
వాగులో లారీ బోల్తా
ప్రత్తిపాడు: వాగులో లారీ బోల్తా పడిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమద్రాసు రోడ్డు వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరు నుంచి గుంటూరు వైపు ధనియాల లోడుతో వెళుతున్న లారీ మంగళవారం రాత్రి ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం లోలెవల్ చప్టా సమీపంలో కొండవాగులో బోల్తా పడింది. చప్టా ఇరుకుగా ఉండటం, ముందు వెనుకలు ఎలాంటి సైన్బోర్డులూ లేకపోవడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి మార్జిన్లు అర్థం కాక లారీ వాగులో బోల్తా పడినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.