
చిన్నారులు పోటీతత్వాన్ని పెంచుకోవాలి
గుంటూరు వెస్ట్ (క్రీడలు): చిన్నారులు క్రీడా సాధన ద్వారా పోటీతత్వాన్ని అలవరచుకోవాలని ఏసీఎంఈ స్కూల్ డైరెక్టర్ నందమూరి సౌగంధ కృష్ణ తెలిపారు. గుంటూరు ఫెన్సింగ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు రూరల్ మండలం పొత్తూరులోని ఏసీఎంఈ స్కూల్ ప్రాంగణంలో జరిగిన అండర్–10, 12 బాలబాలికల జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో శారీరక పటుత్వానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన క్రీడలో సాధన చేయాలని తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డి.అశోక్ బాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 50 మంది చిన్నారులు పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఎంపికై న వారిని ఈ నెల 29వ తేదీన విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు సౌగంధ కృష్ణ, అశోక్ బాబు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ డీఎస్ క్రిష్టోఫర్, పీఈటీ రాజేష్ ఇజ్రాయేల్ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే...
● అండర్ 12 బాలుర విభాగంలో.. సాబర్ విభాగం: చైతన్య కృష్ణ, పృథ్వీ వినయ్, ఫాయిల్ విభాగం: ఇ.కౌశిక్.
బాలికల విభాగంలో.... సాబర్ విభాగం: ఆరోహి, హన్సిక, ఎప్పి విభాగం: జోష్నిక, లక్ష్మీ కార్తిక, ఫాయిల్ విభాగం: శ్లోక, హస్నా.
● అండర్–10 బాలుర విభాగంలో... ఫాయిల్ విభాగం: రిశాంక్, సంజయ్, ఎప్పి విభాగం: హర్షవర్ధన్.
బాలికల విభాగంలో.. ఎప్పి విభాగం: దీక్షిత, తన్మయి శ్రీ.