కూటమి ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వం

Jun 22 2025 3:38 AM | Updated on Jun 22 2025 3:38 AM

కూటమి ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం

యువతను నట్టేట ముంచిన

బాపట్ల: రాష్ట్రంలో యువతను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మేరుగ చంద్‌నాగ్‌ పేర్కొన్నారు. యువతకు వైఎస్సార్‌ సీపీ అండగా నిలిచేందుకు ఈనెల 23వ తేదీన జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈమేరకు శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్లు ఆవిష్కరించారు. మేరుగ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేలు ఇస్తామని ఇచ్చిన హామీని నేరవేర్చలేదన్నారు. ప్రతి ఏడాదీ జనవరిలోనే జాబ్‌క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారని విమర్శించారు. యువత నేడు అయోమయ పరిస్థితిలో కూరుకుపోయిందన్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ యువజన విభాగం యువత పోరు కార్యక్రమం చేపట్టిందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, పార్టీ పట్టణ అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ నక్కా వీరారెడ్డి, సెక్రటరీ దొంతిబోయిన జయభారత్‌రెడ్డి, జిల్లా అధికారప్రతినిధి వీరేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాదరెడ్డి, శంకర్‌రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు దొంతిబోయిన ఏడుకొండలరెడ్డి, మధు, మండల, పట్టణ యువజన విభాగం అధ్యక్షులు ఉరబిండి గోపినాఽథ్‌, రవితేజ, సాగర్‌, షేక్‌ మౌలాలి, గోపి, నాయకులు వడ్డిముక్కల డేవిడ్‌, మహ్మద్‌ హుస్సేన్‌, జోగి రాజా, నర్రావుల వెంకట్రావు, మోర్ల సముద్రాల గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

రేపు యువత పోరు వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు మేరుగ చంద్‌నాగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement