
వాగ్దానాల అమలులో ప్రభుత్వం విఫలం
వేమూరు: గత ఎన్నికల్లో కూటమి సూపర్ సిక్స్ పథకాలు వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గం సమన్వయకర్త వరికూటి అశోక్బాబు అన్నారు. ‘జగన్ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని చెరుకుపల్లి గ్రామంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధి చేయకపోగా వారు చేసిన మోసాలను, అరాచకాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమేనని అశోక్బాబు మండిపడ్డారు. ప్రజలకు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రజల కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు, ఆధారాలతో ఈ పుస్తకం రూపొందించడం జరిగిందన్నారు. మోసపు హామీలు, అబద్దపు మాటలతో మభ్య పెట్టి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గొట్టిపాటి హిమచంద్ర శ్రీనివాస్, సుజ్ణల నాగ మలేశ్వరరావు, పడమటి శ్రీనివాసరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కోగంటి లవకుమార్, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు ఇమామ్ హుస్సేన్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి సిరాజ్, దున్నా మేరీసుబాబు, గుమ్మడి దానియేలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త అశోక్బాబు ‘జగన్ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం’ పుస్తకావిష్కరణ