
క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం
కర్లపాలెం: క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం కలుగుతాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి చెప్పారు. కర్లపాలెం ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో జరుగుతున్న శ్రీ కోదండరామస్వామి జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు మంగళవారం ముగిశాయి. విజేత జట్టు అయిన ఏట్రవారిపాలెం పులుగు శ్రీనివాసరెడ్డి మెమోరియల్ క్రికెట్ టీమ్కు ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి రూ.30 వేల నగదు బహుమతితోపాటు కప్పు ప్రదానం చేశారు. రన్నర్స్గా నిలిచిన గని ఫ్రెండ్స్ సర్కిల్ ఎంవీరాజుపాలెం జట్టుకు చెన్ను జనార్దన్ స్పాన్సర్ చేసిన రూ.25 వేల నగదు బహుమతి, కప్పును మార్కెట్ యార్డ్ చైర్మన్ దొంతిబోయిన సీతారామిరెడ్డి అందజేశారు. తృతీయ స్థానంలో నిలిచిన ఇండియన్ పెట్రోల్ బంక్ జట్టుకు మార్కెట్ యార్డ్ చైర్మన్ సీతారామిరెడ్డి స్పాన్సర్ చేసిన రూ.15వేల నగదు బహుమతి, కప్పును కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్ సీపీ యువజన విభాగ జోనల్ కన్వీనర్ కల్లం హరికృష్ణారెడ్డి అందజేశారు. నాలుగో స్థానంలో నిలిచిన శివారెడ్డి ఫ్రెండ్ సర్కిల్ నందాయపాలెం జట్టుకు వైఎస్సార్ సీపీ నాయకుడు ఆట్ల హరిబాబురెడ్డి రూ.10 వేల నగదు బహుమతి, కప్పు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ యువకులంతా ఐకమత్యంగా జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించటం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కర్లపాలెం మండల అధ్యక్షుడు యల్లావుల ఏడుకొండలు, మండల పరిషత్ వైస్ ఎంపీపీలు పందరబోయిన సుబ్బారావు, కాగిత బుల్లియ్య, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆట్ల నాగేశ్వరరెడ్డి, పెదపులుగువారిపాలెం సర్పంచ్ అక్కల శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొంతిబోయిన జయభారత్రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు పేరాల వెంకటసురేష్, ఆట్ల పోలిరెడ్డి, పందరబోయిన శ్రీనివాసరావు, మార్పు రత్నం, కమిటీ సభ్యులు ఆట్ల నాగిరెడ్డి, తుమ్మా సుబ్రమణ్యంరెడ్డి, ఆట్ల హరికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి జిల్లా స్థాయి క్రికెట్ పోటీల విజేతగా ఏట్రవారిపాలెం జట్టు