సమస్యలు పరిష్కరించకపోతే విధుల బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించకపోతే విధుల బహిష్కరణ

Jun 28 2025 8:14 AM | Updated on Jun 28 2025 8:14 AM

సమస్యలు పరిష్కరించకపోతే విధుల బహిష్కరణ

సమస్యలు పరిష్కరించకపోతే విధుల బహిష్కరణ

తాడేపల్లి రూరల్‌: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో విధులు బహిష్కరిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో గల సీడీఎంఏ కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో గత 52 రోజుల నుంచి నిరసనలు తెలుపుతున్నా కూటమి ప్రభుత్వంలో స్పందన లేదని తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్మిక సంఘాలను ప్రభుత్వం చర్చలకు పిలిచిందని, జీతం పెంచే విషయమై ఎటువంటి స్పష్టత ఇవ్వని కారణంగా ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని వెల్లడించారు. 30వ తేదీ నుంచి విధులను బహిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు జోన్ల చైర్మన్లు బాబా ఫకృద్దీన్‌, మధుబాబు, సత్యం, శ్రీనివాసులు, రాజేష్‌బాబు, ఏసుబాబు, జిల్లా కన్వీనర్లు సతీష్‌కుమార్‌, మురళీకృష్ణ, ముకుందం, సురేష్‌, ప్రసాద్‌, రామ్మూర్తి, సత్యనారాయణ పాల్గొన్నారు.

ప్రభుత్వాన్ని హెచ్చరించిన కార్మిక జేఏసీ నాయకులు సీడీఎంఏ కార్యాలయం ముట్టడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement