
మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనలో భాగస్వాములు కావాలి
రేపల్లె: మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని ఆర్డీవో నేలపు రామలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. మాదక ద్రవ్యాలను సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మాదక ద్రవ్యాలతో కుటుంబాలు నాశనమవ్వటంతోపాటు సమాజం పెడద్రోవ పడుతోందన్నారు. మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు మాదక ద్రవ్యాలపై అవగాహన ఉండి వీటికి దూరంగా ఉండాలన్నారు. సమాజంలో తోటి వారికి వీటిపై అవగాహన కల్పించాలని కోరారు. ఏబీఆర్ డిగ్రీ కళాశాల నుంచి రింగు రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, సీఐలు సురేష్బాబు, మల్లికార్జునరావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఇన్చార్జి ఎంపీడీవో ప్రసాద్, టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్, వివిధ కళాశాలల, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్డీవో రామలక్ష్మి