అప్రకటిత ఎమర్జెన్సీ కోరల్లో ప్రజాస్వామ్యం | - | Sakshi
Sakshi News home page

అప్రకటిత ఎమర్జెన్సీ కోరల్లో ప్రజాస్వామ్యం

Jun 27 2025 4:30 AM | Updated on Jun 27 2025 4:30 AM

అప్రకటిత ఎమర్జెన్సీ కోరల్లో ప్రజాస్వామ్యం

అప్రకటిత ఎమర్జెన్సీ కోరల్లో ప్రజాస్వామ్యం

మచిలీపట్నంటౌన్‌: దేశంలో 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ పోకడల కారణంగా ఎమర్జెన్సీ విధిస్తే నేడు దేశంలో ప్రధాని మోదీ నియంతృత్వ పోకడలతో అప్రకటిత ఎమ ర్జెన్సీ రూపంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు ఆందో ళన వ్యక్తం చేశారు. బుట్టాయిపేటలోని మహాత్మ జ్యోతిబాపూలే విజ్ఞానకేంద్రంలో గురువారం ‘ఎమర్జెన్సీ నాడు–నేడు’పై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లక్ష్మణరావు మాట్లాడుతూ.. నాడు ఇందిరాగాంధీ తనకు ఎదురులేదని నిరూపించుకోవడానికి ఎమర్జెన్సీ విధిస్తే, నేడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల్లో హిందువులు, ముస్లింలు పాతిపదికన విభజన తీసుకురావడానికి నిరంకుశ విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజలను చైతన్య పరుస్తున్న గౌరీ లంకేష్‌, నరేంద్ర దంబుల్కర్‌ గోవింద పనసరే తదితరులను ఆర్‌ఎస్‌ఎస్‌ ముష్కరులు చంపేశారని ఆందో ళన వ్యక్తంచేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెసర్‌ సాయిబాబాకు కోర్టు లో బెయిల్‌ ఇచ్చినా కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమిత్‌షా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అత్యవసరంగా సమావేశ పరిచి బెయిల్‌ రద్దు చేయించి ఆయన జైలులో మగ్గిపోయేలా చేశారన్నారు. కార్పొరేట్‌ ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలకు పాల్పడుతోందన్నారు.

మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement