
నిలిచిన జోధ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు
చీరాల రూరల్: బాపట్ల జిల్లా చీరాలలో జోధ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు దాటుతున్న గేదెను ఢీకొట్టింది. దీంతో రైలు 26 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఈ సంఘటన శనివారం సాయంత్రం సమారు 6:15 గంటలకు చీరాల రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు చైన్నె నుంచి విజయవాడ వైపు వెళ్లే జోధ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు చీరాల రైల్వేష్టేషన్ సమీపంలోకి రాగానే ఓ గేదె పట్టాలు దాటుతోంది. ఈ క్రమంలో ఎక్స్ప్రెస్ రైలు గేదెను ఢీకొట్టింది. ఈ సంఘటనలో గేదె కళేబరం ఇంజిన్లో ఇరుక్కుపోవడంతో ఇంజిన్ మొరాయించింది. ఒక్కసారిగా రైలు ఆగిపోవడంతో ఏమి జరిగిందో అర్థంకాక ప్రయాణికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న రైల్వేశాఖాధికారులు, రైల్వే పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు ఇంజిన్ ముందుభాగంలో ఇరుక్కుపోయిన గేదె కళేబరాన్ని తొలగించారు. దీంతో రైలు యథావిధిగా సాగిపోవడంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్స్ప్రెస్ రైలు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆర్ఫీఎఫ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
గేదెను ఢీకొట్టడంతో ఇంజిన్లో ఇరుక్కుపోయిన కళేబరం 26 నిమిషాల పాటు మొరాయించిన రైలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళన చెందిన ప్రయాణికులు ఘటనపై కేసు నమోదు చేసిన ఆర్ఫీఎఫ్ పోలీసులు