పై గెలిచి మంత్రి అయిన సంగతి తెలిసిందే. అంతేకాక గతంలో సీబీఐ డైరెక్టర్గా విజయరామారావు పనిచేశారు. ప్రస్తుతం అధికార పార్టీ టీఆర్ఎస్లో విజయ రామారావు చేరతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ విజయ రామారావు టీఆర్ఎస్ పార్టీ లో చేరితే ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి ఊపందుకున్నట్లే. జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి మొదలైన నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి అధికార టీఆర్ఎస్ లోకి భారీ వలసలు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. -
ఉక్కిరి బిక్కిరి
దానం, వీహెచ్ ఎదురీత ఖైరతాబాద్లో గడప దాటని.. దానం సికింద్రాబాద్లో వెనకబడి పోయిన జయసుధ గ్రేటర్లో వీఐపీలకు ముచ్చెమటలు పడుతున్నాయి. బుల్లెట్లా దూసుకుపోతున్న ప్రత్యర్థుల ప్రచార హోరుతో హేమాహేమీలనుకున్న అభ్యర్థులు హడలిపోతున్నారు.అంబర్పేటలో కాంగ్రెస్ అభ్యర్థి వి.హన్మంతరావు బీజేపీ అభ్యర్థి కిషన్రెడ్డితో గట్టిపోటీని ఎదుర్కొంటుండగా, ఖైరతాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్కు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి, పీజేఆర్ కూతురు విజయారెడ్డి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. సికింద్రాబాద్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి జయసుధ ప్రచారంలో పూర్తిగా వెనకబడి పోయారు. - సాక్షి, సిటీబ్యూరో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని హోదాకు తోడు రాష్ర్ట కేబినెట్ మంత్రిగా అన్ని నియోజకవర్గాల్లో అన్నీ తానై వ్యవహరించే ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ప్రస్తుతం నియోజకవర్గ గడపదాటని స్థితి నెలకొంది. గత ఐదేళ్లలో నియోకజవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటంతో పాటు ఆయన అనుచరల భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఉద్యమ కారులపై దాడులకు పూనుకుని సంపాదనే లక్ష్యంగా పని చేస్తున్నారనే ఆరోపణలతో సాధారణ జనమంతా దూరమైయ్యారు. దీనికి తోడు ఖైరతాబాద్ నియోకజవర్గంలో బలమైన అభిమానులు, అనుచరవర్గం ఉన్న పీజేఆర్ కూతురు విజయారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఆమె ఎక్కడికి వెళ్లినా అపూర్వ స్వాగతం లభిస్తోంది. ఈ నియోకజవర్గంలో వైఎస్సార్ - పీజేఆర్ అభిమానులు విజయారెడ్డి వెంట నడుస్తుండటంతో దానం నాగేందర్కు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. విజయారెడ్డి ప్రచారానికి వెళుతున్న కాలనీల్లో విద్యుత్ కోత విధించేలా చూడటం, క్రియాశీలక కార్యకర్తలకు డబ్బు ఎర వేయటం, ఆయా సంఘాలకు మూడు దఫాలుగా మొత్తాన్ని ముట్ట చెబుతానని హామీలతో కాలం గడిపే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు నియోకజవర్గంలో ఫలితాన్ని శాసించే స్థితిలో ఉన్న ముస్లిం, క్రిస్టియన్లు దానం తీరుకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయిం చటంతో ఆయన పరిస్థితి గందరగోళంగా మారింది. కేవలం డబ్బు పంపిణీతోనే గట్టెక్కే ఆలోచనతో పావులు కదుపుతున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో ఊపందుకుంది. లష్కర్... మసకబారిన సినీ గ్లామర్ సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంఎల్ఏ, సినీ నటి జయసుధ ప్రచారంలో పూర్తిగా వెనకబడి పోయారు. తొలుత తనకు ఎంఎల్ఏ టికెట్ ఇస్తారా? లేదా? అన్న అయోమయంలో కాలం గడిపిన జయసుధ ప్రచారాన్ని ఆలస్యంగా ప్రారంభించారు.గత ఎన్నికల్లో ఆమెకు అండగా నిలిచిన ఆదం విజయ్కుమార్ ప్రస్తుతం ఇదే నియోకజవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి దూసుకుపోతున్నారు. ఆదం వెంట బలమైన కాంగ్రెస్ కేడర్, అభిమానులు వెంట నడుస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ గ్లామర్ ఒక్క సారిగా తగ్గిపోయింది. ఐదేళ్లు ఎంఎల్ఏగా పనిచేసినా కూడా బస్తీల వారీగా సమస్యలపై అవగాహన పెంచుకోకపోవటం, కార్యకర్తలు, ముఖ్య నాయకులను సైతం గుర్తు పట్టలేని పరిస్థితి ప్రస్తుతం జయసుధ ను పరేషాన్ చేస్తోంది. దీనికి తోడు తెలంగాణ తామే తెచ్చామంటూ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు సైతం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ను గండికొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. అంబర్పేటలో ఢిల్లీకి..గల్లీకి పోటీ ముఖ్యమంత్రి రేసులో తాను ఉన్నానంటూ ఎన్నికల గోదాలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వి.హన్మంతరావు పరిస్థితి ఆశాజనకంగా లేదు. బీజేపీ అభ్యర్థి కిషన్రెడ్డితో తీవ్ర పోటీని ఎదుర్కుంటున్నారు. అధ్యక్షునిగా ఉన్న కిషన్ర్రెడ్డి పని ఒత్తిడి ఎలా ఉన్నా.. వారంలో ఐదు రోజులు నియోజకవర్గంలో పర్యటించటం అలవాటుగా చేసుకోవటం కిషన్రెడ్డికి కలిసి వచ్చింది. అంబర్పేటకు చెందిన హన్మంతరావు అధిక సమయం ఢిల్లీలోనే గడిపేయటంతో ప్రస్తుతం నియోజక వర్గంలో గల్లీకి - ఢిల్లీకి పోటీలా మారింది. కిషన్రెడ్డి గల్లీగల్లీలోనూ అక్కడి బస్తీ నాయకుల పేర్లతో పలకరిస్తుంటే.. అంబర్పేట వాసినని చెప్పుకునే హన్మంతరావు ఆయా బస్తీల రూట్లు కూడా మరిచిపోవటం ఆయనకు ఇబ్బందికర అంశంగా మారింది. దీంతో కిషన్రెడ్డి గల్లీకి - ఢిల్లీకి మధ్యే పోటీ అంటూ అంబర్పేటలో దూసుకువెళుతున్నారు.. హన్మంతరావు గత 15 ఏళ్లుగా అంబర్పేటలోనే తాను నివాసముంటున్నా ఇక్కడి బస్తీల అభివృద్ధికి కృషి చేయలేదనే అపవాదు ఉంది. తన రాజ్యసభ నిధుల నుండి కనీసం రెండు శాతం నిధులు కూడా అంబర్పేట నియోజకవర్గానికి కేటాయించలేదన్న అంశం కూడా అంబర్పేట ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశమైంది.