బతుకే చిత్తు | - | Sakshi
Sakshi News home page

బతుకే చిత్తు

Jun 27 2025 4:30 AM | Updated on Jun 27 2025 4:30 AM

బతుకే

బతుకే చిత్తు

ముంచెత్తే మత్తు..
కూటమి పాలనలో విచ్చలవిడిగా డ్రగ్స్‌ విక్రయాలు
విద్యార్థులే లక్ష్యంగా...
● కళాశాలల యువతే లక్ష్యంగా అమ్మకాలు ● శివారు ప్రాంతాలలో జోరుగా సాగుతున్న దందా ● ఏడాదిలోనే 300 కేజీల గంజాయి స్వాధీనం ● కట్టడిలో పూర్తిగా విఫలమైన కూటమి సర్కార్‌

శివారు ప్రాంతాలలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి నుంచి నగరంలోకి సిగరెట్స్‌, చాకెట్లు, చూయింగ్‌ గమ్‌, పౌడర్‌ రూపంలో తీసుకొస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. కేజీ గంజాయి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. అదే విధంగా గ్రాము చొప్పున క్రిస్టల్‌ను రూ.8 వేలు నుంచి రూ.10 వేలు, మెత్‌ను రూ.5 వేలు నుంచి రూ.6 వేలు, ఎండీఎంఏను రూ.3 వేలు నుంచి రూ. 5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లాకు మాదకద్రవ్యాలు చేరుతున్నాయి.

నెహ్రూనగర్‌ : రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో గంజాయి, కొకై న్‌, మెత్‌, ఎండీఎం వంటి మాదకద్రవ్యాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విశాఖపట్నం, పాడేరు, అరకు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు గంజాయి భారీగా సరఫరా అవుతోంది. ముఖ్యంగా యువతే లక్ష్యంగా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

బతుకే చిత్తు 1
1/1

బతుకే చిత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement