‘కిల్లర్‌ లేడీ’ ఆటకట్టు | - | Sakshi
Sakshi News home page

‘కిల్లర్‌ లేడీ’ ఆటకట్టు

Jun 22 2025 3:38 AM | Updated on Jun 22 2025 3:38 AM

‘కిల్లర్‌ లేడీ’ ఆటకట్టు

‘కిల్లర్‌ లేడీ’ ఆటకట్టు

తెనాలి: ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధ మహిళలను హత్య చేసి బంగారు నగలను అపహరించిన కేసులో మారీసుపేటకు చెందిన అత్తోట కుసుమ ప్రధాన సూత్రధారిగా పోలీసులు నిర్ధారణ కొచ్చారు. ఆమెను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. విచారణలో మరో వృద్ధురాలి హత్య తోపాటు, ఇంకొకరి హత్యకు రెక్కీ నిర్వహించినట్టు తెలి సి, ఆ కోణంలో దర్యాప్తు జరుగుతోందని విశ్వసనీయ స మాచారం. మారీసుపేట, మల్లెపాడులో కలకలం రేగింది.

ఇన్స్యూరెన్స్‌ ఏజెంటుగా వివరాల సేకరణ

తెనాలి పట్టణం మారీసుపేటలో కుసుమ నివాసం. ఆమె భర్త 15 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. ఇద్దరు సంతానం. కాలేజీకి వెళుతున్నారు. గతంలో ‘మెప్మా’ విభాగంలో తాత్కాలికంగా పని చేసింది. ప్రస్తుతం ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీ ఏజెంటుగా పని చేస్తోంది. పాలసీల పేరుతో అందరినీ కలుస్తూ వారి వివరా ల ఆధారంగా నేరాలకు ప్రణాళికను రచిస్తోంది. తన సహాయకులతో పక్కాగా అమలు చేస్తోంది. తెనాలి నుంచి చినపరిమి వెళ్లే రోడ్డులో మూతపడిన అప్పడాల కంపెనీ పైభాగంలో వితంతువులైన వియ్యపురాళ్లు దాసరి రాజేశ్వరి (65), పిట్టా అంజమ్మ (70) నివసిస్తున్నారు. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం ఆ ఇద్దరు హత్యకు గురయ్యారు. వీరి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఈ కేసులో కుసుమ సహా ఆటోడ్రైవర్‌, మరొక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హత్యకు ప్లాన్‌ ఇలా..

హత్యకు గురైన వృద్ధుల ఇంటికి ఆ రోజు ఒక ఆటోలో కుసుమ సహా మరో ఇద్దరు యువకులు వచ్చారు. ‘ఆంటీ...ఇల్లు చూట్టానికి వచ్చారు...కిందకు రండి !’ అని కుసుమ పిలవడంతో ఒక వృద్ధురాలు కిందకు వచ్చారు. కిందకు వెళ్లినామె ఎంతకీ పైకి రాకపోవటతో ఇంకో వృద్ధురాలు, ‘ఇంకా రాలేదేంటి...పైకి రా!’ అని వియ్యపురాలిని కేకేసింది. దీనితో మళ్లీ కుసుమ, ఆమెను కూడా ‘కిందకు రండి...పిలుస్తున్నారు !’ అనడంతో ఆమె కూడా దిగివచ్చింది. తర్వాత ఆ ముగ్గురూ అదే ఆటోలో తిరిగి వెళ్లిపోయారు. ఇదంతా ఇంటిముందున్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు కుసుమతో సహా ఆ ఇద్దరు యువకులను తేలిగ్గా పట్టుకోగలిగారు. విచారణలో వారు కూడా విస్తుపోయే మరికొన్ని నిజాలు తెలిసినట్టు విశ్వసనీయ సమాచారం.

వృద్ధురాలి మృతి వెనుక కూడా ఆమె హస్తం

కుసుమ నివాసానికి ఎదురుగానే రోడ్డుకు అవతల ఒంటిరిగా నివసిస్తున్న ఓ వృద్ధురాలు రెండు వారాల క్రితం చనిపోయింది. ఆ సమయంలో ఆమె ఒంటిపై గాట్లు ఉండటం, బంగారు నగలు కనిపించకపోవటాన్ని బిడ్డలు గుర్తించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అంత్యక్రియలు చేశారు. ఆ వృద్ధురాలి మృతి వెనుక కుసుమ, ఆమె బ్యాచ్‌ హస్తమున్నట్టు నిర్ధారణకొచ్చారు.

జంట హత్యల సూత్రధారి అరెస్టు ? మరో ఇద్దరితో కలిసి ఘోరాలు ఇప్పటికే పోలీసుల అదుపులో ఆ ముగ్గురు పోలీస్‌ విచారణలో మరికొన్ని నేరాలు వెలుగులోకి...!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement