
పౌడా సమావేశంలో 15 అంశాలు ఏకగ్రీవ ఆమోదం
నరసరావుపేట: స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని జేసీ చాంబర్లో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అధ్యక్షతన మంగళవారం పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పౌడా) కమిటీ సాధారణ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన అధికారులు అజెండాలో ప్రభుత్వం విడుదల చేసిన 15 అంశాలపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. పౌడా అభివృద్ధికి చేయాల్సిన అంశాలపై చర్చించారు. సమావేశంలో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రీజినల్ డెప్యూటీ డైరెక్టర్ పి.మధుకుమార్, ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజానాయక్, విద్యుత్శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ సీహెచ్.రాంబొట్లు, పర్యాటక శాఖ జిల్లా అధికారి జి.నాయుడమ్మ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి జి.అనీల్కుమార్, పరిశ్రమల శాఖ జిల్లా అధికారి జి.కృష్ణారావు, పౌడా ప్లానింగ్ అధికారి పాల్గొన్నారు.