
యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం
ఏఎన్యూ: యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె. మధుమూర్తి అన్నారు. యోగాంధ్రలో భాగంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన యోగా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యోగా ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించి దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. ఏఎన్యూ వీసీ ఆచార్య కె. గంగాధరరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ యోగా ఆవశ్యకతను తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం అభినందనీయం అన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అకడమిక్ అడ్వైజర్ ఆచార్య జి.రోశయ్య, వర్సిటీ పాలకమండలి సభ్యులు ఆచార్య సుమంత్ కుమార్, ఆచార్య జగదీష్ నాయక్, రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం యోగా ఆవశ్యకతను తెలిపారు. ప్రిన్సిపల్ ఆచార్య వీరయ్య, ఆచార్య సురేష్ కుమార్, ఓఎస్డీ ఆచార్య రవికుమార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, యోగాంధ్ర నిర్వాహకులు ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్, దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి.వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య డి.రామచంద్రన్, రూసా డైరెక్టర్ ఆచార్య ఎస్.మురళీమోహన్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య దివ్య తేజోమూర్తి, సీడీసీ డీన్ ఆచార్య రవికుమార్, పీజీ, యూజీ పరీక్షల కోఆర్డినేటర్లు ఆచార్య సుబ్బారావు, ఆచార్య ఎన్వీ కృష్ణారావు, వర్సిటీ వసతి గృహాల చీఫ్ వార్డెన్లు ఆచార్య మల్లికార్జున్, డాక్టర్ మాధవి, ఆచార్య త్రిమూర్తి రావు, ఆచార్య బ్రహ్మాజీ, ఆచార్య సుధాకర్, డాక్టర్ చంద్రమౌళి, గుంటూరు జిల్లా పరిధిలోని పలు కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు.