
సింగయ్య కుటుంబానికి పరామర్శ
గుంటూరు రూరల్: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంలో ఏటుకూరు బైపాస్ రోడ్డు వద్ద ప్రైవేటు వాహనం ఢీకొని తీవ్రగాయాలపాలై మృతిచెందిన వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) మృతదేహాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్లు సందర్శించి ఘన నివాళులర్పించారు. వెంగళాయపాలెం గ్రామంలోని మృతుని నివాసానికి వెళ్లి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంతాపం వ్యక్తం చేసి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండి, ఆర్థికంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ తరఫున బాధితుడి కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. సింగయ్య కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.