రాష్ట్రంలో రాజ్యమేలుతున్న అరాచక పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రాజ్యమేలుతున్న అరాచక పాలన

Jun 18 2025 3:27 AM | Updated on Jun 18 2025 3:27 AM

రాష్ట్రంలో రాజ్యమేలుతున్న అరాచక పాలన

రాష్ట్రంలో రాజ్యమేలుతున్న అరాచక పాలన

చెరుకుపల్లి: రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతుందని వైఎస్సార్‌ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ ఈవూరి గణేష్‌ అన్నారు. మంగళవారం గుళ్లపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ‘జగన్‌ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం’ అనే పేరుతో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో వైఫల్యాలపై రూపొందించిన పుస్తకాన్ని డాక్టర్‌ గణేష్‌ నియోజకవర్గ నాయకులతో కలసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అబద్దపు హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడంతో పథకాలను అరకొరగా అమలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా మహిళలకు, రైతులకు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని డాక్టర్‌ గణేష్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రజలకు అండగా నిలుస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు, చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు యార్లగడ్డ మదన్‌మోహన్‌, కాటూరి శివ, బొర్రా శ్రీనివాసరావు, మండల కన్వీనర్లు దుండి వెంకటరామిరెడ్డి, ఇంకొల్లు రామకృష్ణ, యార్లగడ్డ రాంబాబు, నాయకులు చదలవాడ శ్రీనివాసరావు, నిజాంపట్నం కోటేశ్వరరావు, లుక్కా బాపనయ్య, ఉల్లంగుంట శ్రీరాంమూర్తి, వంగర భాను, ప్రభు కిరణ్‌, ఖుద్దూస్‌, చౌటూరి రమేష్‌, డి.కొండలురెడ్డి, శొంఠి సురేష్‌, రాజ్‌పాల్‌, కందుల సురేష్‌, పిట్టు సాంబశివారెడ్డి, గాలిమోటు రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ ఈవూరి గణేష్‌ ‘జగన్‌ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం’ పుస్తకావిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement